breaking news
-
డీ గ్లామర్ పాత్రలే కాదు బోల్డ్ సీన్స్లోనూ రచ్చచేసే బ్యూటీ (ఫోటోలు)
-
వెల్కమ్ దాసరి హర్షిత.. జపాన్ నుంచి నేడు స్వదేశానికి..
సాక్షి, కరీంనగర్: తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి జిల్లా పేరు ఇనుమండింపజేసిన దాసరి హర్షిత అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ఆదివారం స్వదేశానికి చేరుకోనుంది. రామగిరి మండలం చందనాపూర్ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న హర్షిత ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు జపాన్ రాజధాని టోక్యో వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకూర కార్యక్రమంలో పాల్గొంది. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా నిర్వహించిన 9వ జాతీయ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన పోటీల్లో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు హాజరవగా.. హర్సిత ప్రతిభ చూపించింది. కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి జితేంద్రసింగ్ నుంచి అవార్డును అందుకున్నట్లు డీఈవో మాధవి తెలిపారు. అలాగే ఈఏడాది ఏప్రిల్ 10 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఫైన్ కార్యక్రమంలో పాల్గొని నేరుగా రాష్ట్రపతికి తను రూపొందించిన బహుళ ప్రయోజనకర హెల్మెట్ గురించి వివరించి మన్ననలు పొందింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రగతిమైదాన్లో మే 10, 11, 12వ తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలోనూ ప్రతిభ చాటింది. మనరాష్ట్రం నుంచి 9వ జాతీయ ప్రదర్శన పోటీల్లో విజేతలైన 8 మంది విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ కార్యక్రమానికి ఎంపికై ంది. దేశం నలుమూలల నుంచి ఏడు, ఎనిమిది, తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డు– మనక్ పోటీల్లో విజేతలైన 59 మంది విద్యార్థులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మనరాష్ట్రం నుంచి ఆరుగురు విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఆదేశంలోని మన రాయబార కార్యాలయంతోపాటు పలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన 15కు పైగా ప్రదేశాలను తిలకించి రావడం హర్షిత ప్రత్యేకత. పాఠశాల స్థాయి నుంచే.. పాఠశాలస్థాయి ప్రదర్శన నుంచే చైనా, సైప్రస్, ఉజ్బెకిస్తాన్, తజబిస్తాన్ లాంటి దేశాల విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి అరుదైన అవకాశం మనదేశంలోని గ్రామీణి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హర్షితకు రావడం విశేషం. ఆమెను ప్రో త్సాహించిన గైడ్ టీచర్ సంపత్కుమార్ను డీఈవో మాధవి, జిల్లా సైన్స్ అధికారి రవినందన్రావు, హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు. -
దాసరి సినీ అవార్డుల ప్రదానోత్సవం
ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (ఫాస్) ఈ ఏడాది దాసరి ఫిల్మ్ అవార్డు విజేతల ఎంపిక వివరాలను సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డ్ సభ్యులు కె. ధర్మారావు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 6న హైదరాబాద్లో జరగనుంది. డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్గా శేఖర్ కమ్ముల (ఫిదా), ఉత్తమ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్ లవ్బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్ బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవని, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా.