breaking news
-
నేటితో తెర
ఈ సాయంత్రం ముగియనున్న ‘గ్రేటర్’ ప్రచారం టీఆర్ఎస్ కీలక శక్తిగా హరీశ్ రావు చివరి రోజు ప్రచారానికి మంత్రి కేటీఆర్ బీజేపీ తరఫున దత్తాత్రేయ, హన్స్రాజ్ కాంగ్రెస్ నుంచి వీహెచ్ రాక హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వానికి శుక్రవారం తెరపడనుంది. వారం రోజులుగా హోరుగా సాగుతున్న ఓట్ల అభ్యర్థనకు నేటి సాయంత్రం ఐదు గంటలకు చివరి గడువు కానుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు నగరంలో ప్రచారంతో సందడి చేస్తున్నారు. టికెట్ల పంపిణీ నుంచి టీఆర్ఎస్కు అన్నీ తానై వ్యవహరిస్తున్న హరీశ్రావు ఇప్పటికే దాదాపు నగరం మొత్తం ప్రచారం చేశారు. చివరి రోజు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధికార పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్ ప్రచారానికి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార పార్టీ ముందు నుంచి ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రతిపక్ష పార్టీలు మొదట్లో నెమ్మదించినా పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా వేగం పెంచాయి. ఆయా పార్టీలకు చెందిన బడా నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్షోలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చేసిన ప్రచారం ఖర్చు వివరాలు సమర్పించాల్సి ఉంది. టీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావు గ్రేటర్ వరంగల్ ప్రచారంలో కేంద్ర బిందువుగా మారారు. వారం రోజుల పాటు ఆ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార వ్యూహంలో హరీశ్రావు ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రేటర్ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు ప్రచారంలో పదును తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఎంపీలు పసునూరి దయాకర్, ఆజ్మీర సీతారాంనాయక్, బాల్క సుమన్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నగరంలో ప్రచారం చేస్తున్నారు. కాగా, చివరి రోజున టీఆర్ఎస్ మరో కీలక నేత కె.తారకరామారావు నగరంలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన రోడ్షో నిర్వహించనున్నారు. అధికార పార్టీని ప్రచారాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యూహం రచించారు. బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ గురువారం ప్రచారం నిర్వహించారు. చివరిరోజు ప్రచారానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్ రానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి రెండు రోజులుగా వరంగల్లోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.{పచారాన్ని నెమ్మదిగా ప్రారంభించిన కాంగ్రె స్ చివరి దశలో వేగం పెంచింది. ఆ పార్టీకి చెందిన అగ్రనాయకులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. చివరిరోజున పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రానున్నారు.తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ప్రచారం నిర్వహించారు. రేవంత్రెడ్డి రోడ్షోలు నిర్వహిస్తు ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతూ ప్రచారం చేశారు. మొదటి నుంచి చివరి వరకు వీరిద్దరే ప్రధాన ప్రచారకర్తలుగా ఉన్నారు. బడా నేతలతో సంబంధం లేకుండా రెబల్ అ భ్యర్థులు, స్వతంత్రులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమకు కేటాయించిన ఎన్నికల గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారం రో జులుగా శ్రమిస్తున్నారు. ఎన్నికల గుర్తుల ను పట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతిఇంటికి వెళుతూ తమను గెలిపిం చాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
స్టార్ క్యాంపెయిన్
చివరి రోజు జోరు.. హోరు.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం ప్రచార ‘స్టార్లు’ నగరాన్ని చుట్టేశారు. టీఆర్ఎస్ తరఫున మంత్రి కేటీఆర్... బీజేపీ తరఫున ఎమ్మెల్యే కిషన్రెడ్డి... ఎంఐఎం తరఫున ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ర్యాలీలు... పాదయాత్రలలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో రెండో అంకానికి ఆదివారంతో తెరపడింది. ఇరవై రోజుల పాటు వాడవాడలా.. ప్రతి ఇంటి తలుపును తట్టిన పార్టీల ప్రచార పర్వం ముగిసింది. చివరిరోజు కావడంతో అధికార పార్టీ మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యనాయకులు జోరు పెంచారు. బైక్ ర్యాలీలు, బహిరంగ సభలతో కాలనీలను హోరెత్తించారు. -
