breaking news
-
స్టార్ హీరో ఇంటికెళ్లిన సీఎం.. !
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కలిశారు. కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా గురించి అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈనెల 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లోని భుజ్లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. #WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde arrived at the residence of actor Salman Khan. pic.twitter.com/ncJUz4n6C9 — ANI (@ANI) April 16, 2024 #WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde met actor Salman Khan at his residence. Inside visuals from the residence. (Source: Eknath Shinde office) pic.twitter.com/lbMmfCOBNm — ANI (@ANI) April 16, 2024 -
జేఎంఎంకు సీతా సోరెన్ రాజీనామా!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు. ఒడిశాలోని మయూర్భంజ్లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు. -
స్టైలిష్గా ఉన్న ఈయన ఓ రాష్ట్ర సీఎం.. ఎవరో తెలుసా?
ఇక్కడ స్టైలిష్గా కనిపిస్తున్న ఈయన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా (Meghalaya CM Conrad Sangma). మౌడియాంగ్డియాంగ్లో నిర్మాణమవుతున్న మేఘాలయ శాసనసభ నూతన భవనాన్ని ఆయన తాజాగా పరిశీలించారు. స్పీకర్ థామస్ సంగ్మా, డిప్యూటీ స్పీకర్ తిమోతీ డి షిరా, ఉప ముఖ్యమంత్రి ప్రిస్టోన్ టైన్సాంగ్ నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. మేఘాలయ శాసనసభ నూతన భవన నిర్మాణం ఆ రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయి. నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో శాసనసభ భవనం ప్రారంభోత్సవం కోసం మేఘాలయ పౌరులలో నిరీక్షణ పెరిగింది. ఈ మైలురాయి రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపుతుంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే కొందరు సీఎంలు మాత్రం ఏదో ఒక వ్యాపకంతో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఒకరు. ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్పై వాయిస్తున్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంగీతం తనకు అంతులేని ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుందని సీఎం సంగ్మా చెబుతుంటారు. తాను ఎప్పుడూ సంగీతంలోనే ఉంటానని, అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తానని చెప్పారు. క్యాబినెట్ సహచరులతో ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాల అనంతరం లైవ్ ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడుతుంటానని తెలిపారు. -
ఛూ మంతర్.. ఒక చంద్రబాబు.. వెయ్యి అబద్దాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'హామీల అనుభవాలు' ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచితమే. చంద్రబాబు మాట నీటి మూట. ఆంధ్రప్రదేశ్లో ఈ నానుడి బాగా ఫేమస్. చంద్రబాబు మాటలనే కాదు.. ఆయనను కూడా ప్రజలు నమ్మడం లేదు. 'జయహో బీసీ' పేరుతో టీడీపీ - జనసేన సంయుక్తంగా సభ నిర్వహించాయి. 2014లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చారు. ఒక్క హామీనైనా 100 శాతం అమలు చేశారా..? అమలు చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో దాచి పెట్టే పరిస్థితి, టీడీపీ అధికార వెబ్ సైట్ నుంచి తొలగించి పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? . "చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాది పూచి" అన్న పవన్ కల్యాణ్ ఏనాడైనా చంద్రబాబును ప్రశ్నించారా...? ఈ రోజున ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్నవే. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్లు సమాధానం చెప్పి బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తే బాగుండేది. "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు బడుగులకు న్యాయం చేస్తానని సభ నిర్వహిస్తే ప్రజలు నమ్ముతారా...? తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ బెదిరించింది చంద్రబాబు కాదా..? "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అని బెదిరించింది చంద్రబాబు కాదా...?. బీసీల పిల్లలు పెద్ద చదువులు చదవడానికి తోడ్పాటు ఇవ్వకుండా ఇస్త్రీ పెట్టెలు, మోకులు, కత్తెరులు ఇచ్చింది చంద్రబాబు కాదా..? ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకునే, తన అనుకూల మీడియాలో చెప్పించుకునే చంద్రబాబు ఇస్త్రీ పెట్టెలు, కత్తిరెలు ఇవ్వడం ఏంటనీ సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదివి, విమానాల్లో వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని బీసీ మేధావులు గుర్తు చేస్తున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో పరిస్థితి చూస్తే.. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడిని ఏనాడైనా నారా లోకేష్ గౌరవించాడా...?. టీడీపీ కీలక నిర్ణయాల్లో అచ్చెన్నాయుడి భాగస్వామ్యం ఉందా...? టీడీపీ వ్యూహాత్మక భేటీల్లో బీసీ నేత అయిన అచ్చెన్నాయుడి ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటున్నారా..? గుండె మీద చేయి వేసుకుని ఆత్మ సాక్షిగా అచ్చెన్నాయుడే ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలరా..? బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని బాబు అంటున్నారు. బీసీల డీఎన్ఏలో టీడీపీ ఉంటే 23 సీట్లు ఇచ్చి మూలన ఎందుకు కూర్చోబెడతారు..? కుప్పం నియోజకవర్గంలో 30 వేలకే మీ మెజార్టీ ఎందుకు తగ్గిపోయింది..? బీసీల సీటు మంగళగిరిలో నారా లోకేష్ ఘోరంగా ఎందుకు ఓడిపోయారు..? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4 వేలు చేస్తానని బాబు చెబుతున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 40 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారు. బాబు హయాంలో నెలవారీ పింఛన్ బడ్జెట్ కేవలం రూ.400 కోట్లు. వైఎస్ జగన్ పాలనలో 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఈ జనవరి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్ రూ.3 వేలకు పెంచారు. సీఎం జగన్ పాలనలో నెలవారీ పింఛన్ బడ్జెట్ రూ.2 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే.. చంద్రబాబు రూ.4 వేల పింఛన్ కాదు రూ.5 వేలు ఇస్తానన్నా ఆయనను నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు హయాంలో పింఛన్ తీసుకోవాలంటే నడుచుకుంటూ వెళ్లాలి.. గంటలు కొద్దీ వెయిట్ చేయాలి..లైన్లో నుంచోలేక పండుటాకులు ప్రాణాలు వదిలిన సందర్భాలు అనేకం. కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫస్ట్ తేదీ వచ్చిందంటే చాలు వలంటీర్ వచ్చి చేతిలో పింఛన్ డబ్బులు పెట్టి వెళ్తున్నారు. ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారు. కళ్లతో చూస్తున్నారు. విచిత్రం ఏమంటే.. కర్ణాటక, తెలంగాణ మేనిఫెస్టోలు కాపీ కొట్టడమే కాదు.. చివరికు వైఎస్ఆర్ సీపీ నినాదాలు కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నారు. "బీసీలు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాసెస్" అని మొదట నినదించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చివరకు ఈ నినాదాన్ని కూడా బాబు బ్యాచ్ కాపీ కొట్టడంపై జనాలు నవ్వుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీ ఏలూరులో బీసీ గర్జన సభ నిర్వహించింది. ఈ సభలో ఇచ్చిన హామీల కంటే 58 నెలల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగానే చేశారు. డీబీటీ - నాన్ డీబీటీ కింద వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రూ.1.71 లక్షల కోట్లు బీసీలకు లబ్ధి చేకూర్చింది. సంక్షేమ పథకాల్లో సింహభాగం బీసీ లబ్ధిదారులే. 2014లో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.50 వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఐదేళ్లలో వాస్తవానికి ఆయన ఇచ్చింది కేవలం రూ.19 వేల కోట్లు. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోటయ్య కమిటీ వేసి కోతలు, వాతలు పెట్టారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు రూ.15 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేసి అన్నదాతలకు ఇచ్చిన మాట తప్పారు. అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు.. ఈ రుణాలు కూడా మాఫీ చేయకపోవడంతో ఆ రుణాలు వడ్డీలతో కలుపుకుని రూ.25 వేల కోట్లు అయ్యాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ ఆసరా పేరుతో చంద్రబాబు ఎగ్గొట్టిన డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నారు. డ్వాక్రా రుణాల చెల్లింపు సాధ్యం కాదని ఆనాటి మంత్రి పరిటాల సునీత ద్వారా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారు. అంటే.. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటను అసెంబ్లీ సాక్షిగా తప్పారు చంద్రబాబు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా బీసీలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు విశ్వసనీయతలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ తేడానే 2024 ఎన్నికల్లో నిజమైన ఫలితాన్ని ప్రజల ముందుంచనుంది. - YV రెడ్డి -
Vizag : విశాఖ స్వప్నం సాకారం దిశగా జగన్ పాలన
