breaking news
Ad - Sakshi_Home_Sticky
-
గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంటారు. అక్కడ సీకే కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న పేర్నాటి శ్యామ్ప్రసాద్ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయలుదేరుతారు. పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికపై ప్రసంగించనున్నారు. అనంతరం, వరుసగా ఐదో ఏడాది తొలివిడత వైయస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి:ఏపీ: బడి గంట రోజే ‘కానుక’ -
రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిది: గోపీచంద్
కర్నూలు(టౌన్): రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిదని సినీ హీరో గోపీచంద్ అన్నారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో శుక్రవారం రాత్రి రామబాణం సినిమాలోని ‘దరువెయ్యరా’ పాట లాంచింగ్ ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ తన 30వ సినిమాగా రామబాణం విడుదల కానుందన్నారు. హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. -
పట్టన ప్రాంతాల్లో ఎండ దెబ్బకు రోడ్లపై పందిర్లు
-
NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!
అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ ఎన్బీకే107(NBK107) అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘‘నేటి నుంచి అక్కడి కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సోమవారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకుసంగీతం అందిస్తున్నారు. -
నెలలు నిండని శిశువును కాపాడిన కిమ్స్ వైద్యులు
సాక్షి, కర్నూలు : నెలలు నిండకుండానే పుట్టిన శిశువును అతికష్టం మీద శస్ర్తచికిత్స చేసి కాపాడారు కిమ్స్ వైద్యులు. కేవలం 950 గ్రాముల అతి తక్కువ బరువు ఉండటంతో పాటు పేగుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఉండటంతో శిశువును కాపాడటం వైద్యులకు కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ శిశువు ప్రాణాలు కాపాడి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన అరుదైన ఘటన కిమ్స్ ఆసుపత్రి వైద్యులకే దక్కింది. కడప జిల్లాకు చెందిన గీత అనే మహిళ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో రెండోసారి గర్భం దాల్చారు. అయితే ఆరున్నర నెలలకే ఉమ్మనీరు మొత్తం పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. అయితే శిశువు రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో పాటు ప్తేగుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ( నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్ ) ఉన్నట్లు తేలింది. వీటితో పాటు ప్లేగులకు రంధ్రం కూడా ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది. దీంతో పీడియాట్రిక్ నిపుణులైన డా. శ్రీకాంత్ బాబు సంరక్షణలో శిశువును ఐసీయూలో పెట్టి అత్యాధునిక లైఫ్ సపోర్ట్ వ్యవస్థలపై ఉంచారు. ఇలియోస్టమీ (మలవిసర్జనకు ప్రత్యేక మార్గం ) ఏర్పాటు చేసి శిశువును కొన్ని రోజులపాటు వెంటిలేటర్పై ఉంచి క్రమంగా తీసేశారు. అతి చిన్న వయసులోనే శిశువుకు ఇన్ఫెక్షన్ రావడంతో 3 వారాలపాటు యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. దాంతో పాటు రెండుసార్లు రక్తం ఎక్కించి 5సార్లు ప్లేట్లెట్లు ఎక్కించారు. తర్వాత కొద్దికొద్దిగా తల్లిపాలు అలవాటు చేసి కంగారూ మదర్ కేర్ అందించారు. దాదాపు నెల రోజుల అనంతరం వైద్యుల సంరక్షణ అనంతరం ప్రస్తుతం పాప పూర్తిగా కోలుకుంది. ('అక్కడ ఎనిమిదో వింత ఉన్నట్లుగా ఫీలవుతున్నారు' )
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019