breaking news
-
తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్ని ప్రమాదం
తిరుమల: తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్నిప్రమాదం సంభవించింది. శేషచల అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగసిపడి శ్రీగంధం వనం మంటలు వ్యాపించాయి. ఎండలతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
అనంతగిరి అడవుల్లో రేసింగ్ పై స్పందించిన పోలీసులు
-
చాక్లెట్ గుట్టలుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?..
చాక్లెట్ కొండలు చాక్లెట్ రంగులో కనిపించే ఈ కొండలు ఫిలిప్పీన్స్లోని బొహోల్ ప్రావిన్స్లో ఉన్నాయి. భారీ ఎత్తున చాక్లెట్ను గుట్టలుగా రాశిపోసినట్లు కనిపించే ఇలాంటి 1776 కొండలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి యాభై కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. బొహోల్ ప్రావిన్స్లో ఈ చాక్లెట్ కొండలే ప్రధాన పర్యాటక ఆకర్షణ. వీటిని చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. యూనెస్కో ఈ కొండలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించింది. వీటిలో రెండు కొండలపై ఇటీవలి కాలంలో టరిస్ట్ రిసార్ట్లను ఏర్పాటు చేశారు. గోపురాల్లా తీర్చిదిద్దినట్లు కనిపించే ఈ కొండలు ఒక్కొక్కటి సగటున 30 నుంచి 50 మీటర్ల ఎత్తు ఉంటాయి. వీటిలో అతి ఎత్తయిన కొండ 120 మీటర్లు ఉంటుంది. (చదవండి: గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే) -
గుట్టలు గుల్ల.. సర్కారు లీజు గోరంత.. తవ్వుకునేది గుట్టంతా
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘కొండలు పగలేసినం..బండలనూ పిండినం.. మా పదవులు అడ్డుపెట్టి ఉన్నకాడికి ఊడ్చుతం’’.. ఇదేంటీ యాభై ఏళ్ల క్రితం విప్లవ కవి చెరబండ రాజు అప్పటి దోపిడీ పీడనపై ఎక్కుపెట్టిన ‘కొండలు పగిలేసినం..’’అన్న కవితకు పూర్తి వ్యతిరేకంగా ఉంది అనుకుంటున్నారా? అవును..వ్యతిరేకమే..ఇప్పుడిలాగే ఉంది పరిస్థితి. అక్రమాలు సాగించే వారికి పదవుల్లో ఉన్నవారి అండా దండా తోడైతే ఇంక అడ్డేముంది? అందినకాడికి మనదే..అన్నట్టుగా కళ్ల ముందే కొండలన్నీ పిండి చేస్తున్నారు. సర్కారుకు కొసరంత సీనరేజీ కట్టి..కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో భూగర్భ వనరుల శాఖ కొండలు, గుట్టలను పలు సంస్థలకు లీజుకు ఇస్తుంటుంది. ఆయా సంస్థల నుంచి సీనరేజీ వసూలు చేస్తుంది. అయితే కొండ/గుట్టలో కొంత భాగం లీజుకు తీసుకుంటున్న అక్రమార్కులు మొత్తం కొండంతా తవ్వేస్తున్నారు. అధికారులెవరైనా ప్రశ్నిస్తే నయానో, భయానో వారిని చెప్పుచేతల్లో పెట్టుకుని మైనింగ్ జోన్ సహా, ఇతర ప్రాంతాల్లోనూ దందా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల్లో అడ్డూఅదుపూ లేని క్రషింగ్తో కొండలు కనుమరుగవుతున్నా, భారీయెత్తున సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వాస్తవ లీజును మించి పదింతల మైనింగ్! నిజామాబాద్ జిల్లాలో గుట్టల్ని మింగే ‘అనకొండలు’ బట్టాపూర్ కొండను ఆనవాళ్లే లేకుండా మింగేస్తున్నాయి. తీసుకున్న లీజును మించి పదింతల మైనింగ్, క్రషింగ్ చేస్తూ ఎవరడ్డొచ్చినా తగ్గేదేలేదంటున్నారు. ఈ జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న బట్టాపూర్ కొండ క్రషింగ్ వివరాల్లోకి వెళితే.. ఏర్గట్ల మండలం బట్టాపూర్ సర్వేనంబర్ 195/1లో 3.85 హెక్టార్లను 2016లో లీజుకు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుండి అనుమతి (కన్సెంట్ ఫర్ ఆపరేషన్) లేకుండానే గుట్టను తొలిచి క్రషింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు 13,686 క్యూబిక్ మీటర్ల మేరకే భూగర్భ శాఖ నుండి అనుమతి తీసుకుని సుమారు రూ.6.36 లక్షల సీనరేజీని చెల్లించారు. కానీ వాస్తవంగా సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కొండను తొలిచి కంకరగా మార్చి కోట్లలో సొమ్ము చేసుకున్నారు. జియో ట్యాగింగ్ ద్వారా ఫిట్ మెజర్మెంట్ పద్ధతిలో బట్టాపూర్ క్వారీలో పరిమితికి మించి తవ్వకం జరిగినట్లు అధికార యంత్రాంగం గుర్తించినా..దీని వెనక ఉన్న ముఖ్యనేత హెచ్చరికతో ఆ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదు. ఈ క్వారీలో పరిమితికి మించిన పేలుళ్ల కారణంగా బండరాళ్లు పంటపొలాల్లో, పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో పడుతున్నాయన్న ఫిర్యాదుతో.. ఓ మారు తనిఖీకి వచ్చిన కమ్మర్పల్లి ఎఫ్ఆర్వో ఆనంద్రెడ్డిని 24 గంటల్లోనే బదిలీ చేయించడంతో, ఇక ఏ ప్రభుత్వ శాఖ అధికారీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. సామాన్యులు బకాయి పడితే వారం రోజులు కూడా ఉపేక్షించని విద్యుత్ అధికారులు.. ఈ వీవీఐపీ ఫిబ్రవరి, 2022 నుండి విద్యుత్ బిల్లు చెల్లించకపోయినా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు సంబంధిత సంస్థ ఎన్పీడీసీఎల్కు రూ.51.15 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా..ఆ వైపు వెళ్లేందుకు విద్యుత్ అధికారులు సాహసించటం లేదు. ఇది బట్టాపూర్ గుట్ట. ఇందులో అతి కొద్ది భాగాన్నే లీజుకు తీసుకున్నారు. (2015లో గూగుల్ ఎర్త్ చిత్రం ఇది) ప్రస్తుతం బట్టాపూర్ గుట్ట దాదాపు కనుమరుగైన పరిస్థితి. (2022లో గూగుల్ ఎర్త్ చిత్రం ఇది) అన్నిచోట్లా ఇదే తంతు.. ►రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సర్వే నంబర్ 268లో 680 ఎకరాల్లో ఉన్న మైనింగ్ జోన్లోనూ పలు అక్రమాలు చోటు చేసుకుంటు న్నట్లు ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వం నుండి లీజు మంజూరైన వాటిలో మెజారిటీ సంస్థలు తమ లీజులను అనధికారికంగా ఇతరులకు విక్రయించేశాయి. ఈ జోన్లోని మెజారిటీ లీజులు ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకి వచ్చేశాయి. ►నిబంధనల మేరకు క్వారీ తవ్విన ప్రాంతాలను మళ్లీ మట్టితో నింపి చదును చేయాల్సి ఉండగా ఆ పని ఎవరూ చేయటం లేదు. ఇక మైనింగ్ కోసం ఏకంగా నాలుగు ఇంచుల బోర్లు వేస్తూ వాటిలో పేలుడు పదార్థాలు నింపి పేల్చేస్తున్నారు. తీసుకున్న లీజు పరిధిని మించి మైనింగ్ చేస్తున్నారు. జియో ట్యాగింగ్ ఫిట్ మెజర్మెంట్ పక్కాగా జరగటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ►సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ క్వారీల పేలుళ్లతో భూ ప్రకంపనలు నిత్యకృత్యమయ్యాయి. పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల తదితర మండలాల్లోని క్వారీల్లోనూ తీసుకున్న అనుమతుల కంటే భారీ విస్తీర్ణంలో తవ్వకాలు చేస్తున్నారు.పరిమితికి మించిన పేలుడు పదార్థాలు వాడుతుండటంతో మాదారాం, లకుడారం గ్రామాల్లో ఇళ్లకు బీటలు పడుతున్నాయి. పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ►క్వారీలు, క్రషర్ల నిర్వాహకులంతా కీలక ప్రజాప్రతినిధులు కావటం, వారు సిఫారసు చేసిన అధికారులే పర్యవేక్షకులు కావడంతో క్రషింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. -
పిల్లల కథ: ఎగిరే కొండలు
