breaking news
-
April 20th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
-
April 19th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 19th AP Elections 2024 News Political Updates.. 08:50 PM, Apr 19th, 2024 షర్మిలకు ఈసీ నోటీసులు వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఈసీ నోటీసులు వివేకా హత్య కేసులో పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న షర్మిల అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు నోటీసులు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే విచక్షణాధికారంతో చర్యలు తీసుకుంటామని స్పష్టం 05:20 PM, Apr 19th, 2024 కాకినాడు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగం.. ముఖ్యంశాలు ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ నగరా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు ఇంటింట ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్వార్ జరుగుతోంది ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుంది ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలు వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుంది జగన్కు ఓటేస్తే.. ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి లేదంటే బాబు మార్క్తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడు జగన్కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్ మార్క్ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్తో కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది ఫ్యాన్కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుంది. అదే సమయంలో పెన్షన్ అందిస్తున్న జగన్ మార్క్ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశాం ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగింది. లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్ ముగింపు ఉంటుంది మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడు ఫ్యాన్కు ఓటేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్తో ముగింపు పడుతుంది. ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తేనే.. ఉచిత పంటల బీమా.. ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే రుణాలు, ఫ్యాన్పై రెండు ఓట్లేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే.. రైతన్నకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తేనే.. దళారిలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటలు కొనుగోలు అన్నది జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే అనేది గుర్తుపెట్టుకోండి లేదంటే.. చంద్రబాబు మార్క్తో ముగింపు ఫ్యాన్కు ఓటేస్తేనే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఫ్యాన్కు ఓటేస్తేనే గవర్నమెంట్ బడుల్లో రూపు రేఖలు మార్చే నాడు-నాడు ఫ్యాన్కు ఓటేస్తేనే మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ బోధన, మూడో తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరో తరగతికి వచ్చేసరికి డిజిటల్ బోధన, ఐఎఫ్బీ ప్యానల్స్, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇక పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ దీనిలో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన డిగ్రీ చదువుతున్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువుల్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ద్వారా విదేశాల్లో అతి ఉన్నత విద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం తొలిసారి డిగ్రీలో మ్యాండెటరీ ఇంటెర్న్షిప్ ఇవన్నీ కొనసాగి మీ పిల్లలు ఎదగాలంటే.. మీ బిడ్డ వైఎస్ జగన్ 10 ఏళ్లు ఇదే స్థానంలో ఉంటే జగన్ మార్క్ విప్లవాలు కొనసాగుతాయి. 05:00 PM, Apr 19th, 2024 పుట్టపర్తి సొమ్ములు ఎక్కడికి పోయాయంటే.? మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ కిరణ్ కుమార్ రెడ్డి దోపిడీ దొంగ పుట్టపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు వేల కోట్లు దోచుకున్నాడు సాయిబాబా మరణ వార్తను వారంపాటు ప్లాన్ ప్రకారం బయట పెట్టలేదు అదే సమయంలో నగదు, బంగారం ట్రక్కుల ద్వారా తరలించాడు చిదంబరానికి డబ్బు సంచులు ఇచ్చి సీఎం పదవి తెచ్చుకున్నాడు అప్పుడే రాష్ట్ర విభజనకు కుట్ర జరిగింది 04:50 PM, Apr 19th, 2024 మంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే దౌర్జన్యాలు,అరాచకాలకు పాల్పడేలా టిడిపి నేతలను ప్రోత్సహిస్తున్న లోకేష్. మేకా వెంకటరెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు. ఓటమి భయంతోనే లోకేష్ ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకుని బాధ్యులను శిక్షించి బ్రెయిన్ డెడ్ అయిన వెంకటరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలి. -వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల డిమాండ్ 04:40 PM, Apr 19th, 2024 కృష్ణాజిల్లా: 25 సంవత్సరాలు వైఎస్సార్సీపీ అధికారంలో ఉంటుంది: జోగి రమేష్ వచ్చే 23 రోజులు కీలకం. 25 సంవత్సరాలు వైఎస్సార్సీపీ అధికారంలో ఉంటుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడం లేదు ఎమ్మెల్యే అయితే చాలనుకుంటున్నాడు. అన్ని సర్వేలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయి బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతుంది. 25న సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మేనిఫెస్టో ప్రకటిస్తాం 03:50 PM, Apr 19th, 2024 లోకేష్ను అరెస్టు చేయాలి: ఎమ్మెల్యే ఆర్కే తెలుగుదేశం కార్యకర్తల దాడిలో గాయపడి బ్రెయిన్ డెత్ అయిన మేకా వెంకట రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నారా లోకేష్ ఓటమి భయంతోనే మంగళగిరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నాడు. మేకా వెంకట్ రెడ్డిని అత్యంత దారుణంగా బైక్ తో గుద్దారు. తెలుగుదేశం కార్యకర్తల దాడిలో గాయపడిన మేకా వెంకట్ రెడ్డి కు బ్రెయిన్ డెత్ అయిందని వైద్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని వైద్యులు చెప్తున్నారు. 15 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనం పైన తెలుగుదేశం నాయకులు దాడి చేశారు. లోకేష్కే ఈ దాడులు చేయిస్తున్నాడు. వెంటనే లోకేష్ను అరెస్టు చేయాలి. తెలుగుదేశం కార్యకర్తల దాడిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ కామెంట్స్. తెలుగుదేశం నాయకుల దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఎలాంటి దాడులకు చోటు లేదు. మంగళగిరిలో తెలుగుదేశం నాయకులు భయపెట్టి ఎన్నికలు చేయాలనుకుంటే కుదరదు. తెలుగుదేశం కార్యకర్తల దాడిలో మేక వెంకట్ రెడ్డికి బ్రెయిన్ డెత్ అయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు. 03:15 PM, Apr 19th, 2024 ఏపీ అప్పులపై చంద్రబాబు, రామోజీరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కొండా రాజీవ్, వైఎస్సార్ అధికార ప్రతినిధి సీఎం జగన్ హయాంలో రూ. 2.68 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశారు రాష్ట్రం మొత్తం అప్పు రూ. 7 లక్షల కోట్లు కానీ చంద్రబాబు, రామోజీరావు రూ. 