breaking news
-
టైమ్ మ్యాగజైన్లో ఇద్దరు బారతీయ అమెరికన్లకు చోటు..!
టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలోని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ భార్య యులియా నవల్ని, ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో నాయకుల విభాగంలో భారత సంతతికి చెందిన యూఎస్ అధికారి జిగర్ షా, ఇటాలియాన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహ్మది వంటి వారు కూడా ఉన్నారు. ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ నాయకులు, ఆదర్శవంతమైన వ్యక్తులు, ఆయా రంగాల్లో ప్రావీణ్యం గల వారుగా వర్గీకరించి మరీ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక రష్యా ప్రతిపక్ష నాయకుడు భార్య యులియా తన భర్త మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు. తన భర్త అలెక్సి ఉనికిని సజీవంగా ఉంచేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇక భారతీయ అమెరికన్ అజయ్ బంగా గతేడాది ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధికి నాయకత్వం వహించిన తొలి భారత సంతతి అమెరికన్గా చారిత్రతక ఘట్టాన్ని ఆవిష్కరించారు. బంగా ఐదేళ్ల కాలానికి 14వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ జాబితాలో మరో భారతీయ అమెరికన్ జిగర్ షా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఆఫీస్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ స్వచ్ఛమైన మౌలిక సదుపాయాలు, ఇంధన కార్యక్రమాల కోసం పబ్లిక్ ఫండ్లో దాదాపు వంద బిలియన్ డాలర్లను పర్యవేక్షిస్తుంది. అలాగే నాయకుల జాబితాలో ఉన్న అగ్ర రాజకీయ నాయకులలో టాలియన్ ప్రధాని జార్జియా మెలోని ఒకరు. 47 ఏళ్ల మెలోని 2022లో అధికారంలోకి వచ్చి ఇటలీకి తొలి మహిళ నాయకురాలయ్యింది. ఆమెకు దేశంలో భారీగా మద్దతు ఉండటం విశేషం. ఇక 51 ఏళ్ల నర్గేస్ మొహమ్మది ఇరాన్ మానవహక్కుల కోసం ఆమె అలసిపోని న్యాయవాదానికి గుర్తుగా 2023 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. దీని గురించి ఆమె గత ఇరవై ఏళ్లులో ఎన్నో సార్లు జైలుల పాలయ్యింది. ఇప్పటికీ టెహ్రాన్లో ఎవిన్ జైలులో నిర్బంధింపబడి ఉంది. ఇక ఈ టైమ్స్ ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ఈ జాబితాలో రెజ్లర్ సాక్షి మాలిక్ , సత్య నాదెళ్లకు కూడా చోటు దక్కించుకున్నారు. (చదవండి: సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..) -
సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..
ఇటీవల సోషల్ మీడియా పిచ్చితే యువత చేసే పనులకు అంతుపొంతు లేకుండా పోతోంది. ఇలాంటి పిచ్చి ఫీట్లతో కొందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే ఏకంగా సొంత కొడుకుపై పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి సెలబ్రెటీ అయిపోవాలనుకున్నాడు. నెలల పసికందు అని కూడా చూడకుండా అతడు చేసిన దారుణ కృత్యాలకు బలైపోయింది ఆ చిన్ని ప్రాణం. చివరికీ ఈ విషయం బయటపడి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ అతడేం చేశాడంటే..? రష్యా కు చెందిన మాక్సిమ్ లైయూటీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. పచ్చి