breaking news
-
నాభి అందాలతో రాశీ.. చాన్నాళ్ల తర్వాత అలా కనిపించిన తృప్తి!
భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న కృతి సనన్ మత్తెక్కించేలా చూస్తూ కాక రేపుతున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి బాయ్ ఫ్రెండ్ తో 'రానా నాయుడు' బ్యూటీ క్యూట్ పోజులు షాకింగ్ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తున్న మెగాడాటర్ నిహారిక చూస్తేనే మతిపోయేల్లాంటి స్టిల్స్ తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Jasnya Jayadeesh (@jasnya_k_jayadeesh) View this post on Instagram A post shared by prateik patil babbar (@_prat) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
బాలీవుడ్ పై కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు..!
-
ప్రభాస్ ఆదిపురుష్పై ట్రోల్స్.. డైరెక్టర్ను భయపెట్టారు: నటుడు కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరెకెక్కించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణాన్ని ఇప్పటి సినీ ప్రియులకు అనుగుణంగా తెరకెక్కించడంలో ఓం రౌత్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఆదిపురుష్పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీపై వచ్చిన విమర్శలపై ఆదిపురుష్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కళను విమర్శించడం సరికాదని హితవు పలికారు. సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ..నటీనటులను, చిత్రబృందాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ..'మీకు సినిమా నచ్చకపోతే చూడటం మానేయండి. అంతే నటీనటులను విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒక సినిమా తీయాలంటే అందులో ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. మీకు నచ్చితేనే సినిమా చూడండి. కొంతమంది కళాకారులను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఓం రౌత్ అలాంటి భయపడలేదు. ట్రోల్స్ పట్టించుకోకుండా ధైర్యంగా ఉన్నాడు. అందుకే అతను నాకు ఇష్టం' అని అన్నారు. తాజాగా బిజయ్ ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. కాగా.. బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ చిత్రంలో బ్రహ్మ పాత్రలో కనిపించారు. తాజాగా విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ సినిమా ప్రమోషన్స్లో ఈ కామెంట్స్ చేశారు. -
హీరోలకు అంత సీన్ లేదు: హీరోయిన్ కృతిసనన్
ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా సరే హీరోలదే హవా. స్టార్ హీరోలు ఉన్నారంటే ప్రేక్షకుడు, థియేటర్ కి వస్తాడనేది చాలామంది బలంగా నమ్మే మాట. ఇప్పుడు ఈ విషయమై 'ఆదిపురుష్' ఫేమ్ కృతిసనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరోలకు అంత సీన్ లేదు అనేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏంటి విషయం? కృతిసనన్ ఏమంది? (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) 'పెద్ద హీరో ఉన్నంత మాత్రాన సినిమా చూడటానికి ప్రేక్షకులు పరుగెత్తుకుని వచ్చేయరు. కథ బాగుంటే.. అందులో యాక్టర్స్ ఆడా? మగా? అనేది చూడరు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికీ చాలామంది నిర్మాతలు.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే చిన్నచూపు చూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోలు లేనప్పటికీ 'క్రూ' మూవీ బాగా ఆడుతోంది. ఇది చూసైనా సరే ఇండస్ట్రీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.' పైన కృతిసనన్ చెప్పింది నిజమే. ఎందుకంటే ఒకప్పుడు ప్రేక్షకులు.. హీరోల కోసం సినిమాలకు వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం కంటెంట్ బాగుందా? ఎంటర్ టైన్ మెంట్ ఉందా? లాంటివి చాలా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా తన 'క్రూ' మూవీ హిట్టయ్యేసరికి కృతి ఈ వ్యాఖ్యలు చేసింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే హీరోలకు అంత సీన్ లేదని అన్నట్లేగా! ఇకపోతే కృతిసనన్.. మహేశ్ 'వన్ నేనొక్కడినే', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
ఇక్కడ టిల్లు స్క్వేర్.. అక్కడ క్రూ.. రెండింట్లో ఒకటి కామన్!
కంటెంట్ బాగుంటే చాలు.. బడ్జెట్, తారాగణం.. ప్రమోషన్స్.. ఇవేవీ పట్టించుకోరు జనాలు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపించిందా.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా లెక్క చేయకుండా పోలోమని థియేటర్లకు వెళ్లిపోతుంటారు. అలా ఈ మధ్య ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచాయి. తెలుగులో డీజే టిల్లుకు సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ సైతం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. రేపటితో వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఓన్లీ మ్యాజిక్ టిల్లు స్క్వేర్లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఓన్లీ మ్యాజిక్ అంతే! పంచులు, కామెడీ డైలాగులు పటాసుల్లా పేలుతాయి. అలాంటి మ్యాజిక్తోనే బాలీవుడ్లో ఓ సినిమా వచ్చింది.. అదే క్రూ. ఇందులో పెద్దగా ఎమోషన్స్ ఉండవు, సీరియస్ సినిమా కానే కాదు.. కామెడీ ఎంటర్టైనర్. ముగ్గురు ఫ్లయిట్ అటెండెట్లు.. కరీనా, టబు, కృతి పని చేసే ఎయిర్లైన్స్ త్వరలో దివాలా తీస్తుందని ఓ రూమర్. కథేంటంటే? పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్లో ఓరోజు సడన్గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. కలెక్షన్స్ ఎంతంటే? మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హిందీ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడంతో దూసుకుపోతోంది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్లు దాటేసేలా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ల బడే మియా చోటే మియా, అజయ్ దేవ్గణ్ మైదాన్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. అప్పటివరకు క్రూ మూవీ కలెక్షన్స్కు ఎలాంటి ఢోకా లేనట్లే! CREW is flying high with a strong start at the box office with a solid week 1 collection! 🛫#CrewInCinemasNow Book your tickets now: https://t.co/jAZNn6fYMR#Tabu #KareenaKapoorKhan @kritisanon @diljitdosanjh and a special appearance by @KapilSharmaK9 pic.twitter.com/IZJnvt9QIC — BalajiMotionPictures (@balajimotionpic) April 5, 2024 చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది?
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019