breaking news
Ad - Sakshi_Home_Sticky
-
అది ప్యాంట్రీ కార్.. బే‘కార్’ రాతలేల రామోజీ
సాక్షి,అమరావతి/సాక్షి, నంద్యాల: 2024 మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని, జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించనున్నదన్న స్పష్టమైన సంకేతాలు ఈనాడు రామోజీరావుకు అందాయి. బయట సర్వేలే కాదు.. స్వయంగా ఈనాడు, ఈటీవీ కంట్రిబ్యూటర్లు నిర్వహించిన సర్వేలోనూ ఎంత తక్కువ అనుకున్నా వైఎస్సార్ సీపీ 150 సీట్లపై మాటే కైవసం చేసుకుంటుందని తేలడంతో ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. చంద్రబాబు కన్నా ముందే ఆయన భయంతో వణికిపోతున్నారు. ఉచ్ఛనీచాలు మరిచి కథనాలు రాస్తున్నారు. పైత్యం ఎక్కువై ఏమీ లేకున్నా.. అక్కడేదో ఉన్నట్లు, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారమే లక్ష్యంగా ఊహాగానాలతో అసత్యాలు అల్లుకుని యథేచ్ఛగా వార్తలు రాస్తున్నారు. ఇలాంటి పైత్యపు రాతలతో రామోజీ కడుపు మంట తీరుతుందేమోగానీ, అవాస్తవాలను వాస్తవం అంటూ ప్రజల్ని మోసం చేయలేరు. సీఎం క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది? అంటూ బుధవారం ఈనాడు కట్టుకథను అల్లింది. ప్యాంట్రీ కార్.. కంటెయినర్లా కనిపించిందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం పే రుతో బస్సుయాత్రను బుధవారం ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా దాదాపు మూడు వారాల (21రోజులు)పాటు ప్రజలోనే ఉండనున్నారు. దీంతో ముఖ్యమంత్రి కోసం ఆహారాన్ని వండేందుకు ఏపీ 16 జడ్ 0363 నంబర్ గల ప్యాంట్రీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనం మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామాన్లు తీసుకొచ్చింది. వాహనంలో వాటర్ బాటిళ్లు, వంటకు అవసరమైన కూరగాయలు, వంట సామగ్రి మాత్రమే ఉన్నాయి. ఈ వాహనం మంగళవారం తాడేపల్లి నుంచి బుధవారం ఉదయానికి వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలానికి చేరుకుంది. అక్కడే డీజిల్ కొట్టించుకుని సీఎం వైఎస్ జగన్ బస చేయనున్న ఆళ్లగడ్డకు మధ్యాహ్నానికి చేరుకుంది. చిన్నసైజులో ఉన్న ఈ ప్యాంట్రీ వాహనం ఈనాడుకు, రామోజీరావుకు ఓ పెద్ద కంటెయినర్గా కనిపించింది. అంతే ఈ కంటెయినర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏమి తెచ్చింది.. అంటూ నిస్సిగ్గుగా ఉన్మాదపు రాతలను ఆ పత్రిక అచ్చేసింది. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి ప్యాంట్రీ వాహనం విజువల్స్, ఫొటోలు తీసినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా ఫొటోలు.. వీడియోలు తీయడం నిషిద్ధం. ఇది తెలిసినా ఈనాడు పత్రిక నిబంధనలు మీరి ఫొటోలు, వీడియోలు తీయడమే కాకుండా అడ్డగోలు రాతలు రాసింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈనాడు, ఈటీవీపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా, అధికారులెవరినీ వివరణ అడగకుండా బురద జల్లేలా రాసిన రాతలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఒక వార్త రాసేముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం జర్నలిస్టు విధుల్లో ఓ భాగం. కానీ, ఈనాడు అత్యుత్సాహానికి పోయి ఊహలతో అబద్ధాలు ప్రచురించింది. దీంతో ప్యాంట్రీ వాహనంలో ఏముందో సోషల్ మీడియాలో వైఎస్సార్ సీపీ ఫొటోలతో సహా బహిర్గతం చేసింది. దీంతో ఈనాడు పరువు పోయింది. ఇవేం రాతలంటూ ఆ పత్రికను ట్రోలర్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. బెడిసికొట్టిన లోకేశ్ అతి టీడీపీ నేత నారా లోకేశ్కు తరచూ అభాసుపాలవ్వడం రివాజుగా మారింది. బుధవారమూ రొటీన్గా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ను ఎందుకు తనిఖీ చేయలేదు’ అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీనికి ఈనాడు క్లిప్పింగ్ను జత చేశారు. అయితే వెంటనే స్పందించిన సోషల్ మీడియా లోకేశ్ను రీట్వీట్లతో ఓ ఆట ఆడుకుంది. వాహనంలో ఉన్న వస్తువులతోపాటు వాహన వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి చేద్దామనుకున్న ఆయన వ్యూహం బెడిసికొట్టింది. -
బకరాలైన లోకేష్, యెల్లో బ్యాచ్...