ఎ. నటరాజుకు ప్రదానం చేయనున్నారు. ఫాస్–దాసరి కీర్తి కిరిట సిల్వర్క్రౌన్ అవార్డులను దర్శకులను కోడి రామకృష్ణ, టీవీ యాంకర్ సుమ కనకాలకు అందజేయనున్నారు. దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్హిట్ సినీ వార పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ నిర్మాత బీఏ రాజు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకల సత్యానారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి సభను ప్రారంభించనున్నారు. సన్మానకర్తగా దర్శకుడు ఎన్.శంకర్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ చైర్మన్గా లయన్ ఎ. విజయ్కుమార్ వ్యవహరించనున్నారు. శ్రీమతి టి.లలితబృందం దాసరి సినీ విభావరి నిర్వహించనున్నారు. -
అందుకే మోహన్బాబు ‘నట విశ్వ సార్వభౌమ’ – టీయస్సార్
‘‘నటుడిగా నేను 40 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నన్ను తెలుగు తెరకు పరిచయం చేసిన దాసరిగారి సమక్షంలో వైజాగ్లో ఫంక్షన్ చేశారు టీయస్సార్. కళాకారులను గౌరవించాలనే ఆలోచన రావడం మామూలు విషయం కాదు. ఈ ఆలోచన వచ్చిన వ్యక్తి నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో వన్ అండ్ వోన్లీ పర్సన్ టీయస్సార్. ఇది డబ్బుతో కూడుకున్న విషయం కాదు. మనసు ఉండాలి. అభినందనలు వేరు కానీ నాకు ఈ బిరుదు (విశ్వ నట సార్వభౌమ) ప్రదానం చేయటం ఇబ్బందిగా అనిపించింది. టీయస్సార్ నేను ఊళ్లో లేనప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత నీకీ బిరుదు ఇస్తున్నాం అంటే కాదనలేకపోయాను’’ అన్నారు మంచు మోహన్బాబు. టి.సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూర్, ముంబై, ఢిల్లీ.. ఇలా పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ 17న హైదరాబాద్లో ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించనున్నారు. ఈ విశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 600 ఏళ్ల క్రితం ఓరుగల్లు ముఖ్య పట్టణంగా కాకతీయ రాజులు తెలుగు కళలను, నాగరికతను అద్భుతంగా ప్రోత్సహించారని ప్రసిద్ధి. వారి పాలన స్వర్ణ యుగం అని కవులు వర్ణించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఎంతో ప్రోత్సహించారు. ఈసారి మేం టీయస్సార్ కాకతీయ లలిత కళా పరిషత్ ఏర్పాటు చేశాం. తెలంగాణ ముఖ్య ప్రాంతాలలో కాకతీయ కళా వైభవోత్సవాలు చేయాలి, తెలుగు ప్రజల్ని మరోసారి రంజింపజేయాలని నిశ్చయించుకున్నాం. ఇందులో భాగంగా ముందు హైదరాబాద్లో ఈ నెల 17న భారీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 42 ఏళ్లుగా ఏకధాటిగా నటిస్తూ, 560 సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి, తనకంటూ ఓ స్థాయి క్రియేట్ చేసుకున్న మోహన్బాబుకు ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదును ప్రదానం చేయబోతున్నాం. ఆ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుగారు వస్తున్నారు’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘సుబ్బిరామి రెడ్డిగారి ఇంటి పేరు ‘టి’ అని కాకుండా కళా అని పెట్టి ఉంటే బావుండేది. కళాకారులను సత్కరించి తాను సంతృప్తి పొందుతుంటాడు. కాకతీయ శబ్దాన్ని కళా పరిషత్లోకి తీసుకొచ్చారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన రాజ్యాధినేత రుద్రమదేవి. కాకతీయ ద్వారంలోనే కళ కనపడుతుంది. మోహన్బాబు తెర మీద కనపడగానే ఈలలు కొడతారు. ఆయన మమల్ని ఆప్యాయంగా అగ్రజా అని పిలుస్తుంటారు. ఆయనకు సన్మానం జరుగుతుంది అంటే మాకు జరిగినట్టే. ఆ బిరుదుకు మోహన్బాబు అర్హుడు’’ అన్నారు. రాజేంద్రప్రసాద్, విష్ణు, మనోజ్, పోసాని కృష్ణమురళి, అలీ, జయప్రద, జయసుథ, లక్ష్మీప్రసన్న, శ్రియ తదితర సినీరంగ ప్రముఖులు, మధుసూ«ధనాచారి, కె. స్వామిగౌడ్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. -
దాసరిగారు మనుషుల్లో మాణిక్యం– చిరంజీవి
