breaking news
-
హిందీ వార్లో హాలీవుడ్ యాక్షన్
బాలీవుడ్ ‘వార్ 2’లో హాలీవుడ్ తరహా యాక్షన్ కనిపించనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారట. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించారట మేకర్స్. ఈ పోరాట దృశ్యాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేశారని బాలీవుడ్ సమాచారం. ఇక ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేశారు స్పిరో. కాగా స్పై జానర్లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. -
గుర్తుపెట్టుకుని మరీ బర్త్డే సెలబ్రేట్ చేసిన తారక్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. ఆర్ఆర్ఆర్తో అభిమానులకు ఫుల్ మీల్స్ పంచిన ఆయన ప్రస్తుతం దేవర సినిమాతో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో వార్ 2 మూవీలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ నడుస్తోంది. బర్త్డే సెలబ్రేట్ చేసిన తారక్ షూటింగ్స్తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన ఫిట్నెస్ ట్రైనర్ బర్త్డే గుర్తుపెట్టుకుని మరీ సెలబ్రేట్ చేశాడు. ఈ విషయాన్ని హీరో ట్రైనర్ కుమార్ మన్నవ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనలయ్యాడు. 'నా పుట్టినరోజు గుర్తుపెట్టుకున్నారు. నేను ఎలాంటి ఫుడ్ తింటానో తెలుసుకుని ఆరోగ్యకరమైన కేక్ తీసుకొచ్చారు. పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో ఒదిగి ఉంటారు. మీ గురించి ఏమని చెప్పను.. మీరు నాపై, నా కుటుంబంపై చూపించే ప్రేమకు.. మన అనుబంధానికి ఉప్పొంగిపోయాను. మీ గురించి ఏమని చెప్పను.. వినయ విధేయతకు, ప్రేమకు మీరు నిలువెత్తు నిర్వచనం. మీతో కలిసి పని చేయడం సంతోషంగా భావిస్తున్నాను' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మా అన్న బంగారం.. అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kumar Mannava (@kumarmannava) చదవండి: చాలాసార్లు కడుపులోనే బిడ్డను కోల్పోయిన అమీర్ ఖాన్ మాజీ భార్య -
పవన్కు షాకిచ్చిన అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్
సినిమా వాళ్లకు అభిమానులు ఉండటం సహజం. తమ హీరో ఇంత గోప్పవాడు అంటూ ఫ్యాన్స్ కూడా ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో అద్దాల మేడలో ఉన్న సినిమా హీరోలు ఎప్పుడైతే జనం మధ్యకు వస్తారో వారి అసలు స్వరూపం మెల్లగా బయటపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో సినిమాల్లో పవర్ స్టార్గా ఉన్న పవన్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో ఆయన అసలు రూపం ఏంటో జనాలకు తెలిసొచ్చింది. సీఎం అవుదామనే మోజుతో పాలిటిక్స్లోకి వచ్చిన వవన్ను కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రజలు గెలిపించలేదు. కమల్ హాసన్,రజనీకాంత్,విజయ్ కాంత్,చిరంజీవి,ఉపేంద్ర వంటి స్టార్స్ అందరూ కూడా రాజకీయాలను టచ్ చేసిన వారే.. రాజకీయంగా ఒక ట్రయల్ వేద్దామని ఈ స్టార్స్ అందరూ గట్టిగానే ప్రయత్నించారు. రాజకీయంలో కొన్ని డక్కామొక్కీలు తిని పోరాటం చేశారు. కానీ సినిమా ఇమేజ్ ఇక్కడ పనికిరాదని గ్రహించారు. తొందరగానే ప్రజల స్పందన ఏమిటనేది వారికి అర్థమయ్యింది. దీంతో చిల్లర మాటలు మాట్లాడకుండా కాస్త గౌరవంగానే రాజకీయాలు చేశారు. వీరిలో రజనీకాంత్ అయితే రాజకీయ యుద్ధంలో అడుగు పెట్టకుండానే మిడిల్ డ్రాప్ అయ్యారు. ప్రజాదరణ పొందకపోతే పరువు పోతుందనే భావనతో నీట్గా తప్పుకున్నారు. ఇక్కడ చెప్పుకున్న ఈ హీరోలు అందురూ ఎవరి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి రాణించిన వారు కావడం విశేషం. కమల్ హాసన్,రజనీకాంత్,విజయ్ కాంత్,చిరంజీవి,ఉపేంద్ర ఈ స్టార్స్ అందరూ కూడా వారసత్వాలతోనో, కుటుంబసభ్యులను అడ్డు పెట్టుకుని సినిమాల్లో ఎదిగిన వారు కాదు. అందుకే వారిలో విజ్ఞత కనిపించింది. వారు రాజకీయాల నుంచి తప్పుకున్నా వారిపై సమాజంలో గౌరవం మిగిలే ఉంది. కానీ పవన్ కల్యాణ్ పరిస్థితి వేరు. తన అన్నయ్య మెగాస్టార్ లేకపోతే.. ఎందుకూ అవసరం లేని ఒక ఆకతాయిగా మిగిలిపోయేవాడు. ఇదీ గ్రహించే ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు అవుతున్నా కనీసం సర్పంచ్ స్థాయి నాయకుడిని కూడా ఆయన తయారు చేయలేకపోయాడు. దీనంతటికి కారణం పవన్ మాటల్లో ఉన్న కష్టం చేతల్లో ఎక్కడా కనిపించదు. కేవలం ఎవరినో ఓడించాలనే ధోరణితోనే ఆయన రాజకీయ జీవితం కొనసాగుతుంది. ఇలాంటి ధోరణి తన సినిమాల్లో కూడా కనిపించదే.. సినిమాల్లో అయినా ఇలాంటి నీతిలేని పాత్రలో కనిపించే సాహసం పవన్ చేయగలుగుతాడా..? ఆ హీరోల అభిమానులకు గాలం వేస్తున్న పవన్ జీవితంలో తాను గెలవకపోయినా ఫర్వాలేదంటున్న పవన్.. సీఎం జగన్ ఓడిపోవాలని కోరుకుంటూనే చంద్రబాబును గెలిపించాలని తాపత్రయం పడుతున్నాడు. ఈ క్రమంలో బాబు చేతిలో పావుగా మారిన పవన్ ప్రజల్లో పరువు పోగొట్టుకోవడానికి అయినా రెడీ అయిపోయాడు. అందుకే చంద్రబాబు కోసం ఇతర హీరోల ఫ్యాన్స్ను అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే మహేష్ బాబు అభిమానులకు ఓసారి బిస్కెట్ వేశాడు. తనకంటే మహేష్ పెద్ద సూపర్ స్టార్ అన్నాడు. మహేష్ తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడని కూడా గొప్పలు చెప్పాడు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసే ప్లాన్ పవన్ వేస్తున్నాడు. వారి అభిమానులను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు. ప్రభాస్ గారు మా వాళ్లే.