breaking news
-
ప్రజల్లోకి సీఎం వైఎస్ జగన్ డైనమిక్ ఎంట్రీ
-
Birthday Special: యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
శామ్కో నుంచి డైనమిక్ అస్సెట్ ఫండ్
ముంబై: శామ్కో అస్సెట్ మేనేజ్మెంట్ ‘డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్’ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. స్థిరత్వం, వృద్ధి అవకాశాలు, మార్కెట్ల కరెక్షన్లలో రక్షణ ప్రయోజనాలతో ఈ పథకం ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లలో మరీ ప్రతికూల పరిస్థితులు కనిపించిన సందర్భాల్లో పెట్టుబడులను పూర్తిగా డెట్లోకి మార్చడం ఈ పథకం విధానంలో భాగంగా ఉంటుంది. పెట్టుబడులు అన్నింటినీ డెట్కు మార్చే తొలి డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. అలాగే, ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా మారినప్పుడు అవసరమైతే నూరు శాతం పెట్టుబడులను అందులోకి మళ్లించగలదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డెట్, ఈక్విటీల మధ్య పెట్టుబడులను మారుస్తూ, రిస్క్ తగ్గించి, మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. డిసెంబర్ 7 నుంచి 21వ తేదీ వరకు ఈ నూతన పథకం (ఎన్ఎఫ్వో) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
‘ఉమ్మడి’ అనుబంధాల కలబోత
ప్రాంతాలు వేరయ్యే వేళ.. ఇరు ప్రాంతాల ఉద్యోగుల ఆత్మీయ కలయిక పంచాయతీరాజ్ కార్యాలయంలో గెట్ టుగెదర్ పంజగుట్ట, న్యూస్లైన్ : వారంతా 25 సంవత్సరాలుగా కలిసి పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయి ఉద్యమాలు చేశారు. విడిపోవాలని కొందరు.. కలిసుండాలని మరికొందరు విడివిడిగా ఆందోళనలు చేశారు. తెలంగాణ ఉద్యోగులు సకల జనుల సమ్మె చేస్తే.. సీమాంధ్ర ఉద్యోగులు 60 రోజుల పాటు విధులు బహిష్కరించారు. ఉద్యమం సమయంలో పోటాపోటీ నినాదాలు... తోపులాటలు... ఘర్షణ వాతావరణం... తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు... ఉద్యమానికే ఆ కార్యాలయం కేంద్ర బిందువుగా మారింది. సీన్ కట్ చేస్తే... రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో శుక్రవారం ఇరు ప్రాంతాల వారు గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ములా కలిసుందామంటూ అందరూ కలిసి సమైక్య రాష్ట్రంలో ఆఖరి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఎర్రమంజిల్లోని పంచాయతీ రాజ్ కార్యాలయం వేదికయింది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగులు, మిత్రులతో కలిసి సహపంక్తి బోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్రాంతాలకతీతంగా అందరూ పాల్గొని ఎంతో ఆనందంగా గడిపారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘కేవలం రాష్ట్రాలు మాత్రమే విడిపోయాయి. మన బందాలు ఎన్నటికీ విడిపోవు’ అంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. విడిపోయినా కలిసి ఉందామనే.. ఉద్యమ సమయంలో ఉద్యమానికే మా కార్యాలయాలు కేంద్ర బిందువుగా నిలిచాయి. రాబోయే రోజుల్లో ఇరుగు, పొరుగు రాష్ట్రాలుగా ఒకరి అవసరం మరొకరికి ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములా కలిసి ఉందామనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. - అబు శ్రీనివాస్, ఇండియా ఇంజనీర్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ రాష్ట్రాలు వేరైనా ఒక్కటేనని చాటిచెప్పాలి 1947లో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. కాని ఇప్పటికీ మన పిల్లలకు పాకిస్థాన్ ప్రమాదకర దేశమని చెబుతుంటాం. అలాంటి వాతావరణం కలగకుండా తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఒక్కటేనని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాలి. ఉద్యోగులు ఒకరికి మరొకరు సహాయ సహకారాలు అందిస్తూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలి. - సీవీఎస్ రామ్మూర్తి, ఇంజనీర్ ఇన్ చీఫ్, పంచాయతీరాజ్ -