ప్రచార పర్వంలోకి సిద్ధు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల ప్రచార పర్వంలోకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం లాంఛనంగా అడుగుపెట్టేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం కోసం రూపొందించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు గాను కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్తో కలిసి కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో గురువారం ఉదయం సిద్ధరామయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయా వార్డుల వారీగా అభ్యర్థులు ఎలాంటి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నగర ప్రజలకు ఎలా వివరించాలి వంటి అంశాలపై అభ్యర్థులకు సూచనలు చేశారు. అంతేకాక బీజేపీ హయాంలో బీబీఎంపీలో జరిగిన కుంభకోణాలు, నగరంలో తలెత్తిన చెత్త సమస్య వంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం గురువారం మద్యాహ్నం నగరంలోని బీటీఎం లే అవుట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పూర్తై తర్వాత నగరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని సిద్ధరామయ్య తొలుత భావించారు. అయితే ఇప్పటికే బీజేపీ, జేడీఎస్లు ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఇంకా ఆలస్యం అయితే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించి గురువారం నుంచే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈనెల 15 తర్వాత స్టార్ ప్రచారకులతో బీబీఎంపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక గురువారం సాయంత్రానికి నగరానికి చేరుకోనున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నుంచే నగరంలో ప్రచారాన్ని చేపట్టనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో టికెట్ లభించని కారణంగా దాదాపు 100 మంది రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రెబల్ అభ్యర్థులతో పార్టీ సీనియర్ నేతలు చర్చలు జరపడంతో వీరిలో దాదాపు 60 మంది గురువారం రోజున తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. కాగా మిగిలిన వారికి జేడీఎస్ పార్టీ తక్షణమే బీ-ఫాంలు అందించడంతో ప్రస్తుతం వీరంతా జేడీఎస్ తరఫున పోటీలో ఉన్నారు. దీంతో ఈ రెబల్స్ బెడదను తప్పించుకొని, విజయాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులే చేయాల్సి వస్తోందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘నారా’జకీయంపై నారీభేరి
రుణ మాఫీ మాటెత్తని చంద్రబాబు మండిపడుతన్న మహిళా సంఘాలు ‘మహిళలంటే నాకెంతో అభిమానం. వారు వేసిన ఓట్లే నా గెలుపునకు కారణం. వారిని జీవితంలో మరిచిపోను. మహిళల కోసం ఏమైనా చేస్తాను’.. ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు, అధికార దండం అందుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పుకొన్న గొప్పలివి. ఆయన ప్రముఖంగా ప్రచారం చేసుకున్న డ్వాక్రా మహిళల రుణ మాఫీపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. అధికారం చేపట్టి ఆరు నెలలైనా హామీని అమలు చేయలేదు. చంద్రబాబు కప్పదాటు వైఖరిపై జిల్లాకు చెందిన 6 లక్షల 20 వేల మంది డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. ఏలూరు (టూటౌన్) : డ్వాక్రా మహిళలు తీసుకున్న మొత్తం రుణాన్ని మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే గ్రూపునకు రూ.లక్ష చొప్పున మాఫీ చేస్తానని మాట మార్చారు. కనీసం ఆ హామీనైనా నిలబెట్టుకోలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసే వరకూ ఎవరూ రుణాలు కట్టొద్దన్న బాబు బ్యాంకుల వల్ల డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా కనీసం పరిష్కరించలేకపోయారు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు సొమ్మును బ్యాంకు అధికారులు రుణం కింద జమ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 48 మండలాలు కలిపి 62 వేల డ్వాక్రా గ్రూపులున్నాయి. దీనిలో 6 లక్షల 20 వేల మంది మహిళలున్నారు. వీరందరూ వివిధ బ్యాంకుల ద్వారా రూ.1163 