-
ఈనాడు అత్యుత్సాహం.. లోకేష్ సహా బకరాలైన యెల్లో బ్యాచ్
సాక్షి, గుంటూరు: తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పరు. మంచి చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. గత 58 నెలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను ఏరకంగా బద్నాం చేయాలి? అనే ఆలోచనతోనే కుట్రలు పన్నుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ తమ అసత్య ప్రచారాల మోతాదును ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది ? అంటూ ఈనాడు తాజాగా ఓ కథనం ప్రచురించింది. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, అలాగే బయటకు వచ్చిందని, భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలంటూ.. రకరకాల డైరెక్షన్లలో కంటెయినర్ను హైలెట్ చేస్తూ ఓ గాలి వార్త రాసేసింది. ఇంకేం ఐ-టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. తమకు చెందిన అకౌంట్లతో ఏవేవో ట్వీట్లు వేయించింది. దీనికి తోడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు.. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ సంగతేంటి?’’ అంటూ ఓ ట్వీట్ కూడా వేశారు. దానికి ఆ ఈనాడు పేపర్ కట్టింగ్ క్లిప్పులను జత చేశారు. అయితే.. బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామానులు తీసుకు వచ్చింది ఆ పాంట్రీవాహనం. ఏపీ16జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. పైగా ఈ ఉదయం ఆ వాహనం ఆళ్లగడ్డకు సైతం చేరుకుంది. అసలు అదేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. అత్యుత్సాహంతో ఆ కంటెయినర్ వాహనం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏదో తెచ్చిందంటూ నిస్సిగ్గుగా రాతలు రాయించారు రామోజీ రావు. ఈ క్రమంలో.. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి మకాం వేసిన దృశ్యాలు కనిపించాయి. ఆ పాంట్రీ వాహనం విజువల్స్, ఫోటోలు తీసినట్టు సీసీటీవీ పుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా... సదరు పోటోలను, వీడియోను వాడుకుని.. దురుద్ధేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసిన ఈటీవీపై చర్యలకు అధికారులు ఇప్పుడు సిద్ధం అయ్యారు. -
విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సీపోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో డ్రైఈస్ట్తో మిక్స్ చేసి బ్యాగ్ల్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేపన్ చేపట్టింది. విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతోనే డెలీవరి అడ్రస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అడ్రస్ ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్ పేరుతో కంటైనర్ బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. లాసన్స్ బే కాలనీలో సంధ్యా అక్వా ఎక్స్ పోర్టు కార్యాలయం ఉంది. ఏ1గా సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ను చేర్చగా, నిందితులుగా మరి కొంతమందిని చేర్చే అవకాశం ఉంది. 18న ఈ-మెయిల్ ద్వారా సీబీఐకి కీలక సమాచారం వచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్పోల్ గుర్తించింది. సీబీఐకి ఇంటర్ పోల్ సమాచారంతో డ్రగ్ రాకెట్ ముఠా గట్టు రట్టయ్యింది. డ్రగ్ రాకెట్ ముఠాను పట్టుకునేందుకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్కి చెందిన ప్రతినిధుల పేర్లను సైతం సీబీఐ పేర్కొంది. -
రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఆనందపురం (విశాఖ జిల్లా): కంటెయినర్లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్ పార్టుల లోడుతో హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్ పోస్టు వద్ద కంటెయినర్ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని, డివైడర్ను ఢీకొట్టి కంటైనర్ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్ పోస్టులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద కంటెయినర్ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్ బైక్ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు. అందులో స్పేర్ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్ను ఆనందపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ, ఏసీపీ(నార్త్) సునీల్లు కంటెయినర్ను పరిశీలించి 13 బ్యాగ్లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజాయి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్ మణికంఠ చెప్పారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019