breaking news
-
బాలారిష్టాలు దాటని హబ్
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ హబ్లో రకరకాల కొరతతో తరచూ పరీక్షలు నిలిచిపోతున్నాయి. రసాయనాల కొరత, యంత్రాల్లో లోపాలతో ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందో సిబ్బందికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి శాంపిళ్లు తీసుకొస్తున్నా లక్ష్యం మేరకు పరీక్షలు జరగడం లేదు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్ల క్రితం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ నెలకొల్పారు. తొలుత 57 రకాల పరీక్షలు నిర్వహించగా క్రమంగా వాటి సంఖ్య పెంచడంతో ప్రస్తుతం 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ కొంత కాలంగా టెస్టులకు రసాయనాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్ని పరీక్షలు జరగడం లేదు. ఇటీవల రసాయనాల సరఫరా పూర్తిగా నిలిచిపోగా కొన్ని రోజుల పాటు పరీక్షలే నిలిచిపోయాయి. దీంతో అధికారులు మహబూబాబాద్, వరంగల్ ఆస్పత్రుల నుంచిరసాయనాలు తెప్పించి పని కానిచ్చేశారు. ఇదే పరిస్థితి తరచుగా ఎదురవుతుండడంతో అవసరమైన పరీక్షలు జరగక సామాన్యులు మళ్లీ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. తొలినాళ్లలో మంచి స్పందన డయాగ్నస్టిక్ హబ్కు తొలి నాళ్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో 57 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం అదనంగా మరో 77 రకాల పరీక్షలను గత ఏడాది ప్రభుత్వం చేర్చింది. ఇలా 134రకాల పరీక్షలు చేయాల్సి ఉన్నా ఖమ్మం హబ్లో సగానికి కంటే తక్కువ పరీక్షలే జరుగుతున్నాయి. తరచూ రసాయనాల కొరత, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, యంత్రాల మరమ్మతులు వంటి కారణాలతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. సాధారణంగా హబ్లో ప్రతీ గంటకు 1,520 పరీక్షలు చేస్తారు. ఇందులో కెమిస్ట్రీ అనలైజర్ మిషన్ ద్వారా 1,200, ఇమ్యునో అనలైజర్ మిషన్ ద్వారా 220, సీబీపీ మిషన్ ద్వారా గంటకు వంద పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆ స్థాయిలో జరగడంలేదు. 45 ఆస్పత్రుల నుండి శాంపిళ్లు జిల్లాలోని 45 ప్రభుత్వ ఆస్పత్రుల నుండి ఖమ్మం పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్కు నిత్యం శాంపిల్స్ వస్తుంటాయి. పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో సేకరించిన శాంపిళ్లను వాహనాల్లో ఇక్కడకు తీసుకొస్తారు. ఇందుకోసం ఐదు రూట్లలో వాహనాలు తిరుగుతుంటాయి. అనంతరం హబ్లో పరీక్షలు చేసి 24గంటల్లోగా బాధ్యుల సెల్ఫోన్కు రిపోర్టు పంపిస్తారు. కానీ కొంత కాలంగా అనుకున్న స్థాయిలో పరీక్షలు జరగకపోగా... అవసరమైన వారు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సివస్తోంది. ప్రస్తుతం హబ్లో సీబీపీ, గర్భిణులకు నిర్వహించే కోయోగ్లేషన్ టెస్టులు, ఇతర అవసరమైన టెస్టులు అందుబాటులో లేవని సమాచారం. అన్ని పరీక్షలు జరిగేలా చర్యలు డయాగ్నస్టిక్ హబ్లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రసాయనాల కొరతతో అప్పుడప్పుడు కొంత ఏర్పడుతుండడంతో ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హబ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగేలా చూస్తున్నాం. డాక్టర్ బి.అమర్సింగ్, ఆర్ఎంఓ, ఖమ్మం జనరల్ ఆస్పత్రి తరచుగా పరీక్షలకు అంతరాయాలు పేరుకు 134 పరీక్షలు.. అందేవి అంతంతే ఖమ్మం డయాగ్నస్టిక్ హబ్లో రసాయనాల లేమితో ఇక్కట్లు సిబ్బంది కొరత, యంత్రాల మరమ్మతులతో ఇంకొంత సమస్య -
ఉక్కపోతతో బాలింతలు, చిన్నారుల అవస్థ
ఎంసీహెచ్లో మొరాయిస్తున్న ఏసీలుఖమ్మంవైద్యవిభాగం: ప్రచండ భానుడి ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో చికిత్స పొందుతున్న బాలింతలు వేడి తట్టుకోలేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలు వార్డుల్లో ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడంతో అధికారులు కొన్నిచోట్ల కూలర్లు బిగించారు. అయినా గాలి సరిపోక పలువురు ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుని వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. -
‘మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం’
● ఎంపీగా నామను గెలిపిస్తేనే అది సాధ్యం ● ప్రచార సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలిపించాలని పలువురు పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో జరిగిన ప్రచార సమావేశాల్లో అభ్యర్థి నామతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, సామాన్య ప్రజల కష్టాలు కళ్లెదుటే కనబడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా నామ గెలుపు తప్పనిసరని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినందుకు తప్పు చేశామని భావిస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ నామ గెలుపునకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలను తొలగించడమే కాక హామీలను నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా పాట రూపంలో వివరించారు. అలాగే, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ బి.ఉమ, నాయకులు తాళ్లూరి జీవన్కుమార్, బెల్లం వేణు, బాషబోయిన వీరన్న, గుడిబోయిన దర్గయ్య, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, ఏ.వరప్రసాద్, దేవరం దేవేందర్రెడ్డి, మాలతి, చావా వేణు, ఆలస్యం నాగేశ్వరరావు, రవి, చామకూరి రాజు తదితరులు పాల్గొన్నారు. ● ఖమ్మం లీగల్: బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు బిచ్చాల తిరుమలరావు, కొత్తా వెంకటేశ్వరరావు, మేకల సుగుణారావు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన సివిల్స్ ర్యాంకర్
