breaking news
-
భారీగా ‘బ్యాక్లాగ్’! ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్లాగ్ తిప్పలు పట్టుకున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో.. గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సెలింగ్ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారు వాటిని వదులుకుంటే.. తర్వాతి మెరిట్ అభ్యర్థులకు కేటాయించే పరిస్థితి (రిలిక్విష్ మెంట్) లేకపోవడం కూడా సమస్యకు దారితీస్తోంది. ఇలా మిగిలిపోయిన ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. ఇటీవల భర్తీ చేసిన గురుకుల కొలువులు, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ తదితర కేటగిరీ ఉద్యోగాల్లో సుమారు 10శాతానికిపైగా ఇలా మిగిలిపోవడం గమనార్హం. 33వేల కొలువుల్లో.. 4,590 ఉద్యోగాలు ఖాళీ.. రాష్ట్రంలో గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 33 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇందులో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయినట్టు నియామక సంస్థల ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయి. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రానుంది. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో ఇప్పటివరకు 8.820 ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. ఏకంగా 1,810 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలినట్టు సమాచారం. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇటీవల చేపట్టిన 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో దాదాపు 2వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7 వేల స్టాఫ్ నర్సు, 1,150 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయగా.. వీటిలోనూ 780 ఉద్యోగాలు మిగిలిపోయాయి. రిలిక్విష్మెంట్ లేకపోవడంతో.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రిలిక్విష్మెంట్ విధానాన్ని అనుసరించారు. అంటే ఏదైనా నోటిఫికేషన్కు సంబంధించి ప్రకటించిన ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాకుంటే.. అందులోని తర్వాతి మెరిట్ అభ్యర్థులతో భర్తీచేసేందుకు వీలు ఉండేది. 2018 వరకు ఈ విధానాన్ని అనుసరించారు. కానీ ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికితోడు ఇతర కారణాలతో రిలిక్విష్మెంట్ విధానాన్ని పక్కనబెట్టారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక జారీ అయిన నోటిఫికేషన్లలో రిలిక్విష్మెంట్ అంశాన్ని జతచేయలేదు. అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్ని పోస్టులు మిగిలినా అదే నోటిఫికేషన్ కింద భర్తీ చేసే అవకాశం లేదు. ఇటీవల రిలిక్విష్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, నిబంధనలపై చర్చించినా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా భర్తీ ప్రక్రియలో బ్యాక్లాగ్ ఖాళీలు మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయాలంటే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నియామకాల ప్రక్రియలు ఇంకా కొనసాగుతుండటంతో.. నోటిఫికేషన్ల వారీగా ఏర్పడే ఖాళీలపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. -
శాశ్వత అంగవైకల్యం ఉంటేనే రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులకు సంబంధించి వికలాంగ (దివ్యాంగ) రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి మాత్రమే దివ్యాంగ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు తాత్కాలిక వైకల్య ధ్రువీకరణ(టెంపరరీ డిజేబుల్డ్ సర్టిఫికెట్)తో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో అవకాశం కల్పించగా... ఇప్పుడు ఆ ప్రయోజనాలను నిలిపివేసింది. తాత్కాలిక వైకల్యంతో ఉన్న వ్యక్తికి కొంత కాలం తర్వాత వైకల్య స్థితిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పు తాలుకు ఫలితం వైకల్యం నయమవ్వడం లేదా శాశ్వత వికలాంగుడిగా మారడంలాంటి సంఘటనలు అనేకం ఉంటాయి. ఈ క్రమంలో వికలత్వ నిర్ధారణ విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. శాశ్వత నిర్ధారణ సర్టిఫికెట్లే పరిగణించాలని.. ► శాశ్వత వికలత్వ నిర్ధారణ సర్టిఫికెట్లను మాత్రమే పరిగణించాలని, ఇతరత్రా సర్టిఫికెట్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వికలాంగుల సాధికారత, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ అందుకు అనుగుణంగా జీఓ 41 జారీ చేసింది. 