breaking news
-
Lok sabha elections 2024: కాంగ్రెస్లో ప్రియాంకం
ప్రియాంకా గాంధీ వాద్రా. తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచంపైనే కోపం పెంచుకున్న అమ్మాయి. ఎదిగే కొద్దీ క్షమాగుణం విలువను తెలుసుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియాను కాంగ్రెస్ నేతలంతా కోరితే తననూ హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువతి. ఇప్పుడదే కాంగ్రెస్కు ట్రబుల్ షూటర్గా మారారు. అచ్చం నానమ్మ ఇందిర పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఆమె పద్నాలుగో ఏట నుంచే మొదలైంది! తనకు రాజకీయాలు సరిపడవని మొదట్లో గట్టిగా నమ్మారామె. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. గాంధీల కంచుకోటైన యూపీలోని రాయ్బరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ జీవితం ప్రియాంక తొలుత క్రియాశీల రాజకీయాల్లో అంతగా పాల్గొనలేదు. తల్లి, సోదరుల లోక్సభ నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీలకు వెళ్లేవారు. 2004 లోక్సభ ఎన్నికలలో సోనియాకు ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకుని సీట్ల కేటాయింపులు, అంతర్గత పోరును పరిష్కరించడం దాకా అన్నీ తానై వ్యవహరించారు. 2019లో యూఈ తూర్పు భాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత యూపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. మహిళలకు 40 శాతం టికెట్ల డిమాండ్తో ‘లడ్కీ హూ, లడ్ సక్తీ హూ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చవిచూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞత తీసుకొచి్చందంటారు ప్రియాంక. అయితే 2022 హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. హిందీ సాహిత్యం.. బౌద్ధం... ప్రియాంక 1972 జనవరి 12న జని్మంచారు. డెహ్రాడూన్ వెల్హామ్ బాలికల పాఠశాలలో చదివారు. తర్వాత భద్రతా కారణాలతో రాహుల్తో పాటు ఢిల్లీలోని డే స్కూల్కు మారారు. ఇందిర హత్యానంతరం ఇద్దరూ ఇంట్లోనే చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ చేశారు. నానమ్మను అత్యంత శక్తివంతమైన మహిళగా చెబుతారు. బాల్యంలో నానమ్మతో రాహులే ఎక్కువగా గడపడం చూసి ఈర‡్ష్య పడేదాన్నంటూ నవ్వేస్తారు. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్తో గడిచింది. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ప్రేమ్చంద్ సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఖాళీ దొరికితే పుస్తకాలు పట్టుకుంటారు. బౌద్ధ తత్వశా్రస్తాన్ని ఆచరిస్తారు. 1999లో రాజకీయాల్లోకి రావాల్సి వచి్చనప్పుడు పది రోజులపాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా! -
Rajasthan Elections 2023: ఐదేళ్లుగా పరస్పరం రనౌట్కు కుట్రలు
జైపూర్: దేశమంతటా ఎక్కడ చూసినా క్రికెట్ ప్రపంచకప్ ముచ్చట్లే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీ తీరును క్రికెట్ టీమ్తో పోల్చారు. రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరినొకరు రనౌట్ చేసుకొనేందుకు గత ఐదేళ్లుగా కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. తద్వారా ఆ పారీ్టలో నేతల మధ్య రగులుతున్న అంతర్గత విభేదాలను, సీఎం అశోక్ గహ్లోత్, సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరును ప్రస్తావించారు. వారు పరుగులు చేయడానికి బదులు, సొంత టీమ్లోని ప్రత్యర్థులను పడగొట్టాలని చూశారని చెప్పారు. వారి టీమ్ సరిగ్గా లేనప్పుడు ఇక ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆదివారం రాజస్తాన్లోని చురు జిల్లాలోని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు అనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని, దాని వల్ల దేశం భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరు వల్ల దేశంలో యువతకు ఎదిగే అవకాశాలు రాలేదని చెప్పారు. పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం.. రాజస్తాన్లో బీజేపీకి అధికారం అప్పగిస్తే అవినీతిపరుల భరతం పడతామని, వేగవంతమైన అభివృద్ధికి శ్రీకారం చుడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్కు ఎంత దూరంగా ఉంటే రాజస్తాన్కు అంత మేలు జరుగుతుందని, భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ప్రజలకు సూచించారు. వెలుతురికి, చీకటికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే మంచికి, కాంగ్రెస్కు మధ్య కూడా ఉందని అన్నారు. రాష్ట్రంలో జల జీవన్ మిషన్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి ఉద్దేశించిన పథకంలోనూ నిధులు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, అభివృద్ధి అనేవి పరస్పరం శత్రువులని, ఆ శత్రుత్వం ఎప్పటికీ కొనసాగుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పేపర్ లీక్ మాఫియా యువత భవిష్యత్తును లక్షలాది రూపాయలకు అమ్మేసిందని ధ్వజమెత్తారు. ఎరువుల కుంభకోణంతో రైతులను విచ్చలవిడిగా లూటీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ రాజస్తాన్లో కాంగ్రెస్ పాలనలో ధరలు భారీగా పెరిగిపోయానని మోదీ గుర్తుచేశారు. హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.13 అధికంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరలను సమీక్షిస్తామని, ప్రజలకు ఊరట కలి్పస్తామని వెల్లడించారు. కొన్నేళ్లలో అన్ని రంగాల్లోనూ భారత్ అద్భుతాలు చేసిందన్నారు. ఎటు చూసినా నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ ఖజానా నింపుతున్న గహ్లోత్
భరత్పూర్(రాజస్తాన్): రాజస్తాన్ రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ అగ్రనేత అమిత్ షా విమర్శలు గుప్పించారు. శనివారం రాష్ట్రంలోని భరత్పూర్లో బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశంలో షా ప్రసంగించారు. ‘ ఓవైపు అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ అధిష్టానం ఖజానాను సీఎం గహ్లోత్ నింపేస్తుంటే మరోవైపు సరైన కారణం లేకుండానే సచిన్ పైలట్ ధర్నాకు కూర్చుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పైలట్ ఎంతగా చెమటోడ్చినా లాభం లేదు. ఎందుకంటే పార్టీ ఖజానాను నింపేస్తూ అధిష్టానం దృష్టిలో పైలట్ కంటే గెహ్లాట్ కొన్ని మెట్లు పైనే ఉన్నారు. రాష్ట్రాన్ని గెహ్లాట్ అవినీతి అడ్డాగా మార్చారు. రాష్ట్ర సొమ్మును లూటీ చేసి ఆ ధనంతో పార్టీ ఖాతా నింపుతున్నారు. దిగబోనని గహ్లోత్ సీఎం కుర్చీపై భీష్మించుకుని కూర్చున్నారు. ఈసారి సీఎం కుర్చీ నాదేనని పైలట్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. వీరిద్దరూ అనవసరంగా అధికారం కోసం పోరాడుతున్నారు. వాస్తవానికి ఈ దఫా అధికారంలోకి వచ్చేది బీజేపీ’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘ వారసత్వ రాజకీయాల కోసమే ఇన్నాళ్లూ గహ్లోత్ ప్రభుత్వం పనిచేసింది. కుల రాజకీయాలను రాజేసింది. బుజ్జగింపుల్లో టాప్ మార్కులు ఈ ప్రభుత్వానికే పడతాయి. రాష్ట్రంలో రెండు డజన్లకుపైగా పేపర్లు లీక్ అయ్యాయి. అయినా ఇంకా మీకు అధికారం కావాలా గహ్లోత్ జీ ? లీకేజీలో సెంచరీ కొడతారా ఏంటి ?. రాష్ట్ర ప్రజలకు మీరిక అక్కర్లేదు. ఈసారి మూడింట రెండొంతుల సీట్లు మావే. మొత్తం పాతిక ఎంపీ సీట్లూ గెల్చేది మేమే’ అని షా ధీమా వ్యక్తంచేశారు. ‘ ఇటీవలే రాహుల్ బాబా దేశమంతటా నడుస్తూ భారీ యాత్ర ముగించారు. కాంగ్రెస్కు లబ్ధి ఏమేరకు చేకూరుతుందని నన్ను పాత్రికేయులు అడిగారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందిగా’ అని షా అన్నారు. -
