breaking news
-
గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్
కాకినాడ,సాక్షి: ఎన్నికల వేళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్జగన్ మోహన్రెడ్డి వారందరినీ ఆప్యాయంగా పలుకరించి, కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం మేమంతా సిద్ధం బస్సు యాత్ర నైట్ స్టే పాయింట్ వద్ద చేరికల కార్యక్రమం జరిగింది. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో మాజీ కార్పొరేటర్ ఎస్.కెసైదా, మొండి బండ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ, టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మాధవయాదవ్ తదితరులున్నారు. ఇదీ చదవండి.. మేమంతా సిద్ధం.. 18వ రోజు సీఎంజగన్కు ఘన స్వాగతం -
సీఎం జగన్ సమక్షంలో YSRCPలోకి కీలక చేరికలు
సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ.. అభివృద్ధి మంత్రం వైపు పలు పార్టీ నేతలు ఆకర్షితులవుతున్నారు. గత కొన్నాళ్లుగా ప్రతిపక్షాలకు షాక్ తగిలేలా.. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి కేడర్ మొదలు.. మాజీ మంత్రులు, కీలక నేతల దాకా అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా.. ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్డీ కండువా కప్పుకున్నారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నేతలు సైతం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని), వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ళగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్ రెడ్డి. కిషోర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ… pic.twitter.com/fktBuN4W2R — YSR Congress Party (@YSRCParty) March 4, 2024 ‘‘భూమా అఖిల ప్రియ ఓ క్రిమినల్. ఆమె.. ఆమె భర్త కలిసి కిడ్నాప్లు, దొంగ తనాలు, కబ్జాలు చేస్తున్నారు. అలాంటి అరాచక వాదులు గెలవకూడదు అని వై ఎస్సార్ కాంగ్రెస్ లో చేరాను. ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. గంగుల నానిని గెలిపించడం కోసం భూమా కుటుంబం పనిచేస్తుంది. భూమా కుటుంబ మొత్తం అఖిల ప్రియకి వ్యతిరేకంగా పనిచేస్తాం. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరాను. ఏపీలో బీజేపీ నాయకులు టీడీపీ ఇచ్చే సీట్ల కోసం ఎదురు చూస్తున్నారేగానీ.. నేతల, కార్యకర్తల మనోభావాలను పట్టించుకోవడం లేదు’’ భూమా కిషోర్ అన్నారు. వైఎస్సార్సీపీలోకి ఏపీసీపీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ సీఎం జగన్ సమంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పీవీ మిథున్రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు
-
పరిటాల ఫ్యామిలీకి ఎదురుదెబ్బ..ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీలోకి భారీ చేరికలు
-
చేరికలపై దూకుడు.. టీ కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్..
సాక్షి, హైదరాబాద్: చేరికలపై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడానికి టీ కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ చేరికలను కాంగ్రెస్ నేతలతో కాకుండా న్యూట్రల్ పర్సన్స్తో ఆపరేషన్ ఆకర్షగా కంప్లీట్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. వరంగల్ మోదీ సభ రోజే ఒకరిద్దరు కీలక నేతలను చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ చేసింది. ప్రియాంక హాజరుకానున్న సభలో మరికొందరు కీలక నేతలను చేర్చుకునే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. యెన్నంశ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్రావు, ఖాజీపేట లింగయ్య, పవన్కుమార్రెడ్డి, రమేష్ రాథోడ్, రవీంద్రనాయక్, తీగల కృష్ణారెడ్డిలతో మంతనాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ నేతలు కలుసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్లో తిరిగి చేరడంపై పొంగులేటితో రాజగోపాల్రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే రాజగోపాల్రెడ్డికి ఘర్ వాపసిపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆహ్వానం పలికారు. చదవండి: సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ! కాగా, అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలు సమయం ఉండగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. రాజకీయ వర్గాలు ముందుగా ఊహించినట్టుగానే ఖమ్మం గడ్డపై నుంచి ఆ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ జనం నడుమ ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ ఎన్నికల ప్రచార సభను తలపించిన సంగతి తెలిసిందే.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019