breaking news
-
‘రాజవంశ పాలనే నమ్ముతున్నారు’.. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన నడ్డా
కాంగ్రెస్ అగ్రనేత,కేరళ వయనాడ్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ ఇంకా రాజవంశ పాలనను విశ్వసిస్తున్నారని విమర్శించారు. వయనాడ్ బీజేపీ లోక్సభ అభ్యర్ధి కే సురేంద్రన్కు మద్దతుగా జేపీ నడ్డా కేరళ సుల్తాన్ బేతరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్షోలో నడ్డా రాహుల్ గాంధీ ఇంకా రాజవంశ పాలను నమ్ముతున్నారని ఆరోపించారు. భారతదేశ ప్రజస్వామ్య పాలన ప్రమాదకరమని ఆయన భావిస్తున్నారని తెలిపారు. విభజించు పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాల్ని ఆచరిస్తున్నారని ఆరోపించారు . నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)అనుసంధానమైన రాజకీయ పార్టీ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్డీపీఐ కాంగ్రెస్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎంకు మద్దతు ఇస్తోందని, ఈ రెండు పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం) రెండూ సైద్ధాంతికంగా దివాళా తీశాయని పేర్కొన్నారు. -
All We Imagine as Light: గోల్డెన్ బరిలో మన బంగారం
డెబ్యూ ఫిక్షన్ ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ముంబైకి చెందిన పాయల్ కపాడియా. కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్లోని ప్రిస్టీజియస్ కాంపిటీషన్ సెక్షన్ పామ్ డ ఓర్ (గోల్డెన్ పామ్)లో పాయల్ ఫిల్మ్ పోటీ పడనుంది. మూడు దశాబ్దాల తరువాత మన దేశం నుంచి ఈ విభాగానికి ఎంపికైన చిత్రం ఇదే... ఎకనామిక్స్లో పట్టా పుచ్చుకున్న పాయల్కు ఆర్థికశాస్త్రం కంటే సినిమా శాస్త్రమే ఎక్కువగా దగ్గరైంది. ఆ ఇష్టంతోనే ‘పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో చేరాలనుకుంది. రెండో ప్రయత్నంలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. పాయల్కు తొలి గుర్తింపు ఆఫ్టర్నూన్ క్లౌడ్స్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2017)కు మన దేశం నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ఇది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు డైలాగ్ రైటింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ స్క్రిప్ట్ రాసుకుంది. పాయల్ శబ్దప్రేమికురాలు. ‘చెవులు మూసుకొని సినిమా చూస్తే ఏ ఫీలింగ్ ఉండదు’ అంటున్న పాయల్కు ఏ దృశ్యంలో ఎలాంటి శబ్దం ఉపయోగించాలో బాగా తెలుసు. ‘సినిమాలు ఎందుకు తీస్తారు?’ అనే ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా జవాబు చెప్పవచ్చు. పాయల్ చెప్పే జవాబు మాత్రం... ‘నన్ను నేను అర్థం చేసుకోవడానికి, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చిత్రాలు తీస్తాను’ సినిమాను పాయల్ అర్థం చేసుకునే కోణం కూడా భిన్నమైనది. ‘సినిమా అనేది ΄్లాటే సర్వస్వంగా ఉండనక్కర్లేదు. చక్కని కవిత్వం చదివినట్లు ఉన్నా సరిపోతుంది’ అనేది ఆమె మనసులోని భావం. సోకాల్డ్ ఆడంబరాలు, పాపులర్ కల్చర్కు దూరంగా ఉండే ‘రిషి వ్యాలీ స్కూల్’లో చదువుకున్న చదువు పాయల్ ఆలోచనలను విశాలం చేసింది. ఇప్పుడంటే ప్రపంచ ‘చిత్ర’ పటంలో తనకంటూ కొంత గుర్తింపు సాధించింది పాయల్. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లితే మాత్రం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్కు సంబంధించి ఫస్ట్ రిజెక్షన్ ఆమెను అమితంగా బాధించింది. కలల మేడ కళ్ల ముందే కుప్పకూలినట్లుగా అనిపించింది. ‘స్కూల్ రోజుల నుంచి పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరాలనేది నా కల. ఎందుకంటే నేను అభిమానించే ఎంతో మంది దర్శకులు అక్కడ చదువుకున్నారు. మొదట బాధ అనిపించినా ఆ తరువాత రెండో ప్రయత్నం చేయాలనుకున్నాను’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది పాయల్. రెండో ప్రయత్నం చేసి ఉండకపోతే ఆమె ప్రతిభ వృథాగా పోయేది. ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’కు లభించిన గుర్తింపుతో పాయల్ మనసులో ఆత్మవిశ్వాసం అనే బీజం పడింది. ‘ది లాస్ట్ మ్యాంగో బిఫోర్ ది మాన్సూన్’ ఫిల్మ్తో ఆ విత్తనం మొలకెత్తింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ప్రైజ్ గెలుచుకుంది.‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పాయల్. ఇది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (2021)లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘గోల్డెన్ ఐ’ అవార్డ్ అందుకుంది. ఫిల్మ్మేకర్స్ డిజిటల్ ప్రపంచంలో ఉన్న ఈ కాలంలోనూ ‘ఫిల్మ్’ అంటే పాయల్కు ప్రత్యేక ఇష్టం. ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ను ఫిల్మ్ పైనే షూట్ చేసింది. ‘డిజిటల్ ఫిల్మ్తో పోల్చితే ఓల్డ్–స్కూల్ ఫిల్మ్లో ఇమేజ్కు సంబంధించిన ఈస్థెటిక్ క్వాలిటీ, సాఫ్ట్నెస్ భిన్నంగా ఉంటుంది’ అంటుంది పాయల్. ఫిల్మ్మేకింగ్ అనేది ఇలా అనుకోగానే అలా అయిపోదు. కొన్నిసార్లు చాలా టైమ్ తీసుకోవచ్చు. అందుకు ఎంతో ఓపిక అవసరం. అందుకే చిత్రనిర్మాణాన్ని శిల్పం చెక్కడంతో పోల్చుతుంది పాయల్. ‘చిత్రనిర్మాణం అనేది చాలా ఓపికగా శిల్పం చెక్కడం లాంటిది. ఆ శిల్పం ఎలా రూపుదిద్దుకోనుందో శిల్పికి కూడా తెలియదు. చిత్రం కూడా అంతే’ అంటుంది పాయల్. పాయల్ తల్లి నళిని మలాని ఆర్టిస్ట్. దేశవిదేశాలకు చెందిన అత్యుత్తమ సినిమాల క్యాసెట్లను ఇంటికి తీసుకువచ్చేది. సినిమాలపై పాయల్ ఆసక్తికి తల్లి ఫిల్మ్ కలెక్షన్ ఒక కారణం. ‘చూడాలేగానీ మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే ఎంతో అందం దాగుంది. అలాంటి అందాలను అమ్మ ఆస్వాదిస్తూ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది’ అంటుంది పాయల్. తల్లి ప్రభావం పాయల్పై కనిపిస్తుంది. ‘జీవనోత్సాహం నుంచే సృజన జనిస్తుంది’ అంటున్న పాయల్ తనదైన విజువల్ లాంగ్వేజ్ను తయారు చేసుకుంటోంది. మూడు దశాబ్దాల తరువాత... పాయల్ కపాడియా గుర్తింపును మరో స్థాయికి తీసుకు వెళ్లిన ఫీచర్ ఫిల్మ్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ముంబైలోని నర్స్ ప్రభ, భర్త, ప్రభ స్నేహితురాలు అను కేంద్రంగా సాగే చిత్రం ఇది. షాజీ ఎస్ కరుణ్ మలయాళ చిత్రం ‘స్వాహమ్’ తరువాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాన పోటీకి ఎంపికైన చిత్రంగా ప్రత్యేకతను సాధించి ప్రశంసలు అందుకుంటోంది. ‘ఆల్ వి...’కి దర్శకత్వంతో పాటు రచన కూడా చేసింది పాయల్. ఈ చిత్రంలో దివ్య ప్రభ(మలయాళం సినిమా టేక్ ఆఫ్ ఫేమ్), కనీ కుస్రుతి (కేరళ కేఫ్ ఫేమ్), హృదు హరూన్ నటించారు. -
ఆస్ట్రియన్ పర్యాటకురాలికి కేరళ పోలీసుల సమన్లు
కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది. పాలస్తీనా అనుకూల పోస్టర్ను చింపివేసూ ఒక ఆస్ట్రియన్ యూదు పర్యాటకురాలు కేరళలో స్థానికులతో వాదిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వారం ప్రారంభంలో ఎర్నాకులం జిల్లా ఫోర్ట్ కొచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో పోస్టర్ను చింపివేస్తున్న ఆమెను వారించేందుకు స్థానిక యువకులు ప్రయత్నించగా, ఆమె వారితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఆ పోస్టర్ చినిగిన ముక్కలను తీయమని అక్కడున్న యువకులు ఆమెకు చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ గోడపత్రికతో సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని వారు ఆమెకు సూచించడాన్ని కూడా ఆ వీడియోలో గమనించవచ్చు. An Austrian tourist tears down pro-palestinian posters in Kochi, India. What an entitled Zionist woman. Kerala Police filed a FIR against her. pic.twitter.com/X4CM7tIJCM — Mahesh Kusumagiri (@maheshkusumagir) April 17, 2024 ఈ వీడియో వైరల్గా మారిన నేపధ్యంలో కేరళ పోలీసులు విచారణ కోసం ఆ మహిళను పోలీస్ స్టేషన్కు రావాలని కోరారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ)కొచ్చి ఏరియా సెక్రటరీ మహమ్మద్ అజీమ్ కెఎస్ ఆ మహిళపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. ఎస్ఐవో అతికించిన పోస్టర్లను ఆ ఆస్ట్రియన్ యువతి చించివేసింది. కాగా గత జనవరిలో కోజికోడ్ బీచ్ సమీపంలోని స్టార్బక్స్ స్టోర్పై పాలస్తీనా అనుకూల పోస్టర్లు అతికించిన ఆరుగురు విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నాడు నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం స్టార్బక్స్ స్టోర్ గ్లాస్ డోర్పై ఆ విద్యార్థులు ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసిన పోస్టర్లను అతికించారు. గాజాలో జరిగిన యుద్ధ నేపధ్యంలో స్టార్బక్స్ ఇజ్రాయెల్కు అనుకూల వైఖరిని ప్రదర్శించినదుకు విమర్శలకు గురైంది. -
