breaking news
-
రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్ చేసుకోవడమా?
చెట్లను హగ్ చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా..?. అదీగాక ఇటీవల ఓ విదేశీ మహిళ చెట్టుని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. మళ్లీ ఇందేంట్రా బాబు అనుకుంటున్నారా..!. ఓ కంపెనీ దుస్సాహసం లేదా సోమ్ము చేసుకునే సరికొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు దీన్ని. ఆఖరికి సహజ సిద్ధమైన ప్రకృతిని కూడా ఇలా అమ్మకానికి పెట్టేస్తోందా అని ఆ కంపెనీపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ అంటే.. చికాగుగా, ఒత్తిడిగా ఉంటే అలా కాసేపు ఓ పార్కుకో వెళ్లి ప్రకృతిలో కాసేపు సేద తీరుతాం. లేదా ఆరుబయట కాసేపు ఆకాశానికేసి చూసి ఆహా ఈ ప్రకృతి అద్భుతాలు ఊహకే అందవు అని ఆనందపడతాం. దీనికి డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదు. ఈ భూమ్మీద జీవించే ప్రతి ఒక్కరి హక్కు ఇది. అదీగాక ఆరోగ నిపుణులు కూడా పచ్చని ప్రదేశాల్లో నిమగ్నమయ్యితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పదేపదే చెబుతుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఉండే ఉద్యానవనాలు ప్రజలకు ప్రకృతి ఒడిలో సేదతీరే చక్కటి ప్రదేశాలు. అంతేగాదు ఇలా ప్రకృతితో రమించడాన్ని జపాన్లో షిన్రిన్-యోకు అంటారు. దీన్ని 1982లో జపనీస్ వ్యవసాయ, అటవీ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ పేరుతో ప్రజలకు ఉచితంగా అటవీ ప్రాంతంలో గడపడం, కనెక్ట్ అవ్వడం వంటివి నేర్పిస్తుంది. దీని వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నది వారి నమ్మకం. అయితే ఇటీవల బెంగుళూరుకి చెందిన ఓ కంపెనీ అచ్చం అలాంటి కాన్సెప్ట్తో జస్ట్ రూ. 1500లతో గైడెడ్ ఫారెస్ట్ బాత్ అనుభవాలు నేర్పిస్తామంటూ ప్రకటన ఇవ్వడం వివాదాస్పదమయ్యింది. ఆ కంపెనీ చెట్టుని కౌగిలించుకుని వాటితో కనెక్ట్ అవ్వడం ఎలాగో నేర్పిస్తాం అంటూ ధర ప్రకటించడం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆఖరికి ప్రకృతిని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారా..? అని మండిపడుతున్నారు. ఇదేదో స్కామ్, అంటూ పోస్టులు పెట్టారు. ఇక్కడ చెట్టుని కౌగిలించుకుని వాటితో మమేకమవ్వడం వరకు బాగుంది. దీనికీ డబ్బులేం ఖర్చవ్వుతాయి. అదీ కూడా నేచర్కి ఉన్న పవర్. ఆ కంపెనీకి ఖర్చు పెట్టి చేసేదేం ఉంటుంది. వాలంటీర్గా గైడ్ చేయడమే సూచించడమే చేస్తే సరిపోయే దానికి ఇలా సొమ్ము చేసుకునే దుస్సాహాసానికి ఒడిగట్టడం అందరీకీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. సహిస్తే చక్కగా పీల్చే గాలిని కూడా సొమ్ము చేసుకుంటారు కొందరు ప్రబుద్ధులు అని తిట్టిపోస్తున్నారు ప్రజలు. (చదవండి: వారెవ్వా..నీరజ!.. మొత్తానికి సాధించింది..!) -
దేశ రాజధానిలో ఘనంగా ఈద్ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు వివిధ మసీదులలో నమాజ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు ముస్లింలు నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈద్ జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపూర్ మసీదు ఇమామ్లు చంద్రుని దర్శనాన్ని ధృవీకరించారు. చంద్రుడిని చూసిన తర్వాత ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఫతేపూర్ మసీదు షాహీ ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకర్రమ్ అహ్మద్.. ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశానికి శాంతి, సామరస్యం సమకూరేందుకు ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరారు. కాగా చంద్రుడు కనిపించినంతనే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా అభినందనల పరంపర మొదలైంది. ఫోన్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లింలు ఈద్ కోసం పెర్ఫ్యూమ్, క్యాప్స్, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పాత ఢిల్లీతో పాటు, జామియా నగర్, సీలంపూర్, జాఫ్రాబాద్, నిజాముద్దీన్ సహా ఇతర మార్కెట్లలో రద్దీ పెరిగింది. రాత్రంతా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈద్ వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. #WATCH | Delhi: Devotees gather at Jama Masjid to offer prayers, on the occasion of Eid-ul-Fitr. pic.twitter.com/Id3OsJDGxv — ANI (@ANI) April 11, 2024 -
ఆస్కార్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హగ్
-
సీరియల్స్ మేకర్స్కు షాక్.. ఇకపై ‘ఆ సీన్లు’ ఉంటే చర్యలు తప్పవు