సీతాపురం గ్రామం మొదట్లోనే.. ఒక పెంకుటిల్లు ఉంది. అందులో తన కొడుకు, కోడలుతో బాటుగా చిన్నవాడైన తన మనవడితో కలసి ఒక అవ్వ జీవిస్తోంది. కొడుకు, కోడలు పగలు పనికి వెళితే.. అవ్వ మనవడిని చూసుకునేది. రాత్రి అవగానే ఒక కథైనా చెప్పనిది మనవడు నిద్రపోయేవాడు కాదు. రోజూ రాజుల కథలు చెప్పి మనవడిని నిద్రపుచ్చేది, ఆ రోజు బాగా వెన్నెల కాస్తోంది. మనవడితో బాటు ఆరుబయట తాళ్ళ మంచంపై పడుకుంది అవ్వ. ‘కొండపైన అనేక రకాల పక్షులు ఉన్నాయి. అవి బాగా ఎగరగలవు. కొండకు కూడా రెక్కలు వుంటే ఎంత బాగుండేదో కదా అవ్వా..’ అన్నాడు మనవడు. మనవడి ప్రశ్నకు అవ్వ ఆశ్చర్యబోయింది ‘అవునూ.. ఎప్పుడూ రాజుల కథలేనా? ఇలాంటి కొత్త కథ ఒకటి చెప్పవ్వా’అంటూ మారాం చేశాడు. అవ్వ తల గీరుకుంది. ఏమి చెప్పాలా అని ఆలోచించింది. టక్కున ముసలి బుర్రకు ఒక కథ తట్టింది. వెంటనే చెప్పడం ప్రారంభించింది. ‘అనగనగా ఒకానొక కాలంలో కొండలకు రెక్కలు ఉండేవట. అవి ఎక్కడబడితే అక్కడ వాలిపోయేవట. మాకన్న బలవంతులు.. ఎత్తు గలవాళ్ళు, ఈ భూమిపై మా అంతటి విశాలమైన రెక్కలు ఏ పక్షికి లేవని చాలా గర్వపడేవట. మాకు ఎదురు లేదు, మేము ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగిపోతాం, ఒకరి ఆజ్ఞతో నడవాల్సిన పని లేదు, ఇంకొకరి సలహా అవసరం లేదు’ అంటూ చాలా గర్వంగా మాట్లాడేవట. ‘ఓ పర్వతమా.. మీరు బాగా ఎగరండి తప్పు లేదు. ఆకాశంలో ఆనందంగా విహరించండి, మాలాగా మీకు రెక్కలొచ్చాయి, కాదనలేదు, కానీ మేము ఏ కొమ్మలపైనో, ఏ రాతిపైనో వాలిపోతాం, ఏ జీవికి హాని చేయం’ అన్నాయట పక్షులు. ‘ఐతే ఏంటి’ అని వెటకార ధోరణిలో అడిగిందట కొండ. ‘మీరు ఎక్కడ వాలితే అక్కడ మీ బరువు జీవజాలంపై పడి చనిపోతున్నాయి, పైగా మీరు ఇలా స్థాన చలనం కావడం ప్రకృతికే విరుద్ధం’ అని హితవు పలికాయట పక్షులు. ‘ఏమన్నారు.. మేము విరుద్ధమా.. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?’ అంటూ కొండలు కోప్పడ్డాయట. పక్షులు చేసేది లేక, మిన్నకుండి పోయాయట. కొండలు మాత్రం తమ రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి, ఎక్కడబడితే అక్కడ వాలి, తమకు ఏ అపకారం చేయని జీవులను చంపేసేవట. ఇలా అయితే భూమిపై గల జీవులన్నీ చనిపోతాయని తలచి, ఎలాగైనా రెక్కల కొండల ఆగడాలను ఆపాలని, భూమిపై నివసించే జీవులన్నీ తమ గోడు వెళ్ళబోసుకోడానికి భగవంతుని దగ్గరకు వెళ్ళాయట’ అంటూ కథ మధ్యలో ఆపేసి.. మంచం పక్కనే చెంబులో పెట్టుకున్న నీళ్ళు తాగి, కాస్త ఊపిరి పీల్చుకుంది అవ్వ. ‘తర్వాత ఏం జరిగిందో చెప్పవ్వా ’ అంటూ ఎంతో ఆసక్తిగా అడిగాడు మనవడు. తిరిగి చెప్పడం ప్రారంభించింది అవ్వ.. ‘అలా జీవులన్నీ దేవుని దగ్గరికి వెళ్లి మొర పెట్టుకోగానే.. దేవుడికి కోపం వచ్చిందట. ‘ఆ పర్వతాలకు ఎందుకంత గర్వం. ఒక చోట వుండలేక పోతున్నామంటే, పోనీలే అని కనికరించి రెక్కలు ఇస్తే.. ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నాయా.. వెంటనే వాటి పొగరు అణచాల్సిందే ’ అంటూ దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారట. ఒక మంచి సమయం చూసుకుని పర్వతాల దగ్గరకు వెళ్లి ‘మీరు గౌరవంగా ఉంటారనుకుంటే.. గర్వంతో మసలుతున్నారు. బలముందని బలహీనులను తొక్కేయడం అహంకారానికి చిహ్నం. కాబట్టి మీ రెక్కలు తుంచడమే సరైన ధర్మం’ అంటూ దేవతలు కొండల రెక్కల్ని తెగ నరకడంతో ఊళ్ళకు అవతల పడిపోయాయట. ఉన్నచోటనే ఉండిపోయాయట. అంటూ కథ ముగించి పిల్లాడి వంక చూసింది అవ్వ. మనవడు బాగా నిద్రపోతున్నాడు. (పిల్లల కథ: ఎవరికి విలువ?)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019