breaking news
-
అమితాబ్.. రెహమాన్లకు లతా మంగేష్కర్ అవార్డు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022న ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో ‘దీప్స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్కు కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది. -
బిగ్ బీకి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ ప్రకటన!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు అరుదైన గౌరవం లభించింది. ఆయన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకోనున్నారు. అమితాబ్ బచ్చన్ను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 6, 2022న మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందజేస్తున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న ఈ పురస్కారంతో అమితాబ్ను సత్కరించనున్నారు. కాగా.. 2023లో ఈ అవార్డ్ను మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లేకు బహుకరించారు. అంతేకాకుండా భారతీయ సంగీతానికి చేసిన కృషికి గానూ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కూడా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వారి కుటుంబం వెల్లడించింది. సామాజిక సేవా రంగంలో సేవలకు గాను లాభాపేక్షలేని సంస్థ దీప్స్తంభ్ ఫౌండేషన్ మనోబల్కు కూడా ఈ అవార్డును అందజేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హృదయనాథ్ మంగేష్కర్ అధ్యక్షత వహిస్తారని.. ఆశా భోంస్లే చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. -
'ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని అస్సలు చేయను'..స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ గురించి తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది చంద్రముఖి-2 అలరించిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలో విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా పెట్టిన తాజా పోస్ట్ వైరల్గా మారింది. తనకు తాను లతా మంగేష్కర్తో పోల్చుకున్న కంగనా.. డబ్బుల కోసం సెలబ్రిటీల వివాహాల్లో డ్యాన్స్ చేయనని తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్పై నెట్టింట చర్చ మొదలైంది. తనకు డబ్బుల కంటే.. ఆత్మ గౌరవమే ముఖ్యమని తెలిపింది. కాగా.. స్టార్ సింగర్ లతా మంగేష్కర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పారు. అయితే ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్స్లు వేస్తూ కనిపించారు. అంతే కాదు ఈ వేడుకల్లో డ్యాన్స్ చేసినందుకు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా వారిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంగనా చేసిన పోస్ట్కు కొందరు నెటిజన్స్ మద్దతుగా నిలవగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. -
