breaking news
-
మరో 'గంగుభాయి కతియావాడి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రిటీష్రాజ్కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో లాహోర్లోని హీరా మండిలోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే స్వాతంత్ర్యానికి ముందు పాకిస్తాన్లో లాహోర్లోని వేశ్య గృహాల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటుందో ట్రైలర్లో పరిచయం చేశారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ ఆలియా భట్తో ఇదే కాన్సెప్ట్తో గంగుభాయి కతియావాడి తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అదే తరహాలో హీరామండితో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ మే 1వ తేదీన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
Manisha Koirala: జీవితం అనే గురువు పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది
సంజయ్లీలా భన్సాలి ‘హీరామండి– ది డైమండ్ బజార్’ వచ్చే నెల నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ‘హీరామండి’లో మనిషా కోయిరాల నటించింది. ‘హీరామండి’ విడుదలకు ముందు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన జీవితంలోని ప్రధాన సంఘటనల గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది మనిషా. క్యాన్సర్తో తాను పోరాడిన రోజులను గుర్తు తెచ్చుకుంది. ‘ఎన్నో మంచి పాత్రలలో నటించాను. ఎంతో మంది ఉత్తమ దర్శకులతో కలిసి పని చేశాను. ఎంతోమంది స్నేహాన్ని పొందాను. దేవుడి దయతో క్యాన్సర్తో పోరాడి గెలిచాను. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నా జీవితంలో ఎన్నో లోతులను చూశాను. జీవితాన్ని మించిన గురువు లేదు. ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది. కాలం విలువను తెలుసుకున్నాను’ అంటూ రాసింది. మనిషా కోయిరాల రాసిన ఈ నోట్ నెట్జనులను బాగా కదిలించింది. -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో నెట్ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు. ఈ సిరీస్లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
22 ఏళ్ల తర్వాత కమల్హాసన్ సినిమా రిలీజ్
లోకనాయకుడు కమలహాసన్ నట విశ్వరూపానికి ఒక మచ్చుతునక 'ఆళవందాన్'. నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రమిది. సురేష్కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కమలహాసన్ కథను అందించారు. ఇదే మూవీలో హీరో కమ్ విలన్గా కమల్ ద్విపాత్రాభినయం చేశారు. సైకలాజికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. 2001 నవంబర్ 12న విడుదలైంది. కొన్ని కారణాల వల్ల అప్పట్లో హిట్ కాలేదు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) ఈ సినిమాలో అన్నదమ్ములుగా కమలహాసన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ బ్యూటీస్ మనీషాకొయిరాల, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. 22 ఏళ్ల క్రితం విడుదలైన ఆళవందాన్ చిత్రాన్ని నిర్మాత భాను ఇప్పుడు మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఇది 'అభయ్' పేరుతో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడీ చిత్రాన్నే చిన్నచిన్న మార్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పేర్కొని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మధ్యే కమలహాసన్ 'వేట్టైయాడు విళైయాడు' చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఆ చిత్రానికంటే బెటర్గా ఆళవందాన్ చిత్రం కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంటుందని భావించవచ్చు. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019