breaking news
Ad - Sakshi_Home_Sticky
-
భారీ క్రేన్ తో జగనన్నకు పూల మాల
-
జగన్ మంచి మనసు..అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం
-
Kurnool: శ్రీకొండలరాయుడికి నైవేద్యంగా తేళ్లు
కోడుమూరు: ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండమీద వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే మూడవ సోమవారం ఈ వింత ఆచారాన్ని కోడుమూరు ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. కోడుమూరులోని కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకు బొంకు లేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి కానుకగా సమర్పించి తమ కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం ఇక్కడ ప్రతి యేటా కొనసాగే వింత ఆచారం. తేలును పట్టుకునే సమయంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. (క్లిక్: మూడు దేశాల ముచ్చటైన కళ్యాణం) మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రియుడి మోజులో మహిళ దారుణం..
సాక్షి, కర్నూలు(కోడుమూరు): ప్రియుడి మోజులో పడి ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే కడతేర్చింది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం కోడుమూరు పట్టణంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కర్నూలు డీఎస్పీ కేవి.మహేష్ ఎదుట హాజరు పరిచారు. పట్టణంలోని హరిజన వాడకు చెందిన సుధాకర్(37), కల్లూరుకు చెందిన లక్ష్మికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. అదే పని చేస్తున్న దస్తగిరి అనే వ్యక్తితో సుధాకర్ భార్య లక్ష్మికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం బయట పడటంతో పలుమార్లు భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాకపోగా.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు దస్తగిరితో కలసి సుధాకర్ను చంపేందుకు పథకం రూపొందించింది. చదవండి👉🏾 హైదరాబాద్లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్ ఈ క్రమంలో ఈనెల 18వ తేదీ రాత్రి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపేసి ముళ్ల పొదల్లో పడేసి ఇంటికి చేరుకున్నారు. కాగా మృతదేహం కనిపించకుండా మరుసటి రోజు ఇద్దరు వెళ్లి మృతదేహాన్ని హంద్రీ నదిలో పూడ్చి పెట్టారు. కాగా రెండు రోజులుగా కుమారుడు కనిపించక పోవడంతో సుధాకర్ తండ్రి లక్ష్మన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి, దస్తగిరిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. శవాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతాన్ని నిందితులు శుక్రవారం చూపెట్టారు. కర్నూలు డీఎస్పీ కేవి.మహేష్, తహసీల్దార్ ఉమామహేశ్వరమ్మ, కోడుమూరు సీఐ శ్రీధర్, ఎస్ఐ విష్ణు నారాయణ సుధాకర్ సమక్షంలో శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే సుధాకర్
సాక్షి, కర్నూలు: ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చిందని భయపడకూడదని, అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదన్నారు. తనకు గత నెల 20న కరోనా వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ప్లాస్మా దానం వల్ల మరో ముగ్గురు కరోనా బాధితులకు ప్రాణదానం చేయవచ్చన్నారు. (ఆత్మస్థైర్యంతో జయించా)
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019