breaking news
Ad - Sakshi_Home_Sticky
-
‘నీ యవ్వ తగ్గేదే లే..’.. దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం (ఫొటోలు)
-
మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం
లండన్: నిండా వివాదాల్లో మునిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి గురువారం రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ పక్ష నేత పదవి నుంచి సైతం తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో అవమానం ఎదురైంది. బ్లాక్పూల్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయన మైనపు విగ్రహాన్నిప్రభుత్వ కార్యాలయం జాబ్ సెంటర్ ముందుకు తరలించారు. జాబ్ సెంటర్ ముందు రోడ్డుపై విగ్రహం ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. Blackpool Madame Tussauds have put Boris Johnson’s waxwork outside of the job centre and I can’t stop laughing pic.twitter.com/U6VToQSjo9 — Charlotte (@charlotteclaber) July 7, 2022 నీలిరంగు టైతో కూడిన సూట్లో నడుముపై చేతులు ఉంచి నవ్వుతున్న జాన్సన్ విగ్రహాన్ని రూపొందించింది మేడమ్ టుస్సాడ్స్. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని తరలించటం చర్చనీయాంశంగా మారింది. జాబ్సెంటర్ ముందు రోడ్డుపై కనిపిస్తున్న జాన్సన్ విగ్రహం కొద్ది సమయంలోనే వైరల్గా మారింది. ఈ అంశంపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ఫోటోలకు పోజులిచ్చారు. మేడమ్ టుస్సాడ్స్ ఈ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. 'బోరిస్ ఎక్స్ బ్లాక్పూల్' అంటూ నోట్ రాసుకొచ్చింది. బోరిస్ జాన్సన్ మైనపు విగ్రహాన్ని ఈ ఏడాది మార్చిలోనే ఆవిష్కరించారు. లాన్స్ లైవ్ నివేదిక ప్రకారం.. విగ్రహం తయారు చేసేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. సుమారు 20 మంది కళాకారులు కొన్ని వందల గంటలు శ్రమించి విగ్రహానికి రూపునిచ్చారు. -
మైనపు బొమ్మ
కాజల్ అగర్వాల్ మర్చిపోలేని రోజు ఫిబ్రవరి 5, 2020. సింగపూర్లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా మారిపోయిన రోజు. సింగపూర్లో బుధవారం తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు కాజల్. మేడమ్ తుస్సాడ్స్లో సౌత్ నుంచి మైనపు బొమ్మగా చోటు సంపాదించుకున్న తొలి హీరోయిన్ కాజల్ కావడం విశేషం. ‘‘ఈ గుర్తింపుని అందించిన మేడమ్ తుస్సాడ్స్ సంస్థకు ధన్యవాదాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్సనాలిటీల మధ్య నా మైనపు బొమ్మ కూడా ఉండటం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్తో... -
తెగ సంబరపడిపోతున్న కాజల్
దక్షిణాదిన హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. 12 ఏళ్ళ కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించింది. రేపు(ఫిబ్రవరి 05) ప్రఖ్యాత సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో కాజల్ వీడియో ద్వారా విషయాన్ని నెటిజన్స్కి చేరవేసింది. తన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ లో పెడుతున్నందుకు సంతోషంగా ఉందని, దీనికోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానంటూ ఓ వీడియోని ఇన్స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక మేడమ్ టుస్సాడ్స్లో కొలువు తీరనున్న తొలి సౌతిండియా హీరోయిన్గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు, డార్లింగ్ ప్రభాస్ సరసన చందమామ విగ్రహం కూడా చేరనుండతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాజల్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపుదిద్దుకుంటోన్న ఓ సినిమాతో పాటు, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లోనూ నటిస్తోంది. ప్రముఖుల మైనపు విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ మేడమ్ టుస్సాడ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటీనటుల విగ్రహాల్ని ఒకేచోట ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ విగ్రహాలు ఈపాటికే అక్కడ కొలువుదీరాయి. .@MsKajalAggarwal's Wax Statue at #MadameTussauds is getting unveiled tomorrow.#KajalMadameTussauds#Kajal #KajalAggarwal #MadameTussaudsSG #MTSG@MTsSingapore pic.twitter.com/0oelsEGovc — BARaju (@baraju_SuperHit) February 4, 2020 -
కొత్త దశాబ్దానికి శుభారంభం
పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేటప్పుడు కొత్త ఏడాది అంతా బాగుండాలని కోరుకుంటాం. కాజల్ అగర్వాల్ అలానే కోరుకుంటున్నారు. అయితే రానున్న 2020 గురించి మాత్రమే కాదు.. వచ్చే దశాబ్దం కూడా తనకు బాగుంటుందని ఆమె అంటున్నారు. దానికి కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖుల లిస్ట్లో కాజల్ చేరబోతున్నారు. మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్లో ఎంతోమంది సెలబ్రిటీల బొమ్మల సరసన కాజల్ మైనపు బొమ్మ చేరబోతోంది. సింగపూర్లోని మేడమ్ తుస్సాడ్స్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న తన మైనపు బొమ్మను కాజల్ ఆవిష్కరించనున్నారు. ‘‘నా చిన్నప్పుడు తుస్సాడ్స్ మ్యూజియమ్కి వెళ్లి, అక్కడున్న ప్రముఖుల బొమ్మలను ఎంతో ఆరాధనగా చూసేదాన్ని. నా బొమ్మ వారితో పాటు ఉండబోవటం అనేది నాకు దక్కిన గౌరవంలా భావిస్తున్నాను. కొత్త దశాబ్దం శుభారంభానికి ఇది నాంది అనుకుంటున్నాను. నిద్ర లేకుండా ఎంతో కష్టపడి షూటింగ్ చేసిన రాత్రులు, ఎన్నో వ్యక్తిగత త్యాగాలకు దక్కిన ప్రతిఫలంలా భావిస్తున్నా. నా బొమ్మను నా చేతులతో ఆవిష్కరించే రోజు కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు కాజల్ అగర్వాల్. కాజల్ బొమ్మకు కావాల్సిన కొలతలను తుస్సాడ్స్ టీమ్ తీసుకుంది.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019