12 లక్షల కోట్లు అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు చంద్రబాబు హయాంలో జి ఎస్ డి పి వృద్ధి 5.44 శాతం తో 22 వ స్థానంలో ఉంచాడు సీఎం జగన్ హయాంలో 18.4 శాతం జీఎస్డీపీ వృద్ధి సాధించాం ఈ రాష్ట్రంలో 16 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చెప్పింది తలసరి ఆదాయం పెరిగి.మన ర్యాంక్ 9 వస్థానానికి పెరిగింది నిరుద్యోగ శాతం తగ్గిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క పోర్టు,.ఒక్క మెడికల్ కాలేజి కట్టలేదు సిగ్గులేదా..? గుజరాత్ కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి చంద్రబాబు, పచ్చ మీడియా ఎన్ని తప్పుడు కథనాలు రాసినా ప్రజలు సీఎం జగన్కే మళ్ళీ పట్టం కడతారు 02:19 PM, Apr 19th, 2024 నిరాడంబరంగా ఉండటం నా నైజం: వైఎస్ అవినాష్రెడ్డి నిరాడంబరంగా కడప పార్లమెంట్ స్దానానికి నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి అందుకే నామినేషన్ నిరాడంబరంగా దాఖలు వేశాను ఈ ఎన్నికల్లో భగవంతుడి అశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్దిస్తున్నా ప్రజల అశీస్సులు కూడా మెండుగా ఉండాలని కొరుతున్నా ఈ ఐదేళ్లు జిల్లా అభివృద్ది విషయంలో వెనకపడకుండా చూశాం పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాం బద్వేలులో సెంచూరీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 1200 మంది పని చేస్తున్నారు కొప్పర్తిలోను పలు పరిశ్రమలొచ్చాయి కొప్పర్తిలో లక్ష మందికి ఉపాధి కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం పులివెందులలోను అదిత్య బిర్లా వంటి పరిశ్రమలను ఏర్పాటు చేశాం గండికోటలో 27 టీసీఎంల నీరు నింపగలిగాం గండికోటలో నీరు నిలువ చేయడం వల్లే ఇంతటి కరవు సమయంలోను దాహర్తిని తీర్చగలిగాం ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది జరుగుతోంది కోవిడ్ ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగాయి ఈ ఐదేళ్ల కాలంలో పార్లమెంట్లో అనేక అంశాలు ప్రస్తావించాను ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను కృష్ణా జలాల రీ అలకేషన్ కు సంబంధించి ప్రస్తావించాను కడప ఎయిర్ పొర్టు టర్మినల్ అభివృద్దికి కృషి చేశా కడప-బెంగుళురు రైల్వే లైన్కు రాష్టం నుంచి ఇవ్వాల్సిన వాట ఇవ్వలేమని గత టీడీపీ ప్రభుత్వం లేఖ రాసింది కర్ణాటకలోను భూసేకరణ ఉండటం వల్ల అలస్యమవుతోంది ఫీజు బుల్టి సాధ్యపడితే కడప-బెంగుళూరు ప్రయాణం కల సాకారం అవుతుంది 01:56 PM, Apr 19th, 2024 తణుకులో టీడీపీ, జనసేన నేతల ఓవరాక్షన్ నామినేషన్ దాఖలుకు అభ్యర్థితో పాటు నలుగురికి అనుమతి బారికేడ్లు తోసుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 01:38 PM, Apr 19th, 2024 రాజానగరం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా నామినేషన్ రాజానగరం నియోజకవర్గంలో గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం కరోనా సమయంలో ప్రజలకు విస్తృతంగా సహాయం అందించాం రానున్న రోజుల్లో ఉపాధి పరిశ్రమలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తాం ఐదేళ్లుగా నిరంతరం ప్రజల్లోనే ఉన్నాము మందగా వచ్చే ప్రతిపక్షాలను ప్రజలు నమ్మరు సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రజలంతా తోడుంటారు 01:17 PM, Apr 19th, 2024 నగరి ప్రజలు నా వెన్నంటే ఉన్నారు: మంత్రి ఆర్కే రోజా నా కష్టాన్ని గుర్తించిన జగనన్న చెల్లెలుగా భావించి అండగా నిలిచారు: మంత్రి ఆర్కే రోజా నగరి నుంచి గెలిచి అసెంబ్లీ ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలను వినిపించాను నా సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చారు. 3వ సారి టికెట్ లేదని ప్రచారం చేశారు. సీఎం జగన్ అండతో నామినేషన్ వేశాను నగరి ప్రజలు అండగా నిలిచారు.. నామినేషన్ కాదు విజయోత్సవ ర్యాలీలా ఈ రోజు ర్యాలీ జరిగింది. 151 సీట్లు ప్రజలు ఇస్తే సంక్షేమం, అభివృద్ధి చేశారు తప్పకుండా హ్యాట్రిక్ కొడతాను 10 వేల మెజారిటీ గెలుస్తా.. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు అండగా ఉంటాను. మూడో సారి నగరిలో హ్యాట్రిక్ విజయం సాధించి అన్నకు గిప్ట్గా ఇస్తా నగరి ప్రజలు నా వెన్నంటి ఉన్నారు నగరి లో వెన్నుపోటు రాజకీయాలు చేసే నాయకులకు మే 13 ప్రజలు తగిన బుద్ధి చెబుతారు సీఎం జగన్ సహకారంతో నగరి మరింత అభివృద్ది చేస్తాం 11:34 AM, Apr 19th, 2024 జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విబేధాలు జగ్గయ్యపేట కూటమి అభ్యర్ధి టీడీపీ నేత శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య)కు నిరసనసెగ వత్సవాయి మండలం తాళ్లూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీరామ్ రాజగోపాల్ రాజగోపాల్ను అడ్డుకున్న టీడీపీ నాయకుడు బొల్లా రామకృష్ణ వర్గం రామకృష్ణ టీడీపీ వ్యక్తి కాదని ఇటీవల వ్యాఖ్యలు చేసిన శ్రీరామ్ రాజగోపాల్ బొల్లా రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై తమకు సమాధానం చెప్పాలంటూ శ్రీరామ్ రాజగోపాల్ను అడ్డుకున్న రామకృష్ణ వర్గం నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు బొల్లా రామకృష్ణ ఇంటిలోకి పంపించేసిన పోలీసులు ఇంటి లోపల నుంచే ప్లకార్డులతో నిరసన తెలిపిన బొల్లా రామకృష్ణ అనుచరులు శ్రీరామ్ రాజగోపాల్కు వ్యతిరేకంగా నినాదాలు ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు 11:23 AM, Apr 19th, 2024 సీఎం జగన్పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి సీఎం జగన్పై 2 సార్లు ఎటాక్ జరిగింది.. 2 సార్లూ చంద్రబాబే చేయించారు మానవత్వం, విలువలు లేని వ్యక్తి చంద్రబాబు 11:14 AM, Apr 19th, 2024 ఆరు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మారే అవకాశం? రఘురామకృష్ణరాజు కోసం ఉండి ఎమ్మెల్యేకి చంద్రబాబు వెన్నుపోటు ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి టికెట్ రఘురామకృష్ణరాజుకు దాదాపు ఖరారు తమ ఎంపీ అభ్యర్థులను మార్చేది లేదని చెప్పేసిన బీజేపీ నరసాపురం ఎంపీ సీటును ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన బీజేపీ ఇన్నాళ్లు వాడుకున్న రఘురామకృష్ణరాజుకి ఉండి ఎమ్మెల్యే సీటు ఇస్తున్న చంద్రబాబు ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి చేతులు దులుపుకొనున్న చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లిస్తానని గతంలో చెప్పి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు అనపర్తి - దెందులూరు మధ్య ఇంకా తేలని పంచాయితీ అనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు సీటు బీజేపీకి ఇచ్చేలా ప్రతిపాదనలు దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్తో అధిష్టానం చర్చలు మాడుగులలో పైలా ప్రసాద్ బదులు బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చే అవకాశం మడకశిర అభ్యర్థి అనిల్ కుమార్కు బదులు ఎమ్మెస్ రాజుకు ఇచ్చే ఆలోచన తంబళ్లపల్లె అభ్యర్థి జై చంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సరళా రెడ్డికి ఇచ్చే అవకాశం 11:11 AM, Apr 19th, 2024 విశాఖ వెస్ట్: టీడీపీ ఎమ్మెల్యే గణబాబు చీఫ్ ట్రిక్స్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ నామినేషన్ వేస్తున్నారని గుడి తాళం తీయడంలో జాప్యం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తీసే ఆలయం