ఏడేళ్ల వయసులోనే పాటతో దోస్తీ.. లెజెండరీ సింగర్ జర్నీ..
లతా మంగేశ్కర్ రాకతో గానానికి జ్ఞానం వచ్చింది! ఆ జ్ఞానం సినిమా గానాన్నే కాదు మొత్తం సంగీత క్షేత్రాన్నే సుసంపన్నం చేసింది; ఆ జ్ఞానం గాన, సంగీత అభిమానుల్ని పరవశింపజేసింది. శాస్త్రీయ సంగీత గానం, సినిమా గానం, లలిత గానం అనే వర్గీకరణలకు అతీతంగా లతా మంగేశ్కర్ ఒక మహోన్నతమైన గాయని. సంగీత క్షేత్రంలో లత గానం, గాత్రం మహోన్నతంగా వెల్లివిరిశాయి. Rounded even, clear resonant voice లతా మంగేశ్కర్ది. లత Timbre ఆమె వచ్చిన సమయానికి మన దేశంలో న భూతో; సంగీత దర్శకుడు గులాం హైదర్ ఈ విషయాన్ని ముందుగా పసిగట్టారు. తరువాత ఆ Timbre న భవిష్యతి కూడా అయింది. విశిష్టమైన గాత్రం లత గాత్రం. Verve ఉంటుంది లత గాత్రంలో. లత గాత్రం సహస్రాబ్ధి గాత్రం (Voice Of Millennium). ఖేంచంద్ ప్రకాష్ సంగీతంలో మహల్ సినిమాలో "ఆయేగా ఆయేగా..." పాటతో ఊపందుకున్న లత గానం ఆ పాట వచ్చిన సంవత్సరం (1949)లోనే శంకర్-జైకిషన్ సంగీతంలో బర్సాత్ సినిమాలో "జియా బేకరార్ హై...", "బర్సాత్ మే హంసే మిలే...", "హవామే ఉడ్తా జాయే..." పాటలతో మొత్తం దేశాన్నే ఊపేసింది. నాణ్యత, రంజన రెండూ లత గానంలో రాజిల్లాయి. లత స్థాయి నాణ్యమైన, ఆమెలా రాణించిన మఱొక గాయని మనదేశంలో లేరు. Lata has unerring sense of pitch and rhythm. "లతా సుర్ కా అవ్తార్" అని అన్నారు బడే గులామ్ అలీఖాన్. సినిమా పాటలంటే చిన్నచూపు ఉన్న శాస్త్రీయ సంగీత విద్వాన్ బడే గులామ్ అలీఖాన్. ఆయన లతా మంగేశ్కర్ గాత్రానికి, గానానికి ముగ్ధులయ్యారు. "శ్రుతి అవతారం లత" అని అంటూ అలా, అంతలా ప్రస్తుతించారు. ఠుమ్రీ గాన విధానానికి బడే గులామ్ అలీ ఖాన్ మార్గ దర్శకుడు. ఆయన స్ఫూర్తితో బాజూబంద్ (1954) హిందీ సినిమాలో లత గొప్పగా ఒక ఠుమ్రీ పాడారు. మన దేశ చలన చిత్ర గానంలో bel canto పురుషుల పరంగా మొహమ్మద్ రఫీ, మహిళల పరంగా లత తోనే మొదలయింది! స్వర సమం (తాళ సమం కాదు), mood, balance, diction, modulation, expression వీటిపై లతా మంగేశ్కర్కు గొప్ప అవగాహన ఉంది. "Lata sings others make miserable effort" అని అన్నారు మన దేశంలోనే ప్రశస్తమైన చలన చిత్ర సంగీత దర్శకుడు సజ్జాద్ హుస్సైన్. హల్చల్ చిత్రంలో సజ్జాద్ హుస్సేన్ సంగీతంలో "ఆజ్ మేరే నసీబ్..." పాటలో లత గానం metronomical balanceతో ఉంటుంది. మదన్ మోహన్ సంగీతం చేసిన అన్పధ్ సినిమాలోని "ఆప్ కీ నజ్ రోనే సంఝా..." గానం balance అన్నదానికి సరైన అభివ్యక్తి. రుస్తమ్ సొహరాబ్ చిత్రంలో సజ్జాద్ హుస్సేన్ సంగీతంలో "ఏ దిల్ రుబా..." పాట ఒక్క లత మాత్రమే అంత గొప్పగా పాడగలరు. శంకర్-జైకిషన్ సంగీతంలో "జా జారే జా బాలమ్..." (సినిమా: బసంత్ బహార్), "ఓ బసంతీ పవన్..." (సినిమా: జిస్ దేశ్ మే గంగా బహ్ తీ హై), "రసిక్ బల్ మా..."