40శాతం దాటితేనే... వికలాంగ రిజర్వేషన్ల అమలులో వికలత్వ శాతమే కీలకం. కనీసం 40శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తేనే రిజర్వేషన్ల వర్తింపును ప్రభుత్వం అనుమతిస్తుంది. ప్రతి వికలాంగుడు తప్పకుండా వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. అందులో శాశ్వత ప్రాతిపదిక వైకల్యం ఉన్నట్లయితేనే రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈమేరకు జీఓ 41లో స్పష్టత ఇచ్చింది. తాత్కాలిక వైకల్యం(టెంపరరీ డిజబులిటీ) ధ్రువీకరణ పత్రాన్ని ఇదివరకు అంధ విభాగంలోనే జారీ చేస్తుండగా... ప్రస్తుతం అన్ని కేటగిరీల్లోనూ ఈ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది. మొదటిసారి ధ్రువీకరణ పత్రం కోసం సంప్రదించే ప్రతి వికలాంగుడికి టెంపరరీ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి. అతి త్వరలో పరీక్షల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకోగా... వెనువెంటనే ఫలితాలను ప్రకటించి నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాయి. ఈ సమయంలో వికలాంగ రిజర్వేషన్ల అమలులో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వికలాంగ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీఓ 41 ప్రతులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక సంస్థలకు ప్రత్యేకంగా పంపింది. జీఓ 41లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది వికలాంగులపై కక్షసాధింపు చర్యః ముత్తినేని వీరయ్య తాత్కాలిక ధ్రువీకరణను రిజర్వేషన్ల అమలులో పరిగణించమంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర అన్యాయం. ప్రస్తుతం సదరమ్ ద్వారా జారీ చేస్తున్న సర్టిఫికెట్లన్నీ టెంపరరీ సర్టిఫికెట్లే. కొందరికి రెండు, మూడేళ్లుగా ఇవే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల సమయంలో ఈ అంశాన్ని తీసుకురావడంతో అసలైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశాలున్నాయి. జీఓ 41 జారీ ప్రక్రియ వికలాంగులపై కక్షసాధింపు చర్యగా భావిస్తున్నాం. ఈ ఉత్తర్వులను రద్దు చేసేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. -
కారుణ్య నియామకం హక్కుకాదు
న్యూఢిల్లీ: కారుణ్య నియామకం అనేది హక్కు కాదని, బాధితులకు ఊరడింపు మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హఠాత్∙సంక్షోభాన్ని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి బాధిత కుటుంబానికి కారుణ్య నియామకం దోహదపడుతుందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమేనని, ఆర్టికల్ 16 ప్రకారం చట్టంలో నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తేల్చిచెప్పింది. 24 ఏళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తి కుమార్తెకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలంటూ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గతవారం తోసిపుచ్చింది. కేరళలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్లో పనిచేసే ఓ వ్యక్తి 1995లో ఏప్రిల్లో విధి నిర్వహణలో ఉండగానే మృతిచెందాడు. అప్పట్లో ఆయన కుమార్తె మైనర్. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ మేజరైన తర్వాత ఆమె కంపెనీకి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఇవ్వలేమంటూ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది. బాధితురాలిని కంపెనీలో చేర్చుకోవాలని సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. హైకోర్టు డివిజన్ బెంచ్ సైతం దీన్ని సమర్థించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కంపెనీ యాజమాన్యం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 30న తీర్పును వెలువరించింది. -
