breaking news
-
Singapore PM: మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
సింగపూర్: సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు లూంగ్ సోమవారం తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. సింగపూర్కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. -
బ్రిటన్ ఉప ప్రధాని రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు అక్కడ ఎదురు గాలి వీస్తోంది. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖలో పాటు వైట్హాల్ విభాగాల్లో ఆయన సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ రిపోర్ట్ గురువారం ప్రధాని సునాక్కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డొమినిక్ రాబ్ తన పదవులకు రాజీనామా ప్రకటించారు. ఈ సీనియర్ కన్జర్వేటివ్ ఎంపీ తన పేషీలో పని చేసే సిబ్బందిని వేధించినట్లు, అవమానించినట్లు, ఏడ్పించినట్లు.. సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ గార్డియన్ తొలుత బయటపెట్టింది. అయితే.. ఆరోపణలను డొమినిక్ రాబ్ ఖండిస్తూ వస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీనియర్ న్యాయవాది అడమ్ టోలీని కిందటి ఏడాది నవంబర్లో నియమించారు ప్రధాని సునాక్. రెండు ఫిర్యాదుల మీద మొదలైన ఈ వ్యవహారంలో దర్యాప్తు.. మలుపులు తీసుకుంటూ ఎక్కడికో పోయింది. రాబ్కు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించుకుంటూ పోయింది అడమ్ టీం. రాబ్ దగ్గర పని చేసే సిబ్బంది నుంచి వాంగ్మూలం సేకరించి.. నివేదికను సిద్ధం చేసింది. గురువారం ఆ నివేదికను రిషి సునాక్కు సమర్పించారు అడమ్ టోలీ. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ లోపే రాబ్ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు. My resignation statement.👇 pic.twitter.com/DLjBfChlFq — Dominic Raab (@DominicRaab) April 21, 2023 అయితే.. తీవ్ర ఆరోపణలు, రాబ్పై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ సునాక్ను.. మంత్రిగా కొనసాగించడంపై ప్రధాని రిషి సునాక్ రాజకీయపరంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు కిందటి ఏడాది అక్టోబర్లో రిషి సునాక్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు కేబినెట్ మంత్రులు వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే పదవుల నుంచి వైదొలగాల్సి రావడం గమనార్హం. -
ఉపప్రధాని భార్యను అపహరించిన ఉగ్రవాదులు
బోకో హరామ్ ఉగ్రవాదులు తెగ రెచ్చిపోతున్నారు. సొంత దేశం నైజీరియాలోనే కాదు, పొరుగున ఉన్న కామెరూన్ లోనూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. సరిహద్దు దాటి వచ్చి మరీ కామెరూన్ లోని కోలోఫాటా నగరంపై దాడి చేశారు. చేయడమే కాదు ఏకంగా ఆ దేశ ఉప ప్రధాని అమదౌ అలీ భార్యను, నగర మేయర్ ను, మరి కొంత మందిని అపహరించుకుపోయారు. ఉగ్రవాదులు తమ దేశంలోని తమ రహస్య స్థావరాలకు వీరిని తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కామెరూన్ ప్రస్తుతం తన సైన్యాలను సరిహద్దు వెంబడి మొహరించింది. ఇప్పటికే నైజీరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు పొరుగు దేశాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. బోకో హరామ్ ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. దీనికి అల్ కాయిదాతో సంబంధాలున్నాయి. పాశ్చత్య విద్యా విధానానికి వ్యతిరేకంగా కూడా బోకో హరామ్ పోరాడుతోంది. ఇప్పటికే నైజీరియాలోని 200 మందికి పైగా విద్యార్థినులను బోకో హరాం ఉగ్రవాదులు అపహరించుకుపోయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. -
కనీసం ఉప ప్రధాని పోస్టయినా!
ఆనాడు అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి కాదనుకున్నా.. ఈనాడు కనీసం ఉప ప్రధానిని కాలేకపోతానా...? అని అనుకుంటున్నారట టీడీపీ అధినేత. ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు ఏదో అన్నట్టు ఇదెక్కడి లెక్కబ్బా... అని తెలుగు తమ్ముళ్లు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారట. అసలు ఎన్నికలే లేవు.. పైగా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం పార్టీలో ఎవరికీ లేనేలేదు. అలాంటప్పుడు అదీ కేంద్రంలో పెద్ద పోస్టుమీద కన్నేయడంలోని ఆంతర్యమేంటని నేతలు కిందామీదా పడుతున్నారు. ముందేదో చెప్పినా ఇప్పుడు మూడో ఫ్రంట్ ఊసే ఎత్తడం లేదు. మోడీతో జోడీ కట్టాలని ఉబలాటపడుతున్నా అదింకా కుదరనే లేదు. అయినా కాబోయే ఉప ప్రధాని అని ఎందుకు చెప్పుకుంటున్నట్టు...! నేతలకేం పాలుపోవడం లేదట. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంతో కొందరు నేతలు అసలు దీనివెనుక ఉన్న మర్మమేంటని తెలుసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ‘సుదీర్ఘకాలం సీఎంగా చేశారు. అపొజిషన్ లీడర్గా చేశారు. అందుకే ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించార’ంటూ కొందరు నేతలు విలేకరుల వద్ద పనిగట్టుకుని ప్రచారం మొదలుపెట్టారు. మీ నాయకుడు ఏం చేసినా దానివెనుక ఏదో ఒక మతలబు ఉంటుంది కదా...! దీనివెనుకా ఏదో ఉండే ఉంటుందని మీడియా మిత్రులు అడిగినప్పుడు ఒక నేత అసలు గుట్టును విప్పారు. ‘గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ను కాపాడుతున్నందుకు మా నాయకుడిపై ఈగ కూడా వాలలేదు. రేపటి రోజున కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారో తెలియదు. రాష్ట్రంలో అధికారం దక్కదని తేలిపోయింది. అందుకే సెంటర్లో అన్ని ఆప్షన్స్ ఓపెన్గా పెట్టుకున్నారు. కేంద్రంలో ఎవరొచ్చినా ఎమ్మార్, ఐఎంజీ లాంటి కేసులేవీ తిరగదోడే అవకాశం రాకూడదు..!’ అని ఆ నాయకుడు ఏవో లెక్కలు చెబుతుంటే... ఉప ప్రధాని కథ చెప్పమన్నప్పుడు... ‘అన్నా...! ఉప ప్రధాని పదవి అంటే అందులో హోం శాఖ ఉండే అవకాశమూ ఉంది. దాని పరిధిలోనే సీబీఐ ఉంటుంది...’ అంటూ అసలు గుట్టు విప్పడంతో విస్మయపోవడం మీడియా మిత్రుల వంతైందట.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019