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబె ట్టుకోవాలంటే జిల్లాలోని డ్వాక్రా గ్రూపులకు రూ.620 కోట్లు అవసరం. ఇప్పటికే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిన నేపధ్యంలో మరో 6 నెలలు గడిచినా డ్వాక్రా మహిళల రుణాల మాఫీ అయ్యే అవకాశాల్లేవు. ఈ సందర్భంగా జిల్లాలోని కొందరు డ్వాక్రా మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. అన్నీ అబద్దాలే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అబద్దాలు చెప్పి డ్వాక్రా మహిళలను మోసగించారు. మేం పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకు అధికారులు జమ చేసుకుంటున్నారు. అదేమని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. తీసుకున్న రుణాలు కట్టొద్దా? అని ప్రశ్నిస్తున్నారు. - అంబటి ధనలక్ష్మి, డ్వాక్రా మహిళ, ద్వారకాతిరుమల మాట తప్పిన బాబు డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. రుణాలు మాఫీ చేస్తామని చెప్పగానే నమ్మకంతో ఓట్లేశాం. ఆరు నెలలవుతున్నా మాఫీ కాలేదు. రుణాలు కట్టి తీరాలంటూ బ్యాంకు అధికారులు ఆదేశించటంతో కడుతున్నాం. చంద్రబాబు మాట తప్పారు. - పెద్దపులి సుధ, డ్వాక్రా మహిళ, చింతలపూడి పస్తులుండి చెల్లిస్తున్నాం చంద్రబాబు హామీని న మ్మి డ్వాక్రా రుణాన్ని సకాలంలో చెల్లించలేదు. వాయిదాలు మీరడంతో బ్యాంక్ అధికారులు ము క్కుపిండి వసూలు చేస్తున్నారు. పేద కుటుంబం కావడంతో చెల్లించలేకపోతున్నాను. చంద్రబాబు చేసిన మోసంతో పస్తులుండి చెల్లించాల్సి వస్తోంది. - గంటా రమణ, ఆర్జావారిగూడెం, భీమడోలు, డ్వాక్రా సంఘం నాయకురాలు వడ్డీలు పెరిగిపోతున్నాయి ఏడాదిగా 500కు పైగా సంఘాలకు డ్వాక్రా రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్తే డ్వాక్రాసంఘాల మహిళలకు రుణం లభించకపోగా, అవమానాలు ఎదుర్కొంటున్నారు. మరో ఏడాది రుణం చెల్లించకపోతే వడ్డీలు అసలును మించిపోతాయి. - వనమా భాగ్యలక్ష్మి, మండల మహిళా సమాఖ్య సభ్యురాలు, కుక్కునూరు అప్పుల్లో మహిళా సంఘాలు డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న సంఘాలు చెల్లించాల్సిన వడ్డీ అసలు మించిపోయింది. రూ.3 లక్షలు తీసుకున్న సంఘాలకు రూ.లక్షకుపైగా బకాయిలున్నాయి. - బెజ్జంకి లక్ష్మి, వీఓ, రామసింగారం, కుక్కునూరు -
ఉద్యోగులు ఔట్
అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఊడగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం చిత్తూరు: ‘ఏరు దాటేదాకా ఏటి మల్లన్న.. ఏరుదాటాక బోడిమల్లన్న’ అన్న చందంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ‘బాబు వస్తే ఇంటికో ఉద్యోగం’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలోపడ్డారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీచేసిన పాపాన పోలేదు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఆదర్శ రైతులు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, గృహనిర్మాణశాఖ వర్క్ఇన్స్పెక్టర్లతోపాటు పలుశాఖల పరిధిలో వందలాది మంది తాత్కాలిక సిబ్బంది ఉద్యోగాలు ఊడబెరికి ఇంటికి పంపారు. మిగిలిన వారిని సైతం డిసెంబర్ 31 నాటికి రోడ్డుపైకి నెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వడం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.2 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు. కొత్త ఉద్యోగాలు కల్పించడం సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడబెరకడం మొదలు పెట్టారు. ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీలను సైతం భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రెవె న్యూ, వైద్య ఆరోగ్యశాఖ, తాగునీటి సరఫరాల శాఖ, పంచాయతీరాజ్ తదితర ముఖ్య శాఖల్లోనూ అధిక సంఖ్యలో ఖాళీలు ఉండడంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో 2006 నుంచి 1,793 మంది ఆదర్శరైతులు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం నియమించిందన్న సాకుతో ప్రస్తుత ప్రభుత్వం వారిని తొలగించింది. గృహ నిర్మాణశాఖలో 112 మందిని తాత్కాలిక ఉద్యోగులను సైతం ఇంటికి పంపింది. మిగిలిన వారిని పంపేందుకు సిద్ధమైంది.