breaking news
Ad - Sakshi_Home_Sticky
-
Jana Sena Clash: ‘దక్షిణ’ నాదంటే నాదే!
సాక్షి, విశాఖపట్నం: జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు రసకందాయంలో పడింది. ఈ టికెట్ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్ జరుగుతోంది. ఈ సీటును కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజులతో పాటు మూగి శ్రీనివాస్లు ఆది నుంచీ ఆశిస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థుల జాబితాల్లో విశాఖ దక్షిణ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయినా ఈ సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. వంశీ అభ్యర్థిత్వంపై దక్షిణం సీటును ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ‘వంశీ వద్దు.. స్థానికులే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. కొద్దిరోజుల క్రితం ఒక మేకను తీసుకొచ్చి వంశీతో పోలుస్తూ ఈ సీటును బలి చేయొద్దని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో వంశీ వర్గీయులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జనసేన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో జనసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. వంశీ ఎన్నికల ప్రచారానికి వ్యతిరేక వర్గీయులు దూరంగా ఉంటున్నారు. మరోపక్క వంశీకృష్ణకు టికెట్ కేటాయింపు ప్రకటన వట్టిదేనని, అంతా బూటకమని కందుల బహిరంగంగానే చెబుతున్నారు. పవన్ ఆ సీటును తనకే ఖరారు చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. మంగళగిరికి కందుల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను కలిసి విశాఖ దక్షిణ సీటు తనకే కేటాయించాలని కోరేందుకు కందుల నాగరాజు గురువారం మంగళగిరికి పయనమయ్యారు. వంశీకృష్ణకు సీటిస్తే ఓడిపోతారని, తనకిస్తే గెలుస్తానని చెప్పడానికి వెళ్లారు. సీటు ఇస్తారన్న హామీతోనే గతంలో జనసేనలో చేరానని, ఒకవేళ తనకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి గుడ్బై చెబుతానని పవన్కు స్పష్టం చేయనున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. మంగళగిరి పంచాయతీలో దక్షిణ టికెట్పై ఏం తేలుస్తారోనని జనసేన శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇవి చదవండి: ‘సైకిల్’ దొంగ దొరికాడోచ్! -
బీజేపీలో చేరిన కందుల బ్రదర్స్
కడప: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో జిల్లాకు చెందిన కందుల సోదరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కందుల శివానంద రెడ్డి మాట్లాడుతూ...అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రతి ముస్లిం సోదరున్ని సోదరునిగా భావించాలన్నారు. ఆ దిశగా బీజేపీ అడుగులేస్తోందన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని బీజేపీ సారధ్యంలో త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. -
వైఎస్ఆర్ సిపిలో చేరిన కందుల సోదరులు
కడప: వైఎస్ఆర్ జిల్లాలో పేరున్న సీనియర్ రాజకీయ నాయకులు కందుల సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కందుల శివానంద రెడ్డి, అతని సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజమోహన రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు. వీరు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు, ఎమ్మెల్యే అభ్యర్ధి అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న కందుల సోదరులు సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కొద్ది కాలం ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మల్లీ కొద్ది కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత నెలలోనే మళ్లీ టిడిపిలో చేరారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో అక్కడ ఇమడలేమనుకున్నారో ఏమో ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో చేరారు. కందుల శివానందరెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.1981 నుంచి 1986 వరకు శాసనమండలి సభ్యులుగా ఉన్నారు.1989లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప శాసనసభ స్థానంకు పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత కూడా ఆయన మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 1996లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ పార్టీ పోలిట్బ్యూరో సభ్యులుగా పనిచేశారు. ఆయన సోదరుడు కందుల రాజమోహన్రెడ్డి కూడా పోలిట్బ్యూరో సభ్యునిగా పనిచేశారు. కందుల రాజమోహన రెడ్డి మూడు సార్లు లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2011లో ఉప ఎన్నికల సందర్భంగా కందుల సోదరులిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019