breaking news
Ad - Sakshi_Home_Sticky
-
‘నీ యవ్వ తగ్గేదే లే..’.. దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం (ఫొటోలు)
-
దుబాయ్లో అల్లు అర్జున్.. ఆ గౌరవం దక్కించుకున్న తొలి హీరోగా గుర్తింపు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్లో అడుగుపెట్టారు. తన కుటుంబంతో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నారు. దుబాయ్లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన బన్నీ నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత మరో విశేష గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ కుటుంబంతో పాటు దుబాయ్ చేరుకున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకి ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ ఇవి లండన్లోని మ్యూజియంలో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ విగ్రహం మాత్రం దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తున్నడం విశేషం. దీంతో సౌత్ ఇండియా తొలి హీరోగా బన్నీ రికార్డ్ సెట్ చేశారు. అంతే కాకుండా దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు హీరో కూడా బన్నీనే కావడం మరో విశేషం. సినిమా, క్రీడలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్ మ్యూజియంలో పొందుపరిచారు. సింగపూర్, లండన్, దుబాయ్.. ఇలా వివిధ చోట్ల ఈ మ్యూజియానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. దుబాయ్లోని మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్,షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణ్బీర్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్లో మన టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ చేరనున్నారు. -
మేడమ్ తుస్సాడ్స్లో...
దుబాయ్లోని మేడమ్ తుస్సాడ్స్లో అల్లు అర్జున్ మైనపు బొమ్మ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి మేడమ్ తుస్సాడ్స్ ప్రతినిధులు అల్లు అర్జున్ కొలతలను తీసుకున్నారు. దాదాపు 200 కొలతలు తీసుకున్నారట. ‘‘ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ బొమ్మను ఏర్పాటు చేయబో తున్నాం. ఈ మైనపు బొమ్మ ఆవిష్కరణ వచ్చే ఏడాది ఉంటుంది’’ అంటూ అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేశారు నిర్వాహకులు. కాగా, దుబాయ్లోని మేడమ్ తుస్సాడ్స్లో తెలుగు నుంచి ప్రదర్శితం కానున్న తొలి మైనపు బొమ్మ అల్లు అర్జున్దే కావడం విశేషం. National Award winner; the first Telugu Actor in 69 years to win this award and icon of dance moves, the one and only Allu Arjun is all set to come face to face with his wax twin at Madame Tussauds Dubai later this year. Stay tuned for an event like never before 🎬✨#alluarjun pic.twitter.com/ePHhfvWfru — Madame Tussauds Dubai (@Tussauds_Dubai) October 5, 2023 -
అతిలోక సుందరికి అరుదైన గౌరవం
అతిలోక సుందరి శ్రీదేవి ఈ ప్రపంచాన్ని విడిచి ఏడాదిన్నర కాలమవుతున్నా అభిమానులు ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చేసిన విభిన్న పాత్రలు, సినిమాల ద్వారా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తాజాగా ఈ దివంగత నటికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు శ్రీదేవి మైనపు విగ్రహానికి సంబంధించిన ప్రొమో వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ ప్రోమోలు శ్రీదేవి కళ్లు.. ఆమే భువికి తిరిగొచ్చారా అన్నంత సహజంగా ఉండటంతో పూర్తి విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 4న సింగపూర్లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షం ప్రసారం చేయనున్నారు. Sridevi lives forever in not just our hearts but also in the hearts of millions of her fans. Eagerly waiting to watch the unveiling of her figure at Madam Tussauds, Singapore on September 4, 2019. #SrideviLivesForever pic.twitter.com/AxxHUgYnzt — Boney Kapoor (@BoneyKapoor) September 3, 2019 -
అనుష్క శర్మకు అరుదైన గౌరవం
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో ఓప్రా విన్ఫ్రే, పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, లెవిస్ హామిల్టన్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీల మధ్య ఆమె మైనపు విగ్రహం కొలువు తీరనుంది. అయితే గతంలో ఇక్కడ ఉన్న మైనపు బొమ్మలకు, అనుష్క మైనపు విగ్రహానికి ఓ వ్యత్యాసం ఉందట. ఈ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మాట్లాడే అనుష్క మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఇక్కడ కొలువుతీరిన మైనపు బొమ్మలతో ఆయా సెలబ్రిటీల అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. అయితే అనుష్క ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన సెలబ్రిటీతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అనుష్క మైనపు బొమ్మకు వద్ద ఏర్పాటు చేసిన ఫోన్ను పట్టుకుంటే అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తుంది. ప్రపంచంలో మరే ఇతర సెలబ్రిటీకి దక్కని అరుదైన గౌరవం తమ అభిమాన నటికి సింగపూర్లో దక్కిందన్న విషయం తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క మైనపు విగ్రహంపై టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ.. చాలా మంది అతిథులు, అభిమానులు, ఔత్సాహికులు ఇక్కడికి తరచుగా వస్తుంటారు. అనుష్క శర్మ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారి కోరిక మేరకు, అనుష్కకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మాట్లాడే మైనపు బొమ్మను ఏర్పాటు చేసి ఆమెను గౌరవించాలని భావించినట్లు వివరించారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019