‘‘దాసరిగారి గురించి ఇలాంటి పుస్తకాలు ఎన్ని రాసినా, ఇంకా మిగిలి ఉండే ఘనమైన చరిత్ర ఆయనది. ఆయన తెలుగువారికి దిగ్దర్శకులుగా ఉండటం మనం చేసుకున్న అదృష్టం. తెలుగు పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన్ను మర్చిపోలేము’’ అన్నారు నటుడు చిరంజీవి. దర్శకరత్న దాసరి నారాయణరావుగారు జీవితంపై సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన ‘తెరవెనుక దాసరి’పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించి, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డికి అందించారు. రెండో ప్రతిని దర్శకుడు రాఘవేంద్రరావుకి అందించారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సభలో ముఖ్యంగా ఇద్దరి గురించి ప్రస్తావించుకోవాలి. ఒకరు మట్టిలో మాణిక్యం. ఒకరు మనుషుల్లో మాణిక్యం. మనుషుల్లో మాణిక్యం అన్నా... సినీ పరిశ్రమలో తలమానికం అన్నా.. సినీకార్మికులకు గుండె ధైర్యం ఇచ్చే భరోసా అన్నా... అది మరెవరో కాదు లేట్ ది గ్రేట్ దాసరిగారు. ఒక దాతగా, దర్శకునిగా, దార్శనికుడిగా ఆయన ఆర్జించిన కీర్తి విశేషం. అలాంటి చరిత్రకారుడు మన మధ్య లేకపోవడం తీరని లోటు. కానీ ఆయన చాలా మంది హృదయాల్లో జీవించి ఉండటం చాలామందికి స్ఫూర్తిదాయకం. అలాంటి దాసరిగారి గురించి ‘తెరవెనుక దాసరి’ పుస్తకాన్ని తీసుకువచ్చిన మట్టిలో మాణిక్యం పసుపులేటి రామారావుగారు. దాసరిగారి స్టేటస్కి తగ్గట్లుగా ఈ పుస్తకావిష్కరణను మెగా లెవల్లోనే చేద్దామనుకున్నాం. వెంటనే టి.సుబ్బిరామిరెడ్డిగారిని, ఈ వేడుకకు మీరెంతవరకు సహాయం చేస్తారని అడిగితే, ఓకే అన్నారు. నేను అన్ని స్థాయిల్లో నుంచి వచ్చాను. అవకాశాలు వస్తాయా? రావా? ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనా లేదా? అనే ఆశ నిరాశల మధ్య ఊగిసలాడాను. కాన్ఫిడెన్స్ను, కష్టాన్ని నమ్ముకున్నాను. ఇప్పుడు నాలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ పుస్తకం సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. దాసరిగారు అంటూ ఉండేవారు ‘ఏ అడ్రస్ లేకుండా చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగాడు అని’. నేను కాదు.. నాకు స్ఫూర్తి దాసరిగారు. దాసరి గారి తరువాత.. దాసరి ముందు అని చెప్పే బ్రిడ్జ్లా ఉన్నారాయన. ఎలాంటివారికైనా మంత్రంలాంటిది ఈ పుస్తకం’’ అన్నారు. ‘‘కథారచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎంతోమంది నటులను తీర్చిదిద్దిన దాసరి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు అర్హుడు. అయనకు ఆ అవార్డ్ రావటానికి కృషి చేస్తాను’’ అని టీఎస్సార్ అన్నారు. ‘‘గురువుగారి జీవితంపై పుస్తకం రాయాలనుకున్నప్పుడు బీఏ రాజు నైతిక బలం అందించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ప్రోత్సహించారు. నేను రాసిన అన్ని పుస్తకాలకు అరవింద్ గారి సహకారం ఉంది. ఈ పుస్తకాన్ని చిరంజీవిగారు ఆవిష్కరిస్తే బాగుంటుందని అరవింద్గారికి చెప్పా. ఆ తర్వాత సురేశ్ కొండేటి కూడా సహాయం చేశారు. స్వయంగా చిరంజీవిగారు ఫోన్ చేస్తే, నేను గొంతు గుర్తుపట్టలేదు. ‘రామారావు గారూ.. మనది 40 ఏళ్ల అనుబంధం. గుర్తుపట్టలేకపోతే ఎలా’ అన్నారు. అప్పుడు బుక్ ఆవిష్కరణ గురించి చెప్పా. గ్రాండ్గా చేద్దామన్నారు. సహకరించిన, విచ్చేసినవారికి ధన్యవాదాలు’’ అన్నారు పసుపులేటి రామారావు. కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కోడి రామకృష్ణ, మురళీ మోహన్, సి. కల్యాణ్, యస్వీ కృష్ణారెడ్డి, రాజా వన్నెంరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు దాసరి గురించి మాట్లాడారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్కుమార్, కుమార్తె హేమాలయకుమారి, అల్లుడు రంగనా£Š పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019