మరోవైపు జిల్లాలో పనిచేస్తున్న 853 మంది ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లలో 300 మందిని తొలగించగా, మిగిలిన వారిని ఇంటికి పంపేందుకు రెడీ అయ్యింది.260 మంది వెలుగు ఉద్యోగులను సైతం ఇంటికి పంపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీరితోపాటు అన్నిప్రభుత్వ శాఖల పరిధిలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ వదిలించుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు ఈ నెల 31 డెడ్లైన్గా పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లా రెవెన్యూ శాఖలో ఖాళీలు: సీనియర్అసిస్టెంట్లు -76, జూనియర్ అసిస్టెంట్లు -34, వీఆర్వోలు -186, వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలు: వైద్యాధికారులు-24, ఏఎన్ఎంలు-155, రెండవ ఏఎన్ఎంలు-75, ఎంపీహెచ్ మేల్-134, ల్యాబ్ టెక్నీషియన్లు- 43, ఫార్మసిస్టు-36, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు -86 సంక్షేమశాఖలో ఖాళీలు మొత్తం వసతి గృహాలు-68, సహాయ బీసీ సంక్షేమ శాఖాధికారుల పోస్టులు-4, ఖాళీ వార్డెన్ పోస్టులు-20, వర్కర్స్ -85, నీటి పారుదల శాఖలో ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్లు-2, టైపిస్టులు- 8, అటెండర్లు-34, జూనియర్ టెక్నీషియన్స్ - 13, టెక్నికల్ అసిస్టెంట్-1, డీఈ-3, ఏఈ-10, ఉద్యానశాఖలో ఖాళీలు సీనియర్ అసిస్టెంటు-1, అటెండర్ -1 డ్వామాలో ఖాళీలు ఏపీవోలు -2, టెక్నికల్ కన్సల్టెంట్ -18, కంప్యూటర్ ఆపరేటర్లు -15 పశుసంవర్థక శాఖలో ఖాళీలు వెటర్నరీ అసిస్టెంట్లు-21, ప్యారావెట్స్- 136, అటెండర్లు-86 వ్యవసాయశాఖలో ఖాళీలు వ్యవసాయాధికారులు-4, అదనపు వ్యవసాయాధికారుల పోస్టులు- 33 చిత్తూరు కార్పొరేషన్లో ఖాళీ పోస్టులు - అసిస్టెంట్ కమిషనర్ -1, రెవెన్యూ అధికారి -1, మేనేజర్ -1, అకౌంటెంట్ -1, పర్యావరణ ఇంజనీర్ -1, సిటీ ప్లానర్ -1, ఏఈ-2, శానిటరీ ఇన్స్పెక్టర్ -3, హెల్త్ ఇన్స్పెక్టర్ -1, మహిళ వైద్యాధికారి -1, వెటర్నరీ అసిస్టెంట్ -5, ఆయాలు -3, సీనియర్ అసిస్టెంట్ -16, ఆఫీసర్ సూపరింటెండెంట్ -7, యూడీఆర్ఐ -1, పబ్లిక్ అండ్ హెల్త్ - 4, స్వీపర్లు -19 తాగునీటి సరఫరా విభాగం ఖాళీలు ఎస్ఈ -1, ఈఈ-1, డీఈ-1, ఏఈ-24, జూనియర్ అసిస్టెంట్లు -2, అటెండర్లు -18, టైపిస్టులు -4, జేటీఓలు -13, టెక్నికల్ అసిస్టెంట్ - 1 జిల్లాపరిషత్లో ఖాళీలు జూనియర్ అసిస్టెంట్లు -12, అటెండర్లు -8 అరకొర పోస్టులతో డీఎస్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ను ఇచ్చింది. దీంతో ఒ క్కొక్క పోస్టుకు వెయ్యిమంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక శాఖల్లో ఖాళీలు ఉన్నా భర్తీకి మాత్రం నోచుకోలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో బయాలజీకి ఒక్కపోస్టు కూడా చూపకపోవడం దారుణం. - చరణ్రాజ్,డీఎస్సీ అభ్యర్థి, ఐరాల ప్రతిఏటా డీఎస్సీ నిర్వహించాలి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతియేటా డీఎస్సీని నిర్వహించి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ఉన్నత విద్యలను పూర్తిచేస్తే ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో వైఫల్యం చెందుతోంది. నిరుద్యోగ సమస్య అధికమవుతోంది. -కుమార్, బీఈడీ నిరుద్యోగి,చిత్తూరు 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. అధికారం చేపట్టాక నిరుద్యోగుల గురించి యోచనైనా చేయలేదు. కందిస్థాయి ఉద్యోగాలే కాకుండా ఇంజనీర్లు,ఎంఈవోలు,డీవైఈవోలు అధికసంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. - షేరు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు నిరుద్యోగభృతి ఇచ్చి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో అధికసంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఇమ్రాన్,చిత్తూరు జాబ్ జాడ ఎక్కడ బాబు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఒక డీఎస్సీ మినహా ఏ ఉద్యోగ ప్రకటన ఇవ్వలేదు. అది కూడా అరకొర పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ భృతి ప్రస్తావన తేవడం లేదు. పెపైచ్చు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచారు. అలాగే యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 వరకు పెంచారు. ఫలితంగా నిరుద్యోగులు మరో రెండేళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వుంది. -వి.హరిప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019