breaking news
-
అక్రమ మద్యం, గంజాయిపై నిఘా పెంచండి: కేఎస్ జవహర్రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీస్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అక్రమ మద్యం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల రవాణా, వాడకంపై ఉక్కుపాదం మోపేందుకు సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో సమన్వయం చేసుకోండి. వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్లను గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేయండి. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులలో నిఘాను మరింత పటిష్టం చేయండి. ముఖ్యంగా గంజాయి సాగు చేసే గిరిజనులను ఆపరేషన్ పరివర్తన్ కింద ప్రత్యామ్నయ పంటల సాగు వైపు ప్రోత్సహించండి. ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వచ్చే అవకాశాలున్నందున సరిహద్దులతో పాటు రాష్ట్రంలోని అన్ని చెక్పోస్టుల్లో నిఘాను అధికం చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. ఎస్ఈబీ కమిషనర్ యం.రవిప్రకాశ్ మాట్లాడుతూ.. గంజాయికి సంబంధించి 90 శాతం ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా నుంచి.. 10 శాతం కోరాపుట్ నుంచి ఏపీలోకి వస్తోందని తెలిపారు. ఒడిశా డీజీపీ సమన్వయంతో గంజాయి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి 25 మంది కింగ్ పిన్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.4.38 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. మద్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రంలోని ప్రతి డిస్టిలరీకి ఒక సహాయ కమిషనర్ స్థాయి అధికారిని ఇన్చార్జ్గా పెట్టామని చెప్పారు. మద్యం రవాణా చేసే వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు దేవకుమార్, వాసుదేవరావు, రజత్ భార్గవ, డా.మల్లిఖార్జున, ఢిల్లీ రావు, రవిశంకర్ అయ్యన్నార్, కాంతిరాణా టాటా, విజయ సునీత, రవి సుభాష్, తుహిన్ సిన్హా, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ‘నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయండి. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు.. ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. తాగునీటి సరఫరా విధానాన్ని పర్యవేక్షించేందుకు రూపొందించిన యాప్ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి’ అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. 9 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బంది లేదని కలెక్టర్లు నివేదించినట్లు చెప్పారు. మిగిలిన 17 జిల్లాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపేందుకు అవసరమైన నీటిని కాలువల ద్వారా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూపొందించిన యాప్ను శుక్రవారం అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామ స్థాయిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధిత ఇంజనీర్ ఆమోదంతో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా డిమాండ్ను యాప్లో అప్లోడ్ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా పంపిస్తే ఆమోదిస్తామని తెలిపారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, నారాయణరెడ్డి, జాన్ సత్యరాజ్, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో జోరుగా నకిలీ మద్యం దందా