తెలంగాణలో కొత్త కొలువుల భర్తీ కాస్త జాప్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కొత్త కొలువుల భర్తీ ఆలస్యం కానుంది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుతో సామాజిక వర్గాల వారీగా ఉద్యోగ కేటాయింపుల్లో మార్పులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. ఇప్పటికే పావువంతు కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వగా.. మిగతా ఉద్యోగాలకు సంబంధించి అనుమతుల జారీ వేగవంతం అయింది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు కూడా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలు తయారు చేస్తున్నా యి. కాగా, ప్రస్తుతం ఆరుశాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రిజర్వేషన్లు అక్టోబర్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం నోటిఫికేషన్ల దశలో ఉన్న పలు ఉద్యోగాలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో బ్రేక్ పడినట్లైంది. కొత్త ప్రతిపాదనలు తప్పనిసరి.. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలు కాగా, మిగతా కేటగిరీలో గురుకుల కొలువులు, టీచర్ ఉద్యోగాలే ఉన్నా యి. పోలీస్ కొలువులకు సంబంధించిన ప్రకటనలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల బోర్డు దాదాపు విడుదల చేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన గ్రూప్–1 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడగా.. ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా పలు పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. వైద్య ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను కూడా తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసింది. ఇక అధిక సంఖ్యలో ఉన్న గురుకుల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం అనుమతించిన మిగతా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సంబంధిత నియామక సంస్థలు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఈ సమయంలో రిజర్వేషన్ల పెంపు ఉత్తర్వులు రావడంతో కొత్తగా వెలువడాల్సిన నోటిఫికేషన్లు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాల్సి ఉండటంతో మార్పు లు, చేర్పులకు సమయం పడుతుంది. పాత నోటిఫికేషన్లకు ఓకే.. ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లను కొనసాగించి నియామకాలు పూర్తి చేసే వీలుండగా.. కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్ల విషయంలో మాత్రం 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లతో ఉద్యోగాలను భర్తీ చేయా ల్సి ఉండటంతో ఆ దిశగా ప్రభుత్వ శాఖలు చర్యలు మొదలుపెట్టాల్సి ఉంది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల ప్రకటనలకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనల్లో ఎస్టీలకు 10 శాతం కోటా కేటాయించాలి. అందుకు సమయం పడుతుందని, దీంతో కొత్త నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం అవుతాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
తెలంగాణలో 30,453 ప్రభుత్వ ఉద్యోగాలు.. శాఖల వారీగా పోస్టుల వివరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ(డైరెక్ట్ రిక్రూట్మెంట్) చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ నెల 10న అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. వీటిని అత్యంత త్వరితంగా భర్తీ చేసి నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తానని ఆయన ఇచ్చిన హామీ కార్యరూపంలోకి వచ్చింది. ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసిన వెంటనే ప్రభుత్వ శాఖలు చర్యలు వేగవంతం చేస్తూ వచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతరులతో పాటు సీఎస్ సోమేశ్కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ బుధవారం జీవోలు జారీ చేసింది. ఇతర ఖాళీలపైనా త్వరలోనే హరీశ్, ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించ నున్నారు. వీలైనంత వేగంగా వీటికి అనుమతులు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. తొలిసారిగా గ్రూప్–1...: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి అనుమతులు రావడం, అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుం డటంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీకి అనుమతిచ్చిన వాటిలో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయి. పోలీస్ విభాగానికి సంబంధించి నాలుగు కేటగిరీల్లో 17,003 ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్య