breaking news
-
మీ తప్పుల వల్లే కరువు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై బతకాలని తాము అనుకోవడం లేదని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగాయన్న విషయాన్ని మరుగున పెట్టారు. సింగరేణిలో రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చే బొగ్గు గనులకు సంబంధించిన పెండింగ్ అంశాలను పదేళ్లయినా తేల్చలేదు. వర్షాలు వాళ్లున్నప్పుడే పడలేదు. వచ్చిన వర్షాన్ని ఒడి సి పట్టుకోవడంలో విఫలమయ్యారు. కాళేశ్వ రం ప్రాజెక్టు కుంగిపోయినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెపితే గోదావరి నీటిని అవసరం లేకపోయినా కిందకు వదిలేశారు. కృష్ణాలో నీటి నిల్వల సంగతి తెలిసి కూడా కేవలం ఓట్ల కోసం, కాల్వల్లో నీటిని చూసి జనం ఓట్లేస్తారనే ఉద్దేశంతో పంటలు లేకపోయినా నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఇప్పుడు కరువొచ్చిందని అంటున్నారు. రూ. 43 వేల కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వ్యవస్థ ఈ కరువులో ఏం చేస్తున్న ట్టు? ఇవన్నీ ఎవరి తప్పులు? తప్పులన్నీ మీవైపే ఉన్నాయి..’అంటూ భట్టి ధ్వజమెత్తా రు. శుక్రవారం హైదరాబాద్లోని దేశోద్ధారక భవన్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘విద్యుత్–తాగునీరు–ఆర్థికం’అంశాలపై నిర్వ హించిన మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అప్పులు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు చెల్లించాం ‘రైతుబంధు కింద గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు దాచిపెడితే మేమేదో ఖర్చు పెట్టినట్టు గా ప్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో మేము అధికారం చేపట్టేనాటికి రూ.3,960 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఆ పరిస్థితి నుంచి ప్రతి రూపాయి పోగేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తు న్నాం. సీఎం రేవంత్రెడ్డితో సహా మంత్రులందరం 24 గంటలూ కష్టపడుతూ ఓ తపస్సు లా పనిచేస్తున్నాం. రాష్ట్రంలో సంపదను సృష్టించి పేదలందరికీ పంచాలన్నదే మా ఆలోచన. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు తిరిగి చెల్లించాం. రైతుబంధు కింద రూ.5,575 కోట్లు, ఆరీ్టసీకి రూ.1,120 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల కోసం రూ.3,924 కోట్లు, గృహజ్యోతి కోసం రూ.200 కోట్లు, గ్యాస్ సబ్సిడీ కోసం రూ.80 కోట్లు, బియ్యం సబ్సిడీల కింద రూ.1,147 కోట్లు, రైతు బీమా ప్రీమియం కోసం రూ.734 కోట్లు చెల్లించాం. ఉద్యోగుల వేతనాలు, విద్యార్థులకు డైట్ చార్జీలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీలు, హోంగార్డులకు వేతనాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు... ఇలా మొత్తం రూ.66,507 కోట్లు ఖర్చు పెట్టాం. దీనిపై ఎవరితోనైనా, ఎక్కడైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’అని భట్టి సవాల్ చేశారు. విద్యుత్కు అంతరాయమే తప్ప కోతల్లేవు ‘విద్యుత్పై ప్రత్యేకంగా దృష్టి సారించి పనిచేస్తున్నాం. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 15,673 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినా చిన్న కోత లేకుండా నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా కరెంటు పోతే అది అంతరాయం మాత్రమే. నిర్వహణ పనుల కోసం ఆపేస్తున్నదే తప్ప కోత కాదు. 2031–32 సంవత్సరం వరకు 29 వేల నుంచి 30వేల మెగావాట్ల వరకు పీక్ డిమాండ్ వచ్చినా అందుకు తగిన కార్యాచరణ మా వద్ద ఉంది..’అని డిప్యూటీ సీఎం తెలిపారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు ‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నా తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఎ క్కడా నీటి సమస్య రానివ్వబోం. త్వరితగతి న పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు నిధు లు కేటాయిస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు నిర్మిస్తాం. రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టమైన ప్ర కటన ఉంటుంది..’అని భట్టి తెలిపారు. 10 లక్షల కోట్లు ప్రభుత్వ అకౌంట్లలోకి రాలేదు గత పదేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను భట్టి ఖండించారు. ‘కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయని ఒక పెద్దమనిషి చెపుతున్నాడు. రూ.10 లక్షల కోట్ల మాట అటుంచితే తెలంగాణపై బీజేపీకి కనీస ప్రేమ ఉన్నా లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగేది కాదు. నాడు చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర కోల్పోయే 3 వేల ఎకరాల భూమి విషయంలో వారిని ఒప్పించి పరిహారం ఇచ్చి ఉంటే నేడు కాళేశ్వరం ప్రాజెక్టే వచ్చేది కాదు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా కింద వచ్చింది రూ.3,70,235 కోట్లు మాత్రమే. మరి ఆయన చెపుతున్నట్టు మిగిలినవి ఎక్కడ ఇచ్చారో తెలియదు. ప్రభుత్వ అకౌంట్లలోకి అయితే రాలేదు. బీజేపీ ఇచ్చిన రూ.10 లక్షల కోట్లు, బీఆర్ఎస్ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పు ఏమయ్యాయో, ఆ రెండు పారీ్టలు ఏం సాధించాయో?’