breaking news
Ad - Sakshi_Home_Sticky
-
T20: రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్గా సంజూ శాంసన్!
‘రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. అంతెందుకు టీ20 వరల్డ్కప్-2024లోనూ జట్టును అతడే ముందుకు నడిపిస్తాడు’’.. చాన్నాళ్లుగా విశ్లేషకుల మాట. అయితే, వన్డే వరల్డ్కప్-2023 తర్వాత సీన్ కాస్తా మారింది. గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన ఈ పేస్ ఆల్రౌండర్.. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ ముంబై పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ మాత్రం ఈసారి పొట్టి ప్రపంచకప్లో రోహిత్ శర్మనే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలైన తర్వాత సీన్ పూర్తిగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట కేవలం మూడు మాత్రమే గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో సోమవారం నాటి మ్యాచ్తో ఐదో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం తన జట్టును విజయపథంలో ముందుకు నడిపిస్తున్నాడు. సంజూ శాంసన్ (PC: IPL) ఇప్పటి దాకా రాయల్స్ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఏడు విజయాలతో ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సంజూ అదరగొడుతున్నాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి అతడు 314 పరుగులు సాధించాడు. ముంబైతో మ్యాచ్లో సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104)తో కలిసి సంజూ(28 బంతుల్లో 38) ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాష్ శాశ్వతం అని యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ మరోసారి నిరూపించింది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత జట్టులో నేరుగా అడుగుపెట్టే అర్హత అతడికి ఉంది. అంతేకాదు రోహిత్ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్గా సంజూ శాంసన్ ఎదుగుతాడనడంలో మీకేమైనా అనుమానాలున్నాయా?’’ అంటూ కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ కావాలని ఆకాంక్షించాడు. అసలు జట్టులో చోటు దక్కుతుంతా అన్న సందేహాల నడుమ ఊహించని విధంగా కెప్టెన్ కావాంటూ అంటూ కామెంట్ చేశడు. కాగా వరల్డ్కప్-2024 నేపథ్యంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొన్న తరుణంలో భజ్జీ ఇలా సంజూకు ఓటు వేశాడు. మరి మీ ఓటు ఎవరికి?! Yashasvi Jaiswal’s knock is a proof of class is permanent . Form is temporary @ybj_19 and there shouldn’t be any debate about Keepar batsman . @IamSanjuSamson should walks in to the Indian team for T20 worldcup and also groomed as a next T20 captain for india after rohit . koi… — Harbhajan Turbanator (@harbhajan_singh) April 22, 2024 THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024 -
IPL 2024 MI Vs RR: బుమ్రా ఉండగా నువ్వు తొలి ఓవర్ వేయడమేంటి హార్దిక్..!
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మరోసారి సొంత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాజస్థాన్తో మ్యాచ్లో హార్దిక్ చెత్త నిర్ణయాలే ముంబై కొంపముంచాయని వాపోతున్నారు. నామమాత్రపు స్కోర్ను కాపాడుకునే క్రమంలో ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రాను కాదని తాను బౌలింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుమ్రా కాకపోతే కొయెట్జీ, తుషార కనిపించలేదా అని నిలదీస్తున్నారు. ఏదో వరల్డ్ నంబర్ వన్ బౌలర్లా తొలి ఓవర్ వేయడమేంటని ధ్వజమెత్తుతున్నారు. బౌలర్లను మార్చే విషయంలో గల్లీ కెప్టెన్ల కంటే అధ్వానంగా ఉన్నావని ఫైరవుతున్నారు. హార్దిక్ బ్యాటింగ్ చెప్పనశక్యమైన ఛండాలంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోతూ ఆల్రౌండర్నని ఎలా చెప్పుకుంటావని దుర్భాషలాడుతున్నారు. ఈ సీజన్లో ముంబై యాజమాన్యం స్వయంకృతాపరాధమే (హార్దిక్ను కెప్టెన్గా నియమించడం) ఐదు సార్లు ఛాంపియన్ అయిన తమ ఫేవరెట్ జట్టు కొంపముంచుతుందని వాపోతున్నారు. హార్దిక్ను వెంటనే కెప్టెన్సీ నుంచి తీసిపారేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రాయల్స్తో నిన్నటి మ్యాచ్లో హార్దిక్ బ్యాటింగ్లో 10 పరుగులు (10 బంతుల్లో ఓ ఫోర్) చేసి, బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. 