breaking news
-
Prabhas New Look: ప్రభాస్ లేటేస్ట్ లుక్.. వీడియో చూశారా?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్రి యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. ఆ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మరో చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్కు ది రాజాసాబ్ సెట్స్లో అడుగుపెట్టారు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రభాస్ సరికొత్త హెయిర్ కట్ లుక్లో కనిపించారు. ఇది చూసిన అభిమానులు రెబల్ స్టార్పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రబాస్ మిర్చి సినిమాలో లాగా స్టైలిష్గా ఉన్నారంటూ పోస్టులు పెడుతున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో సరికొత్త వింటేజ్ లుక్లో ప్రభాస్ సందడి చేశారు. Latest Look of our Rebel star #Prabhas 🥵😍🔥🔥 pic.twitter.com/YtTByjybJ5 — Prabhas FC (@PrabhasRaju) April 17, 2024 Darling😘🖤#Prabhas pic.twitter.com/nkFUzITdwa — Ashhu🖤 (@PrabhAshhu) April 18, 2024 -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. క్రేజీ హింట్ ఇచ్చిన బేబీ నిర్మాత!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ను మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. భాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. అయితే మూడు నెలలుగా ది రాజాసాబ్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన నిర్మాత ఎస్కేఎన్ హింట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మొదటి సాంగ్ను రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ నిర్మాత ఇన్డైరెక్ట్గా ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఈ ట్వీట్కు డైరెక్టర్ మారుతి రిప్లై ఇవ్వడంతో ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 👑🎵🎶💖🔥❤️🔥💥 — SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 16, 2024 -
కంటెంట్పై మాకు నమ్మకం ఉంది.. అవి కేవలం రూమర్స్: బేబీ నిర్మాత
మణికందన్, గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ట్రూ లవర్". ఈ విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్, మారుతి పాల్గొన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - 'ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా బేబి సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగల్తో మా సినిమాకు పోటీ లేదు. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. బేబి హిందీ రీమేక్లో నేను నటిస్తున్నాననే అనే వార్తల్లో నిజం లేదు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ - 'నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. ఈ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ మూవీతో వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నా. ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్తో సినిమా రాలేదు.' అన్నారు. -
ప్రభాస్-మారుతి క్రేజీ కాంబో.. టైటిల్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. క్రేజీ డైరెక్టర్ మారుతితో జతకడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ప్రభాస్- మారుతి కొత్త చిత్రానికి 'ది రాజాసాబ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ కొత్త లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ప్రభాస్ మరోవైపు కల్కి అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా.. దర్శకుడు మారుతి గతంలో "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు", "ప్రతి రోజు పండగే" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో అలా "రాజా సాబ్" మూవీని మారుతి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ది "రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #TheRajaSaab It is… 👑 Wishing you all a very Happy and Joyous Sankranthi! ❤️ 𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas A @DirectorMaruthi film Produced by @Vishwaprasadtg A @MusicThaman Musical… pic.twitter.com/kvmUxIcXFC — People Media Factory (@peoplemediafcy) January 15, 2024 -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019