వారే సమాధానం చెప్పాలి..’అని భట్టి వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుంది మాజీ సీఎం కేసీఆర్ గురువారం చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ..‘ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేసే ప్రయత్నాలు తెలంగాణ సమాజానికే నష్టం కలిగిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంది. తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని పిల్లేరు గంతులు వేసినా మా ప్రభుత్వానికి వచ్చే ఢోకా లేదు. ఐదేళ్ల పాటు నిశి్చంతగా ఉంటుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇప్పుడే మరమ్మతులొద్దు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతుల నిర్వహణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించడంపై ఆ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని స్పష్టం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. బ్యారేజీలకు అత్యవసర మరమ్మతుల విషయమై నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఇటీవల నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్ జలసౌధలో సమావేశం నిర్వహించి చర్చలు జరపడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా, పాలసీకి విరుద్ధంగా మరమ్మతుల విషయంలో ఎలా ముందుకు వెళ్లారు? అనే అంశంపై ఈఎన్సీ అనిల్కుమార్ను మంత్రి వివరణ కోరారు. ఇలావుండగా.. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ పునర్నిర్మాణం పనులతో పాటు కాఫర్ డ్యామ్ పనులను సొంత ఖర్చుతో చేసేందుకు ఈ సమావేశంలో నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’అంగీకరించినట్టు కొన్ని పత్రికల (సాక్షి కాదు)తో పాటు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు రావడంతో సీఎం కార్యాలయం ఆరా తీసింది. ఆ వార్తా కథనాలను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించింది. వర్షాలొస్తే వరదలొస్తాయని.. కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి పరిష్కారాలను సూచించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేసేవరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టబోమంటూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ విధానపర నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై విస్తృత రీతిలో అధ్యయనం చేపట్టింది. నీళ్లు నిల్వ ఉంటే బ్యారేజీలకు మరింత నష్టం జరిగే ప్రమాదముందని, ఖాళీ చేయాలని సూచించడంతో గతంలోనే బ్యారేజీలను ఖాళీ చేశారు. కాగా మరో నెలన్నర రోజుల్లో వర్షాలు ప్రారంభం కానుండడంతో గోదావరిలో ఎప్పటిలాగే భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. ఈ వరదలతో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా చేపట్టాల్సిన అత్యవసర మరమ్మతులను సాధ్యమైనంత త్వరగా సూచించాలని అయ్యర్ కమిటీకి సర్కారు విజ్ఞప్తి చేసింది. అయితే కమిటీ రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి సూచనలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే అత్యవసర మరమ్మతులపై బ్యారేజీల నిర్మాణ సంస్థలతో గత వారం ఆ శాఖ ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్ చర్చలు జరిపారు. విషయం తెలియడంతో మంత్రి ఫైర్! మేడిగడ్డ బ్యారేజీ మరింత కుంగకుండా 7వ బ్లాక్కు రెండు వైపులా షీట్పైల్స్తో అదనపు రక్షణ కల్పించాలని ఈఎన్సీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీని కోరినట్టు తెలిసింది. గోదావరి నదికి అడ్డంగా బ్యారేజీలకు రెండు వైపులా కరై్టన్ వాల్స్ నిర్మించాలని సూచించినట్టు సమాచారం. అలాగే బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను ప్రెషర్ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేయాలని కాంట్రాక్టర్లను కోరినట్టు తెలిసింది. కాగా ఈ పనులను సొంత ఖర్చుతో చేసేందుకు ఎల్ అండ్ టీతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్కి ఎదురుగా నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ కోసం రూ.52 కోట్ల బిల్లులను చెల్లించాలని కూడా ఎల్ అండ్ టీ కోరింది. ఈ విషయాలన్నీ తెలిసిన నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. -