మోస్ట్ వాంటెడ్ అస్సాం ‘వీరప్పన్’ హతం
అతనొక తిరుగుబాటు సంఘానికి సీనియర్ నేత. ఆ గ్రూప్లో మిగిలిన ఏకైక సభ్యుడు కూడా. కానీ, భద్రతా దళాలకు కొన్నేళ్లుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పైగా గంధపు చెక్కల స్మగ్లింగ్తో ‘అస్సాం వీరప్పన్’గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. కానీ, అనూహ్యంగా నిర్జీవంగా అడవుల్లో దొరికాడు. దిస్పూర్: మంగిన్ ఖల్హౌ.. యునైటెడ్ పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్(యూపీఆర్ఎఫ్) కీలక నేత. గంధపు చెక్కల స్మగ్లింగ్తో అతనికి అస్సాం వీరప్పన్గా పేరొచ్చింది. అయితే ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని భద్రతా దళాలు అస్సాం దక్షిణ దిశగా కర్బి అడవుల్లో స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఏడాదిగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో యూపీఆర్ఎఫ్ సీనియర్లంతా చనిపోగా.. మంగిన్ మాత్రం దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. సొంతవాళ్ల చేతుల్లోనే? మంగిన్ది ఎన్కౌంటర్ కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అంతర్గత విభేధాలతో వాళ్లలో వాళ్లే కాల్చుకున్నారని, ఆ కాల్పుల్లోనే అతను చనిపోయాడని వెల్లడించారు. శనివారం, ఆదివారం మధ్య జరిగిన కాల్పుల్లో అతను చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుకీ కమ్యూనిటీకి చెందిన ప్రజలతో ఏర్పడిందే యూపీఆర్ఎఫ్. సింగ్హసన్ పర్వతాల గుండా స్థావరాల్ని ఏర్పరుచుకుని భద్రతా దళాలపై తరచూ దాడులు చేస్తున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్లో గ్రూప్ కమాండర్ మార్టిన్ గుయిటెను పోలీస్ కాల్పుల్లో మరణించగా.. శాంతి ఒప్పందానికి సిద్ధపడుతూ ప్రభుత్వానికి యూపీఆర్ఎఫ్ ఓ లేఖ కూడా రాసింది. కానీ, ఆ లొంగుబాటు ఆలస్యం అవుతూ వస్తుండగా.. ఈ మధ్యలో ఎదురుకాల్పుల్లో గ్రూప్ సభ్యులు చనిపోతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంగిన్కు, యువ సభ్యులకు మధ్య పొగసకపోవడమే అతని మరణానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మంగిన్ మరణంపై సంఘం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. -
33మంది మిలిటెంట్ల హతం
కాబూల్ : తాలిబన్ల మిలిటెంట్ల మధ్య గతవారం రోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో 33 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. తాలిబన్ అగ్రనేతలు మన్సూర్, రసూల్ మధ్య నెలకొన్న విభేదాలు కారణంగా మిలిటెంట్లు మరణించారని ఘజియా ప్రావిన్స్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. తాలిబన్ నేత ముల్లా అక్తర్ మొహమ్మద్ మన్సూర్ అనుయాయులకు, వ్యతిరేకులకు మధ్య ఘర్షణలు చెలరేగాయని వారు పేర్కొన్నారు. తూర్పు ఘజియా ప్రావిన్స్లోని నావాజిల్లాను ముల్లా వ్యతిరేక నేత మొహమ్మద్ రసూల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఇరువురి మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని తెలిపారు. ఈ పోరులో ఇరువర్గాలకు చెందిన సుమారు 33 మంది ఉగ్రవాదులు హత్యకు గురయ్యారన్నారు. చివరికి రసూల్ వర్గం పైచేయి సాధించిందని తెలిపారు. అయితే ఈ వార్తలను తాలిబన్ ప్రతినిధి జబిహుల్లాహ్ ముజాహిద్ ఖండించారు. ఇవన్నీ అవాస్తవ కథనాలని కొట్టి పారేశారు. నావా జిల్లాపై గత కొన్నాళ్ల కిత్రమే తాము పట్టు సాధించామని తెలిపారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019