► ఆసిఫాబాద్కు చెందిన రాజేష్ మూడు రోజుల కిందట గుండి రహదారిలో ఉన్న ఓ మద్యం దుకాణానికి వెళ్లి క్వార్టర్ మద్యం తీసుకున్నాడు. ఇంటికెళ్లి బాటిల్ మూత తీయగానే స్పిరిట్ వాసన గుప్పుమంది. తాజాగా తయారైన మద్యం అనుకుని గ్లాసులో పోసుకుని తాగగా.. నిజంగా స్పిరిట్ తాగిన భావన. నిత్యం తాగే బ్రాండ్ ఇలా ఉందేమని.. మరుసటి రోజు బ్రాందీ షాపుకెళ్లి ఫిర్యాదు చేశాడు. సాయంత్రానికి షాపు లైసెన్సుదారుడు రాజేష్కి ఫోన్ చేసి ‘ఏ బ్రాండు తీసుకున్నావు? స్పిరిట్ వాసన వచ్చిందా? నేను చెక్ చేస్తాను.. ఎవరితో చెప్పకు’ అని కోరాడు. ► శ్రీధర్ అనే మరో వ్యక్తి రెండు రోజుల కిందట ఖరీదైన విస్కీ బ్రాండు మద్యం బాటిళ్లు కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి పార్టీలో మద్యం బాటిళ్లను ఓపెన్ చేసి గ్లాసుల్లో పెగ్లు పోయగా.. వాటిని తాగిన స్నేహితులందరూ ఇది నకిలీ మద్యం.. స్పిరిట్ వాసన వస్తోందని అనడంతో శ్రీధర్ కంగుతిన్నాడు. ఆసిఫాబాద్లోని చిర్రకుంట వెళ్లే రహదారిలో ఉన్న ఓ మద్యం దుకాణంలో శ్రీధర్ ఈ బాటిళ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. జిల్లావ్యాప్తంగా ఈ రకం మద్యం విక్రయించని వైన్స్ లేదంటే అతిశయోక్తి కాదు. నిబంధనలకు విరుద్ధంగా అనేక మద్యం షాపుల్లోనూ లభి స్తోంది. నవంబర్ తర్వాత పాత వైన్స్ షాపుల స్థానంలో కొత్తవి రానుండడంతో పాత షాపుల య జమానులు కొందరు నకిలీ మద్యం దందాను ప్రో త్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉ న్నతాధికారులు, ఆబ్కారీ ఉన్నతాధికారులకు మా మూళ్లు ఇస్తున్నామనే భావనతో.. చివరి రోజుల్లోనైనా కొంత లాభాలు దక్కించుకునేందుకు లైసెన్సుదారులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో తనిఖీలు గాలికొదిలేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగజ్నగర్ అడ్డాగా.. జిల్లాలో 32 మద్యం దుకాణాలు, 3 బార్లు ఉన్నా యి. ఏటా రూ.250 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. వీటికి అనుసంధానంగా మండల కేంద్రాల్లో ప దుల సంఖ్యలో బెల్టు షాపులు ఉండగా.. జిల్లావ్యాప్తంగా వాటి సంఖ్య 800 వరకు ఉంటుంది. నవంబర్తో ప్రస్తుత మద్యం షాపులకు గడువు పూర్తవుతోంది. డిసెంబర్ నుంచి కొత్తగా మద్యం దుకా ణాలను టెండర్ల ద్వారా దక్కించుకున్న లైసెన్సుదారులు ఏర్పాటు చేయనున్నారు. ఇదే అదనుగా ప్రస్తుతం ఉన్న లైసెన్సుదారులు తమ మద్యం దు కాణాల్లో నకిలీ మద్యం విక్రయాలకు తెరలేపినట్లు సమాచారం. ముఖ్యంగా కాగజ్నగర్ అడ్డాగా నకిలీ మద్యం తయారవుతోంది. అసలు బాటిళ్ల మా దిరిగా ఉండే నకిలీ బ్రాండ్లను షాపుల్లో ఉంచి మందుబాబులకు అంటగడుతూ రూ.లక్షలు అర్జిస్తున్నారు. ఒకప్పుడు చీప్ లిక్కర్లలో కల్తీ జరిగేది. కానీ ప్రస్తుతం ఖరీదైన బ్రాండ్లనూ నకిలీగా తయారు చేయడం విశేషం. ఇదే విషయమై జిల్లా ఎక్సైజ్శాఖ అధికారి జ్యోతికిరణ్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. జోరుగా దందా.. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ గడువు ఈ ఏడాది నవంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఇటీవలే కొత్త దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో ప్రస్తుతం ఉన్న మద్యం లైసెన్సుదారులు అక్రమార్జనకు అడ్డదారులు వెతుక్కున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బీరు, ఇతర ప్రీమియం మద్యం బాటిళ్లపై ధర పెంచి విక్రయించి సొమ్ము చేసుకున్న సంగతి విధితమే. ఇప్పుడంతకు మించి అర్జించాలంటే నకిలీ మద్యం ఒక్కటే మార్గమని భావించి అసలు బ్రాండ్ల స్థానంలో నకిలీ మద్యం బ్రాండ్ బాటిళ్లను ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో కేవలం కొన్ని దుకాణాల్లో మాత్రం నకిలీ మద్యం విక్రయాలు జరగడం లేదని తెలుస్తోంది. స్థానికుల్లో చాలా మంది మంచిర్యాల, పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లి మద్యం బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారంటే జిల్లాలో నకిలీ మద్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. చాటుగా కాకుండా ఏకంగా మద్యం దుకాణాల్లోనే నకిలీ మద్యం బాటిళ్లను ఉంచి విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. -
గుట్టు రట్టు