తలుపులు ఎనిమిది గంటలకు తెరవని ఆలయ నిర్వాహకులు గుడి తాళం తెరవకపోవడంతో రెండు గంటలుగా ఆలయం బయట ఉన్న భక్తులు ఓటమి భయంతో గణబాబు చీఫ్ పాలి ట్రిక్స్ చేస్తున్నారని భక్తులు ఆగ్రహం గోపాల్పట్నం గ్రామానికి చెందిన నూకాంబిక ఆలయాన్ని తన కుటుంబ సభ్యుల ఆధీనంలో వుంచుకున్న గణబాబు 10:42 AM, Apr 19th, 2024 కాకినాడ జిల్లాలో టీడీపీ, జనసేనకు ఎదురు దెబ్బ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన జనసేన నేతలు పొలసపల్లి సరోజ, విజయ్ గోపాల్, టీడీపీ నేతలు తోట నాయుడు, ముత్యాల శ్రీనివాస్ 10:39 AM, Apr 19th, 2024 వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరికలు వైఎస్సార్సీపీలోకి నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుకాంత్రెడ్డి, జనసేన నేతలు కాటంరెడ్డి జగదీష్రెడ్డి, ప్రవీణ్కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజర్ల సుబ్బారావు, కాంగ్రెస్ నేతలు పంతం నెహ్రూ, ఇందిర 10:13 AM, Apr 19th, 2024 సీఎం జగన్ బస్సు యాత్రతో ప్రతిపక్షాల్లో వణుకు: మంత్రి వేణు తూర్పుగోదావరిలో సీఎం జగన్ రోడ్ షో అత్యద్భుతంగా జరిగింది స్వచ్ఛందంగా వేల సంఖ్యలో జనం తరలివచ్చారు ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు సీఎం రాక కోసం ఎదురు చూశారు సీఎం జగన్ పై తమకున్న ప్రేమాభిమానాలను జనం చూపించారు సీఎంకు ఉన్న జనాభిమానాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి వారి మీడియాలో అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ఎవరేనుకున్నా వైఎస్ జగన్కు అత్యధిక ప్రజాదరణ రోడ్ షోలో మరోసారి స్పష్టమైంది 09:10 AM, Apr 19th, 2024 అనకాపల్లి: మాడుగుల టీడీపీలో గందరగోళం మాడుగుల టీడీపీ అభ్యర్థి మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం నామినేషన్ వేసేందుకు సిద్దమైన పైల ప్రసాదరావు టికెట్ తనదేనంటున్నబండారు సత్యనారాయణ తగ్గేదే లేదంటూ నేడు నామినేషన్కు ఏర్పాట్లు చేసుకున్న పైలా ప్రసాదరావు మాడుగుల టీడీపీ అయోమయం ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో క్యాడర్.. 07:46 AM, Apr 19th, 2024 వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’మూక హత్యాయత్నం కళ్యాణదుర్గంలో దారుణం మూకుమ్మడి దాడికి దిగిన టీడీపీ అభ్యర్థి అమిలినేని బంధువులు, బౌన్సర్లు ప్రచార రథం తాళాలు లాక్కుని కవ్వింపు వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాలువలో పడేసి పిడిగుద్దులు గుండెలపై రాళ్లతో కొట్టి, కాళ్లతో తొక్కి చంపే ప్రయత్నం గాయపడిన ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థి వాహన డ్రైవర్ విధుల్లో ఉన్న పట్టణ సీఐ హరినాథ్పైనా చిందులేసిన టీడీపీ నేతలు 07:31 AM, Apr 19th, 2024 గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు కడియపులంకలో సీఎం వైఎస్ జగన్పై పూల వర్షం వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం రాజమండ్రిలో జనజాతర🔥 మేమంతా సిద్ధం యాత్రకి భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు దిష్టి తీసి, హారతులు ఇచ్చి స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు సాయంత్రం 5.15 నుండి కొనసాగిన రోడ్ షో జనాలతో కిక్కిరిసిన దేవి చౌక్, ఆజాద్ సెంటర్లు జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన రాజమహేంద్రవరం.… pic.twitter.com/uJvhhlHh77 — YSR Congress Party (@YSRCParty) April 19, 2024 07:30 AM, Apr 19th, 2024 ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాజకీయాలకు అతీతంగా ఎన్నికల నిర్వహణ.. 12,459 సమస్యాత్మక కేంద్రాల్లో లోపల, బయట కెమెరాలు మొత్తం 30,111 పోలింగ్ స్టేషన్లలో వెబ్టెలికాస్టింగ్ ఇప్పటి వరకు రూ.121 కోట్ల విలువైన నగదు, వస్తువుల జప్తు సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తుపై పోలీసు అబ్జర్వర్ల పర్యవేక్షణ ప్రభుత్వ ఉద్యోగులు పాలనాంశాలపై మాట్లాడటం నిబంధనల ఉల్లంఘనే 07:10 AM, Apr 19th, 2024 బొండా బ్యాచ్ స్కెచ్.. సీఎం జగన్ను హత్య చేసేందుకే.. తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక కుట్రదారుల ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు ఏ1 సతీశ్ పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి శాస్త్రీయ ఆధారాలతో కుట్రను ఛేదించిన పోలీసులు ఏ2తోపాటు తెరవెనుక కుట్రదారుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకినిందితులిద్దరూ బొండా ఉమాతో కలసి దిగిన ఫొటోలు వైరల్ 07:07 AM, Apr 19th, 2024 రాష్ట్రానికి మీ కూటమి చేసిన మేలేమిటి? చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారు సీఎం జగన్ని మీరు ఎంత మాటైనా అనొచ్చు.. తిరిగి మిమ్మల్ని అంటే ఏడుపులా? టీడీపీలో ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు మంచోడు, మా పార్టీలో ఉంటే చెడ్డోడా? వాస్తవాలు చెప్పే జగన్ కావాలా?.. అబద్ధాల బాబు కావాలా?: పేర్ని నాని 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు మాట్లాడేవన్నీ పాపపు మాటలే నా కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ఆరోపణలు చేయడం దుర్మార్గం. -మాజీ మంత్రి పేర్ని నాని#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/KypoZ8Usk0 — YSR Congress Party (@YSRCParty) April 18, 2024 07:05 AM, Apr 19th, 2024 టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో చేటే ముస్లింలకు మేలు చేసింది సీఎం జగనే.. ఆయనతోనే ముస్లిం సమాజానికి భద్రత, భరోసా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా టీడీపీ భుజంపై గన్ పెట్టి ముస్లిం సమాజంపైకి గురిపెట్టిన బీజేపీ -
ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
Updates ఏలూరు జిల్లా : నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్ పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా... రామచంద్రపురం ఆర్డీఒ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్.... పిల్లి సూర్యప్రకాష్ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి సుధా సుధా సాగర్కు అందజేత. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ శాంత తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు అన్నమయ్య : రాజంపేటంలో అట్టహాసంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అకేపాటి అమరనాథరెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించిన అమరనాథరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తిరుపతి కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య హాజరైన ఎన్డీసిసిబి బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి, కలికి మాధవరెడ్డి ఎన్టీఆర్ జిల్లా నామినేషన్ సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ పూనూరు గౌతమ్ రెడ్డి తూర్పుగోదావరి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు కొవ్వూరులో ఆర్డిఓ ఆఫీస్ వద్ద 10 వేలమంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు నెల్లూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కర్నూలు జిల్లా నామినేషన్ వేసిన బుట్ట రేణుక ఎమ్మిగనూరులో పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్ట రేణుక పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ కార్పోరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్ వైఎస్సార్ జిల్లా నామినేషన్ వేసిన రఘురామి రెడ్డి మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామి రెడ్డి పాల్గొన్న వైఎస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు భూమన అభినయ్ రెడ్డి నామినేషన్ దాఖలు తిరుపతి నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెంట మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన ఎం.