శాఖలో మూడు కేటగిరీల్లో 12,735 ఉద్యోగాలు, రవాణా శాఖలో 212 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోస్టర్ ఫిక్స్ అయ్యాక..: వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతివ్వడం, నియామక సంస్థలను కూడా ఖరారు చేయడంతో ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన మేరకు ఆయా శాఖలు ఉద్యోగాల వారీగా రోస్టర్ను ఖరారు చేయాల్సి ఉంటుంది. రోస్టర్ ప్రకారం ఉద్యోగాల ఇండెంట్లు నియామక సంస్థలకు సమర్పించిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ –1 పోస్టులు జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్–40 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్–38 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వైద్యారోగ్యశాఖ)–20 డీఎస్పీ– 91 జైల్స్ డిప్యూటీ సూపరిండెంట్–2 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్–8 డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్–2 జిల్లా మైనారీటీ వెల్ఫేర్ ఆఫీసర్–6 మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–2(35) ఎంపీడీవో(121) డీపీవో(5) కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(48) డిప్యూటీ కలెక్టర్(42) అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్(26) జిల్లా రిజిస్ట్రార్(5) జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(3) ఆర్టీవో(4) జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2) మొత్తం 503 జైళ్ల శాఖ: డిప్యూటీ జైలర్ (8), వార్డర్ (136), వార్డర్ ఉమెన్ (10) మొత్తం 154 పోలీసు శాఖ: కానిస్టేబుల్ సివిల్ (4965), ఆర్మడ్ రిజర్వ్(4423), టీఎస్ఎస్పీ(5704), కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ(262), డ్రైవర్లు పిటీవో(100), మెకానిక్ పీటీవో(21), సీపీఎల్(100), సబ్ ఇన్స్పెక్టర్ సివిల్(415), ఎస్ఐ ఏఆర్(69), ఎస్ఐ టీఎస్ఎస్పీ(23), ఎస్ఐ ఐటీ అండ్ సీ(23), ఎస్ఐ పీటీవో(3), ఎస్ఐ ఎస్ఏఅర్ సీపీఎల్(5) ఏఎస్ఐ(ఎఫ్బీబీ–8), సైంటిఫిక్ ఆఫీసర్(ఎఫ్ఎస్ఎల్–14), సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్ఎస్ఎల్–32), ల్యాబ్టెక్నిషీయన్ (ఎఫ్ఎస్ఎల్–17), ల్యాబ్ అటెండెంట్(1), ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్(390), ఎస్ఐ ఎస్పీఎఫ్(12) మొత్తం: 16,587 డీజీపీ ఆఫీస్: హెచ్ఓ (59), జూనియర్ అసిస్టెంట్ ఎల్సీ(125), జూనియర్ అసిస్టెంట్ టీఎస్ఎస్పీ(43), సీనియర్ రిపోర్టర్(ఇంటెలిజెన్స్–2), డీజీ ఎస్పీఎఫ్ (2) మొత్తం: 231 రవాణా శాఖ: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్సెక్టర్స్(113), జూనియర్ అసిస్టెంట్ హెడ్ ఆఫీస్(10), జూనియర్ అసిస్టెంట్ ఎల్సీ(26), మొత్తం: 149 వైద్యారోగ్య శాఖ: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్(1520), వైద్య విద్య హెచ్ఓడీ: అసిస్టెంట్ ప్రొఫెసర్ (1183), స్టాఫ్ నర్స్ 3823, ట్యూటర్ 357, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (751), ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్ఓడీ : సివిల్ అసిస్టెంట్ సర్జన్ (7) ఎంఎస్జె క్యాన్సర్ ఆసుపత్రి: స్టాఫ్ నర్స్(81) తెలంగాణ వైద్య విధాన పరిషత్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (211), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(బయోకెమిస్ట్రి– 8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈఎన్టీ(33), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు ఫోరెన్సిక్ మెడిసిన్ (48), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్ (120), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ(126), సి విల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ గైనకాలజీ (147), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (24), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ మైక్రోబయోలజీ(8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆప్తామాలజీ(8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆరోథపెడిక్స్(53), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్(142), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సైక్రియాట్రి(37), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ రేడియోలజీ(42), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్తీషియా(152), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ డెర్మటాలజీ(9), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పాథలోజీ(78), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పల్మనరీ మెడిసిన్ (38), మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్/ఎఎన్ఎం(265), స్టాఫ్ నర్స్(757) మొత్తం: 10,028 ఆయుష్ విభాగం హెచ్ఓడీ: ఆక్సిలరీ నర్స్ మిడ్–వైఫ్(ఎ ఎన్ఎమ్–26), జూనియర్ అసిస్టెంట్ లోకల్(14), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(3), ల్యాబ్ అసిస్టెంట్(18), ల్యాబ్ టెక్నీషీయన్ (26), లెక్చరర్ ఆయుర్వేద(29), లెక్చరర్ హోమియో(4), లెక్చరర్ యునాని(12), లైబ్రెరీయన్ (4), మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద(54), మెడికల్ ఆఫీసర్ హోమియో(33), మెడికల్ ఆఫీసర్ యునానీ(88), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్(9), ఫార్మాసిస్ట్ ఆయుర్వేద(136), ఫార్మాసిస్ట్ హోమియో(54), ఫార్మాసిస్ట్ యునానీ(118), స్టాఫ్ నర్స్(61) మొత్తం: 689 డీఎంఈ హెచ్ఓడీ: అనస్తీషీయా టెక్నినీషియన్ (93), ఆడియో వీడియో టెక్నినీషియన్ (32), ఆడియో మెట్రీ టెక్నినీషియన్ (18), బయోమెడికల్ ఇంజనీర్(14), బయోమెడికల్ టెక్నీషీయన్ (11), కార్డియోలజీ టెక్నిషీయపన్ (12), సీటీ స్కాన్ టెక్నీషీయరన్ (6), డార్క్ రూమ్ అసిస్టెంట్(36), డెంటల్ హైజెనీస్ట్(3), డెంటల్ టెక్నీషీయన్ (53), ఈసీజీ టెక్నిషీయన్ (4), ఈఈజీ టెక్నీషీయన్ (5), జూనియర్ అసిస్టెంట్ లోకల్(172), ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్02(356), ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(161), ఫీజియోథెరెపిస్ట్(33), రేడియోగ్రాఫర్(55), రేడియోగ్రఫీ టెక్నీషియన్ (19), ఆప్టోమెటరిస్ట్(20), స్టెరిలైజేషన్ టెక్నీషీయన్ (15) మొత్తం: 1118 డైరెక్టర్ పబ్లిక్ హెల్త్: అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్(2), డార్క్రూమ్ అసిస్టెంట్(30), జూనియర్ అసిస్టెంట్ లోకల్(42), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(4), ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(119), ఫార్మాసిస్ట్ గ్రేడ్02(160) మొత్తం: 357 డ్రగ్స్ కంట్రోలర్: డ్రగ్స్ ఇన్స్పెక్టర్(18), జూనియర్ అనాలిస్ట్(9), జూనియర్ అసిస్టెంట్ లోకల్94), జూనియర్ అసిస్టెంట్ స్టేట్ట్(2) మొత్తం: 33 ఐపీఎమ్(హెచ్ఓడీ): ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (24), జూనియర్ అనలిస్ట్ స్టేట్(9), జూనియర్ అనలిస్ట్ జోనల్(2), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(1), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లోకల్(5), లాబోరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్(6), లాబోరేటరీ టెక్నీషీయన్ గ్రేడ్ –2 స్టేట్ క్యాడర్(6), శాంపిల్ టేకర్ లోకల్ క్యాడర్(3) మొత్తం: 56 ఎమ్ఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్తీషియా 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ గైనిక్ ఆంకాలజీ–2, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పెయిన్ అండ్ పల్లియేటివ్ కేర్–2, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియో థెరపీ–3, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ అంకాలజీ–3, బయోమెడికల్ ఇంజనీర్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పాథాలోజీ–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్తీషీయా–1, డెంటల్ టెక్నిషీయన్ –1, ఈసీజీ టెక్నీషీయన్ –2, జూనియర్ అసిస్టెంట్ స్టేట్–5, ల్యాబ్ అసిస్టెంట్–8, ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(5), లెక్చరర్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ –1, మెడికల్ ఫిజిసిస్ట్–5, మెడికల్ రికార్డ్ టెక్నీషీయన్ –3, ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(2), రేడియో గ్రాఫర్(సీటీ టెక్నీషీయన్ –2), రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషీయన్ –2, రేడియో గ్రాఫర్ ఆర్టీ టెక్నీషీయన్ –5, రేడియోగ్రాఫర్స్–6, సోషల్ వర్కర్–6, మొత్తం: 68 నిమ్స్: జూనియర్ అసిస్టెంట్ స్టేట్–20, టీఎస్ఎంఎస్ఐడీసీ: ఏఈఈ/ఏఈ(11), జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1, జూనియర్ టెక్నీకల్ ఆఫీసర్–1, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–1, మొత్తం: 13 వైద్య విధాన పరిషత్: డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (36), జూనియర్ అసిస్టెంట్ లోకల్(63), ల్యాబ్ టెక్నీషీయన్ (47), ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(119), రేడియోగ్రాఫర్(36) మొత్తం: 301 కాలోజీ యూనివర్సీటీ: అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్–1, అసిస్టెంట్ లైబ్రేరియన్ –2, జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1, లైబ్రేరియన్ –1, ప్రోగ్రామర్–1, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్–1 మొత్తం: 7 మొత్తం: 2662 ఉద్యోగాల భర్తీలో కొత్త రోస్టర్ నూతన జోనల్ విధానంతో మారిన రోస్టర్ పట్టిక క్రమసంఖ్య ఒకటి నుంచి మొదలు కానున్న నియామకాల ప్రక్రియ బ్యాక్లాగ్ పోస్టులు కొత్త జిల్లాలకు సమాన ప్రాతిపదికన కేటాయింపు ఉద్యోగ నియామకాలపై సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక అడుగు పడింది. మొత్తంగా 80 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసింది. అయితే ఈ నియామకాలను ఏవిధంగా చేపడతారనే సందిగ్ధానికి రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఆగస్టు–2018 నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. కానీ అప్పటినుంచి కొత్తగా ఉద్యోగ నియామకాలేవీ జరగలేదు. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ఉద్యోగఖాళీల భర్తీపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కొత్త ఉద్యోగ నియామకాలకు నూతన రోస్టర్ ప్రాతిపదిక కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీతో ఈ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, ప్రభుత్వం వీటిని బుధవారం విడుదల చేసింది. రోస్టర్దే కీలక పాత్ర.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రిజర్వేషన్ల అమలులో రోస్టర్దే (రిజర్వేషన్ల క్రమ పట్టిక) కీలక పాత్ర. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం రోస్టర్ పాయింట్లతో పట్టికను తయారు చేసింది. ఇందులో క్రమ సంఖ్య ఒకటి నుంచి వంద వరకు ప్రాధాన్యత క్రమంలో రిజర్వేషన్ల కూర్పు చేసి ఉంచింది. జనరల్, జనరల్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ ఉమెన్, ఎస్టీ, ఎస్టీ ఉమెన్, బీసీ, బీసీ ఉమెన్, డిజేబుల్, డిజేబుల్ ఉమెన్ కేటగిరీలను ఒక్కో క్రమ సంఖ్య వద్ద ఫిక్స్ చేశారు. తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సైతం అమల్లోకి రానుండడంతో ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ రిజర్వేషన్లను రోస్టర్ పాయింట్ల వద్ద ఫిక్స్ చేస్తారు. సాధారణంగా ఒక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడితే.. ఖాళీల భర్తీ పూర్తయ్యే నాటికి ఉన్న రోస్టర్ను తదుపరి నోటిఫికేషన్కు కొనసాగింపుగా భావిస్తారు. కానీ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ కొనసాగింపునకు బదులుగా.. రోస్టర్ పాయింట్లను ఒకటో క్రమ సంఖ్య నుంచి కొనసాగించాలని సాధారణ పరిపాలన శాఖ తాజాగా స్పష్టం చేసింది. సమంగా క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తయిన తర్వాత మిగులు ఖాళీ ఉద్యోగాలను జనాభా ప్రాతిపదికన సమానంగా నూతన జిల్లాలకు కేటాయించారు. ఈ క్రమంలో రిజర్వేషన్లను సైతం సమ ప్రాతిపదికను అవలంభిస్తూ కేటాయింపులు జరిపారు. ఇక కొన్నిచోట్ల బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో వాటిని క్యారీ ఫార్వర్డ్ కేటగిరీలోకి మార్చారు. తాజాగా ఈ ఉద్యోగాలను కూడా నూతన జిల్లా యూనిట్ల ప్రకారం పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో కూడా రోస్టర్ను పాటించాలి. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించే విషయంలో రోస్టర్ పాయింట్లకు విఘాతం కలగకుండా శాఖాపరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఈ బాధ్యతల్ని పూర్తిగా నెరవేర్చాలని జీఏడీ స్పష్టం చేసింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019