( సినిమా: చోరీ చోరీ), "ఏ షామ్కీ తన్ హాయియా..."(సినిమా: ఆహ్) వంటి ఎన్నో అద్భుతాల్ని పాడారు లత. నౌషాద్ సంగీతంలో బైజుబావ్రా సినిమాలో పాడిన "మొహెభూల్ గయె సావరియా" పాట మరెవరు పాడినా అంత గొప్ప పాట కాకుండా పోయేది. భారతదేశ చలన చిత్రాలలోనే అత్యుత్తమమైన జోల పాట సి. రామచంద్ర సంగీతం చేసిన అల్బేలా సినిమాలో లత పాడిన "ధీరేసే ఆజా..." పాట. అటు తరువాత ధోభీగా జమీన్ సినిమాలో సలిల్ చౌధురీ సంగీతం చేసిన "ఆజారీ ఆ నిందియా...", సన్సార్ సినిమాలో రోషన్ సంగీతం చేసిన "హన్సే టిమ్ టిమ్...", పూనమ్ సినిమాలో శంకర్- జైకిషన్ సంగీతం చేసిన "ఆయీ ఆయీ రాత్ సుహానీ...", కట్పుత్లీ సినిమాలో శంకర్-జైకిషన్ సంగీతం చేసిన "సోజా రే సోజా మేరీ..." వంటి దేశంలో వచ్చిన గొప్ప జోల పాటలు లత పాడడంవల్ల మరింత గొప్ప జోల పాటలయ్యాయి. సలిల్ చౌధురీ సంగీతంలో లత పాడిన "ఓ సజ్ నా..." , టాంగా వాలీ సినిమాలో "మే లుట్ గయీ దునియా వాలో..." అంటూ పాడిన పాట, అన్నదాత సినిమాలో " రాతో మే క్యా క్యా.." పాట విశేషమైనవి. ఎస్.డి. బర్మన్ సంగీతంలో "మేఘా ఛాయా ఆధీ రాత్..." (సినిమా: షర్మిలీ) వంటి పలు ఉదాత్తమైన పాటలు పాడారు లత. "సునో సజ్నా..." (సినిమా: ఆయే దిన్ బహార్ కే) అంటూనూ, "జీవన్ డోర్ తుమ్ హీ..." (సినిమా: సతీ సావిత్రీ) అంటూనూ, "సత్యమ్ శివమ్ సుందరమ్..." (సినిమా: సత్యమ్ శివమ్ సందరమ్) అంటూనూ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ సంగీతంలో గొప్ప పాటలు పాడారు లత. ఆర్.డి.బర్మన్ సంగీతంలో లత పాడిన "రేనా బీతి జాయే షామ్ న ఆయే..." పాట గాన కళకు ఉచ్చ స్థితి. గాన కళను మెఱుగు పఱుచుకుంటే పోతే ఒక దశలో రేనా బీతి జాయే పాటలాగా వస్తుంది. ఆర్.డి.బర్మన్ సంగీతంలో "క్యా జానూ సజన్..." ( సినిమా: బహారోంకే సప్నే), "సీలీ హవా ఛూ గయే..."( సినిమా: లిబాస్), "నా కోయీ ఉమంగ్ హై..." (సినిమా: కటీ పతంగ్), "తేరే లియే పల్కోంకీ ఝాలర్..." (సినిమా: హర్జాయీ) వంటి ప్రతేకమైన పాటలు పాడారు లత. "తుమ్ క్యా జానో తుమ్హారీ యాద్..." అంటూ సి. రామచంద్ర సంగీతంలో (సినిమా: శిన్ శినాకీ బూబ్లబూ) లత చేసిన గానం మరో గాయని అందుకోలేని ఔన్నత్యం. భావ యుక్తంగా బాగా పాడడం అన్నదానికి మించి Mood (మనోధర్మం), spirit, అతీతమైన మేలిమి(super fineness), profoundity, శ్రుతి శుభగత్వం వీటితో ఈ పాటలో లత గానం అత్యుదాత్తంగా ఉంటుంది. ఇలా అత్యుదాత్తంగా రోషన్ సంగీతంలో "ఇస్ దిల్ కీ హాలత్ క్యా కహి యే..." (సినిమా: అన్హోనీ), పండిత్ రవి శంకర్ సంగీతంలో "హాయ్ రే వొ దిన్..." (సినిమా: అనూరాధా), నౌషాద్ సంగీతంలో "మొహే పన్ఘట్..."