breaking news
-
వారెవ్వా జడేజా.. క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో చెన్నై స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. జడ్డూ అద్బుతమైన క్యాచ్తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను పెవిలియన్కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మతీషా పతిరానా బౌలింగ్లో తొలి బంతిని రాహుల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. ఎడమవైపున్కు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారెవ్వా జడ్డూ సూపర్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. జడేజా(57), ధోని(28 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు. Ravi Shastri - "What a Catch, is that the Catch of IPL, WOW, that was Flying like a Trace of Bullet" Ravindra Jadeja took "One of the Greatest Catch of IPL 2024" 👏#CSKvLSG #CSKvsLSGpic.twitter.com/SQDFOz9Lmo — Richard Kettleborough (@RichKettle07) April 19, 2024 -
‘సూపర్’ పోరులో జెయింట్స్ పైచేయి
ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కోలుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ను నిలువరించిన లక్నో ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం చేరింది. ఛేదనలో కేఎల్ రాహుల్, డికాక్ కీలక పాత్ర పోషించగా... రెండు వరుస విజయాల తర్వాత చెన్నై తలవంచింది. లక్నో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో లక్నో కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో లక్నో 8 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... రహానే (24 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (20 బంతుల్లో 30; 3 సిక్స్లు), ధోని (9 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్లు), క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 90 బంతుల్లోనే 134 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. ధోని మెరుపులు... ఓపెనర్ రచిన్ రవీంద్ర (0) టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగించగా... మరో ఎండ్లో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్ప్లే ముగిసేసరికి చెన్నై 51 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17) ప్రభావం చూపలేకపోగా, నాలుగో స్థానంలో వచ్చిన జడేజా పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే రహానేతో పాటు ఫామ్లో ఉన్న శివమ్ దూబే (3), సమీర్ రిజ్వీ (1)లను తక్కువ వ్యవధిలో అవుట్ చేసి లక్నో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా చెన్నై బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఒకదశలో వరుసగా 34 బంతుల పాటు బౌండరీనే రాలేదు! 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 113/5. అయితే చివరి 4 ఓవర్లలో సూపర్ కింగ్స్ చెలరేగి 63 పరుగులు రాబట్టింది. మొహసిన్ ఓవర్లో సిక్సర్తో 34 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... బిష్ణోయ్ వేసిన తర్వాతి ఓవర్లో అలీ వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. అనంతరం 19వ ఓవర్లో 4, 6 కొట్టిన ధోని... ఆఖరి ఓవర్లో మరో 2 ఫోర్లు, సిక్స్తో చెలరేగాడు. ఏడో వికెట్కు ధోని, జడేజా 13 బంతుల్లో 35 పరుగులు జోడించారు. శతక భాగస్వామ్యం... ఛేదనను రాహుల్, డికాక్ ఘనంగా ఆరంభించారు. వీరిద్దరిని ఇబ్బంది పెట్టడంలో చెన్నై బౌలర్లంతా విఫలమయ్యారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో పవర్ప్లేలో 54 పరుగులు రాగా... 10.5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు దాటింది. 31 పరుగుల స్కోరు వద్ద డికాక్ ఇచ్చిన క్యాచ్ను పతిరణ వదిలేయగా, 31 బంతుల్లో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 41 బంతుల్లో డికాక్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు అవుటైనా... లక్ష్యం చేరేందుకు లక్నోకు ఇబ్బంది ఎదురు కాలేదు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (బి) కృనాల్ 36; రచిన్ (బి) మొహసిన్ 0; రుతురాజ్ (సి) రాహుల్ (బి) యశ్ 17; జడేజా (నాటౌట్) 57; దూబే (సి) రాహుల్ (బి) స్టొయినిస్ 3; రిజ్వీ (స్టంప్డ్) రాహుల్ (బి) కృనాల్ 1; అలీ (సి) బదోని (బి) బిష్ణోయ్ 30; ధోని (నాటౌట్) 28; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు 176. వికెట్ల పతనం: 1–4, 2–33, 3–68, 4–87, 5–90, 6–141. బౌలింగ్: హెన్రీ 3–0–26–0, మొహసిన్ 4–0–37–1, యశ్ ఠాకూర్ 4–0–45–1, కృనాల్ పాండ్యా 3–0–16–2, రవి బిష్ణోయ్ 4–0–44–1, స్టొయినిస్ 2–0–7–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 54; రాహుల్ (సి) జడేజా (బి) పతిరణ 82; పూరన్ (నాటౌట్) 23; స్టొయినిస్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–134, 2–161. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–26–0, తుషార్ 4–0–42–0, ముస్తఫిజుర్ 4–0–43–1, జడేజా 3–0–32–0, పతిరణ 4–0–29–1, అలీ 1–0–5–0. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X హైదరాబాద్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
RCB: అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా: కేఎల్ రాహుల్