కాళేశ్వరంపై విచారణ వేసవి సెలవులు ముగిశాకే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లలో విచారణను హైకోర్టు వేసవి సెలవుల (జూన్) తర్వాతకు వాయిదా వేసింది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్తో పాటు బక్క జడ్సన్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. కేఏ.పాల్ వాదనలు వినిపిస్తూ.. ‘దేశంలోనే అత్యంత అవినీతి జరిగిన ప్రాజెక్టు కాళేశ్వరం. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణలోని 4 కోట్ల మందికి చెందిన రూ.లక్ష కోట్లకు సంబంధించిన అంశం ఈ ప్రాజెక్టు. సీబీఐ దర్యాప్తుతోపాటు భవిష్యత్లో ఎలాంటి ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వినియోగించుకునేలా నిపుణుల కమిటీని కూడా వేయాలి. ఎన్నికలకు ముందు పలు సభలు, సమావేశాల్లో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ అధికారంలోని రాగానే మాట మార్చారు. సీబీఐ విచారణ కోరకుండా.. రిటైర్డ్ జడ్జితో విచారణ అంటున్నారు’అని పేర్కొన్నారు. ఈ కేసులో సీఎం పార్టీ కాదని.. ఆయనపై చర్చ అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాల్ వాదనలను ధర్మాసనం పలుమార్లు తప్పుబట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
8న ‘కాళేశ్వరం’పై విచారణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లలో వాదనలను సోమవారం(ఈనెల 8న) వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లలో ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు పిటిషన్ల తరఫు న్యాయవాదులకు చెబుతూ.. విచారణను వాయిదా వేసింది. మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుకు కారకులెవరో తేల్చేందుకు.. పూర్తి అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించాలి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.86 వేల కోట్ల సేకరణ వ్యవహారంపై కూడా సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఎఓ)తో దర్యాప్తునకు ఆదేశాలివ్వాలి. మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తేనే కుంగుబాటుకు అసలు కారణాలు బట్టబయలవుతాయి. నవంబర్ 1న నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్టును కూడా పరిగణనలోకి తీసుకుని బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్ల భద్రతకు వీలుగా చర్యలు చేపట్టేలా నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వాలి’అని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, కాంగ్రెస్ నేత బక్క జడ్సన్తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు(4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక రిట్ పిటిషన్) దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం తెలుసుకుని చెప్పండి సీబీఐకి అప్పగించే విషయం, పిటిషనర్ల వాదనపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకొని చెప్పాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) ఇమ్రాన్ ఖాన్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఏఏజీ.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పార్టీ ఇన్ పర్సన్ (అతనే వాదనలు వినిపిస్తారు)గా కేఏ పాల్ వాదిస్తూ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అయితే ప్రభు త్వ వాదన కూడా వినాల్సి ఉన్నందున ఉత్త ర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. తమ వాదనలు వినాలని పాల్, ఇతర పిటి షనర్ల లాయర్లు కోరగా ధర్మాసనం నిరాకరించింది. వ్యాజ్యాలను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నామంటూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. గతేడాది ఎన్డీఎస్ఏ అధికారులు ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదికను గత నెల విచారణ సందర్భంగా ప్రభుత్వం.. ధర్మాసనం ముందు ఉంచింది. -
మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్ను అందించాలని కోరింది. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్పైల్స్ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్పైల్స్ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్ మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్లు–ర్యాఫ్ట్ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్వాల్స్ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది. సీడీవోలో ఎవరేం చేస్తారు? సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది. డిజైన్ ఉల్లంఘనలేమిటి ? సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019