(సినిమా: ముఘల్-ఎ-ఆజమ్), "తోడ్ దియా దిల్ మేరా..." (సినిమా: అందాజ్) హేమంత్ కుమార్ సంగీతంలో "కుచ్ దిల్ నే కహా..." (సినిమా: అనుపమ), హృదయానాథ్ మంగేశ్కర్ సంగీతంలో "యారా సీలీ సీలీ..." (సినిమా: లేకిన్), ఖయ్యామ్ సంగీతంలో "బహారో మేరా జీవన్ భీ సవారో..." (సినిమా: ఆఖ్రీకత్), ఎస్. డి. బర్మన్ సంగీతంలో "థండీ హవాయే..." (సినిమా: నౌజవాన్) చిత్రగుప్త సంగీతంలో "దిల్ కా దియా జలా కే గయా..." (సినిమా: ఆకాశ్ దీప్) మదన్ మోహన్ సంగీతంలో "లగ్ జాగలే కే ఫిర్ హసీ రాత్..."(సినిమా: వో కౌన్ థీ), "న తుమ్ బేవఫా హో న హమ్ బేవఫా హై..."(సినిమా: ఏక్ కలీ ముస్కాఈ) సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో "వొ రాత్ దిన్ వొ చాందినీ..." (సినిమా: సైయా), "కిస్మత్ మే ఖుషీ కా నామ్ నహీ..." (సినిమా: సైయా), వంటి పాటలూ, ఇంకా పలు పాటలూ పాడారు లత. తెలుగులో సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో "నిద్దుర పోరా తమ్ముడా అంటూ గొప్పగా పాడారు లత. అంతకు ముందు తెలుగువారైన ఈమని శంకర శాస్త్రి సంగీతంలో బహుత్ దిన్ హుఎ సినిమాలో "చందా చమ్కే నీల్ గగన్ మే..." అంటూ గొప్పగా పాడారు లత. ఆఖరి పోరాటం సినిమాలో ఇళయరాజా సంగీతంలో "తెల్లచీరకు తకధిమి తపనలు..." అంటూ చక్కగా పాడారు ఆమె. ఎ.ఆర్. రహ్మాన్తో సహా పలువురు సంగీత దర్శకులకు పలు భాషల్లో పలు ఉన్నతమైన పాటలు పాడారు లత. 1929 సెప్టెంబర్ 28న పుట్టిన లత తన 7వయేట తండ్రి మరాఠీ నాటకం సుభద్రాలో నారదుడి వేషంలో పాడుతూ నటించారు. ఆ తరువాత 13యేళ్ల వయసులో మరాఠీ సినిమా పహిలీ మంగల్ గౌర్ (1945) సినిమాలో నటిస్తూ తనకు "నటాలీ చైత్రాచి నవలాయీ" అన్న మరాఠీ పాట పాడుకున్నారు. లత తన మొదటి హిందీ పాట "హిందూస్థానీ లోగో..." అంటూ గజభావూ(1945) అన్న మరాఠీ సినిమాలో నటిస్తూ పాడుకున్నారు. 1945లో వచ్చిన బడీమా హిందీ సినిమాలో నటించి తనకు తాను "తుమ్ హో బడీ మా..." అంటూ ఒక పాట పాడుకున్నారు. ఈ బడీమా సినిమాలో "నట్ కట్ హటీ లే గోపాల్..." అంటూ లత తొలిసారి నేపథ్య గానం చేశారు. ఆ తరువాత 1946లో వచ్చిన ఆప్ కీ సేవా మే హిందీ సినిమాలో "ఏక్ నయే రంగ్ మే...", "పా లాగూ కర్ జోరి రే..." పాటలు పాడారు. ఈ ఆప్ కీ సేవా మే పాటలు బొంబాయిలో రికార్డ్ అయిన లత తొలి పాటలు. ఇవి ఆమె నేపథ్య గానం చేసిన తొలి పాటలు కావు. పూణేలో రికార్డ్ అయిన బడీమా సినిమాలోని "నట్ కట్ హటీ లే గోపాల్..." పాట నేపథ్య గాయనిగా లత పాడిన తొలి పాట. 2019లో "సౌగంధ్ ముఝే ఇస్ మిట్టి కీ..." అంటూ మన దేశ సైన్యానికి నివాళిగా తన చివరి పాట పాడారు లత. సినిమా పాటలు, భజన్లు, గజళ్లు, లలిత గీతాలు, అభంగ్లు, బెంగాలీ సంగీతం, జానపద సంగీతం ఇలా పలు ధోరణుల్లో లత గానం ప్రవహించింది. అన్ని భాషల్నీ కలుపుకుని 6,550 పైచిలుకు సినిమా పాటలూ, ఇంచు మించు 1,000 ఇతర పాటలూ లత పాడారని తెలుస్తోంది. ఎంత ఎక్కువగా ఊహించుకున్నా ఈ సంఖ్య 8,000 పైచిలుకు దాటకపోవచ్చు. లత 40,000 లేదా 30,000 పాటలు పాడారని చెప్పబడుతూండడం సరి కాదు. పాడడం అన్న కళ లతా మంగేశ్కర్వల్ల పరిపుష్టమైంది, పరిఢవిల్లింది, పరిపూజనమైంది. Rendition-intensity లేదా ప్రగాఢమైన గానం లత వైశేష్యం. Profound singingతో, rounded even singingతో లత ఒక గాన శకం అయ్యారు. లతా మంగేశ్కర్ 'ఒక ప్రకృతి అద్భుతం' అన్న మాట ఉంది. సంగీత ప్రపంచానికి ప్రకృతి ఇచ్చిన వర వరం లత. 