breaking news
-
Lok sabha elections 2024: రాచరిక మాంత్రికుడు రాహుల్: మోదీ
హోషంగాబాద్/సాక్షి బెంగళూరు: ఒక్క దెబ్బతో దేశంలోని పేదరికాన్ని నిర్మూలించవచ్చంటూ కాగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. రాహుల్ను రాచరిక మాంత్రికుడిగా అభివరి్ణంచారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆదివారం మధ్యప్రదేశ్లో హోషంగాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పిపారియా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ఒక్కదెబ్బతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చని కాంగ్రెస్ రాజకుమారుడు ప్రకటించారు. నిజంగా నవ్వొస్తోంది. ఆ రాజరిక మాంత్రికుడు ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లారు. ఆయన నాన్నమ్మ 50 ఏళ్ల క్రితం గరీబీ హఠావో అంటూ నినాదం ఇచ్చారు. పేదరికం మాత్రం పోలేదు. అందుకే ఆ రాజకుమారుడి మాటలను జనం పట్టించుకోవడం లేదు. ఆ కుటుంబ(సోనియా గాం«దీ) సభ్యులు 2014 కంటే ముందు పదేళ్ల పాటు రిమోట్ కంట్రోల్తో ప్రభుత్వాన్ని నడిపించారు. అప్పుడు పేదరికం గుర్తుకురాలేదు. ఇప్పుడు హఠాత్తుగా పేదరికాన్ని నిర్మూలించే మంత్రం కనిపెట్టారు. ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. పేదరికంపై జోక్లు వేయొద్దని కోరుతున్నా’’ అని మోదీ స్పష్టం చేశారు. -
‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. నేను నా కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటా
భోపాల్ : మీకో దండం!!.. మీ పార్టీకో దండం.. నేను నా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటానంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మహిళా నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో డిప్యూటీ కలెక్టర్ హోదాను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తనని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ, లోక్సభ సీటును నిరాకరించి పార్టీ తనకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన నిషా బాంగ్రే ఇప్పుడు తన ఉద్యోగాన్ని తిరిగి పొందాలని కోరుతున్నట్లు తెలిపారు. నిషా బాంగ్రే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహించారు. అయితే డిప్యూటీ కలెక్టర్గా హోదాలో ఉన్నతమైన సేవలందించినందుకు ప్రజలు తనని రాజకీయాల్లోకి రావాలని కోరారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాంగ్రేను సంప్రదించింది. తమ పార్టీలో చేరితే రాజకీయంగా సముచితం స్థానం కల్పిస్తామని ఆశచూపించింది. అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోలేదు ‘కాంగ్రెస్ నన్ను సంప్రదించింది. అప్పుడే డిప్యూటీ కలెక్టర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లాలనే అనుకున్నాను. నాకు రాజకీయ నేపథ్యం లేదు. ఆర్థికంగా బలమైన కుటుంబం కూడా కాదు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరాను. చివరకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. బీజేపీ కావాలంటే నాకు టికెట్ ఇచ్చేది. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఇవ్వలేదు. చదువుకున్న మహిళ రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ బెతుల్ జిల్లా నాయకత్వం భయపడింది’ అని బాంగ్రే అన్నారు . ఫలితాలతో పరిస్థితులు తారుమారు అసెంబ్లీ ఫలితాల తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. కాంగ్రెస్ అన్నీ కమిటీలను రద్దు చేసింది. బాధ్యతలు అప్పగించలేదు. కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా విలువైనా ఉండేది. లోక్సభ సీటు ఇవ్వలేదు. అందుకే నన్ను తిరిగి ఉద్యోగంలో చేరాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. నా రాజీనామాను కేంద్రం అంగీకరించలేదు. తిరిగి విధుల్లో చేరేందుకు వీలుంది. ఇప్పుడు కాంగ్రెస్కు రాజీనామా చేసి.. డిప్యూటీ కలెక్టర్గా బాద్యతులు చేపట్టాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. నిషా బాంగ్రే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యక్తులు ఎమ్మెల్యే,లోక్సభ టికెట్లు పొందొచ్చు. ఇందుకోసం వారు కష్టపడి పనిచేయాలి. నిషా బాంగ్రేకి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించాం. రాజకీయాల్లో కెరీర్ను నిర్మించుకోవడానికి సమయం పడుతుంది. ఆమె పార్టీని వదిలి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చు అని కాంగ్రెస్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. -
అందరి దృష్టి ఆ దిగ్గజ నేతల కుమారులపైనే..