కూరగాయలతో ప్రత్యేక ఆహారం తినడం గురించి చెబుతూ ఎక్కువ మంది యూజర్లను పొందే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తను తీసుకునే ఆహారం, వాటి ద్వారా సమకూరే శక్తి నిజమైనదని నమ్మడలికి ఫేమస్ అవ్వాలనుకునేవాడు. ఆ నేపథ్యంలోనే తన సొంత కొడుకు పైనే ఇలాంటి చెత్త ప్రయోగాలే చేశాడు. నిజానికి ఒక మనిషి ఆహారం తీసుకుంటేనే బతుకగలడు. కానీ ఈ దుర్మార్గుడు సూర్యరశ్మితో కూడా ఓ మనిషి బతకగలడిని నిరుపించాలనేది మాక్సిమ్ ఆలోచన. అస్సలు ఇది సాధ్యమా..? సూర్యుడి ప్రతాపానికి చెట్టు చేమలు విలవిల్లాడతాయి. సూర్యుడి శక్తి మనకు ఆకలిపుట్టించేలా చేసి చైతన్యవంతం చేస్తుంది. అంతే దానితో బతకాలనుకోవడం అత్యంత పిచ్చి ఆలోచన. కానీ మాక్సిమా తన కొడుకు నెలల పనికందుపై ఈ ప్రయోగం చేశాడు. భార్య ఎంతలా చెప్పిన వినలేదు. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నారీతీలో మూర్ఖంగా ప్రవర్తించాడు. బిడ్డకు పాలు ఇవ్వకుండా సూర్మరశ్చిలోనే ఉంచేవాడు. పాపం ఆ భార్య అతడికి తెలియకుండా బిడ్డకు పాలు ఇస్తుండేది. రోజు రోజుకి బిడ్డ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. మరోవైపు ఇతడి ఆగడాలు శృతిమించాయి. చల్లటి నీళ్లల్లో బిడ్డను ముంచి ఎండలో ఉంచడం వంటి పిచ్చి పనులు చేసేవాడు. గుక్కపెట్టి ఏడుస్తున్న కంగకుండా ఆకలిని అధిగమించేలా శక్తిని పొందుతున్నాడని భార్యకు ఏవేవో పిచ్చి కబుర్లు చెప్పేవారు. చివరికీ బాబు ఆరోగ్యం మరింతగా దిగజారిపోయింది. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చేశాడు. దీంతో భార్య ఇతర కుటుంబ సభ్యులు గట్టిగా ఒత్తిడి తేవడంతో బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అనుమతించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. మాక్సిమ్ పిచ్చి ప్రయోగాలు ఆ బిడ్డ ప్రాణం బలైపోయింది. వైద్య పరిక్షల్లో ఆ పసికందు నిమోనియా సహా పలు సమస్యల వల్ల చనిపోయినట్లు వెల్లడయ్యింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మాక్సిమ్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోలేదని బుకాయించే యత్నం చేశాడు. అయితే అతడి భార్య ఈ బాధను ఓర్చుకోలేక పోలీసులు ముందు జరిగిన విషయం అంతా చెప్పేసింది. దీంతో కోర్టు జరిగిన నేరంలో తల్లి పాత్ర కూడా ఉందని భావించి ఇరువురకి జైలు శిక్ష విధించింది. మాక్సిమ్కు ఎనిమిదేళ్లు జైలు శిక్ష పడగా, అతడి భార్యకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. విచిత్రమేమిటంటే తను చేసిన తప్పును ఒప్పుకోకుండా తన బిడ్డ బలమైన వ్యక్తిగా మారితే చూడలన్నాదే తన ఉద్దేశ్యమని వాదిస్తూనే ఉన్నాడు. అతడి వాదనతో కోర్టు ఏకభవించ లేదు. ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే..సోషల్ మీడియాలో పచ్చి కూరగాయాలతో మంచి ఆరోగ్యం అని చెప్పే మాక్సిమ్ కస్టడీలో ఉన్నప్పుడూ న్యూడిల్స్, మాంసాహారం అడిగేవాడట. దయచేసి ఇలాంటి పిచ్చి పనులతో సోషల్ మీడియా ఫేమ్ రాదు కదా..! ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. నాన్వెజ్ తినేవాళ్లకు వ్రతాలు, పూజలు పేరుతో నాన్వెజ్కి దూరం ఉంటేనే అబ్బా నాలుకు చప్పబడిపోయినా ఫీల్ వచ్చేస్తుంది. అలాంటిది పూర్తిగా శాకాహారం అంటే చాలా కష్టం. ఇది వ్యక్తిగతంగా రావాల్సిన మార్పు. అనుకున్నదే తడువుగా చేసేయడం అన్నది సాధ్యం కాదు. అందువల్ల సోషల్ మీడియా లేదా మరేదైనా క్రేజ్ కోసం అయినా ఏదైనా సాహసం చేయాలనుకుంటే సాధ్యసాధ్యాలు గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకు సాగండి. -
