breaking news
-
SRH: ‘టాలీవుడ్ ప్రిన్స్’తో కమిన్స్.. సూపర్స్టార్ రిప్లై.. ఫ్యాన్స్ ఫిదా
Pat Cummins And Mahesh Babu- Crazy Viral: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాక సన్రైజర్స్ హైదరాబాద్లో సరికొత్త ఉత్సాహం నింపింది. అతడి సారథ్యంలో ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సన్రైజర్స్ కాస్తా సన్‘డేంజర్స్’గా మారి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్.. ఇలా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పరుగుల సునామీ సృష్టిస్తూ సన్రైజర్స్ను విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మార్చగా.. వీరి సేవలను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన కమిన్స్ తనదైన వ్యూహాలతో విజయాల పరంపరకు తెరతీశాడు. ఈ నేపథ్యంలో.. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడ్డ రైజర్స్ ఇప్పుడు.. ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరుసలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు విజయాలతో ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా సన్రైజర్స్ తమ తదుపరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్తో బెంగళూరుతో తలపడనుంది. హైదారాబాద్ వేదికగా గురువారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో సొంతగడ్డపై మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమైన ప్యాట్ కమిన్స్ బృందం సోమవారం సూపర్స్టార్ మహేశ్ బాబును కలిసింది. View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) ఈ సందర్భంగా మహేశ్ బాబుతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కమిన్స్.. ‘‘ఈరోజు మధ్యాహ్నం.. టాలీవుడ్ ప్రిన్స్తో సమయం సంతోషంగా గడిచింది’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక మహేశ్ బాబు సైతం.. ‘‘మిమ్మల్ని నేరుగా కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వీరాభిమానిని. మీకు, ఎస్ఆర్హెచ్ జట్టుకు ఆల్ ది బెస్ట్’’ అంటూ విషెస్ తెలిపాడు. వీరిద్దరి పోస్టులు చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్లో అంటూ మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) కాగా గతంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్ను అనుకరిస్తూ అతడు చేసే రీల్స్ నెట్టింట వైరల్ అయిన సందర్భాలు కోకొల్లలు. చదవండి: ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్ పోస్ట్ వైరల్ SunRisers 🤝 Superstar of Telugu cinema, Mahesh Babu 👑🧡 pic.twitter.com/Nd4MQWCfi8 — SunRisers Hyderabad (@SunRisers) April 22, 2024 -
పవన్కు షాకిచ్చిన అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్
సినిమా వాళ్లకు అభిమానులు ఉండటం సహజం. తమ హీరో ఇంత గోప్పవాడు అంటూ ఫ్యాన్స్ కూడా ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో అద్దాల మేడలో ఉన్న సినిమా హీరోలు ఎప్పుడైతే జనం మధ్యకు వస్తారో వారి అసలు స్వరూపం మెల్లగా బయటపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో సినిమాల్లో పవర్ స్టార్గా ఉన్న పవన్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో ఆయన అసలు రూపం ఏంటో జనాలకు తెలిసొచ్చింది. సీఎం అవుదామనే మోజుతో పాలిటిక్స్లోకి వచ్చిన వవన్ను కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రజలు గెలిపించలేదు. కమల్ హాసన్,రజనీకాంత్,విజయ్ కాంత్,చిరంజీవి,ఉపేంద్ర వంటి స్టార్స్ అందరూ కూడా రాజకీయాలను టచ్ చేసిన వారే.. రాజకీయంగా ఒక ట్రయల్ వేద్దామని ఈ స్టార్స్ అందరూ గట్టిగానే ప్రయత్నించారు. రాజకీయంలో కొన్ని డక్కామొక్కీలు తిని పోరాటం చేశారు. కానీ సినిమా ఇమేజ్ ఇక్కడ పనికిరాదని గ్రహించారు. తొందరగానే ప్రజల స్పందన ఏమిటనేది వారికి అర్థమయ్యింది. దీంతో చిల్లర మాటలు మాట్లాడకుండా కాస్త గౌరవంగానే రాజకీయాలు చేశారు. వీరిలో రజనీకాంత్ అయితే రాజకీయ యుద్ధంలో అడుగు పెట్టకుండానే మిడిల్ డ్రాప్ అయ్యారు. ప్రజాదరణ పొందకపోతే పరువు పోతుందనే భావనతో నీట్గా తప్పుకున్నారు. ఇక్కడ చెప్పుకున్న ఈ హీరోలు అందురూ ఎవరి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి రాణించిన వారు కావడం విశేషం. కమల్ హాసన్,రజనీకాంత్,విజయ్ కాంత్,చిరంజీవి,ఉపేంద్ర ఈ స్టార్స్ అందరూ కూడా వారసత్వాలతోనో, కుటుంబసభ్యులను అడ్డు పెట్టుకుని సినిమాల్లో ఎదిగిన వారు కాదు. అందుకే వారిలో విజ్ఞత కనిపించింది. వారు రాజకీయాల నుంచి తప్పుకున్నా వారిపై సమాజంలో గౌరవం మిగిలే ఉంది. కానీ పవన్ కల్యాణ్ పరిస్థితి వేరు. తన అన్నయ్య మెగాస్టార్ లేకపోతే.. ఎందుకూ అవసరం లేని ఒక ఆకతాయిగా మిగిలిపోయేవాడు. ఇదీ గ్రహించే ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు అవుతున్నా కనీసం సర్పంచ్ స్థాయి నాయకుడిని కూడా ఆయన తయారు చేయలేకపోయాడు. దీనంతటికి కారణం పవన్ మాటల్లో ఉన్న కష్టం చేతల్లో ఎక్కడా కనిపించదు. కేవలం ఎవరినో ఓడించాలనే ధోరణితోనే ఆయన రాజకీయ జీవితం కొనసాగుతుంది. ఇలాంటి ధోరణి తన సినిమాల్లో కూడా కనిపించదే.. సినిమాల్లో అయినా ఇలాంటి నీతిలేని పాత్రలో కనిపించే సాహసం పవన్ చేయగలుగుతాడా..? ఆ హీరోల అభిమానులకు గాలం వేస్తున్న పవన్ జీవితంలో తాను గెలవకపోయినా ఫర్వాలేదంటున్న పవన్.. సీఎం జగన్ ఓడిపోవాలని కోరుకుంటూనే చంద్రబాబును గెలిపించాలని తాపత్రయం పడుతున్నాడు. ఈ క్రమంలో బాబు చేతిలో పావుగా మారిన పవన్ ప్రజల్లో పరువు పోగొట్టుకోవడానికి అయినా రెడీ అయిపోయాడు. అందుకే చంద్రబాబు కోసం ఇతర హీరోల ఫ్యాన్స్ను అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే మహేష్ బాబు అభిమానులకు ఓసారి బిస్కెట్ వేశాడు. తనకంటే మహేష్ పెద్ద సూపర్ స్టార్ అన్నాడు. మహేష్ తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడని కూడా గొప్పలు చెప్పాడు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసే ప్లాన్ పవన్ వేస్తున్నాడు. వారి అభిమానులను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు. ప్రభాస్ గారు మా వాళ్లే.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ కూడా నాకు కావాల్సిన వాళ్లే అంటూ వారి అభిమానులందరూ నాకు సహకరించాలని వేడుకుంటున్నాడు. పవన్ నైజం తెలిసే ఇప్పటి వరకు కనీసం చిన్న హీరో కూడా జనసేనకు సపోర్ట్గా బయటకు రాలేదు. ఎవరూ లేకపోవడంతో జబర్ధస్త్గా నాగబాబు కమెడియన్ బ్యాచ్ను రంగంలోకి దింపాడు. తమ్ముడి కోసం మెగాస్టార్ రూ. 5 కోట్లు విరాళం అయితే ఇచ్చారు. కానీ వారి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి పవన్ కోసం పనిచేస్తున్నట్లు ఎక్కడా ప్రకటన లేదు. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి సభల్లో ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ అభిమానులు తమ హీరో ఫోటోతో పాటు జగన్ గారి ఫోటోను చేర్చి కనిపించడం విశేషం. ఇప్పుడు కొత్తగా ఓట్ల కోసం పవన్ వేస్తున్న గాలంలో ప్రభాస్,అల్లు అర్జున్,ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎట్టిపరిస్థితిల్లో పడరని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మంత్రి అమర్నాథ్ సమక్షంలో ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైసీపీ పార్టీలో చేరారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇతర హీరోలకు సంబంధించిన ఏ వేడుకలు జరిగినా కూడా పవన్ ఫ్యాన్స్ ఎలాంటి గోల చేస్తారో సినిమా అభిమానులకు చెప్పక్కరలేదు. ఇప్పుడు కూడా పవన్, ఆయన అభిమానులు ఓట్ల కోసం మాత్రమే ఇతర హీరోల అభిమానలను ఎలా బుట్టలో దించాలనే ప్రయాత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్, మహేశ్ ఫ్యాన్స్ అంత అమాయికులేం కాదు.. గతాన్ని వారు మరిచిపోలేదు. సమయం వచ్చింది ఇప్పుడు సరిగ్గా పవన్కు బుద్ధి చెప్తారు. View this post on Instagram A post shared by Gudivada Amarnath (@gudivadaamarnath) -
