breaking news
-
లవ్ టుడే హీరో మరో చిత్రం.. ఆ సూపర్ హిట్ కాంబో రిపీట్!
నటుడు జయంరవి హీరోగా నటించిన కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ ఆ తరువాత లవ్టుడే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్హిట్ను అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ఇదే సంస్థలో ప్రదీప్ రంగనాథన్ మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా తన కాలేజ్మేట్ అశ్వంత్ మారిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిలింస్ చేశారు. దీని గురించి ఏజీఎస్ సంస్థ నిర్వాహకులు గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నటుడు ప్రదీప్ రంగనాథన్ తన కాలేజ్మేట్, మిత్రుడు అశ్వంత్ మారిముత్తుతో కలిసి చిత్రం చేయాలన్నది దశాబ్దం కల అని పేర్కొన్నారు. అది ఇప్పటికి నెరవేరబోతోందని అన్నారు. కాగా ఈయన ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ తరువాత ఏజీఎస్ ఎంటర్టైయిన్మెంట్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 26వ చిత్రం అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని చెప్పారు. కాగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్ప్రభు దర్శకత్వంలో గోట్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. Dedicated to all those who have a dream :) Joining hands with my brother , friend , well wisher @Dir_Ashwath and my home ground @Ags_production once again ❤️#AGS26 #PR03 Announcement video : https://t.co/JwLjs8n5HI#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh pic.twitter.com/hKxBbns9TB — Pradeep Ranganathan (@pradeeponelife) April 10, 2024 -
కబాలి భామ సరికొత్త లేడీ ఓరియంటెడ్ చిత్రం!
2006లో తిరుడి చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అయిన నటి సాయి దన్సిక. అయితే 2009లో జయం రవితో నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. తరువాత మాంజావేలు, నిల్ గమనీ సెల్లాదే, పరదేశీ వంటి చిత్రాల్లో కథానాయకిగా సత్తాచాటారు. 2016లో రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రంలో ఆయనకు కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని మలయాళ చిత్రాల్లోనూ నటించిన ఈమె ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. కాగా తాజాగా ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈమె నటించిన ది ప్రూఫ్ చిత్రాన్ని నృత్య దర్శకురాలు రాధిక తెరకెక్కించడం విశేషం. ఈమె మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం కావడం గమనార్హం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ట్రైలర్ను నటుడు శశికుమార్ బుధవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) -
'40 రోజులు వనవాసం'.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి తన శక్తికి మించిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. మహానటిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తాజాగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా అక్కా అనే వెబ్ సిరీస్లో నటి రాధిక ఆప్టేతో కలిసి నటించారు. ధనరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్ తాజాగా తన ఇన్స్ట్రాగామ్లో పంచుకున్నారు. దాదాపు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానని రాసుకొచ్చారు. అక్కా వెబ్ సిరీస్లో నటించడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ షెడ్యూల్ని ముగించుకుని ఇంటికి తిరిగిరావడం సరి కొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర మూవీ షూటింగ్లకు హాజరవుతానని తెలిపారు. కాగా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివెడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు కావడం విశేషం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. చివరి చిత్రం డైరెక్టర్గా ఎవరంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 69వ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న విజయ్ నటించే చివరి చిత్రం ఇదేననే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన తండ్రి, కుమారుడిగా ద్విపాత్రాభియనం చేస్తున్నారు. కొడుకు పాత్ర కోసం ఆధునికి టెక్నాలజీని వాడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్ 69వ చిత్రానికి దర్శకుడెవరనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఈ విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. వీరిలో ఓ టాలీవుడ్ డైరెక్టర్తో పాటు, వెట్రిమారన్, కార్తీక్సుబ్బరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికీ విజయ్తో చిత్రం చేయాలన్నది ఆశే. తాజాగా హెచ్.వినోద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు చతురంగవేట్టై, ధీరన్ అధికారం ఒండ్రు, తుణివు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిపారు. చిత్రం ప్రారంభమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఆ చిత్రం డ్రాప్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ తన 69వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం వైరలవుతోంది. దీని గురించి ఇటీవల ఓ భేటీలో నటుడు విజయ్ హీరోగా చేస్తే అది ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు హెచ్.వినోద్ బదులిస్తూ కచ్చితంగా రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందని చెప్పారు. విజయ్ హీరోగా రాజకీయ నేపథ్యంలో చిత్రం చేయాలన్నది తన కోరిక అని పేర్కొన్నారు. తాను ఆయనకు చెప్పిన కథలన్నీ అలాంటివేనన్నారు. కాగా విజయ్ 69వ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు అయితే అది కచ్చితంగా ఆయన రాజకీయ జీవితానికి ప్రయోజన కరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
స్టార్ హీరోతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ చిత్రం.. !
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్కు తనకంటూ ప్రత్యేక శైలి, స్థానం సంపాదించుకున్నారు. అగ్రస్టార్గా కొనసాగుతున్న అజిత్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ విజయాలను సాధించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా ఇంతకుముందే అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విడాయమర్చి చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తదుపరి 63వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విశాల్ హీరోగా మార్క్ ఆంటోని వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించకపోయినా టైటిల్ చూస్తుంటే అర్థమవుతోంది. నటుడు అజిత్ ఇంతకుముందు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వరలారు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. ఆ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా దాదాపు 18 ఏళ్ల తరువాత అజిత్ మళ్లీ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో మూడు పాత్రల్లో అలరించునున్నారు. ఇది నిజమైతే ఆయన అభిమానులకు ఇక పండగే.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019