breaking news
-
జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని ముజఫర్ నగర్ సమీపంలోని జీలం నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయంలో జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన పడవలో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో ప్రవాహం అధికంగా ఉండడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
కుదిరిన ఒప్పందం.. చెరో మూడు సీట్లలో కాంగ్రెస్, ఎన్సీ పోటీ
శ్రీనగర్: రానున్న లోక్సభ ఎన్నికలల్లో జమ్ముకశ్మీర్, లడఖ్లో కలిసి పోటీచేయనున్నట్లు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలలైన ఈ రెండు పార్టీల మధ్య తాజాగా సీట్ల ఒప్పందం ఖరారైంది. చెరో మూడు స్థానాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. ఉదంపూర్, జమ్ము, లడఖ్ లోక్సభ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడనున్నారు. అనంత్నాగ్, బారాముల్లా, శ్రీనగర్ లోక్సభ స్థానాల నుంచి ఎన్సీ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, సల్మాన్ ఖుర్షీద్తో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా సీటు షేరింగ్ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పటికే కశ్మీర్లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అనంత్నాగ్ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్సీ అభ్యర్థితోపాటు గులాం నబీ ఆజాద్తో ముఫ్తీ తలపడనున్నారు. చదవండి: టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు -
ఇప్పుడవి రాళ్లు విసిరే చేతులు కాదు
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి.ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రోఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్.ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు.యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమిప్రోఫెషనల్ స్టోన్ పెల్టర్ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ్రపోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలి ప్రోఫెషనల్ ఫిమేల్ ఫుట్బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మాప్రాంంతం నుంచి ఫుట్బాల్లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్లో ఆడాను. గోల్ కీపర్గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మాప్రాంంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. -
జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్లోగా ఎన్నికలు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ప్రత్యేక సైనిక దళాల చట్టాన్ని ఉపసంహరించుకునే దిశగా కేంద్రం యోచిస్తుంది. జమ్మూలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బలగాలను ఉపసంహరించుకొని శాంతిభద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులకే అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. గతంలో జమ్మూకశ్మీర్ పోలీసులపై నమ్మకం ఉండేది కాదని కానీ ప్రస్తుతం వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అనేక ఆపరేషన్లను లీడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జమ్మూలో అమలులో ఉన్న AFSPAను.. ఈశాన్య రాష్ట్రాల్లోని 70% ప్రాంతాల్లో తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనేక సంస్థలు, వివిధ వ్యక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సెప్టెంబర్లోపు జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అమిత్షా చెప్పారు. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, దానిని నెరవేరుస్తారని తెలిపారు. అయితే ఈ ప్రజాస్వామ్యం కేవలం మూడు కుటుంబాలకే పరిమితం కాదని.. ప్రజల ప్రజాస్వామ్యమని అన్నారు. ఇదిలా ఉండా జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సెప్టెంబర్లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా ఏఎఫ్ఎస్పీఏ చట్టం కేంద్ర సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల నిర్వహణలో భాగంగా కేంద్ర బలగాలకు శోధనలు చేపట్టడానికి, అరెస్టులు, అవసరమైతే కాల్పులు చేపట్టడానికి ఈ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తోంది. సాయుధ బలగాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. -
సగం టార్గెట్ ఇవే.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?
దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికల కాక మొదలైంది. వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకుని హాట్రిక్ కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటే ఈసారి ఎలాగైనా ఎన్డీఏ కూటమి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ సహా ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కువ లోక్సభ సీట్లు ఏ కూటమి గెలుచుకుంటే ఆ కూటమికే అధికారం ఖాయమని చెప్పవచ్చు. ఉత్తర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్లో 80 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 1, బీజేపీ 62, ఎస్పీ 5, ఇతరులు 12 సీట్లు గెలుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్, మాయావతి కీలక నేతలు. వారణాసీ, రాయ్బరేలి, మైన్పురీ కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కుల సమీకరణాలు, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. బిహార్ బిహార్లో 40 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 39 స్థానాలను, యూపీఏ 1 సీటు గెలుచుకున్నాయి. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ మోదీ, తేజస్వీ యాదవ్ కీలక నేతలు. హాజీపూర్, పట్నా సాహిబ్, పాటలీపుత్ర కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, హిందూత్వ వాదం, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. రాజస్థాన్ రాజస్థాన్లో 25 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 25 స్థానాలనూ ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భజన్లాల్ శర్మ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ కీలక నేతలు. జోధ్పూర్, కోటా-బూందీ కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, రైతుల సమస్యలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. పంజాబ్ పంజాబ్లో 13 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 8 స్థానాలు, ఎన్డీఏ కూటమి 4, ఆప్ 1 సీటు గెలుచుకున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భగవంత్మాన్, సుఖ్బీర్సింగ్ బాదల్, సునీళ జాఖడ్ కీలక నేతలు. అమృత్సర్, గురుదాస్పుర్ కీలక నియోజకవర్గాలు. రైతు సమస్యలు, శాంతి భద్రతలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హరియాణా హరియాణాలో 10 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. మనోహర్లాల్ ఖట్టర్, నాయబ్సింగ్ సైనీ, భూపీందర్ హుడా, కుమారి శెల్జా, ఓంప్రకాశ్ చౌతాలా కీలక నేతలు. రోహ్తక్, కురుక్షేత్ర కీలక నియోజకవర్గాలు. రైతుల సమస్యలు, హిందూత్వ వాదం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఢిల్లీ ఢిల్లీలో 7 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 7 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్, వీరేందర్ సచ్దేవ, అర్విందర్ సింగ్ కీలక నేతలు. న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ కీలక నియోజకవర్గాలు. సీఏఏ, ఆప్-కాంగ్రెస్ జట్టు కట్టడం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో 5 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 5 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. పుష్కర్సింగ్ ధామీ, కరణ్ మాహరా కీలక నేతలు. హరిద్వార్, నైనిటాల్-ఉద్దమ్ సింగ్ నగర్ కీలక నియోజకవర్గాలు. యూసీసీ, నిరుద్యోగం, మహిళలపై నేరాల పెరుగుదల ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 4 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 68 స్థానాలు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. సుఖ్విందర్ సింగ్ సుఖ్ఖూ, రాజీవ్ బిందల్ కీలక నేతలు. హమీర్పుర్, మండి కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్లో 5 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 2 స్థానాలు, నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకున్నాయి. భారతీయ జనతా పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కీలక నేతలు. ఆర్టికల్ 370 రద్దు, తగ్గుతున్న ఉగ్రవాద ఘటనలే ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇంకా కొలిక్కిరాకపోవడంతో అధికారికంగా ఇంకా అసెంబ్లీ సీట్ల సంఖ్య ఖరారు కాలేదు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019