సీ విజయనందరెడ్డి చిత్తూరులో అటహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం సి విజయనందరెడ్డి పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్ రెడ్డి తదితరులు నామినేషన్ దాఖలు చేసిన కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్సార్సీపీ తరుఫున కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నిక శ్రీశైలం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చక్రపాణిరెడ్డి ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న లోకేష్ చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న విజయానందరెడ్డి దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న శివ ప్రసాద్రెడ్డి నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ నేటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం నేడు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్లను ఏర్పాటుచేశారు. ఫారం–26 తప్పనిసరి.. ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. నామినేషన్ రుసుం ఇలా.. పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నామినేషన్తో పాటు లేటెస్ట్ పాస్పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది. నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్ నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. ముఖ్యమైన తేదీలు నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం పోలింగ్ తేదీ మే 13 సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం -
April 18th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 18th AP Elections 2024 News Political Updates.. 6:45PM, Apr 18th, 2024 నెల్లూరు: కుట్రలు చేస్తున్న చంద్రబాబుకీ ఇవే చివరి ఎన్నికలు: మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి రాష్ట్ర సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన విషయాలన్నీ వాస్తవాలు సీఎం జగన్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంపాలని చూశారు హత్యయత్నం వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు.. వారి పాత్ర పై విచారణ జరపాలి.. కుట్రలు చేస్తున్న చంద్రబాబుకీ ఇవే చివరి ఎన్నికలు 6:38PM, Apr 18th, 2024 అమరావతి: చంద్రబాబు , పవన్ ఇప్పుడేమని సమాధానం చెబుతారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు చంద్రబాబు , పవన్ ప్రచార సభల్లో సీఎంపై వాడుతున్న అసభ్యకర పదజాలం పై ఈసీకి పిర్యాదు చేసాము నర్సీపట్నం లో అయ్యన్నపాత్రుడు సీఎం వైఎస్ జగన్ని దుర్భాషలాడారు రాజకీయ విలువలను దిగజార్చేలా మాట్లాడారు సభ్యసమాజం తలదించుకునేలా అయ్యన్న చేసిన వాఖ్యలపై కూడా పిర్యాదు చేశాం సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై కూడా ఈసీకి పిర్యాదు చేశాం చంద్రబాబు ,పవన్ విలువలు విశ్వసనీయత లేని నాయకులు దగా , కుట్రలకు కూటమి నిలువెత్తు నిదర్శనం సీఎంపై దాడి చేసిన వారికి చంద్రబాబు , పవన్ వత్తాసు పలికారు దాడి బూటకమని ఆరోపించారు నిందితులను పోలీసులు అరెస్ట్ చెసి కోర్టులో హాజరు పరిచారు చంద్రబాబు ,పవన్ ఇప్పుడేమని సమాధానం చెబుతారు 5:32PM, Apr 18th, 2024 అమరావతి: నేటి ఉదయం 11 నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. ముఖేష్ కుమార్ మీనా, ఏపీ సీఈవో ఈ నెల 25 వరకూ నామినేషన్లు స్వీకరణ..26న నామినేషన్లు పరిశీలన ఈ నెల 29 వరకూ నామినేషన్లు ఉపసంహరణ గడువు . ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్. అరకు, పాడేరు,రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ పోలింగ్ 50 మంది సాధారణ పరిశీలకులు ఉంటారు మొదటిసారి ఏపీ ఎన్నికలకు 18 మంది పోలీసు పరిశీలకులను నియమించారు. 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ అవకాశం. ఇవాల్టి నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. 29 వరకూ హోం ఓటింగ్ కోసం అప్లికేషన్లు తీసుకుంటాం. మే 2 నుంచి 10 వరకూ ఇంటింటికీ పోలింగ్ టీమ్స్ వెళ్లి ఓటింగ్ తీసుకుంటాయి. సర్వీస్ ఓటర్లకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. మే 5 నుంచి 10 వరకూ ఎన్నికల విధుల్లో ఉన్న వారికి ఫెసిలిటిషవ్ సెంటర్లలో ఓటింగ్. 5,26,000 మందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంది . 4:20PM, Apr 18th, 2024 తాడేపల్లి: సీఎం జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే: సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ఆర్ఐలు స్వచందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చెయ్యడం సంతోషం ప్రజల్లో సీఎం జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు మన రాష్ట్రంలో మళ్ళీ సీఎం జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారు సీఎం జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే ఇది ఆకతాయిల చర్య కాదు దీని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అర్థరహితం ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా విచారణలో తేలుతుంది తప్పు చేసినోడు నన్ను ఇరికించారాని మాట్లాడితే చెల్లుతుందా? 4:15PM, Apr 18th, 2024 తాడేపల్లి: బాబు, పవన్ అబద్ధాలు చెబుతూ ఓట్లు అడుగుతున్నారు: పేర్ని నాని చంద్రబాబు నోరు తెరిస్తే అసత్యాలే చంద్రబాబు మాట్లాడిన ప్రతీ మాట అబద్ధమే శిరోముండనం కేసు 1996లో జరిగింది 1995-2020 వరకూ తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు చంద్రబాబు బొంకు మాటల నాయుడు బాబు, పవన్పై నేను ఏనాడు బూతులు మాట్లాడలేదు బాబుకు వయసు పెరిగింది కానీ.. ఏం మాట్లాడాలో తెలియదు 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందరుకు ఏం చేశారు బందరుకు పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్ కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించాం పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నాం 26వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చాం కరోనా సమయంలో నా కొడుకు పేదలకు సేవ చేశాడు 75 ఏళ్ల వయసున్న చంద్రబాబువి అన్నీ పాపపు మాటలే నా కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారాలు చంద్రబాబు తీరును ప్రశ్నిస్తే నేను బూతులు నానినా? 