రానున్న లోక్సభ ఎన్నికల నేపధ్యంలో యూపీలోని ప్రయాగ్రాజ్పై అందరి దృష్టి పడింది. ఈ స్థానం నుంచి ఇద్దరు దిగ్గజ నేతల కుటుంబాలు తలపడుతున్నాయి. కేశరి నాథ్ త్రిపాఠి, రేవతి రమణ్ సింగ్ల కుమారులు ఎన్నికల బరిలోకి దిగారు. ఒకరు బీజేపీకి చెందిన బలమైన నేత. మరొకరు ఎస్పీకి చెందిన ప్రజాదరణ పొందిన నేత. త్వరలో జరగబోయే ఎన్నికల మహా పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేదానిపై ఆసక్తి నెలకొంది. ప్రయాగ్రాజ్ నుంచి ఎస్పీ, కాంగ్రెస్ కూటమి తరపున ఎస్పీ సీనియర్ నేత రేవతి రమణ్సింగ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ఉజ్వల్ రమణ్సింగ్ బరిలోకి దిగారు . ఇక బీజేపీ సీనియర్ నేత పండిట్ కేసరినాథ్ త్రిపాఠి కుమారుడు, హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ నీరజ్ త్రిపాఠి ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. దివంగత పండిట్ కేసరి నాథ్ త్రిపాఠి, రేవతి రమణ్ సింగ్.. ఇద్దరికీ బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. పండిట్ కేసరి నాథ్ త్రిపాఠి అశోక్ నగర్ నివాసి. ఆయన బీజేపీకి చెందిన శాసనసభ స్పీకర్గా, ఎమ్మెల్యేగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు. రేవతి రమణ్ సింగ్ కర్చనలోని బరాన్ నివాసి. ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడు. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు తర్వాత ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్లో చేరారు. నీరజ్ త్రిపాఠి బీజేపీలో ఏనాడూ క్రియాశీలకంగా లేరు. దీంతో ప్రయాగ్రాజ్ నుండి నీరజ్ త్రిపాఠి పేరు ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తండ్రికి ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా బీజేపీ నీరజ్ త్రిపాఠికి టిక్కెట్ కేటాయించింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి వచ్చాక తన బాధ్యతలు పెరిగాయని, అందుకే పార్టీలో యాక్టివ్గా ఉండలేకపోయానని ఆయన తెలిపారు. ప్రయాగ్రాజ్ ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకుంటే, స్థానికంగా మూతపడిన కంపెనీలను పునఃప్రారంభించడంతోపాటు కొత్త కంపెనీలను తీసుకురావడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు. -
Lok sabha elections 2024: బీజేపీకి ఎదురుందా!
భౌగోళికంగా భారత్కు గుండెకాయ వంటిది మధ్యప్రదేశ్. ఈ హిందీ బెల్టు రాష్ట్రంలో ఎన్నికల పోరు ఎప్పుడూ జాతీయ పార్టీల మధ్యే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన బీజేపీ ఉరిమే ఉత్సాహంతో లోక్సభ సంగ్రామంలో దూకగా కాంగ్రెస్ కూడా విపక్ష ఇండియా కూటమి దన్నుతో సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది... మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. కాకపోతే దాదాపు పాతికేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యమే సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి బీఎస్పీ, స్వతంత్రుల సాయంతో గద్దెనెక్కినా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. అసంతృప్త కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 2020లో తిరుగుబాటు చేయడంతో కమల్నాథ్ సర్కారు కుప్పకూలింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో మళ్లీ బీజేపీ సర్కారే కొలువుదీరింది. మధ్యప్రదేశ్లో 29 లోక్సభ సీట్లున్నాయి. 10 సీట్లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 28 సీట్లు కొల్లగొట్టగా కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ జోరే కొనసాగింది. 230 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 163 స్థానాలను ఒడిసిపట్టింది. బీజేపీ ఓబీసీ కార్డు, కాంగ్రెస్ మైనారిటీ జపం మధ్యప్రదేశ్ ఎన్నికల సమీకరణాల్లో కులాలదీ కీలక పాత్రే. అగ్రవర్ణ ఓటు బ్యాంకును పటిష్టపరుచుకుంటూనే ఇతర సామాజిక వర్గాలను కూడా తమవైపు తిప్పుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుల గణన హామీని విస్తృతంగా ప్రచారం చేసినా ఓబీసీ ఓట్లను సాధించడంలో విపలమైంది. 2018తో పోలిస్తే బీజేపీ మరింత మంది ఓబీసీలను, ఆదివాసీలను తమవైపు తిప్పుకోగలిగింది. అనూహ్యంగా యాదవ సామాజికవర్గానికి చెందిన మోహన్ యాదవ్ను సీఎం చేయడం ఓబీసీల ఓట్లు సాధించి పెడుతుందని ఆశిస్తోంది. ఇతర హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోనూ కీలకమై యాదవ ఓటు బ్యాంకు తనవైపు మళ్లుతుందని భావిస్తోంది. రాష్ట్రంలో 7 శాతం ఓటు బ్యాంకున్న ముస్లింలతో పాటు ఎస్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. కాషాయ దళంలో జోష్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్లో ఉన్న బీజేపీ ఈసారి మొత్తం 29 స్థానాలనూ చేజక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, మోదీ, అభివృద్ధి, హిందుత్వ నినాదం ఈసారి కమలనాథులు ప్రచా రా్రస్తాలుగా ఉన్నాయి. సీఎంగా దాదాపు పాతికేళ్లు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన శివరాజ్ సింగ్ ఈసారి విదిశ నుంచి లోక్సభ బరిలోకి దిగుతుండటం విశేషం! కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య గుణ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ సింగిల్గా పోటీ చేస్తోంది. నాలుగు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా ఇప్పటికే అభ్యర్థులందరినీ ప్రకటించింది. ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లో సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. తాజాగా మంగళవారం బాలాఘాట్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో విపక్షాలపై పదునైన వాగ్బాణాలు సంధించారు. తాను అభివృద్ధి చేస్తుంటే దూషిస్తున్నారని, దేశ భద్రతకు గ్యారంటీ ఇస్తుంటే బురద జల్లుతున్నారని, అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నప్పుడూ అనరాని మాటలన్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్పై పదునైన విమర్శలతో వేడి పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ కోలుకునేనా...! అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం చతికిలపడుతోంది. సింధియా వంటి కీలక యువ నేతను చేజార్చుకోవడం ఈసారి హస్తం పార్టీకి మరింత ప్రతికూలంగా మారింది. ఇండియా కూటమి దన్నుతో బీజేపీని ఢీకొట్టి పూర్వ వైభవాన్ని అందుకునేందుకు ప్రయతి్నస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటోంది. కులగణన హామీ ద్వారా ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకులపై కన్నేసింది. రాహుల్ ప్రకటించిన యువతకు 30 లక్షల ప్రభుత్వోద్యోగాల హామీపైనా ఆశలు పెట్టుకుంది. 6 న్యాయాలు, 25 గ్యారంటీల మ్యానిఫెస్టోతో ప్రచారాన్ని మ్మురం చేసింది. సమాజ్వాదీ పార్టీకి ఖజురహో స్థానం కేటాయించి మిగతా 28 చోట్ల పోటీ చేస్తోంది. బీజేపీకే ఓటేస్తున్న సర్వేలు సాధారణంగా మధ్యప్రదేశ్లో ఎన్నికల సరళి జాతీయ ట్రెండ్కు అనుగుణంగా ఉంటుంది. ఆ లెక్కన మొత్తం 29 సీట్లనూ బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుందని పలు సర్వేలు అంచనా వేశాయి. మరికొన్ని 27 సీట్లిచ్చాయి. కాంగ్రెస్ గట్టిగా పుంజుకోని పక్షంలో 2 సీట్లకు మించకపోవచ్చన్నది మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనా. ‘సరికొత్త భారత నిర్మాణమే నా మిషన్. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇందుకు ప్రజల దీవెనలు కావాలి. నేను మహాకాలుడి భక్తున్ని. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు’ – మంగళవారం మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఎన్నికల ర్యాలీలో మోదీ , – సాక్షి, నేషనల్ డెస్క్ -
5 నెలల్లో 3 పార్టీలు.. 48 గంటల్లో బీజేపీకి రాంరాం.. కాంగ్రెస్ గూటికి ఛలో!
దేశంలో ఎన్నికలు సమీపించగానే అంతవరకూ ఎవరికీ కనిపించని నేతలు సైతం యాక్టివ్ అయిపోతారు. అధికారంలో ఉన్న పార్టీలోకి లేదా తమకు నచ్చిన పార్టీలోకి దూకేస్తారు. మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. పలువురు నేతలు కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి లేదా బీజేపీని వీడి కాంగ్రెస్లోకి చేరిపోతున్నారు. మొరెనా జిల్లాకు చెందిన ఒక నేత ఐదు నెలల్లోనే మూడుసార్లు పార్టీ మారారు. సిద్ధి జిల్లాకు చెందిన ఓ మహిళా నేత 48 గంటల్లోనే బీజేపీని వీడి, తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేశారు. సిద్ధి మున్సిపాలిటీ అధ్యక్షురాలు కాజల్ వర్మ 48 గంటల్లోనే బీజేపీపై విరక్తి చెందారు. తిరిగి కాంగ్రెస్లో చేరారు. కాజల్ వర్మకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. అయితే తనను బెదిరించి బీజేపీ సభ్యత్వం ఇచ్చారని కాజల్ వర్మ ఆరోపించారు. ఇదేవిధంగా సుమావాలి అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తో కలిసి హెలికాప్టర్లో సబల్గఢ్కు చేరుకుని, బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరడం కాంగ్రెస్కు తీరని నష్టంగా పరిణమించింది. మొరెనా షియోపూర్ లోక్సభ నియోజకవర్గంలో కుష్వాహా సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉంది. అజబ్ సింగ్ కుష్వాహా గత ఐదు నెలల్లో మూడు రాజకీయ పార్టీలు మారారు. తాజాగా ఆయన బీజేపీ పంచన చేరారు. అజబ్ సింగ్ కుష్వాహా తన రాజకీయ యాత్రను బహుజన్ సమాజ్ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత బీఎస్పీపై విసిగిపోయి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో ఉండటం కుదరదంటూ ఇప్పుడు బీజేపీలో చేరారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019