అద్దంకి: కర్నూల్లో తీగ లాగితే అద్దంకిలో నకిలీ మద్యం, పురుగుమందుల తయారీ భాగోతం బట్టబయలైంది. పట్టణం నడిబొడ్డున నకిలీ మద్యం, పురుగుమందులు బయో ఉత్పత్తులు తయారీ కేందాన్ని బుధవారం గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు అవాక్కయ్యారు. దాడుల్లో నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే రెట్టిఫైడ్ స్పిరిట్, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా పట్టణానికి చెందిన రావూరి శ్రీనివాసరావు తన ఇంటికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కారు పెట్టుకునేందుకు వేసిన రేకుల షెడ్డులో చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావుతో పాటు ఆయన భార్య శ్రీదేవిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ డీసీ శ్రీమన్నారాయణ కథనం ప్రకారం..మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల సెల్ఫోన్లోని నంబర్ల ఆధారంగా స్టేట్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హరికుమార్ అప్రమత్తమయ్యారు. ఆయన ఆదేశాల మేరకు పట్టణంలోని సాయి నగర్లో నివాసం ఉంటున్న రావూరి శ్రీనివాసరావు గృహంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అతని ఇంటి పక్కన వేసిన రెకుల షెడ్డులో 125 నకిలీ ఇంపీరియర్ బ్లూ క్వార్టర్ బాటిళ్లు, మద్యం తయారు చేసేందుకు ఉపయోగించే 175 లీటర్ల (నాలుగు క్యానుల్లో ఉంచిన) రెట్టిఫైడ్ స్పిరిట్, 510 ఎంసీ విస్కీ ఖాళీ బాటిళ్లు, 40 లీటర్ల ఖాళీ క్యానులు రెండు, 20 లీటర్ల ఖాళీ క్యాను ఒకటి సీజ్ చేశారు. 172 లీటర్ల నకిలీ పురుగు మందుల (బయో ఉత్పత్తులు) డబ్బాలు, ఖాళీ డబ్బాలు, వాటికి వేసే స్టిక్కర్లు, పురుగుముందుల డబ్బాలకు మూతలు అమర్చే మిషన్ను స్వాధీనం చేసుకుని వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. నిందితుడు రావూరి శ్రీనివాసరావును విచారించగా తాను కర్నూలు జిల్లాకు చెందిన రాంబాబు ద్వారా నకిలీ మద్యం తయారు చేసే వినోద్ఖల్లాల్కు రూ.లక్ష అప్పుగా ఇచ్చానని, ఆ బాకీ ఇవ్వకపోవడంతో తనకు 2019 ఫిబ్రవరి నెలలో 14 క్యానుల స్పిరిట్, నకిలీ మద్యం బాటిళ్లు ఇచ్చారని చెప్పకొచ్చాడు. ఆగస్టులో రెండు దఫాలుగా వచ్చి 10 క్యానుల స్పిరిట్ తీసుకుని 128 ఖాళీ బాటిళ్లు ఇచ్చాడని చెప్పాడు. వినోద్ఖల్లాల్ మొత్తం 315 క్వార్టర్ నకిలీ మద్యం బాటిళ్లు ఇవ్వగా నాలుగు నెలల కాలంలో 190 బాటిళ్లను విక్రయించినట్లు శ్రీనివాసరావు అంగీకరించాడు. నకిలీ మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్ను స్కాన్ చేయగా ఆ మద్యం బాటిళ్లు కర్నూలు నుంచే వచ్చినట్లు గుర్తించామని డీసీ చెప్పారు. నిందితుడిపై పీడీ యాక్ట్, 420 కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరింత లోతుగా విచారిస్తే నకిలీ మద్యం కేసుకు సంబంధించి మరికొంత మంది దొరికే అవకాశం ఉందని డీసీ వివరించారు. సమావేశంలో ఈఎస్ జి. నాగేశ్వరరావు, ఏఈఎస్ శ్రీనివాసులునాయుడు, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు లీనా, తిరుపతయ్య, అద్దంకి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి ముడిసరుకు నకిలీ పురుగుమందులకు సంబంధించిన ముడిసరుకును నిందితులు హైదరాబాద్లోని ముత్తుస్వామి, పొన్నుస్వామిల వద్ద తెస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తి చెప్పారు. నకిలీ పురుగు మందులు తయారీ కేంద్రాన్ని గుర్తించినట్లు తెలుసుకున్న జేడీఏ అద్దంకి ఎక్సైజ్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాసరావు వైరల్ హిట్ పేరుతో పురుగుమందు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆ మందును పరీక్షల కోసం ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. నిందితుడిపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విచారణలో మరింత సమాచారం రావాల్సి ఉందని జేడీ చెప్పారు. ఆయనతో పాటు ఏడీఏలు మాలకొండారెడ్డి, ధన్రాజ్, వ్యవసాయాధికారి వెంకటకృష్ణ ఉన్నారు. -
నకిలీ మద్యం ‘ముఠా’ గుట్టురట్టు!