సిల్క్ రూట్లో సాహసి
సాక్షి, సిటీబ్యూరో: మూడు దేశాలు... పదిహేనువేల కిలోమీటర్లు... యాభై ఐదు రోజుల సుదీర్ఘమైన ప్రయాణం. ఆ దేశాల భాషతో పెద్దగా పరిచయం లేదు. తెలిసిన బంధువులు, స్నేహితులు లేరు. జ్ఞానీ లోక సంచారి అన్నట్లు... అరవై రెండేళ్ల వయస్సులో ఒంటరిగా సాహసోపేతమైన యాత్ర పూర్తి చేశారు పరవస్తు లోకేశ్వర్. ‘సలామ్ హైదరాబాద్’ నవల, చత్తీస్గఢ్ స్కూటర్ యాత్ర ద్వారా సుపరిచితులైన పరవస్తు లోకేశ్వర్ తన 62 ఏళ్ల వయస్సులో ఉజ్బెకిస్తాన్, కిరిగిస్తాన్, చైనా దేశాల ను కలిపి 15 వేల కిలోమీటర్ల సిల్క్రోడ్డుపై సాహస యాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఆ పర్యటన అనుభవాలపై ఆయన రాసిన ‘సిల్క్ రూట్లో సాహసయాత్ర’ పుస్తకం మంగళవారం ఆవిష్కరించనున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి 55 రోజుల పాటు సాగిన పర్యటన విశేషాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ సంగతులు ఆయన మాటల్లోనే... రాహుల్ స్ఫూర్తి... ఎంతోమంది యాత్రికులు ప్రపంచదేశాల్లో పర్యటించారు. వారి అనుభవాలను గ్రంధస్తం చేశారు. ఆ అనుభవాలే నాగరికతా పరిణామాన్ని, వికాసాన్ని అధ్యయనం చేసేందుకు, అర్థం చేసుకొనేందుకు దోహదం చేశాయి. చిన్నప్పటి నుంచి రాహుల్ సాంకత్యాయన్ అంటే ఎంతో ఇష్టం. ఆయనలాగా పర్యటించాలని కోరిక. తిరగడం వల్లనే జ్ఞానం లభిస్తుందని నా విశ్వాసం. గతంలో 3 వేల కిలోమీటర్ల చత్తీస్గఢ్ యాత్రను 15 రోజుల్లో పూర్తి చేశా. బస్తర్లో పర్యటించా. అలాగే ప్రపంచానికి వైభవోపేతమైన నాగరికతను పరిచయం చేసిన మధ్య ఆసియా దేశాల్లో పర్యటించాలనే కోరిక కలిగింది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో చైనా నుంచి రోమ్కు సిల్క్తో పాటు, పింగాణి, పేపర్, మందుగుండు వంటి వస్తువులను ఎగుమతి చేసిన రోడ్డు మార్గానికి సిల్క్రూట్ అనే పేరు స్థిరపడింది. ఆ రూట్లో ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, చైనాల్లో పర్యటించా. గతేడాది సెప్టెంబర్ 1న ఢిల్లీ నుంచి బయలుదేరి 2న తాష్కెంట్ చేరుకున్నా. అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గంలో 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లోని పలు ప్రాంతాలను సందర్శించిన అనంతరం భుకారా, సమర్ఖండ్ మీదుగా కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ వెళ్లా. అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకొని 25 రోజులు బస చేశా. మధ్య ఆసియాలోని స్విట్జర్లాండ్గా పేరు గడించిన కిర్గిస్తాన్ ఎంతో అందమైన దేశం. లాంగ్మార్చ్ జ్ఞాపకాలు... కిర్గిస్తాన్ నుంచి చైనాకు రోడ్డు మార్గం ద్వారా రావచ్చు. కానీ సరిహద్దులో చైనా సైన్యం నన్ను అడ్డుకుంది. నన్ను గూఢచారిగా అనుమానించి అనుమతి నిరాకరించారు. దాంతో విమానంలో బీజింగ్ చేరుకున్నా. భారత్లాగే 4 వేల ఏళ్లకు పైగా గొప్ప చరిత్ర ఉన్న చైనాపై అధ్యయనం ఎంతో సంతృప్తినిచ్చింది. ఎనాన్లోని మావో జెడాంగ్, ఆయన సహచరుల స్థావరాలు, వారు వినియోగించిన వస్తువులు, టేబుళ్లు, కుర్చీలు,పుస్తకాలు, వంటపాత్రలు, విప్లవకారుల నిరాడంబరమైన జీవిత విధానాన్ని ప్రతింబింబించే అనేక అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. లాంగ్మార్చ్ విశేషాలను చెప్పే రెవల్యూషనరీ మ్యూజియంను సందర్శించా. ప్రాచీన బౌద్ధమత క్షేత్రాలు, మైనార్టీ తెగలు నివసించే కుచె, ఉరిమించి, షియాన్, కోటాన్, యార్ఖండ్, లీషాన్ వంటి ప్రాంతాలు పర్యటించాను.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019