3:15PM, Apr 18th, 2024 ఏలూరు జిల్లా: నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు టీడీపీలో ఉన్నదంతా ప్యాకేజ్ బ్యాచ్ రెండు సార్లు నాకు నామాలు పెట్టారు 3:10PM, Apr 18th, 2024 విజయవాడ: 4 శాతం రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా చెప్పిందే కిషన్రెడ్డి, పురంధేశ్వరి చెప్తున్నారు సాక్షితో వైఎస్సార్సీపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ బీజేపీ నేతల స్టేట్మెంట్లను చంద్రబాబు ఖందించట్లేదు అంటే సమర్ధిస్తున్నట్టే కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న కూటమిని ఏపీ ప్రజలు నమ్మరు చంద్రబాబు ముస్లింల ద్రోహి గుంటూరు నారా హమారా సభలో నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులను కేసులు పెట్టి హింసించింది చంద్రబాబే చంద్రబాబును ముస్లిం సమాజం నమ్మదు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు సీఏఏ, ఎన్ఆర్ సి వంటి నల్ల చట్టాలు అమలులోకి వస్తాయి పవన్ కళ్యాణ్ శాంతి భద్రతలను రెచ్చగొట్టేలా అనేక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతల వ్యాఖ్యలతో అన్నదమ్ముల్లాంటి హిందూ, ముస్లిం, కృష్టియన్లకు గొడవలు మొదలవుతాయి 2:50PM, Apr 18th, 2024 అనంతపురం: టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్ పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ 2:20PM, Apr 18th, 2024 తాడేపల్లి జూపూడి ప్రభాకర్ రావు, సోషల్ జస్టిస్ సలహాదారు.. కామెంట్లు ఈనాడు పత్రిక సీఎం జగన్పై దారుణంగా రాశారు దళితులను విడగొట్టి, దళితులను నీరు గార్చిన వ్యక్తి చంద్రబాబు కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదా రామోజీరావుకి కారంచేడు ఘటన కనిపించలేదా దళితులని ముక్కలు చేసి, సాక్ష్యాలు లేకుండా చేసింది చంద్రబాబు కాదా ఈనాడు లో ఒక్క రోజైన దళితుల వృద్ధి కోసం వార్త రాశావా మాదిగ పల్లెలు మీద దాడి చేసి చంపింది టీడీపీ కాదా ట్యాంక్ బండ్ మీద దళితులను గుర్రాలతో తొక్కించి చంపించింది చంద్రబాబు కాదా సీఎం జగన్ నా ఎస్సి, నా బీసీ, నా మైనారిటీ అంటుంటే రామోజీరావు తట్టుకోలేకపోతున్నాడు రామోజీరావు ని వయస్సుకి కూడా బుద్ధి లేదా దళితులు మురికిగా ఉంటారని చంద్రబాబు కేబినెట్లో మంత్రి అనలేదా ఎస్సిలకు ఎందుకురా రాజకీయాలు అన్నది టీడీపీ నాయకులు కాదా వై ఎస్ కుటుంబం లో దళితులను వివాహం చేసుకున్నారు ఉన్నారు రామోజీరావు, చంద్రబాబు ఇంట్లో ఎవరైనా ఎస్సిలు ఉన్నారా 14 ఏళ్ల లో చంద్రబాబు ఏనాడైనా దళితులకు మేలు చేశాడా సీఎం జగన్ని చూసి అన్నీ తడుపుకుంటున్నారు సీఎం జగన్ని చంపాలని కూడా చూశారు ఆ విచారణలో నిజాలు బయటకొస్తున్నాయ్ కాస్కోండి సీఎం జగన్ బి ఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయం సూత్రాన్ని అమలు చేస్తున్నారు చరిత్రలో ఎవ్వరు ఇవ్వని రాజకీయ అవకాశాలు ఇచ్చారు దళితుల్లో విషం నింపాలని రామోజీరావు తప్పుడు వార్తలు రాస్తున్నాడు 14 ఏళ్ళు ఎవడికి ఏం చేశాడో.. చంద్రబాబు చెప్పాలి బాలయోగిని స్పీకర్ కాకుండా అడ్డుకోవాలని చూడలేదా అబ్దుల్ కలాంని రాష్ట్రపతి ని చేశావంటే ఎవరైనా నమ్ముతారా నీకు, అబ్దుల్ కలాంకి ఏంటి సంబంధం సింగణమలలో ఓ సాధారణ టిప్పర్ డ్రైవర్ అయిన దళితుడికి సీటు ఇస్తే చంద్రబాబు అవమానించారు రామోజీరావు శరీరం దళితుల రక్తం, దళితుల చెమట, దళితుల వ్యతిరేక భావం తో నిండిపోయింది రాజధానిలో దళితులు ఉండటానికి వీల్లేదని చెప్పిన వాళ్ళు చంద్రబాబు, రామోజీ రావులు పేదవాడి వాసన, పేదవాడి నీడ వాళ్ళ మీద పడకూడదంట.! విజయవాడలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చూడని దళిత వ్యతిరేక స్వభావం చంద్రబాబుది.! 01:45PM, Apr 18th, 2024 అన్నమయ్య జిల్లా : రాజంపేటంలో అట్టహాసంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ రాజంపేటలో వైసిపిదే గెలుపు: అమరనాథ్ రెడ్డి స్థానికుడిని, అందరికి అందుబాటులో ఉండే వాడిని సిఎం వైఎస్ జగన్ పాలనకు బ్రహ్మరథం పట్టడం ఖాయం 01:45PM, Apr 18th, 2024 ఢిల్లీ: మళ్లీ వాయిదాలు ఇవ్వం,. ఇదే చివరి అవకాశం ఓటుకు నోటు కేసు విచారణలో చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసిన సుప్రీం కోర్టు కేసు ప్రారంభం కాగానే విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు కేసు విచారణ జూలై 24కి వాయిదా ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని కోరిన తెలంగాణ తరఫున న్యాయవాది సెలవుల తర్వాత విచారణ జరపాలనుకొని చంద్రబాబు తరఫు న్యాయవాది ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలని , దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని పిటిషన్ చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావించిన ఏసీబి 01:30PM, Apr 18th, 2024 అనకాపల్లి జిల్లా వైవీ సుబ్బారెడ్డి కామెంట్లు రాజధాని పేరిట దోచుకోవడానికే చంద్రబాబు నాయుడు అమరావతి నినాదం కేంద్రం దాతలు ఇచ్చిన నిధులు ఎప్పుడో దోచేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖ రాజధానిని ఇప్పటికే సీఎం ప్రకటించారు విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది సీఎంపై రాళ్లదాడి వెనక టిడిపి ప్రమేయం కచ్చితంగా ఉంది ఆ విషయం దర్యాప్తులోనే తేలుతుంది సీఎం గెలుపు ఓర్వలేక ఈ ఇలాంటి దాడులకు టిడిపి పురి గొలుపుతోంది 01:00PM, Apr 18th, 2024 విజయవాడ: చంద్రబాబు, పవన్ పై మంత్రి జోగి రమేష్ మండిపాటు జగన్ పై విషం చిమ్ముతున్నారు జనప్రభంజనం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు సభలకు ఎక్కడా జనం లేరు జగన్ సభలకు ఎండ తీవ్రత లెక్కచేయకుండా జనం వస్తున్నారు చంద్రబాబును జనం నమ్మే పరిస్థితిలో లేరు పిఠాపురంలో గాజు గ్లాసు పగిలిపోవడం ఖాయం ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో జగన్ చూపించారు ఇద్దరు మోసగాళ్లు వెళ్లి ఢిల్లీ పార్టీతో కలిశారు విలువలు, విశ్వసనీయత వదిలేసి పొత్తులు పెట్టుకున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ-జనసేన అడ్రస్ గల్లంతే కుప్పంలో బాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోతున్నారు ప్రజల మనస్సులు గెలిచిన నాయకుడు జగన్ 12:40PM, Apr 18th, 2024 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు లో టీడీపీకి ఎదురు దెబ్బ టీడీపీ అభ్యర్ధి వరుపుల సత్యప్రభ తీరుతో మనస్తాపం చెందిన జిల్లా అధికార ప్రతినిధి పైలా సుభాష్ చంద్రబోస్ తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా టీడీపీలో బీసీలకు గుర్తింపు లేదు పార్టీ ఆవిర్భావం నుండి సేవ చేస్తున్న తనకు గుర్తింపు లేకపోవడంతో పాటుగా.. అనేక అవమానాలు ఎదుర్కోన్నాని బోసు ఆవేదన 12:20PM, Apr 18th, 2024 విశాఖపట్నం: మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చెప్పిన మాటమీద నిలబడటం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారు విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు రేపు గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది.. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్ర ను పట్టించుకోలేదు టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు 12:10PM, Apr 18th, 2024 కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండకూడదు.. ఆయనది చీప్ క్యారెక్టర్ కోవూరులో నన్ను ఓడించేందుకు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారు.. ఆయన బాగోతం అంతా నా దగ్గర ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో మరోసారి నామినేషన్ వేశా కోవూరు నియోజకవర్గము నల్లపురెడ్డి కుటుంబానికి అడ్డా.. కోవూరు ప్రజలు మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గడపగడపకి వెళ్లాయి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నా 12:00PM, Apr 18th, 2024 తండ్రిని అడ్డం పెట్టుకుని లోకేష్ మంత్రి కాలేదా?: దేవినేని అవినాష్ కామెంట్స్ స్కూల్స్ రూపు రేఖలు మార్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్ ప్రభుత్వమే గుర్తుకు వస్తోంది ప్రజలను మభ్య పెట్టి కాలం గడుపుతున్న స్థానిక టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ ఇంటి తలుపు తట్టిన ఏది ఒక పథకం వచ్చింది అని ప్రతి మహిళ అంటున్నారు జూన్ 4 తరువాత రామరాజ్యం తలపించే జగన్ పాలన ప్రారంభమవుతుంది ప్రజలు కోరు కుంటున్నది జగన్ ప్రభుత్వమే రామాయణంలో రాముడు ఒక్కడే ఒకవైపు రావణ సమూహం ఒకవైపు ఉన్నాయి అదే చందంగా జగన్ ఒక్కడు ఒకవైపు రాక్షస కూటమీ ఒక వైపు నిలిచింది ఒక సీఎం కొడుకుగా గత ఎన్నికలలో లోకేష్ ఓడిపోలేదా పవన్ కళ్యాణ్ది వారసత్వం రాజకీయం కాదా చిరంజీవి లేక పవన్ కల్యాణ్కు సినీ జీవితం, రాజకీయ జీవితం ఎక్కడది వారసత్వ రాజకీయం గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవటానికి సిద్ధంగా వుండాలి పవన్ రాజకీయ జీవితం నాశనం చేసేది చంద్రబాబు నిత్యం ప్రజల్లో వుండే వ్యక్తులకు ప్రజలు ఎప్పుడూ అండగా వుంటారు బీసీ నేత లాకా వెంగళరావు యాదవ్ పాయింట్స్ గతం లో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు జగన్ అందించారు ఆరోగ్య శ్రీతో అనేక మందికి పేదలకి ఆరోగ్యం అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది 14 సీఎంగా చేసి ప్రజలకు ఉపయోగ పడే ఏ మేలు చేశారో.. చంద్రబాబు చెప్పాలి ఎవరు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారో ప్రజలు కూడా ఆలోచించాలి రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 100 స్థానాలు కేటాయించిన జగన్ వైఎస్ఆర్సీపీ అంటే పేదల పార్టీ 11:45AM, Apr 18th, 2024 ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ కేసు విచారణ జూలై 24 చివరికి వాయిదా ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని కోరిన తెలంగాణ తరఫున న్యాయవాది సెలవుల తర్వాత విచారణ జరపాలనుకొని చంద్రబాబు తరఫు న్యాయవాది ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని పిటిషన్ చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావించిన ఏసీబి అయినా చంద్రబాబు నాయుడు పేరు నిందితుడిగా తెలంగాణ ఎసిబి చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారణ జరిపిన జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ ఏసిబి ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటపెట్టిన ఏసిబి "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ 11:30AM, Apr 18th, 2024 నెల్లూరు గందరగోళం సృష్టించాలని టీడీపీ నేతల కుట్రలు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. -నామినేషన్ సందర్భంగా గందరగోళం సృష్టించాలని తెలుగుదేశం పార్టీ నేతల కుట్రలు.. లోపలకీ అనుమతి ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వివాదం టిడిపి కార్యకర్తలని చెదరగొట్టిన పోలీసులు.. -వేమిరెడ్డి ప్రభాకర్ వందల కోట్లు ఖర్చుపెట్టి కోవూరులో గెలవాలని చూస్తున్నాడు.. సీఎం జగన్ బొమ్మతో ప్రజల్లోకి వెళ్తున్న తనను.. ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే ప్రసన్న ధీమా.. 11:10AM, Apr 18th, 2024 చిత్తూరు పుంగనూరులో టిడిపికి భారీ షాక్ టిడిపి నుంచి వైయస్ఆర్సీపీ లోకి భారీగా వలసలు టిడిపి నేత కృష్ణమూర్తి తో పాటు ఆయన భార్య మాజీ కౌన్సిలర్ లక్ష్మి తో పాటు మరో 100 కుటుంబాలు మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పెద్దిరెడ్డి 11:00AM, Apr 18th, 2024 ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు 10:30AM, Apr 18th, 2024 విజయవాడ దేవాలయాలని కూల్చి వేసిన దుర్మార్గుడు చంద్రబాబు: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రామతీర్థం, అంతర్వేది పూర్వవైపు తేచ్చింది సీఎం జగన్నే చంద్రబాబు బూట్లు వేసుకొని పూజ చేసే వ్యక్తి రూ. 70 కోట్ల నిధులతో బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయని అభివృద్ధి చేసింది సీఎం జగన్ శ్రీరామనవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు సీఎం జగన్పై దాడిపట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారు బోండా ఉమా మాటల్లోనే అర్థమవుతుంది సీఎం జగన్పై దాడి చేసింది ఎవరో..? బోండా ఉమకి బుద్ధి జ్ఞానం లేదు ఎవరైనా కంటిమీద దాడి చేయించుకుంటారా..? బోండా ఉమా ఓడిపోతారని తెలుసు భూ కబ్జాలు, రౌడీయిజం, చేస్తారని ప్రజలందరికీ తెలుసు సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అయిందని బోండా ఉమ సునకానందం పొందాడు పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేస్తుంటే బోండా ఉమ ఎందుకు పారిపోతున్నాడు తప్పు నువ్వు చేసావు కాబట్టే భయపడుతున్నావ్ రాష్ట్రంలోని చేతులన్నీ బొండా ఉమా వైపే చూపెడుతున్నాయి బొండా మామ టీ షర్టులు వేసుకుని మారువేషంలో తిరుగుతున్నాడు తప్పు చేశాడు కాబట్టే మారువేషణలో తిరుగుతున్నాడు సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది అని ఆయన చెప్తున్నాడు ఎంపీ కేశినేని నాని కామెంట్స్ బొండా ఉమా వారిద్దరు కుమారులు రౌడీయిజం, గుండాయిజానికి పాల్పడుతున్నారు బోండా ఉమ బుడమేరును ఆక్రమించి భూకబ్జాలు చేశాడు కీచకుడు, కాలకేయుడు బోండా ఉమ సీఎం జగన్ తలకు వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నుకు దాడికి పాల్పడటం దారుణమైన విషయం బోండా ఉమాకి దాడి చేయించిన విషయం తెలుసు చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రుడు బోండా ఉమా నిన్న బోండా ఉమ మా వాళ్లే కొట్టారు అన్న క్యాంటీన్ తీసినందుకానీ అనలేదా..? బోండా ఉమా రెండు రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చాడు ఏబీఎన్ ఛానల్లో బోండా ఉమా క్లియర్గా చెప్పాడు దాడి చేసామని చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాడు 10:00AM, Apr 18th, 2024 ప్రకాశం జిల్లా నేడు నామినేషన్ వేయనున్న దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కామెంట్స్ వైఎస్సార్సీపీకి జనంలో అనూహ్య స్పందన ఉంది ముఖ్యమంత్రి జగన్ను మళ్లీ సీఎంని చేసుకుంటాం అని జనం ముక్తకంఠంతో చెబుతున్నారు దర్శిలో నా గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు దర్శిలో అత్యధిక మెజారిటీతో నేను గెలవడం ఖాయం 9:30AM, Apr 18th, 2024 ఏపీలో మళ్లీ ఎగరబోతున్న వైఎస్సార్సీపీ జెండా! ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లని వైఎస్సార్సీపీ గెలవబోతున్నట్లు తేల్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ పోల్ స్కాన్ సర్వే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకుని వచ్చినా.. సింగిల్గానే 52.6 శాతం ఓటు షేర్ని వైఎస్సార్సీపీ కొల్లగొట్టబోతున్నట్లు తేల్చేసిన సర్వే మళ్లీ గెలిచేది జగనే ఏపీలో మళ్లీ ఎగరబోతున్న వైయస్ఆర్సీపీ జెండా! ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లని వైయస్ఆర్సీపీ గెలవబోతున్నట్లు తేల్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ పోల్ స్కాన్ సర్వే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకుని వచ్చినా.. సింగిల్గానే 52.6% శాతం ఓటు షేర్ని వైయస్ఆర్సీపీ… pic.twitter.com/y1eZEJLrhc — YSR Congress Party (@YSRCParty) April 18, 2024 9:00AM, Apr 18th, 2024 నామినేషన్ల పర్వం.