Lok sabha elections 2024: పదేళ్ల అభివృద్ధి.. ట్రైలర్ మాత్రమే: మోదీ
త్రిసూర్/తిరువనంతపురం/తిరునల్వేలి: గత దశాబ్దాకాలంగా ఎన్డీఏ పాలనాకాలంలో దేశం చవిచూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాకారంకానుందని ఆయన ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప పత్రం’ విడుదల చేసిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఆ హామీలను పునరుద్ఘాటించారు. కేరళలోని కున్నమ్కులమ్, కట్టకడ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో మోదీ ప్రసంగించారు. రాహుల్గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కాంగ్రెస్ యువరాజుకు ఉత్తరప్రదేశ్లో దశాబ్దాలుగా తమ కుటుంబ గౌరవం(అమేథీ ఎంపీ స్థానం)ను కాపాడే సత్తాలేదుగానీ కేరళకు వచ్చి ఓట్లడుగుతారు. కేరళీయుల ఓట్లడిగే ఆయన సీపీఐ(ఎం) ఏలుబడిలో కరువన్నూర్ సహకార బ్యాంక్లో వెలుగుచూసిన కుంభకోణంపై నోరు మెదపరెందుకు? నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు కాంగ్రెస్కు ఉంది. ఈ రెండింటి మధ్య చీకటి ఒప్పందం కుదిరింది. కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్కు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఈ మోసంపై నేనే ఈడీ దర్యాప్తు నకు ఆదేశించా’’ అని అన్నారు. లెఫ్ట్ ఉంటే అంతా లెఫ్ట్ అయినట్లే ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి, అధికార ఎల్డీఎఫ్ కూటములు కేరళలో అభివృద్ధికి ప్రతిబంధకాలుగా తయా రయ్యాయి. త్రిపుర, పశ్చిమబెంగాల్, కేరళ ఈ రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉందీ అంటే అక్కడ అంతా పోయినట్లే(లెఫ్ట్ అయినట్లే). అక్కడ మంచి అనేదే జరగదు. పశ్చిమబెంగాల్, త్రిపురలో ఏం చేశారని, కొత్తగా కేరళకు చేయడానికి?’ అంటూ ధ్వజమెత్తారు. కచ్ఛతీవు ఉదంతాన్ని 4 దశాబ్దాలు దాచారు తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగిన సభలోనూ మోదీ ప్రసంగించారు. కచ్ఛ తీవు ను శ్రీలంకకు ఇచ్చేసి కాంగ్రెస్, డీఎంకే ఈ ఉదంతాన్ని 40 ఏళ్లు దాచిపెట్టాయని మోదీ ఆరోపించారు. అక్కడ తమిళ మత్స్య కారులు తరచూ అరెస్ట్ అవుతున్నారని, ఈ పాపం ఆ పార్టీలదేనన్నారు. -
కేరళలో యూపీ వ్యూహం.. గణపతి శరణులో బీజేపీ!
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ కేరళలో ఉత్తరప్రదేశ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. యూపీలోని అలహాబాద్, మొఘల్సరాయ్ సహా పలు ప్రాంతాల పేర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చారు. ఇప్పుడు ఇదే కోవలో వయనాడ్ బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ తాను ఎంపీగా ఎన్నికైతే సుల్తాన్ బత్తేరి పట్టణం పేరును గణపతి వట్టంగా మారుస్తానని ప్రకటించారు. కె సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ సుల్తాన్ బత్తేరి పట్టణంను పూర్వకాలంలో గణపతి వట్టంగా పిలిచేవారని తెలిపారు. అయితే టిప్పు సుల్తాన్ ఆ పేరును సుల్తాన్ బత్తేరి పట్టణంగా మార్చాడన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఈ ప్రాంతం పేరును గణపతి వట్టంగా మారుస్తానన్నారు. వయనాడ్లో ఓట్లను కొల్లగొట్టేందుకు కొందరు టిప్పు సుల్తాన్ పేరును వాడుకుంటున్నారని సురేంద్రన్ ఆరోపించారు. టిప్పు సుల్తాన్ మతమార్పిడులకు పాల్పడ్డాడని, హిందూ, జైన దేవాలయాల కూల్చివేతకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఇదిలావుండగా వయనాడ్ నుంచి సురేంద్రన్ గెలిచే అవకాశమే లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ కార్యదర్శి పీకే కున్హాలికుట్టి వ్యాఖ్యానించారు. సుల్తాన్ బత్తేరి పట్టణం పేరు ఎన్నటికీ మారదని, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే సురేంద్రన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి సిద్ధిఖీ ఆరోపించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019