breaking news
-
Cooking Oil: ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? వైద్యులు చెబుతున్నదిదే..
ఆయా ప్రాంతాల్లోని వాతావరణాన్ని అనుసరించి ఆయా నూనెలు వాడటం జరుగుతుంది. మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, ఆలివ్ ఆయిల్ వంటి రకరకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల రుచి కూడా నూనెపైనే ఆధారపడి ఉంటుంది. కొవ్వు గురించి భయపడి చాలామంది ఆహరంలో తక్కువ నూనె వాడకానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. నలభై ఏళ్లు దాటినవారు ఆయిల్ ఫుడ్కు చాలా దూరంగా ఉంటారు. ఇంతకీ ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? రిఫైన్డ్ ఆయిల్స్ కంటే గానుగ నూనె బెటరా అంటే.. గానుగ నూనె చాలా పురాతన నూనె. ఎద్దులను ఉపయోగించి గానుగపట్టి నూనె గింజల నుంచి నూనె తీసే విధానం శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. కొన్నిదేశాల్లో గుర్రాలు, ఒంటెలను కూడా అందుకోసం ఉపయోగిస్తారు.గానుగలో తిప్పడం ద్వారా లభించే నూనెను 'కోల్డ్ ప్రెస్డ్' ఆయిల్ అంటారు. అంటే ఇక్కడ.. గానుగపట్టే సమయంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. నూనె గింజలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద గానుగలో తిప్పడం వల్ల ఆ నూనెలో సహజ విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వాటి అసలు రూపంలో ఉంటాయి. ఇవి నూనెను మరింత రుచికరంగా ఉంచుతాయి. ఆ కారణంగానే గానుగ నూనె శరీరానికి మేలు చేస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. కానీ, ఈ నూనె తయారీకి ఖర్చు ఎక్కువ. ఎందుకంటే, విత్తనాల నుంచి 30 - 40 శాతం నూనె మాత్రమే వస్తుంది, అందువల్ల వ్యర్థాలు ఎక్కువ. అయితే, ఎక్స్పెల్లర్ ప్రెస్డ్ ఆయిల్ మెషీన్ ద్వారా 80 నుంచి 90 శాతం నూనెను తీయవచ్చు. కానీ, మెషీన్ ద్వారా ఆయిల్ తీసే ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థాయిలు 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల నూనె సహజ స్వభావం మారుతుంది. ఆ తర్వాత వంట నూనె రిఫైనింగ్ (శుద్ధి) ప్రక్రియ జరుగుతుంది. మెత్తగా నూరిన విత్తనాల చూర్ణానికి హెక్సేన్ అనే రసాయనాన్ని కలుపుతారు. విత్తనాల నుంచి 100 శాతం నూనెను తీసేందుకు ఈ హెక్సేన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాతి దశలో నూనెతో కలిపిన హెక్సేన్ను వేరుచేస్తారు. అలా వచ్చిన నూనెను వివిధ రసాయనిక పద్ధతుల్లో రిఫైన్ చేస్తారు. చివరగా, నీళ్లలా శుద్ధంగా కనిపించే రుచీపచీ లేని నూనె వస్తుంది.గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్న సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్ హెక్సేన్ ఉపయోగించి రిఫైన్ చేసే నూనెలే. ఏది బెటర్ అంటే.. చివరిగా అన్ని రకాల నూనెల్లోనూ మంచి కొవ్వులు ఉంటాయి. అవి శరీరానికి అవసరం కూడా. అయితే మనం ఎంత నూనె తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. గుండె జబ్బులు, ఊబకాయం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలుంటే నూనె తీసుకోవాల్సిన పరిమాణంలో మార్పులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యితో పాటు ఆలివ్ ఆయిల్ను కొద్దిగా తీసుకోవచ్చు. వేయించడానికి రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనెను వాడొచ్చు. కొబ్బరినూనె, పామాయిల్ వంటి వాటిని కొద్దిమొత్తంలో తీసుకోవచ్చు. అందువల్ల ఒకటే నూనె కాకుండా, అన్ని నూనెలను నిర్దిష్ట మొత్తంలో తీసుకోవడం మంచిది. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తికి రోజుకు 15 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. అంటే.. నెలకు సుమారు 450 నుంచి 500 మిల్లీలీటర్లు చాలు అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్! ఇక ఆ వ్యాధి..) -
164.7 లక్షల టన్నులకు పెరిగిన వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన సీజన్లో వంట నూనెల దిగుమతులు 16 శాతం అధికంగా నమోదయ్యాయి. అక్టోబర్తో ముగిసిన 2022–23 సీజన్లో 167.1 లక్షల టన్నుల వెజిటబుల్ నూనెల దిగుమతులు జరిగినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్ట్రర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకటించింది. దిగుమతులపై తక్కువ సుంకాలు వృద్ధికి దోహదం చేసినట్టు తెలిపింది. అంతకుముందు నూనెల సాగు సీజన్ 2021–22లో వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు 144.1 లక్షల టన్నులుగా ఉన్నాయి. మొత్తం దిగుమతుల్లో 164.7 లక్షల టన్నులు వంట నూనెలు కాగా, ఇతర అవసరాలకు వినియోగించే (నాన్ ఎడిబుల్) నూనెల దిగుమతులు 2.4 లక్షల టన్నులుగా ఉన్నాయి. ‘‘2022–23 నూనెల సీజన్లో వంట నూనెల దిగుమతులు 164.7 లక్షల టన్నులకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 24.4 లక్షల టన్నులు పెరిగాయి. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకం అతి తక్కువగా 5.5 శాతమే ఉండడం ఇందుకు కారణం. దీంతో దేశీయంగా నూనెల సరఫరా అవసరానికి మించి ఎక్కువగా ఉంది’’అని ఎస్ఈఏ తెలిపింది. దేశీయ పరిశ్రమపై ప్రభావం ‘‘మొత్తం పామాయిల్ దిగుమతుల్లో ఆర్బీడీ (రిఫైన్డ్, బ్లీచ్డ్, డియోడరైజ్డ్) పామోలీన్ ఆయిల్ దిగుమతులు 25 శాతంగా ఉన్నాయి. ఇది దేశీయ రిఫైనింగ్ పరిశ్రమను గణనీయంగా దెబ్బతీస్తోంది. స్థాపిత సామర్థ్యాన్ని దేశీయ రిఫైనింగ్ కంపెనీలు పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఎస్ఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. 2022–23 సంవత్సరంలో వంట నూనెల దిగుమతుల విలువ రూ.1.38 లక్షల కోట్లుగా ఉంది. 2021–22లో ఇది రూ.1.57 లక్షల కోట్లు కాగా, 2020–21లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉంది. నవంబర్ 1 నాటికి పోర్టుల్లో 33 లక్షల టన్నుల నూనెల నిల్వలు ఉన్నాయి. ఆర్బీడీ పామాయిల్ దిగుమతులు 2022–23 సీజన్లో 21.1 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు సీజన్లో 18.4 లక్షల టన్నుల కంటే ఇది ఎక్కువ. క్రూడ్ పామాయిల్ దిగుమతులు 54.9 లక్షల టన్నుల నుంచి 75.9 లక్షల టన్నులకు చేరాయి. క్రూడ్ పామ్ కెర్నెల్ ఆయిల్ దిగుమతులు 94,148 టన్నులుగా ఉన్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు గత సీజన్కు 30 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో 19.4 లక్షల టన్నులుగా ఉండడం గమనించొచ్చు. జూన్ 15 వరకు సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై పన్ను సున్నా స్థాయిలో ఉండడం కలిసొచ్చింది. దీని ఫలితంగా సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 41.7 లక్షల టన్నుల నుంచి 36.8 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. -
అమ్మో ఫాస్ట్ఫుడ్! హైదరాబాద్లో కల్తీ పంది నూనె కలకలం.. కొవ్వు కొని..
సాక్షి, హైదరాబాద్: సిటీ లైఫ్లో ప్రజల దినచర్య బిజీబిజీగా గడుపుతుంటారు. కాలుష్య కోరల్లో ప్రయాణం, ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుతూ ఫాస్ట్ పుడ్ సెంటర్లో ఆహారం తింటూ.. అలా బతుకు బండిని నడిపిస్తుంటారు. అయితే నగర కాలుష్యాన్ని మనం నియంత్రించడం అంత సులువు కాదు కాబట్టి, కనీసం మనం తినే ఆహారం విషయంలో నాణ్యత ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆహార పదార్థాలే టార్గెట్గా కొన్ని ముఠాలు వ్యాపారాలు మొదలుపెట్టాయి. ఇటీవల నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లీ పేస్ట్, ఐస్ క్రీమ్స్, సాస్, చాక్లెట్స్ బాగోతం బయటపడింది. అయితే, తాజాగా పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు నేరెడ్మెట్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని నేరేడ్మెట్ పరిధిలోని ఆర్కేపురంలో ఓ వ్యక్తి తాను నివసిస్తున్న ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు తెచ్చుకుని.. వాటిని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపితే అచ్చం వంట నూనెలాగా కనిపించే ఆయిల్స్ను తయారు చేయడం.. వాటిని రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్పుడ్ సెంటర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ దందా గతకొంత కాలంగా నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అతని ఇంటిపై ఆకస్మిక సోదాలు నిర్వహించగా.. కల్తీ గుట్టు మొత్తం బట్టబయలైంది. దీంతో నిందితుడిని నేరెడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: IT Scam Hyderabad:హైదరాబాద్లో మరో భారీ ఐటీ కుంభకోణం -
సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ నూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ద్వారా వంట నూనె ధరలు తగ్గనున్నాయి. దేశీయ విపణిలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం తోడ్పడనుందని శాఖ వెల్లడించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2021 అక్టోబర్లో 32.5% నుంచి 17.5%కి తగ్గించింది. చదవండి: ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే! -
గుడ్ న్యూస్ చెప్పిన మోడీ భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు..!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019