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం క్రైం/ఖమ్మం మయూరిసెంటర్: ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 938వ ర్యాంక్ సాధించిన బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)కు చెందిన సాయి అలేఖ్య సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వీ.పీ.గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ సత్కరించారు. ఆతర్వాత సీపీ సునీల్దత్ను కూడా కలవగా ఆయన సాయిఅలేఖ్యతో పాటు ఆమె తండ్రి మధిర టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాశ్రావు – పద్మశ్రీ దంపతులను సన్మానించారు. అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక సాయి అలేఖ్యను ఖమ్మంలోని బీసీ స్టడీసర్కిల్లో సత్కరించారు. స్టడీసర్కిల్లో గ్రూప్స్, డీఎస్సీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి ఏర్పాటుచేయగా.. ఆమె పాల్గొని ఉద్యోగాలకు సన్నద్ధతపై సూచనలు చేశారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, సాయిఅలేఖ్య చదువుకున్న త్రివేణి పాఠశాల, సెంచరీ స్కూల్లో కూడా ఆమెను సన్మానించారు. త్రివేణి డైరెక్టర్లు గొల్లపుడి వీరేంద్రచౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్తో పాటు సీహెచ్.అప్పారావు, స్వప్న, ముస్తఫా, అశోక్, చార్లెస్, సందీప్, సెంచరీ స్కూల్లో కరస్పాండెంట్ డీవీఎస్.ప్రభాకర్రావు, డైరెక్టర్ మాధవీలతతో పాటు స్వరూప, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాయిఅలేఖ్యను సన్మానించిన కలెక్టర్, సీపీ -
గులాబీకి సవాల్..
ఖమ్మం లోక్సభ ఎన్నిక బీఆర్ఎస్కు సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించడం ఎదురీతకు కారణమవుతోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఇక్కడ విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సర్వశక్తులొడ్డుతున్నా ఫలితం ఎలా ఉండబోతోందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంనాడు అధికారంలో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. దీంతో 1,68,065 ఓట్ల మెజార్టీతో నామ విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నాడు 14.74 శాతం ఓట్ల వ్యత్యాసం వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధి ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు 5,18,194 ఓట్లు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో నామాకు 49,265 ఓట్లు మాత్రమే అదనంగా నమోదయ్యాయి. ఇప్పుడు భారీ వ్యత్యాసం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఖమ్మం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్తో పాటు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థులకు 7,33,293 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తద్వారా కాంగ్రెస్ కూటమి 2,65,654 ఓట్ల మెజార్టీని సాధించినట్లయింది. ఈ గణాంకాలను పరిశీలిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో కూడా లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది. ఖమ్మం లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఎదురీత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు ఆ పార్టీతో పోలిస్తే ‘కారు’కు 2.65 లక్షల ఓట్ల వ్యత్యాసం ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎటువైపోనని ఉత్కంఠపట్టు దొరికేది ఎక్కడ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖమ్మం నియోజకవర్గంలో 49,381 ఓట్ల మెజార్టీ, పాలేరులో 56,650 మెజార్టీ, సత్తుపల్లిలో 19,440 ఓట్లు, మధిరలో 35,452 ఓట్ల మెజార్టీ, వైరాలో 33,045 ఓట్లు, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి 42,781 ఓట్ల మెజార్టీ, అశ్వారావుపేటలో 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ అభ్య ర్థులు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక పోయారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీ రావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ పరిధిలో ఎలా ఓట్లు దక్కించుకోవాలి, ఎక్కడ పట్టు దొరుకుతుందనే లెక్కల్లో బీఆర్ఎస్ నేతలు మునిగితేలుతున్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు.. నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖమ్మం 1,36,016 86,635 పాలేరు 1,27,820 71,170 సత్తుపల్లి 1,11,245 91,805 మధిర 1,08,970 73,518 వైరా 93,913 60,868 కొత్తగూడెం (సీపీఐ) 80,336 37,555 అశ్వారావుపేట 74,993 46,088 మొత్తం 7,33,293 4,67,639
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019