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నిక శ్రీశైలం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చక్రపాణిరెడ్డి ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న లోకేష్ చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న విజయానందరెడ్డి దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న శివ ప్రసాద్రెడ్డి 08:45AM, Apr 18th, 2024 అనంతపురం: కళ్యాణదుర్గంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ ప్రచార రథంపై దాడి అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను విచక్షణా రహితంగా కొట్టిన టీడీపీ నేతలు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో ఘటన టీడీపీ నేతల గూండా గిరిపై కళ్యాణదుర్గం లో భయాందోళనలు 08:30AM, Apr 18th, 2024 తణుకు వైఎస్సార్సీపీలో చేరిన రాజోలు జనసేన ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేరిన బొంతు రాజేశ్వరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్ 08:10AM, Apr 18th, 2024 ఢిల్లీ: నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలని , దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని పిటిషన్ చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావించిన ఏసీబి అయినా చంద్రబాబు నాయుడు పేరు నిందితుడిగా తెలంగాణ ఎసిబి చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ ఏసిబి ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటపెట్టిన ఏసిబి "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ 07:50AM, Apr 18th, 2024 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేనకు షాక్ జనసేన పార్టీ కి రాజీనామా చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ బొంతు రాజేశ్వరరావు రాజేశ్వరరావు తోపాటు రాజీనామా చేసిన జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు ఇవాళ తణుకులో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్న బొంతు రాజేశ్వరరావు 07:40AM, Apr 18th, 2024 పార్వతీపురం మన్యం బీజేపీ అరకు పార్లమెంట్ టికెట్ ఆశావహుడు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ను పార్టీ నుండి తొలగించిన బీజేపీ అరకు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎస్టీ కుల ధ్రువీకరణ ను ప్రశ్నించినందుకు వేటు వేసిన రాష్ట్ర పార్టీ ఇండిపెండెంట్గా పోటీకి సిద్దపడుతున్న జయరాజ్ 07:30AM, Apr 18th, 2024 చెప్పిన మాట తప్పితే నాయకుడు ఎలా అవుతారు? చెప్పిన మాట తప్పితే నాయకుడు ఎలా అవుతారు? @Pawankalyan pic.twitter.com/CeTwj5Bh1u — YSR Congress Party (@YSRCParty) April 18, 2024 07:15AM, Apr 18th, 2024 పచ్చవన్నె మేధావులు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో చంద్రబాబుకుకొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ల ఊడిగం వారికున్నది రాష్ట్రంపై ప్రేమ కాదు.. సీఎం జగన్పై కక్ష ముఖ్యమంత్రిపై బురద జల్లడమే వారి ఎజెండా సర్వీసులో ఉన్నప్పుడే చంద్రబాబు కోసం పరితపించిన ‘నిమ్మగడ్డ’ చట్ట పరిధిని దాటి స్థానిక ఎన్నికల్లో టీడీపీకి గులాంగిరి సీబీఐ డైరెక్టర్గా పనికిరాడని సుప్రీంకోర్టు తేల్చిన వ్యక్తి నాగేశ్వరరావు సర్వీసు పొడిగించలేదనే అక్కసుతో విషం కక్కుతున్న మరో మేధావి పీవీ రమేష్ ఇప్పుడు వీళ్లంతా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షకుల అవతారం సొంత ప్రయోజనాలు, రాజకీయ ఎజెండాతో ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు 07:00AM, Apr 18th, 2024 బాబు నుంచి షర్మిలకు రూ. 60 కోట్లు చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది? చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రధారులు వైఎస్ వివేకా హత్య కేసులో రాజకీయ కోణం లేదు.. మరో సంబంధం ఉంది సునీత, రాజశేఖర్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్టులు చేయాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. రమేష్కుమార్రెడ్డి 06:40AM, Apr 18th, 2024 నేటి నుంచి నామినేషన్ల పర్వం రాష్ట్రంలో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ.. 26న పరిశీలన 29 వరకు ఉపసంహరణకు చాన్స్ ఉ.11 నుంచి మ.3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి కి ఒకరు, స్వతంత్ర అభ్యర్థికి పదిమంది ఓటర్లు ప్రతిపాదించాలి ఎంపీ అభ్యర్థి నామినేషన్ రుసుం రూ.25,000.. ఎమ్మెల్యేకు రూ.10,000 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ.. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి 06:30AM, Apr 18th, 2024 వ్యూహకర్తలు హ్యాండ్సప్.. జారిన జాకీలు! విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం జనసేన, బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాబిన్ నిర్వేదం.. సర్వేలు, స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా సీట్లిచ్చారు పార్టీ కోసం పని చేసిన వారిని పక్కనపెట్టి.. ధనవంతులకే సీట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించినా పట్టించుకోనప్పుడు మేమెందుకు? తమ ప్రయత్నాలు అంతా వృథా అయ్యాయని ఆక్రోశం రాబిన్ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ బృందం 06:20AM, Apr 18th, 2024 అవినీతి జీవి రూ.వందల కోట్లు కైంకర్యం వందలాది ఎకరాలభూముల ఆక్రమణ నకిలీ ఎరువులతో రైతులను నట్టేట ముంచిన వైనం రేషన్, ఇసుక, అక్రమ మద్యం మాటున అక్రమార్జన ఉపాధి హామీ, నీరు చెట్టు, సీసీరోడ్ల పేరుతో ప్రజాధనం లూటీ మరుగుదొడ్ల బిల్లుల్లోభారీగా చేతివాటం అభివృద్ధి పనుల్లోనూ మాయాజాలం వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు అవినీతి చిట్టా 06:10AM, Apr 18th, 2024 నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–4 అమరావతిని ముక్కలు చేసి పంచుకున్న చంద్రబాబు అండ్ కో లింగమనేని కోసం ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ మార్పులు ఆ భూముల విలువ రూ.2 వేల కోట్లకు పైగా చేరేలా పన్నాగం.. ప్రతిగా క్విడ్ ప్రోకోలో హెరిటేజ్కు భూములు, బాబుకు కరకట్ట బంగ్లా నారాయణ విద్యా సంస్థల కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు.. పవన్ కల్యాణ్కూ లాభం చేకూరుస్తూ అమరావతిలో ప్యాకేజీ 06:00AM, Apr 18th, 2024 కూటమి బలం 'నీటి బుడగే'! బస్సు యాత్రలో అడుగడుగునా సీఎం జగన్కు జన నీరాజనం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉప్పొంగిన అభిమాన సంద్రం వారధిపై పాదయాత్ర నాటి ప్రభంజనాన్ని తలపించిన బస్సు యాత్ర మండుటెండైనా.. అర్ధరాత్రయినా రోడ్ షోలకు పోటెత్తుతున్న జన సంద్రం విజయవాడలో 4.30 గంటలపాటు జైత్రయాత్రలా సాగిన రోడ్ షో తామెన్నడూ ఈ ప్రజా స్పందనను చూడలేదంటోన్న ఉద్యోగ, వ్యాపార వర్గాలు తాము పుంజుకున్నామనే చోట బస్సు యాత్ర సక్సెస్తో టీడీపీలో నైరాశ్యం తమది బలుపు కాదు వాపే అంటున్న టీడీపీ సీనియర్ నేతలు తొలిసారి ఓటేయబోతున్న 18–21 ఏళ్ల విద్యార్థులంతా జగన్ వెంటే.. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయేనంటున్న రాజకీయ విశ్లేషకులు -
చౌదరికి 3డీ సినిమా ఖాయం!