Angry Rantman Death: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. గుండె పగిలిందంటున్న ఫ్యాన్స్
#Angry Rantman ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్,యూట్యూబర్ అబ్రదీప్ సాహా (Abhradeep Saha) అలియాస్ యాంగ్రీ రాంట్మ్యాన్ (Angry Rantman)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాంట్మ్యాన్ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. దీంతో అభిమానుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. చిన్న వయసులోనే వెళ్లి పోయాడంటూ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. కర్ణాటకు చెందిన అబ్రదీప్ సాహా సోషల్ మీడియాలో రాంట్ మ్యాన్ పేరుతో చాలా పాపులర్. సమాజంలో ప్రతి రోజూ జరిగే అంశాలపై తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఫాలోయర్లు ఆకట్టుకునేవాడు. అతికొద్ది సమయంలోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలి అతని యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ ప్రకారం యాంగ్రీ రాంట్మ్యాన్ గత నెలలో పెద్ద ఆపరేషన్ జరిగింది. లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్మీద ఉన్నాడని, తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను కోరుతూ ఆ తరువాతి అప్డేట్ ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు తెలుస్తోంది. 2017, ఆగస్టు 18 లో అబ్రదీప్ తన YouTube ఛానెల్ని “నేను అన్నాబెల్లె మూవీని ఎందుకు చూడను!!!!!!” , అలాగే ‘ది కన్జూరింగ్’ చూసిన తర్వాత ఇకపై హారర్ చిత్రాలను చూడడానికి చాలా భయపడ్డానంటూ రివ్యూ వీడియోలు చేశాడు. తనదైన హావభావాలతో ఫన్నీ రివ్యూలతో నెట్టింట్ హల్ చల్ చేసేవాడు. ఈ క్రమంలో 2018 డిసెంబరులో కేజీఎఫ్ సినిమా రివ్యూతో మరింత ట్రెండింగ్లోకి వచ్చాడు. కేవలం 27 ఏళ్ల వయసులో అకాల మరణంతో మరోసారి ట్రెండింగ్లో నిలవడం విషాదం. యాంగ్రీ రాంట్ మ్యాన్ హ్యాష్ ట్యాగ్ వైరలవుతోంది. Gonna miss pearls of wisdom like these. #AngryRantman pic.twitter.com/wQhnNUGC5G — Ritesh (@Szoboszlai8_) April 17, 2024 -
Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్
ఇటీవల ప్రధాని మోదీ దేశంలో టాప్ ఫాలోయింగ్ ఉన్న ఏడుగురు గేమర్స్ను కలిశారు. వారిలో ఒక్కతే అమ్మాయి పాయల్ ధారే. గేమ్స్ను ఆడుతూ తన వ్యాఖ్యానం వినిపిస్తూ ‘లైవ్ స్ట్రీమింగ్’ ద్వారా 35 లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకున్న పాయల్ పురుషుల ఆధిపత్య రంగమైన గేమింగ్లో తనదైన స్థానం పొందారు. పాయల్ పరిచయం. వీడియో గేమ్స్ అనగానే మూడు విధాలైన భాగస్వాములు ప్రస్తావనకు వస్తారు. 