breaking news
-
కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Updates.. కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ కాకినాడ జిల్లా సిద్ధం ఇక్కడ కనిపిస్తోంది.. నిండు గోదావరి ఇక్కడ కనిపిస్తోంది.. అభిమాన వరద గోదావరి ఈ ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం.. దాన్ని కాపాడుకోవాలన్న సంకల్పం మీ అందరిలోనూ కనిపిస్తోంది ఈ సభకు ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ, నా అక్కలకు, నా చెల్లెమ్మలకు, నా అవ్వలకు, నా తాతలకు, నా ప్రతీ సోదరుడికీ, నా ప్రతీ స్నేహితుడికి ముందుగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ నగరా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు ఇంటింట ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్వార్ జరుగుతోంది ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుంది ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలు వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుంది జగన్కు ఓటేస్తే.. ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి లేదంటే బాబు మార్క్తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడు జగన్కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్ మార్క్ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్తో కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది ఫ్యాన్కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుంది. అదే సమయంలో పెన్షన్ అందిస్తున్న జగన్ మార్క్ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశాం ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగింది. లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్ ముగింపు ఉంటుంది మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడు ఫ్యాన్కు ఓటేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్తో ముగింపు పడుతుంది. ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తేనే.. ఉచిత పంటల బీమా.. ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే రుణాలు, ఫ్యాన్పై రెండు ఓట్లేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే.. రైతన్నకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తేనే.. దళారిలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటలు కొనుగోలు అన్నది జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే అనేది గుర్తుపెట్టుకోండి లేదంటే.. చంద్రబాబు మార్క్తో ముగింపు ఫ్యాన్కు ఓటేస్తేనే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఫ్యాన్కు ఓటేస్తేనే గవర్నమెంట్ బడుల్లో రూపు రేఖలు మార్చే నాడు-నాడు ఫ్యాన్కు ఓటేస్తేనే మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ బోధన, మూడో తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరో తరగతికి వచ్చేసరికి డిజిటల్ బోధన, ఐఎఫ్బీ ప్యానల్స్, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇక పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ దీనిలో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన డిగ్రీ చదువుతున్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువుల్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ద్వారా విదేశాల్లో అతి ఉన్నత విద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం తొలిసారి డిగ్రీలో మ్యాండెటరీ ఇంటెర్న్షిప్ ఇవన్నీ కొనసాగి మీ పిల్లలు ఎదగాలంటే.. మీ బిడ్డ వైఎస్ జగన్ 10 ఏళ్లు ఇదే స్థానంలో ఉంటే జగన్ మార్క్ విప్లవాలు కొనసాగుతాయి. లేదంటే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, నాడు-నేడు రద్దు, బడి పిల్లలకు ఇచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే సమయానికి ఇచ్చే విద్యాకానుక రద్దు. ట్యాబ్స్, విద్యా కానుక, వసతి దీవెన ఇలా అన్నీ కూడా రద్దు చంద్రబాబు మార్క్తో కత్తిరింపులు, ముగింపులు చూడాల్సి ఉంటుంది మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. లకలక, లకలక అంటూ అన్నింటికి ముగింపు. ఫ్యాన్కు ఓటేస్తేనే గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు, ఫ్యాన్కు ఓటేస్తేనే ఫ్యామిలీ డాక్టర్, ఫ్యాన్కు ఓటేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష ఇంటివద్దనే టెస్టులు, గ్రామంలోనే మందులు గ్రామంలో రూపు రేఖలు మారుస్తూ నాడు నేడు రూ. 