183 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో హార్దిక్ తొలి ఓవర్ వేసి బట్లర్చే బాదించుకున్నాడు. ఆతర్వాత 13వ ఓవర్లో శాంసన్, యశస్వి ధాటికి 10 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్లో హార్దిక్ చెత్త నిర్ణయాలు, చెత్త వ్యక్తిగత ప్రదర్శన కారణంగా ముంబై ఇండియన్స్ ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతానికి ఆ జట్టు 8 మ్యాచ్లు ఆడి 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. సందీప్ శర్మ (4-0-18-5), ట్రెంట్ బౌల్ట్ (4-0-32-2) ముంబైని దెబ్బకొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఐదో పరాజయాన్ని నమోదు చేసింది. రాజస్తాన్ రాయల్స్తో సోమవారం నాటి మ్యాచ్లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ విఫలమై ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటర్గా వైఫల్యం.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ అటాక్ ఆరంభించడం.. ప్రత్యర్థి పరుగులు రాబడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నపుడైనా బుమ్రాను బరిలోకి దించకపోవడం వంటివి ఇందుకు కారణం. ఇదంతా ఒక ఎత్తైతే రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత విషయాన్ని తేలిక చేసేలా హార్దిక్ పాండ్యా నవ్వుతూ మాట్లాడటం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కు కూడా చిరాకు తెప్పించింది. తమ జట్టులోని ఆటగాళ్లంతా ప్రొఫెషనల్స్ అని.. వారికి తానేమీ కొత్త నేర్పించాల్సిన అవసరం లేదనడం.. ఆటగాళ్లకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొనడం.. తానేదో కెప్టెన్గా అంతా సరిగ్గానే చేశానన్నట్లుగా మాట్లాడటం ఒకింత ఆగ్రహం కూడా తెప్పించాయి. ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ‘‘తమ మనసులో ఏముందో దానిని మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా ఆటగాళ్లు బయటికి చెప్పే రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నా. మౌనంగా ఉంటూ.. అంతా బాగానే ఉందనే భావన కల్పించేలా రక్షణాత్మక ధోరణి అవలంభించకుండా కుండబద్దలు కొట్టాలి. తదుపరి ఓటమి. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థంలేని వాగుడు’’ అంటూ డేల్ స్టెయిన్ ఘాటు విమర్శలు చేశాడు. తన పోస్ట్లో నేరుగా హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తావించకపోయినా ఈ సౌతాఫ్రికా స్టార్ అతడిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఓటమి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాట్లాడిన తర్వాత డేల్ స్టెయిన్ ఈ మేరకు ట్వీట్ చేయడం ఇందుకు కారణం. I really look forward to the day players might say what’s honestly on their mind. Instead we some how dumbed ourselves and our minds into saying the usual safe thing, lose the next game, smile and then repeat that nonsense again. 🙄 PS. Qdk, I love you — Dale Steyn (@DaleSteyn62) April 22, 2024 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్లు: ►వేదిక: సవాయి మాన్సింగ్ స్టేడియం, జైపూర్ ►టాస్: ముంబై.. బ్యాటింగ్ ►ముంబై స్కోరు: 179/9 (20) ►రాజస్తాన్ స్కోరు: 183/1 (18.4) ►ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో ముంబైపై రాజస్తాన్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సందీప్ శర్మ(5/18)- రాజస్తాన్ ►టాప్ స్కోరర్: యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104 నాటౌట్)- రాజస్తాన్. THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024 -