‘‘ఆ రోజు విరాట్ అక్కడే ఉన్నాడు. కోచ్ రే జెన్సింగ్స్.. ఇంకా మిగతా సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. అప్పుడు విరాట్ వచ్చి.. ‘నీకు ఈ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టడం ఇష్టమేనా? ఆర్సీబీకి ఆడతావా? అని అడిగాడు. అందుకు బదులుగా.. ‘ఏంటీ జోక్ చేస్తున్నావా?.. నా చిరకాల కల అది’ అని అన్నాన్నేను. అప్పుడు విరాట్.. ‘అవును.. జోక్ చేశానులే.. అయినా.. ఇది నీకు ఆప్షన్ కాదు.. ముందు ఈ కాంట్రాక్టు మీద సంతకం పెట్టు’ అన్నాడు. నేను అలాగే చేశాను. అప్పుడు వెంటనే విరాట్ స్పందిస్తూ.. ‘ఇక నుంచి నీ ప్రయాణం క్రేజీగా ఉండబోతోంది. వచ్చే రెండు నెలలు నీకు ఫుల్ మజా’ అంటూ నన్ను ఆటపట్టించాడు’’ అని టీమిండియా స్టార్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా కర్ణాటకకు చెందిన కన్ననూర్ లోకేశ్ రాహుల్ 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి ఐపీఎల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కేకేఆర్తో మ్యాచ్తో ఎంట్రీ సొంతమైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్(కెప్టెన్)కు ఆడిన రాహుల్.. 2022లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. తమ తొలి సీజన్లోనే లక్నోను ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. ఇక ఐపీఎల్-2024లోనూ ప్రస్తుతం లక్నో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆడిన ఆరు మ్యాచ్లలో మూడు గెలిచి ఐదో స్థానంలో ఉంది. శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో లక్నో వేదికగా సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇదిలా ఉంటే.. లక్నోకు సారథిగా ఉన్నా కేఎల్ రాహుల్ మనసులో ఆర్సీబీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. తన సొంత రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ కావడంతో పాటు.. తనకు లైఫ్ కూడా ఇచ్చిన ఆర్సీబీ అంటే అతడికి గౌరవం. ఈ విషయాన్ని తాజాగా రవిచంద్రన్ అశ్విన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రాహుల్. అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా ‘‘ఆ రెండు నెలలు ఆర్సీబీలో నేను చాలా నేర్చుకున్నాను. మంచి అనుభవం గడించాను. అంతా త్వరత్వరగా జరిగిపోయింది. బెంగళూరుకు ఆడటం నాకెల్లప్పుడూ ఇష్టమే. నా కెరీర్ మొదలైందే అక్కడ! అక్కడే కెరీర్ ముగిస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నా. ఏదేమైనా భిన్న జట్లతో.. భిన్న ప్లేయర్లతో కలిపే ఐపీఎల్ ఓ అద్భుతమైన టోర్నీ’’ అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. చదవండి: హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి! ‘‘వరల్డ్కప్ జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు. టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు. చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 264 పరుగులు సాధించాడు. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతడొక సర్ప్రైజ్.. వాళ్లిద్దరి వల్లే మా ఓటమి: కేఎల్ రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాల తర్వాత సొంత మైదానంలో తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. తద్వారా 160కి పైగా పరుగుల స్కోరు చేస్తే.. లక్ష్య ఛేదనలో లక్నో కచ్చితంగా గెలుస్తుందనే రికార్డు చెరిగిపోయింది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమిపై విచారం వ్యక్తం చేశాడు. తాము కనీసం ఇంకో 15- 20 పరుగులు సాధిస్తే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. శుభారంభం లభించినా దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యామని పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తమను దెబ్బకొట్టాడని కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక కొత్త బ్యాటర్ జేక్ ఫ్రేజర్- మెక్గర్క్ ఎలా ఆడతాడన్న విషయంపై తమకు అవగాహన లేదని.. అయితే.. అతడు అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. Maiden IPL FIFTY for Jake Fraser-McGurk on DEBUT! Hat-trick of sixes in this thoroughly entertaining knock 💥💥💥 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvDC pic.twitter.com/0hXuBkiBr3 — IndianPremierLeague (@IPL) April 12, 2024 ఢిల్లీ విజయంలో అతడికే ఎక్కువ క్రెడిట్ దక్కుతుందని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను పవర్ ప్లేలోనే అవుట్ చేయాలన్న తమ వ్యూహం ఫలించినా.. క్రీజులో పాతుకుపోయిన రిషభ్ పంత్, మెక్గర్క్ కలిసి మ్యాచ్ను తమ నుంచి లాగేసుకున్నారని రాహుల్ అన్నాడు. Victory in Lucknow for the @DelhiCapitals 🙌 A successful chase power them to their second win of the season as they win by 6⃣ wickets! Scorecard ▶️ https://t.co/0W0hHHG2sq#TATAIPL | #LSGvDC pic.twitter.com/6R7an9Cy8g — IndianPremierLeague (@IPL) April 12, 2024 ఒకవేళ నికోలస్ పూరన్(0) గనుక కాసేపు నిలబడగలిగితే కచ్చితంగా ప్రమాదకారిగా మారేవాడని.. అయితే, అతడిని పెవిలియన్కు పంపడంలో కుల్దీప్ యాదవ్ సఫలమయ్యాడని రాహుల్ పేర్కొన్నాడు. ఏదేమైనా లోపాలు సరిచేసుకుని తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతామని తెలిపాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్లో లక్నో సారథి, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 22 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు. 177.27 స్ట్రైక్రేటు నమోదు చేసి ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డు అందుకున్నాడు. కాగా లక్నో తదుపరి ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో తలపడనుంది. లక్నో వర్సెస్ ఢిల్లీ స్కోర్లు: ►టాస్: లక్నో.. బ్యాటింగ్ ►లక్నో స్కోరు: 167/7 (20) ►ఢిల్లీ స్కోరు: 170/4 (18.1) ►ఫలితం: లక్నోపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్(3/20) ►రిషభ్ పంత్ స్కోరు: 41 రన్స్ ►ఓవరాల్ టాప్ స్కోరర్లు: జేక్ ఫ్రేజర్- మెక్గర్క్(ఢిల్లీ- 35 బంతుల్లో 55), ఆయుశ్ బదోని (లక్నో- 35 బంతుల్లో 55 నాటౌట్). చదవండి: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019