25 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య శ్రీతో పాటు ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్లు నిర్మాణం జగన్ మార్క్ ఈ విప్లవాలు కొనసాగాలంటే ఫ్యాన్పై రెండు ఓట్లేస్తేనే కొనసాగుతాయి లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాలి అంటూ వైద్యం అందని పరిస్థితుల్లోకి పేదవాడిని తీసుకు పోతుంది ఫ్యాన్కు ఓటేస్తేనే పిల్లల్ని బడులకు పంపే తల్లులకు అమ్మ ఒడి అనే పథకం, విద్యా దీవెన, వసతి దీవెన. ఫ్యాన్కు ఓటేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యాన్కు ఓటేస్తేనే కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యాన్కు ఓటేస్తేనే ఈబీసీ నేస్తం కొనసాగింపు ఫ్యాన్కు ఓటేస్తేనే ఓ వైఎస్సార్ జగనన్న కాలనీలు, అందులో 30 లక్షల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లలు.. అన్నీ కూడా వేగంగా అడుగులు ఫ్యాన్కు ఓటేస్తేనే.. నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబాలం ఇస్తూ యాబై శాతం రిజర్వేషన్లతో పదవులు అన్నీ కూడా ఉండాలంటే మీ బిడ్డ జగన్ మళ్లీ వస్తానే అనేది ఆలోచన చేయండి లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి వదల అంటాడు బాబు సిట్ అంటే పవన్ సిట్.. స్టాండ్ అంటే పవన్ స్టాండ్ ప్యాకేజీ స్టార్కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, గాజుగ్లాస్దే అయినా..యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది. బాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుంది. అక్క చెల్లెమ్మలకు గుర్తుందా? పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా? బాబు మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా మళ్లీ అక్క చెల్లెమ్మల బతుకులన్నీ అతలాకుతలం ఆవుతాయి. ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయండి.. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి ఎవరి ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఓటేయండి అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు.. మీ జీవితాలను, తలరాతలను మార్చే ఎన్నికలు మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? లేకపోతే దోచుకుని దాచుకుని చంద్రబాబు పాలన కావాలా? మీ బిడ్డ చేసిన పాలన అందరికీ కనబడుతోంది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి కాకినాడ వైఎస్సార్సీపీ రూరల్ అభ్యర్థి కన్నబాబు స్పీచ్ చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ సీఎం జగన్ నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తుంటే.. బాబు మాత్రం నాణ్యమైన మద్యం అందిస్తారంట వాలంటీర్ సేవలను అడ్డుకున్న కుట్రదారు చంద్రబాబు ఈ సందర్భంగా మేమంతా సిద్ధం అని తెలియజేసుకుంటున్నా అచ్చంపేట జంక్షన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్పై నడుస్తూ ప్రజలకు అభివాదం లక్షలాదిగా తరలి వచ్చిన ‘అభిమానం’ జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం కాకినాడ జిల్లా: అచ్చంపేట జంక్షన్కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర మరికాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం\ సభలో పాల్గోని ప్రసంగించనున్న సీఎం జగన్ జిల్లా నలమూలల నుండి సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు కాకినాడ జిల్లా: ఉండూరు క్రాస్ వద్ద జె.సత్యనారాయణ అనే పేషెంట్ను కలిసిన సీఎం జగన్ పిరుదు భాగంలో సర్జరీ కావడంతో వీల్ ఛైర్కి పరిమితం అయిన కాకినాడ రూరల్ తూరంగికి చెందిన సత్యనారాయణ. ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా ఆదుకుంటానని హమీ ఇచ్చి మానవత్వం చాటుకున్న సీఎం జగన్ కాకినాడ జిల్లా: ఉండూరు క్రాస్ నుండి ప్రారంభమైన మేమంతా సిద్దం సీఎం జగన్ బస్సుయాత్ర మరికాసేపట్లో తిమ్మాపురం మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గోననున్న సీఎం జగన్ బస్సుయాత్రలో సీఎం జగన్కు భద్రత కట్టుదిట్టం బస్సుయాత్రలో ప్రత్యేకంగా మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పోలీస్ శాఖ, ఐ పేజ్ సంయుక్తంగా కమాండ్ సెంటర్ పర్యవేక్షణ సీఎం జగన్ భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు వైఎస్సార్సీపీలోకి చేరిన టీడీపీ, జనసేన కీలక నేతలు కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన జనసేన, తెలుగుదేశం, కీలక నేతలు కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్సార్సీపీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి. రంగంపేట చేరుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్ చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనాలు బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ దారిపొడవునా సీఎం జగన్కు ఘన స్వాగతం భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో అఖండ స్వాగతాలు కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్లో మేమంతా సిద్దం సభ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభమైన మేమంతా సిద్దం బస్సు యాత్ర మరికాసేపట్లో కాకినాడ జిల్లాలో ప్రవేశించనున్న సిఎం జగన్ యాత్ర సీఎం జగన్కు ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్లపై బారులు తీరిన అశేష జనవాహిని నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు Memantha Siddham Yatra, Day -18. ఉదయం 9 గంటలకు ST రాజపురం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4.30 గంటలకు కాకినాడలో బహిరంగ సభ గోడిచర్ల దగ్గర రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/gtYVbwAgfq — YSR Congress Party (@YSRCParty) April 19, 2024 గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు కడియపులంకలో సీఎం వైఎస్ జగన్పై పూల వర్షం వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం -
మేమంతా సిద్ధం 17వ రోజు: సీఎం జగన్ బస్సు యాత్ర సాగిందిలా
Updates.. తూర్పుగోదావరి జిల్లా... 17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర పర్యటన ముగించుకుని రాజానగరం మండలం ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ రాజానగరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. భారీగా హాజరైన ప్రజలు. బస్సుపైకి ఎక్కి ప్రజలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్. రాజానగరం వైపు సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర రాజమండ్రి: గోకవరం బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న బస్సు యాత్ర. సీఎం జగన్కు స్వాగతం పలికిన జనం దేవి చౌక్ సెంటర్లో కిక్కిరిసిన జనం జనసంద్రంగా మారిన రాజమండ్రి రోడ్లు రాజమండ్రి నగరంలో సిఎం వైఎస్ జగన్ కి అపూర్వ స్వాగతం అభిమానుల సందోహంతో పోటెత్తిన ఆజాద్ చౌక్. పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం జగన్కు స్వాగతం పలికిన ముస్లింలు . జై జగన్ నినాదాలతో మార్మోగిన ఆజాద్ చౌక్ . తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులు. చర్చిసెంటర్కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర సీఎం జగన్కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్ అభివాదం రాజమండ్రి సిటీలో సీఎం జగన్కు ఘన స్వాగతం పలికిన అభిమానులు ఆనందంతో డాన్స్ వేసి మరి సీఎం జగనకు స్వాగతం పలుకుతున్న యువతులు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న రాజమండ్రి సిటీ జన సందోహంతో నిండిపోయిన మోరంపూడి, షెల్టన్, తాడితోట, ఆజాద్ చౌక్ , దేవి చౌక్ సెంటర్లు తాడితోట జంక్షన్కు చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్కు పూలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు బూడిది గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన బస్సు యాత్ర రాజమండ్రి నగరంలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సుయాత్ర మోరంపూడి జంక్షన్ దాటిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మరికాసేపట్లో తాడితోట జంక్షన్కు చేరుకోనున్న సీఎం బస్సుయాత్ర మోరంపూడి జంక్షన్కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్కు జనహారతి.. వేమగిరికి చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర వేమగిరిలో పోటెత్తిన జనసంద్రం సీఎం జగన్కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్ అభివాదం తూర్పుగోదావరి జిల్లా. కడియపులంకలో పోటెత్తిన జనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా రోడ్డుకు ఇరువైపుల బారులు తీరిన మహిళలు మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్కు జనహారతి కాసేపట్లో రాజమండ్రి నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షో కడియపు లంక చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర సీఎం జగన్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు తూర్పుగోదావరి జిల్లా: కడియపు లంక వద్ద జగన్కు స్వాగతం పలికేందుకు హైవే పై భారీగా చేరుకున్న ప్రజలు సీఎం జగన్ పై తమ అభిమానం చాటుకునేందుకు