కర్నూలు : నకిలీ మద్యం ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఈఎస్ ఆర్.వి.సుధాకర్, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిఘా వేసి ఏపీ21 ఏఈ 8159 నంబరు గల టాటా సుమోలో తరలిస్తున్న 1400 మెక్డోవెల్స్ క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని రవాణాదారుడితో పాటు ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తిమ్మాపురం కేంద్రంగా వ్యాపారం... ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం కేంద్రంగా నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన రంగస్వామి రెండేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. కృష్ణగిరి, గోనెగండ్ల, దేవనకొండ, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం మండలాల్లో బెల్టు దుకాణాలే లక్ష్యంగా ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లాగౌడ్పై గతంలో పీడీ యాక్ట్... నకిలీ మద్యం వ్యాపారి ఎల్లా గౌడ్ గతంలో కూడా ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి దాదాపు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈయనపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో కొంతకాలం పాటు వ్యాపారానికి విరామం ప్రకటించి అధికార పార్టీకి చెందిన నాయకుల అండతో రెండేళ్లుగా మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీ ఇలా... రాయచూరు జిల్లా గిలకసుగూరు గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్ అదే గ్రామంలో ఓ రహస్య ప్రదేశంలో మెక్డోవెల్స్ కంపెనీకి చెందిన పాత సీసాలను పెద్దఎత్తున పోగుచేసి కలర్ నీళ్లలో స్పిరిట్ కలిపి సీసాలకు నింపి ప్రత్యేక మిషన్తో ప్లాస్టిక్ మూతలు బిగించి జిల్లాలోని బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మండలాల వారీగా ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బంటుపల్లె గ్రామానికి చెందిన బాలా గౌడ్, వీరాంజనేయులు దేవనకొండ మండలంలో బెల్టు షాపులకు స్పూరియస్ లిక్కర్ (విషపూరితమైన మద్యం) సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు నిఘా వేసి పట్టుకున్నట్లు సమాచారం. రెండు నెలలుగా నిఘా... ఎక్సైజ్ అధికారులు తిమ్మాపురం రంగస్వామిపై రెండు నెలలుగా నిఘా ఉంచి ఈదులదేవరబండ నుంచి వెంబడించి బేతపల్లె గ్రామ సరిహద్దులో పట్టుకున్నట్లు తెలుస్తోంది. గిలకసుగూరు నుంచి మాధవరం చెక్పోస్టు మీదుగా జిల్లాలోకి నకిలీ మద్యం రవాణా అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐదుగురు కానిస్టేబుళ్లను గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు, దేవనకొండ మండలం ఈదులదేవరబండ దగ్గర కాపలా ఉంచి పక్కా సమాచారంతో నకిలీ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్కార్ట్గా మరో వాహనంలో వెళ్తున్న ఏజెంట్లు బాలాగౌడ్, వీరాంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పత్తికొండ ఎక్సైజ్ పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారుల అదుపులో ఉన్న ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చెక్పోస్టులకు ముందే సమాచారం... జిల్లా సరిహద్దు గ్రామాలకు గిలకసుగూరు ఆనుకుని ఉండటంతో కర్ణాటక పోలీసుల నిఘా కొరవడింది. దీంతో నకిలీ మద్యం రవాణాదారులు చెక్పోస్టులలో మామూళ్లు ముట్టజెప్పి వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని దాదాపు పది మండలాలను కేంద్రంగా చేసుకుని నెలకు రెండుసార్లు గిలకసుగూరు నుంచి బెల్టు దుకాణాలకు ఎల్లా గౌడ్ ఏజెంట్ల ద్వారా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తరలించే వాహనాల నంబర్లు చెక్పోస్టులో ఉన్న అధికారులకు ముందుగానే చేరవేస్తారు. దీంతో తనిఖీలు లేకుండానే అక్కడి అధికారులు వదిలేస్తుండటంతో నకిలీ మద్యం వాహనాలు జిల్లాలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. -
కల్తీ మద్యం బుసబుస
తెనాలి: నకిలీ మద్యం కుంభకోణానికి ఇంకా తెరపడలేదు. ఖాళీ సీసాల్లో నకిలీ, చౌక మద్యం అమ్మకాల గుట్టు రట్టయి, నిందితులెవరో నిగ్గు తేలినప్పటికీ తవ్వేకొద్దీ అన్నట్టుగా కొత్త కేసులు వెలుగు చూస్తూనే వున్నాయి. ‘సాక్షి’ వరుస కథనాల్లోని అంశాలు పక్కా వాస్తవాలుగా బహిర్గతమవుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం స్థానిక మార్కెట్ సెంటర్లోని బజారులో మూసి ఉంచిన కూరల దుకాణంలో కొత్త మూతల డంప్ పట్టుబడటం ఇందుకు నిదర్శనం. దుకాణం లోపల ఉంచిన వివిధ రకాల మద్యం బ్రాండ్లకు చెందిన వేలాది మూతలను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం గుట్టు రట్టు రేపల్లె సమీపంలోని తుమ్మల పంచాయతిలోని గాదెవారిపాలెంలో ఒక ప్రైవేటు ఇంటిలో నడుస్తున్న నకిలీ మద్యం రాకెట్ జనవరి 16న బహిర్గతమైన విషయం తెలిసిందే. దీనికి కొన్ని నెలల ముందు నుంచి ఈ అక్రమ వ్యాపారం నడుస్తోంది. మ హారాష్ట్ర టు అదిలాబాద్, విజయవాడకు రెక్టిఫైడ్ స్పిరిట్ను తెప్పించి, రంగు కలిపి నకిలీ మద్యం తయారు చేయటం, ఖాళీ మద్యం సీసాల్లో నింపటం ఒకరకమైతే, మధ్య రకం ఖరీదు కలి గిన బ్రాండ్ల ఖాళీ సీసాల్లో చౌకమద్యం కలపటం మరో రకం. ముందే తెప్పించుకున్న కొత్త మూతల్ని క్యాప్ ఫిట్టింగ్ మిషనుతో సీలు వేస్తున్నారు. ‘ఎక్సైజ్’లోని ఆరితేరిన కొందరు ఉద్యోగులు, మద్యం లైసెన్సుదారులు కుమ్మక్కయి, తెనాలి డివిజనువ్యాప్తంగా ఈ అక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ‘సాక్షి’ కథనాలతో తెనాలికేసి చూపు గాదెవారిపాలెం కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్, అతడి బంధువు సహా పలువురు నిందితులని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెనాలి సమీపంలోని క్రాప, ఈమని గ్రామాల్లో పలు కేసులు వెలుగు చూశాయి. అయితే, పట్టించుకోకుండా అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. అధికారుల కనుక మేల్కొంటే కల్తీ, నకిలీ వ్యవహారం ముందే వెలుగుచూసేదని అదే నెల 21న ‘సాక్షి’ కథనంలో పేర్కొనటంతో ఆ దిశగా దర్యాప్తుచేసిన అధికారులు కొత్త మూతల సరఫరాదారును గత నెల మొదటివారంలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన ట్రీట్మెంట్తో ఇందులో భాగస్వాములైన లైసెన్సుదారుల పేర్లను వెల్లడించినట్టు తెలిసింది. సందేహాలకు తావిస్తున్న ‘ఎక్సైజ్’ గోప్యత ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు ఈ కేసులో గోప్యతను పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. గత నెలలో పట్టుబడిన మూతల సరఫరాదారు వెల్లడించిన లైసెన్సుదార్లపై విచారించారా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశంపై అధికారులు మౌనాన్ని వీడటం లేదు. కీలకమైన రెక్టిఫైడ్ స్పిరిట్ను తన పేరుతో దిగుమతి చేసుకుంటూ కల్తీ మద్యం వ్యాపారం కేసులో నిందితుడైన తెనాలి ఎక్సైజ్ కార్యాలయం ఉద్యోగిని ప్రధాన నిందితుల్లో ఒకరుగా కాకుండా చివరి వరుసలోకి చేర్చి, పక్షపాతం చూపారనే విమర్శలున్నాయి. పక్కదారి పట్టించేందుకు ఎత్తుగడ మార్కెట్ సెంటర్లో పట్టుబడిన కొత్త మూతల డంప్ కేసు నీరుగార్చే ప్రయత్నంలో భాగమేనని విశ్వసనీయ సమాచారం. నిజానికి కూరగాయల దుకాణం యజమాని ఆకుల సత్యనారాయణ, అద్దెదారుకు వివాదం నడుస్తోంది. కొద్దినెలలుగా దుకాణం మూసివేసి ఉంటోంది. లోపల బూజు పట్టి వున్న దుకాణంలో మూతలు, వుంచిన సంచీ ఎలాంటి మట్టీమరకలు లేకుండా ఉండటం చూస్తుంటే, ఒకటి రెండురోజుల ముందే ఎవరో అక్కడ పడేసి వుంటారనీ, అందుకు మార్గం కూడా ఉందని చెబుతున్నారు. కేవలం కేసును పక్కదారి పట్టించేందుకు ఇప్పటికే ఆరోపణలున్న దుకాణం యజమానిపై నెట్టే ప్రయత్నంలో ఇదొక భాగమనీ, లైసెన్సుదార్లు తప్పించుకునే వ్యూహమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో పెద్దఎత్తున డబ్బు చేతులుమారినట్టు మద్యం వ్యాపారవర్గాలు గుసగుసలాడుతున్నారు. మద్యం కల్తీ కోసం దాచిన మూతలు స్వాధీనం తెనాలి రూరల్ : మద్యం కల్తీ చేసి విక్రయించేందుకు దాచి ఉంచిన మూతలను ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టణంలోని మార్కెట్ కూడలికి వెనుక వైపున ఉన్న షాపులో కల్తీ మద్యం ఉందన్న సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేశారు. మూసి ఉన్న షట్టర్ను తెరిచి చూడగా, శ్లాబుకు కన్నం వేసి ఉంది. దానికి ఆసరాగా ఉన్న నిచ్చెన సాయంతో శ్లాబు పైభాగంలో వెతకగా, మద్యంలోని వివిధ బ్రాండులకు చెందిన మూతలు ఉన్నాయి. సీసాల్లో మద్యం కల్తీ చేసి, వాటిని బిగిస్తారు. షాపు గత 15 సంవత్సరాలుగా ఆకుల సత్యనారాయణ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్ ఏఈఎస్ అరుణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. మూతలు తెనాలికి సరఫరా ఇటీవల కొల్లూరు మండలం క్రాపలో పట్టుబడిన నకిలీ మూతలు తెనాలికి సరఫరా అవుతున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అరుణకుమారి తెలిపారు. సత్యనారాయణ దుకాణంలో ఈ నేపథ్యంలోనే సోదా చేసినట్టు వివరించారు. బ్రాండెడ్ మద్యాన్ని చీప్ లిక్కర్తో కల్తీ చేసి, వాటికి ఈ మూతల్ని బిగిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, సత్యనారాయణ కొలకలూరు, దుగ్గిరాల గ్రామాల్లో మద్యం వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019