1. గేమ్స్ ఆడేవాళ్లు 2. చలామణిలో ఉన్న గేమ్స్ను ఆడుతూ తమ వ్యాఖ్యానం వినిపిస్తూ (లైవ్ స్ట్రీమింగ్) వీడియోలు చేసేవారు, 3. గేమ్స్ తయారు చేసేవారు. మన దేశంలో 2014 తర్వాత సెల్ఫోన్ల అందుబాటు పెరిగాక గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే వారితోపాటు గేమ్స్ చుట్టూ షోస్ చేసేవారి (గేమర్స్) పలుకుబడి కూడా పెరిగింది. వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్గా మారారు. ఇక ఒరిజినల్గా మన దేశంలో గేమ్స్ తయారు చేసేవారు పై రెండు వర్గాలతో పోల్చితే తక్కువ. ఇటీవల ప్రధాని మోడి గేమ్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిన 7 మంది గేమర్స్ను న్యూఢిల్లీలో కలిసి వారితో మాటామంతి జరిపారు. తీర్థ్ మిత్ర, అనిమేష్ అగర్వాల్, అన్షు బిస్త్, నమన్ మాధుర్, మిథిలేష్, గణేష్ గంగాధర్ అనే యువ గేమర్లతోపాటు వీరితో పాల్గొన్న ఒకే ఒక మహిళా గేమర్ పాయల్ ధారే. 15000 మంది గేమర్స్ మన దేశంలో 15 వేల మంది గేమర్స్ ఉన్నారు. అంటే వీడియో గేమ్స్ను ఆడుతూ వాటిని వివరిస్తూ వాటిపై వ్యాఖ్యానం చేస్తూ ఇన్స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా పాపులర్ అయిన వారు. ఇలాంటి వారిలో అత్యంత ఆదరణ పొందిన వారికి లక్షల మంది ఫాలోయెర్స్ ఉంటారు. ఇదంతా గేమింగ్ కమ్యూనిటీ. గేమ్స్ చుట్టూ వీడియోలు చేసేందుకే మన దేశంలో దాదాపు 1500 స్టుడియో లు కూడా ఉన్నాయి. గేమ్స్ను స్వయంగా తయారు చేసే సాంకేతిక నైపుణ్యం లేని వారు కూడా ఉన్న గేమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. పాయల్ ధారే కూడా అలా పేరు పొందింది. సంవత్సరానికి 5 కోట్లు 23 ఏళ్ల పాయల్ ధారేకు ‘పాయల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఈ చానల్లో ఆమె వీడియో గేమ్స్ ఆడుతూ తన సరదా వ్యాఖ్యానంతో వీడియోలు చేసి పెడుతుంటుంది. మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న గేమ్స్ను పరిచయం చేయడం లేదా ఆడటం వల్ల, సరదా వ్యాఖ్యానం చేయడం వల్ల గేమ్స్ అంటే ఇష్టం ఉన్న యువత అంతా ఈమె వీడియోలు ఫాలో అవుతుంటారు. దానివల్ల ఆమెకు సంవత్సరానికి రూ. 5 కోట్ల ఆదాయం అందుతోందని ఒక అంచనా. ఆశ్చర్యం ఏమంటే ఇంటర్ చదివే వరకూ కూడా పాయల్కు సెల్ఫోన్ లేదు. గేమ్స్ తెలియదు. పల్లెటూరి అమ్మాయి పాయల్ ధారేది మధ్యప్రదేశ్లోని చింద్వారా అనే చిన్న పల్లె. ఫోన్ కూడా చూడని ఆ అమ్మాయి 2021లో లాక్డౌన్ సమయంలో గేమ్స్ గురించి తెలుసుకుంది. ఆ సంవత్సరమే తన వీడియోలు రిలీజ్ చేయసాగింది. 2023 నాటికి అంటే కేవలం రెండేళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ పొందింది. ‘మా అమ్మ నేను గేమింగ్లోకి వెళతానంటే భయపడింది. మా నాన్న ప్రోత్సహించారు. వీడియో గేమింగ్లో ఆడపిల్లలకు అంత సులువుగా ప్రవేశం లభించదు’ అంటుంది పాయల్. ఇప్పుడు తనను చూసి కనీసం 200 మంది అమ్మాయిలు గేమింగ్లోకి వచ్చారని తెలిపింది. మంచి మార్గం కోసం ‘గేమ్స్ను తప్పించలేము. యువతకు మంచి లక్ష్యాలను ఏర్పరడానికి వీటిని మీరు ఉపయోగిస్తూ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి’ అని ప్రధాని గేమర్స్ను కోరారు. ‘మన పంచతంత్రం వంటి కథలను గేమ్స్కు వాడండి. పర్యావరణ సమస్యలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలతో గేమ్స్ తయారు చేస్తే ఇండియన్ సంస్కృతి ఉన్న గేమ్స్ తయారు చేస్తే ఆటకు ఆట, బోధనకు బోధన సమకూరుతాయి’ అని ప్రధాని అన్నారు. చదువుకు తగిన సమయం ఇస్తూ, ఒకవేళ ఏదైనా ఉపాధి ఉంటే ఆ ఉపాధి, ఉద్యోగాల్లో ఉంటూ జీవనానికి తగు గ్యారంటీ ఉన్నప్పుడు గేమింగ్లోకి వచ్చి ఆ రంగంలో నిలదొక్కుకోవాలని గేమర్స్కు సూచించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నన్ను వాడుకుని వదిలేస్తే అట్టర్ ఫ్లాపే అవుతుంది: నటి