'Lata, a boon and boost to the world of music". ఎనెన్నో పురస్కారాలు, బిరుదులు ఆమెను దక్కించుకున్నాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత్ రత్న ఆమెవయ్యాయి. రత్నానికి అరగడం ఉండదు; రత్నం ఎప్పటికీ వాడిపోదు. లత గానం శ్రేష్ఠమైన రత్నం. అది ఎల్లప్పుడూ మనలో మెఱుస్తూనే ఉంటంది; మనకై మెఱుస్తూనే ఉంటుంది. 6/2/2022 న లత తుది శ్వాస విడిచారు. లతా మంగేశ్కర్కు వర్ధంతులు వస్తూ ఉంటాయి. కానీ ఆమె గానానికి వర్ధంతులు ఉండవు! ఎందుకంటే ఆ గానం మరణించలేదు కాబట్టి; ఆ గానానికి మరణం రాదు కాబట్టి. ఇవాళ మనతో లత శరీరం లేదు. కానీ ఆమె శారీరం ఈ మట్టిలో, ఈ మట్టి ప్రజలో, సంగీత ప్రపంచంలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎల్లప్పుడూ నిలిచి ఉండే గాన తటిల్లత లత. - రోచిష్మాన్, 9444012279 -
లతా మంగేష్కర్ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ!
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజీత్ లగ్నంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమం పలువురు ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు, గాయకులు, దర్శకులు, కళాకారులను ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్లో అయోధ్యకు సంబంధించిన అప్డేట్లను తరచూ షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ గాయని లతామంగేష్కర్కు సంబంధించిన ఒక వీడియోను ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో షేర్ చేశారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో గాయని లతా మంగేష్కర్ను మిస్ కావడం విచారకరమని అన్నారు. As the nation awaits 22nd January with great enthusiasm, one of the people who will be missed is our beloved Lata Didi. Here is a Shlok she sung. Her family told me that it was the last Shlok she recorded. #ShriRamBhajanhttps://t.co/MHlliiABVX — Narendra Modi (@narendramodi) January 17, 2024 లతా మంగేష్కర్ కీర్తనలలో ఒకదానిని ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని.. ఇది లతా మంగేష్కర్ పాడగా, రికార్డ్ చేసిన చివరి శ్రీరాముని శ్లోకమని తెలిపారు. ఈ శ్లోకం పేరు ‘శ్రీ రామ్ అర్పణ్’. దీనిలో లతా మంగేష్కర్ మధురమైన గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇది కూడా చదవండి: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019