హార్దిక్ పాండ్యాపై రూ. 12 లక్షలు జరిమానా
ముల్లాన్పూర్: ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ. 12 లక్షలు జరిమానా విధించింది. ముల్లాన్పూర్లో గురువారం పంజాబ్ కింగ్స్ జట్టుతో ఐపీఎల్ మ్యాచ్లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో పూర్తి 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. దాంతో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు హార్దిక్పై పెనాల్టీని విధించారు. తాజా సీజన్లో ఇప్పటి వరకు స్లో ఓవర్రేట్ కారణంగా రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్–2 సార్లు), శుబ్మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్), సంజూ సామ్సన్ (రాజస్తాన్ రాయల్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్కతా నైట్రైడర్స్)లపై జరిమానా విధించారు. -
IPL 2024: హార్దిక్పై గుర్రుగా ఉన్న నబీ.. వైరల్ పోస్ట్
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై సొంత జట్టు అభిమానులే కాక సహచర ఆటగాళ్లు సైతం అసంతృప్తిగా ఉన్నారన్న విషయం మరోసారి బహిర్గతమైంది. దిగ్గజాలు కల్పించుకోవడంతో అభిమానులు కాస్త మెత్తపడినా.. సహచరులు మాత్రం హార్దిక్ తీరును ఎండగడుతూనే ఉన్నారు. రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ లాంటి సీనియర్లు గతంలో పలుమార్లు తమ అసంతృప్తిని వెల్లగక్కగా.. తాజాగా మరో సీనియర్ వీరి సరసన చేరాడు. స్టార్ ఆల్రౌండర్ మొహమ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్) నిన్న పంజాబ్తో మ్యాచ్ పూర్తయిన అనంతరం తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ నబీ అభిమాని పోస్ట్ చేసింది. దాన్నే నబీ తన పోస్ట్గా యాడ్ చేశాడు. ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందంటే.. మీ కెప్టెన్ (ముంబై ఇండియన్స్) తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేటి మ్యాచ్లో నబీ బౌలింగ్ చేయలేదు. అయినా గేమ్ ఛేంజర్ అయిన నబీ కీలక సమయంలో రెండు క్యాచ్లు, ఓ రనౌట్ చేసి ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడని నబీ అభిమాని హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని వెల్లగక్కాడు. Mohammad Nabi's Instagram story. pic.twitter.com/Rk4qWoIOsl — Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024 ఇదే పోస్ట్ను నబీ కూడా తన ఇన్స్టా స్టోరీలో పెట్టుకుని పరోక్షంగా తన అభిమానికి మద్దతు తెలిపాడు. నబీ.. హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని నేరుగా బయటపెట్టనప్పటికీ పరోక్షంగా తనలో భావాన్ని వ్యక్త పరిచాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ముంబై ఇండియన్స్లో చాలామంది సీనియర్ల లాగే నబీ కూడా అసంతృప్తిగా ఉన్నాడంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు నబీకి మద్దతుగా నిలుస్తూ.. హార్దిక్ కెప్టెన్సీ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. పంజాబ్తో మ్యాచ్లో హార్దిక్ ఆఖరి ఓవర్లలో అద్భుతంగా కెప్టెన్సీ చేయడమే కాకుండా వ్యక్తిగతంగానూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనలో 19వ ఓవర్ వేసిన హార్దిక్ 11 పరుగులిచ్చి అప్పటికి కీలకమైన హర్ప్రీత్ బ్రార్ వికెట్ పడగొట్టాడు. ఒకవేళ హార్దిక్ ప్రయోగం (బౌలింగ్ చేయడం) బెడిసికొట్టుంటే అతని మెడపై పెద్ద కత్తి వేలాడేది. అంతిమింగా ఈ మ్యాచ్లో ముంబై గెలవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019