breaking news
-
హెచ్డీఎఫ్సీ.. ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన దీపక్ పరేఖ్.. తదుపరి ఎవరంటే..
హెచ్డీఎఫ్సీ లైప్ ఇన్సూరెన్స్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దీపక్ పరేఖ్ వైదొలిగారు. ఈనెల 18 వ్యాపార వేళలు ముగిసినప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 24 ఏళ్లుగా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్గా ఆయన అందించిన సేవలకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది. పరేఖ్ అనంతరం ఎవరు ఈ కంపెనీని ముందుండి నడిపిస్తారనే వాదనలను తెరదించుతూ కొత్త ఛైర్మన్ను కూడా ఏకగ్రీవంగా నియమించారు. కేకి ఎం మిస్త్రీను సంస్థ ఛైర్మన్గా నియమిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. 23 ఏళ్లుగా కంపెనీలో ఉన్న ఆయన ప్రస్తుతం బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆయన క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సహ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మిస్త్రీ హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ పొందిన అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇదీ చదవండి: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే.. ఏప్రిల్ 24, 2024న వికె విశ్వనాథన్, ప్రసాద్ చంద్రన్ తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఇటీవల వెంకట్రామన్ శ్రీనివాసన్ను ఐదేళ్ల కాలానికిగాను నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సు ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్గా నియమించినట్లు కంపెనీ గతంలోనే పేర్కొంది. -
మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. అలాగే తప్పుడు సమాచారంపై కీలక హెచ్చరిక చేశారు. ‘వాట్సాప్ యూనివర్శిటీ’ విస్తరణ, మార్కెట్లలో డబ్బు సంపాదించడంపై వస్తున్న తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండలన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రజలు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేలా చూసుకోవాలని , HDFC AMC . HDFC లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్తో ప్రారంభించి, ఆ తరువాత కొన్ని చిట్కాలతో నేరుగా మార్కెట్లలో పెట్టుబడులతో భారీ లాభాలు పొందవచ్చని భావించి నష్టపోయిన పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. ముందు మార్కెట్పై అవగాహన పెంచుకోవాలన్నారు. (నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్) ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో అవకాశాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
హెచ్డీఎఫ్సీలో చేరినప్పుడు దీపక్ పరేఖ్ జీతం.. ఆన్లైన్లో 1978 నాటి ఆఫర్ లెటర్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో హెచ్డీఎఫ్సీ విలీనం పూర్తయింది. విలీనం తర్వాత జూలై 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. ఈ మెగా విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ భావోద్వేగ లేఖలో రిటైర్మెంట్ ప్రకటించారు. తాను తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ జూన్ 30న తన పదవీ విరమణను ప్రకటించారు. 1978 నాటి పరేఖ్ ఆఫర్ లెటర్ హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ సంస్థలో చేరినప్పటి ఆఫర్ లెటర్ ఆన్లైన్లో కనిపించింది. 1978 జూలై 19 తేదీతో ఈ ఆఫర్ లెటర్ జారీ అయింది. అప్పట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా హెచ్డీఎఫ్సీ ఆయన ఉద్యోగం ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ లెటర్ ప్రకారం పరేఖ్ బేసిక్ జీతం రూ. 3,500. ఫిక్స్డ్ డియర్నెస్ అలవెన్స్ రూ. 500. అలాగే 15 శాతం హౌసింగ్ రెంట్ అలవెన్స్, 10 శాతం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఉంటుందని అందులో పేర్కొన్నారు. అదనంగా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, వైద్య ప్రయోజనాలు, సెలవు ప్రయాణ సౌకర్యాలకు కూడా పరేఖ్ అర్హులు. ఆయన నివాస టెలిఫోన్ ఖర్చును చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ ఆఫర్ లెటర్లో పేర్కొంది. కాగా దీపక్ పరేఖ్ రిటైర్మెంట్ను సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన రోజుతో పోల్చారు ఆర్పీజీ చైర్మన్ హర్ష్ గోయంక. ఆర్థిక ప్రపంచంలో పరేఖ్ను నిజమైన టైటాన్గా ఆయన అభివర్ణించారు. 78 ఏళ్ల దీపక్ పరేఖ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎలాంటి పాత్రను చేపట్టడం లేదు. హెచ్డీఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేకీ మిస్త్రీ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్కు లోబడి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులో చేరే అవకాశం ఉంది. -
హెచ్డీఎఫ్సీ విలీనం: వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ బ్యాంక్స్లో స్థానం
న్యూఢిల్లీ: రెండు దిగ్గజాల విలీనం తదుపరి పలు ప్రయోజనాలు చేకూరనున్నట్లు మార్ట్గేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం ద్వారా గ్రూప్ కంపెనీలు మరింత పటిష్టపడనున్నట్లు తెలియజేశారు. అమ్మకాలు, నిర్వహణ(ఎగ్జిక్యూషన్), భారీ అవకాశాలు వంటి అంశాలు లబ్ధిని చేకూర్చనున్నట్లు వివరించారు. నేటి(జూలై 1) నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం కానుంది. ఈ విలీనంతో భారతీయ కంపెనీ తొలిసారి ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకులలో ఒకటి చేరనుంది. దీంతో గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీకి 46 ఏళ్లుగా సేవలందించిన పరేఖ్కు శుక్రవారం చివరి పనిదినంగా మారనుంది. దీంతో వాటాదారులకు చివరి సందేశాన్ని వినిపించారు. బ్యాంకుగల కీలక సమర్థతలు గృహ రుణ విభాగానికి మరింత బలాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. గృహ రుణ వినియోగదారుల్లో నిలకడను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్కుగల డిజిటైజేషన్ ప్లాట్ ఫామ్లతో పాటు.. భారీ పంపిణీ నెట్వర్క్ గృహ రుణాలతోపాటు గ్రూప్ కంపెనీలకూ ప్రోత్సాహాన్ని వ్వనున్నట్లు వివరించారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 25 షేర్లకు గాను 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు కేటాయించనున్న సంగతి తెలిసిందే. 40 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల మార్పిడి ద్వారా చోటుచేసుకుంటున్న విలీనం దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద లావాదేవీగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ విలీనం సంస్థ రూ. 18 లక్షల కోట్ల ఆస్తులతో ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో భారీ దిగ్గజంగా ఆవిర్భవించనుంది. విలీనానికి బోర్డుల గ్రీన్సిగ్నల్ ఫైనాన్షియల్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనానికి రెండు సంస్థల బోర్డులూ ఆమోదముద్ర వేశాయి. దీంతో నేటి(జూలై 1) నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కానుంది. (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) కాగా, బీమా రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ఎర్గోలో మార్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తాజాగా 0.5097శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో వాటాను 50.5 శాతానికి పెంచుకుంది. తద్వారా హెచ్డీఎఫ్సీ ఎర్గోను అనుబంధ సంస్థగా మార్చుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనానికి వీలుగా తాజా కొనుగోలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. వారాంతాన బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేరు 1.5 శాతం లాభపడి రూ. 2,822 వద్ద నిలవగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం 1.5 శాతం పుంజుకుని రూ. 1,702 వద్ద స్థిరపడింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019