గ్లోబల్ రేంజ్లో మహేశ్.. ఆఫ్రికాలో 'కుర్చీని మడతపెట్టి'న చిన్నారులు
త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం 'గుంటూరు కారం'. సినిమా విషయంలో మొదట నెగటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్లో ఫ్యామిలీ ఆడియన్స్కు తెగ నచ్చేసింది. తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా రూ. 175 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 'కుర్చీని మడతపెట్టి' సాంగ్ లక్షల వ్యూస్తో రికార్డులు సృష్టించడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేసింది. మహేశ్ బాబు, శ్రీలీల, పూర్ణ ఈ పాటకు డ్యాన్స్తో అలరించారు. ఇది విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ పాటకు ఆఫ్రికన్ పిల్లలు స్టెప్పులు వేశారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో నేషనల్ బాస్కెట్బాల్ గేమ్స్ జరుగుతుండగా.. ఆట మధ్యలో ఏర్పాటుచేసిన వినోద కార్యక్రమంలో కొందరు అమెరికన్స్ ఈ పాటకు డ్యాన్స్ వేశారు. దానిని చూసిన ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లల అదిరిపోయే డ్యాన్స్తో తాజాగా కుర్చీ మడతపెట్టేశారు. స్మాష్ టాలెంట్ ఫౌండేషన్ వారు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ పాటకు థమన్ అందించిన మ్యూజిక్కు తమదైన శైలిలో చక్కగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. From “Smash Talent Foundation Kids”, AFRICA 😯🔥#KurchiMadathapetti goes Global 🌍 #MaheshBabu | #GunturKaaram My Hero @urstrulymahesh 👑 pic.twitter.com/rzkgxzQcCr — VardhanDHFM (@_VardhanDHFM_) April 13, 2024 Dancing to #KurchiMadathapetti on stage - Done ✅🤩🤩🤪 #Goals2024 pic.twitter.com/cuursWK1Ec — Sou😇 (@theChicaCuriosa) April 15, 2024 #KurchiMadathaPetti song at at Pune Ugaadi celebrations 🔥🔥#GunturKaaram pic.twitter.com/slaaxtoQYI — Charan (@charantweetz) April 9, 2024 Em rasika raajuvo mari 💃😻#KurchiMadathapetti pic.twitter.com/KvL4Tx44om — ︎ ︎ (@VamsiPrince_) April 10, 2024 #MaheshBabu𓃵 craze in Orissa#KurchiMadathapetti pic.twitter.com/VCVeH4Oa9U — varapanakoushik Reddy (@varapanakoushik) April 12, 2024 🕋 రంజాన్ పండగా సందర్భంగా 🕋 🪑 #kurchimadathapetti 🪑 Song singing 🎤@shamna_kkasim dance 🔥🪑@urstrulyMahesh #MaheshBabu #GunturKaaram @MusicThaman @Kkdtalkies #SSMB29 pic.twitter.com/JZoclaAZnu — ⭐ god of tollywood ⭐ ssmb ⭐ (@kiranprinc31148) April 14, 2024 #KurchiMadathaPettiGoesGlobal 🌏🎵🔥#KurchiMadathaPetti 💥 pic.twitter.com/VM9okKzJ4v — thaman S (@MusicThaman) April 1, 2024 -
భజే వాయు వేగం
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘భజే వాయు వేగం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్పై ‘భజే వాయు వేగం’ రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ను హీరో మహేశ్బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, అభినందనలు తెలిపారు. ‘‘ఫ్రెష్ కంటెంట్తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. -
Mahesh Babu Europe Vacation Photos: యూరప్ వేకేషన్లో ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019