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ కూడా నాకు కావాల్సిన వాళ్లే అంటూ వారి అభిమానులందరూ నాకు సహకరించాలని వేడుకుంటున్నాడు. పవన్ నైజం తెలిసే ఇప్పటి వరకు కనీసం చిన్న హీరో కూడా జనసేనకు సపోర్ట్గా బయటకు రాలేదు. ఎవరూ లేకపోవడంతో జబర్ధస్త్గా నాగబాబు కమెడియన్ బ్యాచ్ను రంగంలోకి దింపాడు. తమ్ముడి కోసం మెగాస్టార్ రూ. 5 కోట్లు విరాళం అయితే ఇచ్చారు. కానీ వారి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి పవన్ కోసం పనిచేస్తున్నట్లు ఎక్కడా ప్రకటన లేదు. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి సభల్లో ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ అభిమానులు తమ హీరో ఫోటోతో పాటు జగన్ గారి ఫోటోను చేర్చి కనిపించడం విశేషం. ఇప్పుడు కొత్తగా ఓట్ల కోసం పవన్ వేస్తున్న గాలంలో ప్రభాస్,అల్లు అర్జున్,ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎట్టిపరిస్థితిల్లో పడరని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మంత్రి అమర్నాథ్ సమక్షంలో ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైసీపీ పార్టీలో చేరారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇతర హీరోలకు సంబంధించిన ఏ వేడుకలు జరిగినా కూడా పవన్ ఫ్యాన్స్ ఎలాంటి గోల చేస్తారో సినిమా అభిమానులకు చెప్పక్కరలేదు. ఇప్పుడు కూడా పవన్, ఆయన అభిమానులు ఓట్ల కోసం మాత్రమే ఇతర హీరోల అభిమానలను ఎలా బుట్టలో దించాలనే ప్రయాత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్, మహేశ్ ఫ్యాన్స్ అంత అమాయికులేం కాదు.. గతాన్ని వారు మరిచిపోలేదు. సమయం వచ్చింది ఇప్పుడు సరిగ్గా పవన్కు బుద్ధి చెప్తారు. View this post on Instagram A post shared by Gudivada Amarnath (@gudivadaamarnath) -
దేవరలో మరో బాలీవుడ్ భామ.. ఫ్యాన్స్కు ఇక పూనకాలే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారని తెలిపింది. మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్ను కొనియాడింది. త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఊర్వశి రౌతేలా దేవర చిత్రంలో ప్రత్యేక సాంగ్లో కనిపించనుందా? అంటూ కామెంట్స్ చేశారు. గతంలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి.. దేవరలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉది. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్-2 షూటింగ్లో జాయిన్ అయ్యారు. @tarak9999 garu our beloved true #GlobalSuperstar —exceptionally disciplined, honest, and refreshingly straightforward, yet so wonderfully humble. Thanks a million for your kindness and the motivation. Your lion-hearted 🦁 personality is truly admirable. Can’t wait to work with… pic.twitter.com/iysWzhpOYY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 15, 2024 -
ఎన్టీఆర్ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్!
ఆర్ఆర్ఆర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవరతో పాటు బాలీవుడ్లో వార్-2లోనూ నటిస్తున్నాడు. అయితే దేవర సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వార్-2 సెట్స్పైకి వెళ్తాడాని అంతా భావించారు. ఎన్టీఆర్ ప్లాన్ కూడా అదేనట. కానీ కొన్ని కారణాల వల్ల దేవర షూటింగ్ని నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ వార్-2 సెట్స్పైకి వెళ్లాడు. అటు దేవరతో పాటు ఇటు వార్-2ని కూడా కంప్లీట్ చేసి.. వేరే సినిమాపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ రూటునే ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి) బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్తోనూ మరో సినిమా చేయాబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు బన్నీ తన ప్లాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి అటు అట్లీ, ఇటు త్రివిక్రమ్ సినిమాల్లో నటించాలనుకుంటున్నాడట. (చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) త్వరలోనే అట్లీ సినిమాను సెట్స్పైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా ఇప్పుడు తన ఫోకస్ అంతా అల్లు అర్జున్ సినిమా మీదనే పెట్టాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత ఈ రెండు సినిమాల షూటింగ్స్లో పాల్గొని.. వచ్చే ఏడాదిలో రెండింటిని విడుదల చేసేలా బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో బన్నీ రెండు సినిమాలలో అభిమానులను అలరిస్తాడు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019