అన్నీ అనుకున్నట్లుగా జరగవు.. ఇది సినిమాకూ వర్తిస్తుంది. సినిమా మొదలుపెట్టినప్పుడు ఎన్నో పాత్రలు రాసుకుంటారు, షూటింగ్ చేస్తారు. తీరా ఎడిటింగ్లో సగం కంటే ఎక్కువ పాత్రలు డిలీట్ చేస్తారు. మరికొన్నింటిని నిమిషాల నుంచి సెకన్లకు కుదిపేస్తారు. అలా ఇటీవలే డీజే టిల్లులో శ్రీసత్యకు అన్యాయం చేశారు. తనతో డైలాగులు చెప్పించి మరీ ఎడిటింగ్లో అదంతా తీసేయించారు. అందరి టైం వేస్ట్ ఇప్పుడు తనకూ అలాంటి అన్యాయమే జరిగిందంటోంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆశా బోరా. నాలాంటిదాన్ని పిలిచి మరీ స్టఫ్లా వాడుకుని వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ కాకపోతే ఇంకేం అవుతుంది.. సీన్లు, సాంగ్సు, ఫ్యామిలీ ఫంక్షన్లు.. ఇలా ప్రతిదాంట్లోనూ నేనే కనిపించానుగా.. అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేసింది. 'ఇంతోటిదానికి నా టైం వేస్ట్ చేసి, మీ టైం వేస్ట్ చేసుకున్నారు. ఈ పాత్ర నేనే చేయాలంటూ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరి నుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు అందరూ ఫోన్లు చేసి అనవసరంగా హంగామా చేశారు. ఆరోగ్యం బాలేకపోయినా.. ఉఫ్.. అయినా హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్టులకు కరువొచ్చిందా? లేక సోషల్ మీడియా ఫేస్లను ఉపయోగించుకోవాలని చేశారో మరి! మా పనులు మానుకొని, కుటుంబాన్ని వదిలేసి వచ్చి ఒక రోజంతా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి, ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పిన మాట కోసం షూటింగ్కు వచ్చాను. యాంటి బయాటిక్స్ వేసుకుని, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నిలబడి ఉంటే కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు. డైలాగ్స్ ఉంచినా బాగుండేది ఇస్తామన్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా, ట్రావెలింగ్ ఖర్చులు చెల్లించకుండా, హోటల్లో బస చేసేందుకు డబ్బులివ్వకుండా, మాకేంటి సంబంధం అన్నట్లు సరిగా స్పందించనుకూడా లేదు. వాహ్.. గ్రేట్! కనీసం విజయ్ దేవరకొండతో నేను మాట్లాడిన సంభాషణలు ఉంచినా కాస్త సంతృప్తి ఉండేదేమో! మీ ఎడిటింగ్ అలా ఉంది. నా కళ్లు తెరిపించినందుకు థ్యాంక్స్. ఇలా ప్రశ్నిస్తే కాంట్రవర్సీ అని ట్యాగ్ లైన్ ఇస్తారు.. ఇస్తారేంటి? ఇచ్చేశారు కూడా!' అంటూ ఇన్స్టాగ్రామ్లో ఫ్యామిలీ స్టార్ టీమ్పై విమర్శలు గుప్పించింది. View this post on Instagram A post shared by Asha Borra (@asha.borra) చదవండి: ‘ఫ్యామిలీ స్టార్’బంపరాఫర్.. మీ ఇంటికే విజయ్ దేవరకొండ!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019