పెద్ద ఎత్తన కడియపులంక,దుళ్ళ,జేగురుపాడు గ్రామాల నుండి చేరుకున్న మహిళలలు. గంటల తరబడి మండుటెండలో జగన్ కోసం నీరిక్షణ సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న మహిళలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను నమ్మేది లేదని స్పష్టం చేసిన మహిళలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పొట్టిలంక భోజన విరామ ప్రాంతానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కోనసీమ జిల్లాలోకి మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రావులపాలెంలో సీఎం జగన్కు ఘన స్వాగతం మండుటెండలోనూ జననేత కోసం పోటెత్తిన అభిమానం సీఎం జగన్కు ప్రజల్లో అమితాదరణ కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో ఆఖండ స్వాగతాలు సీఎం జగన్ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు తేతలి నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు. రామకృష్ణంరాజును ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. వైఎస్సార్సీపీలోకి జనసేన, టీడీపీ కీలక నేతలు తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, టీడీపీకి చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలోకి చేరిక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ(ఏసుబాబు), టి.త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కేశనపల్లి డి. సూర్యనారాయణ. రాజోలు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు సారథ్యంలో వైఎస్సార్సీపీలోకి చేరిన జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన 17వ రోజు కొనసాగుతోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మండుటెండను సైతం లెక్కచేయక జననేత కోసం పోటెత్తిన జనం పలువురి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్ ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా సాగుతున్న యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా బస్సు యాత్ర తేతలి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదగా ఎస్టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభం తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదగా ఎస్టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర అభిమానం.. ఆకాశమంత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో అమితాదరణ కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు జిల్లాలు దాటి ఎండా, వాన లెక్క చేయకుండా ప్రయాణం పగలూ, రాత్రి తేడా లేకుండా వేచిచూస్తున్న అవ్వాతాతలు చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత వేలాది బైకులతో భారీ ర్యాలీలు గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలలు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణ సంచాలతో అఖండ స్వాగతాలు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు Day-17 తూర్పు గోదావరి జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2024 నేడు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఇలా.. సీఎం జగన్ రాత్రి బస చేసిన తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
YSRCP తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థులు వీళ్లే
తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
టీడీపీకి రాజీనామా దిశగా మాజీ మంత్రి కేఎస్ జవహర్?
సాక్షి, తూర్పుగోదావరి: టికెట్ దక్కకపోవడంతో టీడీపీని వీడే యోచనలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జవహర్.. అధిష్టానం ఫోన్లకు సైతం స్పందించలేదు. జవహర్ను బుజ్జగించేందుకు ముప్పినేని వెంకటేశ్వర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జవహర్ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో చంద్రబాబు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కొవ్వూరు టికెట్ను జవహర్ ఆశిస్తుండగా, నిన్న ప్రకటించిన జాబితాలో కొవ్వూరు స్థానాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించిన సంగతి తెలిసిందే. జవహర్.. కొవ్వూరులోని నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇవాళో, రేపో టీడీపీని వీడే ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మాజీ మంత్రి కేఎస్ జవహర్కు ఘోర అవమానం ఎదురైందా? పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెట్టారా? ద్విసభ్య కమిటీలోని ఓ నేత ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా? ఏళ్ల