అవును, సుజనా కోసం బీసీలు బలయ్యారు. ముస్లిం మైనార్టీలు మోసపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకే చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులను పక్కా ప్రణాళికతో బలి పశువుల్ని చేశారు. పార్ట్నర్ పవన్తో పోతిన వెంకట మహేష్ ను పొడిపించేశారు. పెత్తందారీ పోకడలకు ప్రతీకగా ప్రత్యేక గుర్తింపు పొందిన చౌదరి (సుజనాను బాబుతో సహా టీడీపీలోని ముఖ్యులు సైతం చౌదరి అనే సంభోదిస్తుంటారు) కోసం బాబు తమను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఫణంగా పెట్టేశారని ప శ్చిమలోని బీసీ, మైనార్టీ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని నిప్పులు చెరుగుతున్నారు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి టీడీపీని ఆక్రమించేసుకున్నాక చంద్రబాబు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఆప్షన్గా ఎంచుకున్నారు. అక్కడి నేతలు సొంతంగా బలపడకుండా చూసుకోవడంలో జాగ్రత్త పడుతున్నట్లు ప్రతి ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు నిర్ధారిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం అనంతరం ఒంటరిగా పోటీ చేసింది తక్కువే. 1998 లోక్సభ ఉప ఎన్నిక మొదలు 1999, 2004, 2009, 2014 జనరల్ ఎలక్షన్లలో వామపక్షాలు, బీజేపీ, మహాకూటమి, జనసేనలతో టీడీపీ కూటమి కట్టి తలపడింది. 2019లో నేరుగా పోటీ అన్నట్లు కలరింగ్ ఇచ్చినా, జనసేనతో లోపాయికారీ ఒప్పందం లేకపోలేదు. 2004, 2009, 2019 ఎన్నికల్లో తలపడిన టీడీపీ ఓటమి చెందింది. 1983లో మాత్రమే టీడీపీ నుంచి బి.ఎస్.జయరాజ్ పోటీచేసి సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. కాగా సైద్ధాంతికంగా భిన్న ధృవాలైన సీపీఐ, బీజేపీలకు ప శ్చిమ సీటును కేటాయించడం బాబుకే సాధ్యమైంది. తరచూ ఇంఛార్జిల మార్పుతో ఏమార్పు పశ్చిమలో సంస్థాగతంగా పార్టీ బలపడక పోవడానికి, నిలకడగా ఏ ఒక్కరికీ నాయకత్వాన్ని అప్పగించక పోవడానికి.. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం బాబుకు లేకపోవడమే. కూటమి కట్టినప్పుడల్లా ప శ్చిమ సీటును ఇతరులకు కేటాయించడం బాబుకు పరిపాటి. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలతో పాటు పోటీ చేసి ఓడిన బీసీలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా (దూదేకుల), మైనార్టీ వర్గానికి చెందిన జలీల్ఖాన్, ఆయన కూతురు షబనా ఖాతూన్, మొహమ్మద్ ఫతావుల్లా, ఎంఎస్ బేగ్ తదితర నాయకులు టీడీపీ నుంచి ఉన్నారు. వీరిలో ఎవరికి వారికి నియోజకవర్గ ఇంఛార్జి స్థాయి నీదే అనడం, ఆ తర్వాత కొంత కాలానికి పక్కన పెట్టేయడం చంద్రబాబుకు ఇక్కడ చెల్లుబాటయ్యింది. ఎంపీ కేశినేని శ్రీనివాస్ను అడ్డుగా పెట్టి.. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ను దాదాపు రెండన్నరేళ్లకు పైగా ప శ్చిమ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగిస్తూ అదే ప్రాంతానికి చెందిన బుద్ధా వెంకన్న, జలీల్ఖాన్, నాగుల్మీరా, ఫతావుల్లా తదితరులను పక్కన పెట్టుకుని వారి చేతనే కేశినేనికి వ్యతిరేకంగా వ్యవహరింపజేయడం బాబుకే చెల్లిందని నగర నేతల ఏకాభిప్రాయం. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రచారమప్పుడు నగరమంతా నవ్వుకునేలా ముఖ్య నాయకులను వీధుల్లోకి చేర్చి తిట్ల దండకాలను కొనసాగించడం కొసమెరుపు. ఒకే ఎత్తుగడతో అందర్నీ చిత్తు చేయడమనేది బాబు నైజమని ఆ పార్టీలోని సీనియర్లు వల్లెవేసే మాట. పవన్ చేత పోతినను... జనసేన కోసం ఏళ్ల తరబడి పనిచేసిన, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి 22,367 ఓట్లు పొందిన బీసీ వర్గానికి చెందిన పోతిన వెంకట మహే‹Ùను సుజనా చౌదరి సీటు కోసం తన రాజకీయ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబు పొడిపించేశాడని స్థానికంగా వాడ వాడ కోడైకూస్తోంది. చివరి నిమిషం వరకు సీటు ఆశించి మోసపోయిన పోతిన, జనసేనను వీడి వైఎస్సాఆర్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి కోటీశ్వరుడైనంత మాత్రాన బీసీలు డబ్బులకు అమ్ముడుపోతారని అనుకోవడం పొరపాటని పోతిన బాహాటంగానే ధ్వజమెత్తారు. ‘ధనికుడైనందున చౌదరిని బీజేపీ అభ్యర్థిగా తాము అంగీకరిస్తామని మా అధినేత అనుకుని ఉండొచ్చు. నోట్లతో ఓటర్లను, భారీ బేరసారాలతో మమ్మల్ని లొంగదీసుకోవచ్చనే అంచనాకు వచ్చి ఉండొచ్చు. సమకాలీన రాజకీయాల్లోని లోతుపాతులు మాకూ తెలిసొచ్చా యి. పెత్తందారు పచ్చనోట్లకు పేదలు, మాబోటి నాయకులందరూ లొంగి పోతారనుకోవడం పొరపాటని ‘పెద్దలు’ గ్రహించేలా గుణపాఠం నేర్పుతాం’ అని టీడీపీ, జనసేనల్లోని బీసీ, మైనార్టీల నేతలు చెబుతున్నారు. ‘వాళ్లు చేయాల్సింది చేశారు.. మేం చేయగలిగింది చేసి చూపిస్తాం’ అని వేర్వేరుగా ‘సాక్షి’తో వారు మనసులో మాట వెలిబుచ్చారు. సుజనా మాటకు నాని అడ్డుచెప్పరనే.. బీజేపీలోకి సుజనాను పంపింది, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప శ్చిమ సీటును కేటాయించిందీ బాబు అనేది జనమెరిగిన సత్యం. పొత్తు కుదరక ముందు వరకు.. సుజనా చౌదరి విజయవాడ లోక్సభ అభ్యర్థి అని పచ్చమీడియా, సోషల్ మీడియా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. సుజనా, కేశినేనిల మధ్య సాన్నిహిత్యం మెండుగా ఉన్నందున, చౌదరి మాటను నాని జవదాటరనేది బాబు నమ్మకం. బహుశా ఆ దృష్ట్యానే కేశినేనిని పశ్చిమ ఇంఛార్జిగా కొనసాగిస్తూ బీసీలు, మైనార్టీలను దూరంచేసే ప్రణాళికను బాబు అమలు పరిచారు. కాకపోతే ఊహించని రీతిలో బాబు ఎత్తులను చిత్తు చేస్తూ నాని టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019