ఇస్లామాబాద్: కాలం మారుతున్న కొద్ది ప్రతి రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మంచికి దారితీస్తే.. మరికొన్ని అతిని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ చూస్తే పైన చెప్పిన మాట నిజం అనిపిస్తుంది. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. ఇప్పుడది సీరియల్స్ కూడా అంటుకుంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సీరియల్స్ కూడా రోమాంటిక్ సీన్లు ప్రసారం అవుతున్నాయి. అయితే ఇక మీదట టీవీల్లో ప్రసారం అయ్యే సీరియల్స్లో కౌగిలించుకోవడం, రోమాన్స్ చేసే సన్నివేశాలు ప్రసారం చేయకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తాన్ ఎలాక్ట్రానిక్ మీడియా రెగ్యూలేటరి అథారటీ(పీఈఎంఆర్ఏ) ఉత్తుర్వులు జారీ చేసింది. సీరియల్స్లో ఇలాంటి సన్నివేశాలు బాగా పెరిగిపోయానని తమకు ఫిర్యాదులు వచ్చాయని పెమ్రా తెలిపింది. ఇలాంటి సన్నివేశాలు ప్రసారం చేసే సీరియల్స్ పాకిస్తాన్ సమాజానికి పూర్తి వ్యతిరేకం అని నోటిఫికేషన్లో పేర్కొంది. (చదవండి: సీరియల్ ప్రమోషన్లో కృతిశెట్టి.. రెమ్యునరేషన్ ఎంతంటే?) ఈ మేరకు ‘‘కౌగిలించుకోవడం, ఒకరినొకరు లాలించడం, వివాహేతర సంబంధాలు, పడకగది సన్నివేశాలు, భార్యభర్తల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు, అసభ్యకరంగా దుస్తులు ధరించడం వంటి సీన్లు ఇస్లామిక్ బోధనలు, పాకిస్తానీ సమాజం సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కిందకే వస్తుంది. కనుక ఇలాంటి సీరియల్స్ని ప్రసారం చేసే ముందు సదరు చానెల్స్ ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకుని.. అసభ్యతకు తావులేదని భావించిన తర్వాతే ప్రసారం చేయాలి’’ అని పెమ్రా తన నోటిఫికేషన్లో పేర్కొంది. (చదవండి: సన్నిహిత సన్నివేశాల రూపశిల్పి) పెమ్రా నోటిఫికేషన్పై లీగల్, హ్యూమన్ రైట్స్ ప్రొఫెషనల్ రీమా ఒమర్ ప్రతిస్పందిస్తూ, "పెమ్రా తీసుకున్న నిర్ణయం సరైంది. వివాహిత జంటల మధ్య సాన్నిహిత్యం, ఆప్యాయత 'పాకిస్తానీ సమాజంలో ఉండదు'. మా 'సంస్కృతి' నియంత్రణ, దుర్వినియోగం, హింస మాత్రమే. ఇటువంటి పరాయి విలువలు విధించకుండా మనమందరం మన సంస్కృతిని కాపాడుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. చదవండి: ‘యాక్.. ఇలాంటి చెత్త సీన్లు ఎలా తీస్తారు మీరు?’ PEMRA finally got something right: Intimacy and affection between married couples isn’t “true depiction of Pakistani society” and must not be “glamourised” Our “culture” is control, abuse and violence, which we must jealously guard against imposition of such alien values pic.twitter.com/MJQekyT1nH — Reema Omer (@reema_omer) October 22, 2021 -
క్యాంపస్లో కౌగిలించుకున్నారు, కట్ చేస్తే..
లాహోర్: ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమను వ్యక్తీకరించడం గొప్ప అంటుంటారు. కానీ ఇలా ఏకంగా చదువుల నిలయమైన యూనివర్సిటీలో ప్రపోజ్ చేసుకోవడం కొంత ఆశ్చర్యకరమే! అందులోనూ అందరి ముందే హగ్గులిస్తూ ప్రేమలో తూలి తేలిపోవడం మరింత విడ్డూరకరం. ఈ అరుదైన ఘటన పాకిస్తాన్లోని లాహోర్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరు ప్రేమ పక్షులు వారి మనసులోని భావాలను ఒకరికొకరు చెప్పుకునేందుకు క్యాంపస్నే ఎంచుకున్నారు. అందరూ చూస్తుండగానే యువతి మోకాలిపై కూర్చుని మనసు పడ్డ వ్యక్తికి పువ్వులు ఇస్తూ ప్రపోజ్ చేసింది. దీంతో అతడు ఆమెను అక్కున చేర్చుకుని కౌగిలితంల్లో బంధించాడు. దీన్నంతటినీ అక్కడున్న విద్యార్థులు ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్సిటీ అధికారులు ఆ ఇద్దరినీ తమముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను వారు బేఖాతరు చేశారు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద వారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, వారు యూనివర్సిటీకి సంబంధించిన ఏ క్యాంపస్లోనూ అడుగు పెట్టేందుకు వీల్లేదని నిషేధం విధించారు. కాగా ఈ వీడియో గత వారం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరినీ డిబార్ చేసినట్లు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లు తీసుకున్న నిర్ణయం మంచిదేనని కొందరు హర్షిస్తే వాళ్లు ప్రేమించుకుంటే మీకేంటంటా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. చదవండి: మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్పై మహిళ దాడి వైరల్: ఆకలేస్తే అంతేమరీ!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019