తరబడి పార్టీకి చేసిన సేవను లెక్క చేయకుండా పక్కన పెట్టేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల రెండో జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈసారి జవహర్కు కొవ్వూరు టికెట్టు దక్కనీయకుండా పార్టీలోని ఆయన వైరివర్గాలు బలంగా పని చేశాయి. దీంతో ఒకవేళ ఇక్కడ కాకపోయినా గత ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనైనా టికెట్టు ఇస్తారని జవహర్ వర్గం భావించింది. కానీ, అక్కడ టీడీపీ అభ్యర్థిగా కొటికలపూడి శ్రీనివాసరావును అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గోపాలపురం నియోజకవర్గానికై నా పంపుతారని భావించగా.. మద్దిపాటి వెంకట్రాజు పేరు ఖరారు చేసింది. ఇప్పుడు కొవ్వూరులో కూడా ముప్పిడి పేరు ప్రకటించడం ద్వారా అన్నిచోట్లా జవహర్కు చంద్రబాబు మొండిచేయే చూపారు. ఫలితంగా పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో మాత్రమే కొనసాగే పరిస్థితి జవహర్కు ఏర్పడింది. ఈ పరిణామంతో ఆయన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భగ్గుమన్న జవహర్ వర్గీయులు పార్టీ జిల్లా అధ్యక్షుడు.. అందునా మాజీ మంత్రి అయిన జవహర్నే పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్గా మారింది. జిల్లా స్థాయి నేతనే ఇలా పరాభవిస్తే.. ఇక సామాన్య నేతలకు టీడీపీలో న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ఆయా వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. అధినేత నిర్ణయం జవహర్ వర్గీయులకు మింగుడు పడటం లేదు. తమ నేతకు చేసిన అవమానానికి పార్టీ తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని వారు సవాల్ విరుసుతున్నారు. ఈ అవమానంపై వారు భగ్గుమన్నారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫెక్ల్సీలను చించేశారు. అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో జవహర్ తన వర్గీయులతో సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జవహర్ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం సుజయకృష్ణ రంగారావును పంపింది. పార్టీ ఆదేశాల మేరకు పని చేయాలని సూచిస్తున్నా జవహర్ ససేమిరా అంటున్నారు. -
అన్నీ లాగేసుకుని.. ఇదేం లిస్ట్ బాబూ..?
తూర్పుగోదావరి/పశ్చిమ గోదావరి: ముందు నుంచి ఊహించిందే జరిగింది. టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన తర్వాత ఇరు పార్టీల నుంచి అసంతృప్త జ్వాలలు తారాస్థాయికి చేరాయి. కొన్ని చోట్ల ఆ పార్టీల ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అధిష్టానానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. రాజానగరంలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి ఎదురైంది. అలాగే.. రాజమండ్రి రూరల్ స్థానానికి ఇప్పటిదాకా ఇరు వర్గాలకు క్లారిటీ లేకుండా చేశారు. దీంతో.. టీడీపీ సీనియర్ బుచ్చయ్య చౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక.. ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. మరోవైపు.. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు సీట్లు టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. తణుకులో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని స్వయంగా ప్రకటించిన పవన్.. ఇప్పుడు చంద్రబాబుకి తలొగ్గి ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేశాడని కేడర్ మండిపడుతోంది. ఇక.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, చింతలపూడి స్థానాల్ని సైతం టీడీపీనే లాగేసుకుంది. ఈ క్రమంలో.. మాజీ మంత్రి పీతల సుజాతకు మొండి చేయి చూపించారు చంద్రబాబు. ఇక.. చింతలపూడి లో నాన్ లోకల్కి టికెట్ కేటాయించడంతో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంగా రోషన్కు టికెట్ ఇవ్వడంపై టీడీపీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. తాడేపల్లిగూడెం, నరసాపురం స్థానాల్లో టిడిపి జనసేన మధ్య కుమ్ములాటలతో తొలి జాబితాలో పంచాయితీ తేలలేదు. ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేననేత రెడ్డప్పల నాయుడుకి భంగపాటే ఎదురైంది. ఉండి నియోజకవర్గంలో టికెట్ పై ఆశకు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ మాట ఇచ్చినా విడివాడ రామచంద్ర రావుకు సీటు దక్కలేదు. పాపం.. తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందంటూ ప్రచారం చేసుకున్న విడివాడ రామచంద్ర రావుకు చుక్కెదురైంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019