breaking news
-
ఓడిన చోటే కూతురు గెలిపించింది!
బిక్కవోలు: ఇంకా ఎన్నికలు జరగలేదు. ఓడినచోట కూతురు గెలిపించడం ఏమిటా అని అనుకుంటున్నారా? ఇది నిజం. అయితే ఎన్నికల్లో కాదు పదోతరగతి ఫలితాల్లో ఇది జరిగింది. సోమవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మండలంలోని కొంకుదురు గ్రామంలో కుక్కల శ్రీ తేజస్విని 556 మార్కులు సాధించి పాఠశాల మొదటి స్థానం కై వసం చేసుకుంది. అయితే తన తండ్రి కుక్కల ప్రభాకర్ ఇదే పాఠశాలల్లో 1996 పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అప్పటి నుంచి కూలీ పనిచేస్తున్నా తన ఇద్దరు పిల్లలను చక్కగా చదివించాడు. అయితే 2022లో తన కుమారుడిపై ఆశలు పెట్టుకున్నాడు. కాని కుమారుడు తృతీయ స్థానం సాధించాడు. అప్పటి నుంచి కుమార్తె శ్రీ తేజస్విని మరింత శ్రద్ధ తీసుకోవడంతో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిందన్నాడు. తన కలను కూతురు సాకారం చేయడంలో పాఠశాల ఉపాధ్యాయులు సహకారం అందించారని ఆయన తెలిపాడు. -
10వ తరగతి ఫలితాలలో తిరుమల విజయభేరి
రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. కె.రఘువీర్ 595 మార్కులు, కె.సుప్రియ 595 మార్కులు, ఏపీఆర్ సాయిశ్రీలత, బి.లలితరాణి, కె.సత్యభాస్కర్ 594 మార్కులు, టి.ప్రీతిశరణ్య, ఎం.ఇబ్రహీం 593మార్కులు, కె.అశ్రిత, ఎంవీఎల్ఎ వాత్సల్య, ఎం.గ్రీషశ్రీ, బియు.ప్రసాద్, పి.శ్రీతుల్య, జేవీఎన్ సత్యసాయిదత్త, వై.తేజశ్వి, ఎస్.రంజిత్కుమార్ 592మార్కులు, వై.కృష్ణచైతన్య, ఎల్.వైష్ణవి, సీహెచ్.లోక్ప్రకాష్, ఎస్వీఎస్.శ్రీధర్, డి.చిన్మయి 591మార్కులు సాధించారన్నారు. 590పైన 34మంది విద్యార్థులు, 580పైన 223 మంది విద్యార్తులు, 570పైన 451మంది, 560పైన 642 మంది, 550పైన 779మంది, 500పైన 451మంది , 560పైన 642మంది, 550పైన 779మంది, 500పైన 1108 మంది విద్యార్థులు సాధించారని, 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను నున్న తిరుమలరావు, డైరెక్టర్ సరోజినిదేవి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
టెన్త్ ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి ముందంజ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో శ్రీషిర్డీసాయి విద్యానికేతన్ రాజమహేంద్రవరం, కడియం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. తమ లక్ష్య ఓరియంటేషన్తో 10 వ తరగతి చదివిన వి. ఉదయ రుషిత 600 మార్కులకు 593 సాధించి ప్రథమ స్థానంలో నిలువగా ఎన్.సాయి అక్షయ, బి.యశశ్విని 592 మార్కులు, ఎం. జాహ్నవి, ఎస్. దేవికృష్ణసిరి 591, ఎ. లోహిత్ కుమార్ 590 మార్కులు సాధించినట్లు వివరించారు. ఆరుగురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా, 24 మంది 580 మార్కులకు పైగా, 44 మంది 570కి పైగా మార్కులు, 75 మంది 550కి పైగా మార్కులు సాధించారు. హాజరైన మొత్తం164 మంది విద్యార్థులు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయినట్లు తెలిపారు. విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ కె. శ్రీనివాస్ అభినందించారు. -
11న జాతీయ లోక్ అదాలత్
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మే 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించేందుకు రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు తమ పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను గుర్తించాలని తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి తెలిపారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో ఆమె ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి రాజీపడదగిన జాబితాను అధికారులు సిద్ధం చేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు, గవర్నమెంటు ప్లీడరు సీహెచ్వీ ప్రసాద్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పంచాయితీ అధికారులు పాల్గొన్నారు. -
పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలోని వివిధ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, ఇతర సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. జిల్లా సహాయ కార్మిక కమిషనర్ బీఎస్ఎం వలీ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీనిని ఉల్లంఘించిన యాజమాన్యాలకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కొండెక్కిన ఎన్నికల కోడ్ కడియం: టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల కోడ్ను కొండెక్కించేశారు. కడియం మండలం పొట్టిలంకలో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆయన.. గ్రామస్తుల ఇలవేల్పు చింతాలమ్మ ఆలయంలోకి నేరుగా పార్టీ కండువాలతోనే వెళ్లిపోయారు. ఆ పార్టీ నాయకులందరూ కండువాలతోనే గుడి లోపలికి వెళ్లి ఫొటోలకు పోజులిచ్చారు. అదే ఆలయ ఆవరణలో మాజీ ఉప సర్పంచ్ కొత్తపల్లి రాజుబాబు తదితరులకు గోరంట్ల టీడీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. ప్రతిసారీ రూల్స్పై మాట్లాడే గోరంట్ల.. స్వయంగా ఇలా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంపై గ్రామస్తులు విస్తుబోయారు. ఘనంగా సీతారాముల వనవిహారోత్సవం అన్నవరం: రత్నగిరి క్షేత్రపాలకులు శ్రీ సీతారాముల దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన సోమవారం స్వామి, అమ్మవార్ల వనవిహారోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు వెంట రాగా నవదంపతులు సీతారాములను ఊరేగింపుగా కొండ దిగువన గార్డెన్ వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ ప్రత్యేక సింహసనాలపై సీతారాములను, సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వేంచేయించి, పండితులు పూజలు చేశారు. నవదంపతులకు దేవస్థానం అధికారులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం వనవిహారోత్సవం నిర్వహించారు. నేడు శ్రీచక్రస్నానం శ్రీరామ నవమి ఉత్సవాల ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు పవర్హౌస్ వద్ద పంపా నదిలో సీతారాములకు శ్రీచక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు. నదిలో నీరు లేకపోవడంతో స్నానఘట్టాలకు దూరంగా నీరు ఉన్న చోట గుంత తవ్వి, అందులో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 నుంచి వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019