ఇవాళ వైజాగ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం విన్న ఎవరికైనా మనసులో ఒకటి కచ్చితంగా అనిపించి ఉంటుంది. ఏంటీ.. సీఎం జగన్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు.? ఇంత బలంగా మాట్లాడుతున్నారని మనసులో తప్పకుండా అనుకుని ఉంటారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీఎం జగన్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. విశ్వాసం పెరిగిపోతుంది. దీనికి తన పాలనపై తనకు నమ్మకం ఉండటం వలన కావొచ్చు. ఒక పక్క టీడీపీ - జనసేన పొత్తులతో కుస్తీ పడుతుంటే.. వైఎస్ఆర్ సీపీ మాత్రం తన ప్రశాంతంగా చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ తాడే పల్లి ప్యాలస్.. తాడేపల్లి ప్యాలస్ అని కామెంట్ చేసినవారు.. ఇప్పుడు ఆ ప్యాలెస్లో ప్రశాంతంగా కూర్చొని ..సీఎం జగన్ ఆడే రాజకీయ చదరంగం చూసి వణికిపోవడమే కాదు బెంబేలెత్తుతున్నారు. "వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానన్నారు." ఈ పదాలు పలుకుతున్నప్పుడు సీఎం జగన్ ముఖంలో ఆత్మవిశ్వాసం చూశారా.. యస్ నేను సాధిస్తాననే నమ్మకంలో ఆయన ముఖంలో అణువణువునా కనిపించింది. ఈ రోజు విశాఖలో జగన్ ఇచ్చిన స్పీచ్ ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి భరోసానిచ్చింది. ఉత్తరాంధ్ర విజన్నే కాదు విశాఖ భవిష్యత్తును రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోట్ల మంది కళ్లకు కనబడేలా ప్రసంగించారు. భవిష్యత్తులో విశాఖ నగరం హైదరాబాద్, చెన్నైల కంటే ఎక్కువుగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు సీఎం జగన్. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామని చెప్పారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని.. భవిష్యత్తులో రూ.10 నుంచి 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని సీఎం జగన్ చెప్పారు. విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు 6 లైన్ల రహదారి విశాఖకు మణిమకుటం కానుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 70 శాతం వృద్ధి సాధించామని సీఎం జగన్ చెప్పారు. 58 నెలల వైఎస్ జగన్ పాలనలో ఆయన తీసుకొచ్చిన వ్యవసాయ రంగంలోని సంస్కరణలు ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాయి. RBKలు విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నాయి. భవిష్యత్తులో ఆర్బీకేలు లావాదేవీ కేంద్రాలుగానే కాకుండా ప్రయోగ కేంద్రాలుగా కూడా మారబోతున్నాయి. ఉత్పత్తి రంగంలో ఏపీ మెరుగ్గా దూసుకెళ్తుందని చెప్పారు సీఎం జగన్. మూలపేట, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం రేవులతో ఆంధ్రా తీరం రూపురేఖలు మారిపోతోంది. ఏపీలో తలసరి ఆదాయం తెలంగాణ కంటే ఎక్కువుగా పెరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తమ ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొచ్చిన పరిశ్రమలు వలన రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం తగ్గిందన్నారు సీఎం జగన్. డీబీటీ ద్వారా నేరుగా కోట్ల మందికి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. నిజంగా ఇది దేశంలోనే అత్యద్భుతమైన ప్రయోగమని ఆర్ధిక నిపుణులు, సామాజిక వేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా నిరుద్యోగిత రేటు తగ్గడం కాకుండా యువత క్రైం వైపు, టెర్రరిజం, మావోయిజం వైపు మొగ్గు చూపకుండా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ వాతావరణం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. మెగా, భారీ పరిశ్రమల వలన కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వల్ల 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ విశాఖ వేదికగా చెప్పారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలకు, వ్యాపార వేత్తలకు కనీస విలువ ఉండేది కాదు. చంద్రబాబు హయాంలో అవినీతి గురించి కొందరు విదేశీ వ్యాపారులు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారంటేనే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇక.. భవిత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జాబ్ ఓరియంటెడ్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నామన్నారు. స్కూల్లో 3వ తరగతి నుంచే సబ్జక్ట్ టీచర్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. 158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్ధులకు శిక్షణ ఇచ్చాయన్నారు. విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మాటలు భవిష్యత్ తరానికి ఆశాకిరణంగా కనిపించాయి. పిల్లలను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గ వనరులను కల్పిస్తున్నారు. మంచి ఇంగ్లిష్ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చనేది సీఎం జగన్ అనుకుంటున్నారు. ఇది నిజం. చేతిలో విద్య అనే ఆయుధముంటే విశ్వాన్నిగెలవచ్చు. సీఎం జగన్ నాణ్యమైన విద్య గురించి, నాణ్యమైన మానవ వనరుల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో ముందు చూపు ఉన్న నాయకుడు మాత్రమే ఇలా మాట్లాడగలరు. సీఎం జగన్ ప్రసంగంలోని కాన్పెన్స్కు ప్రధాన కారణం.. నిజాయితీ, అవినీతిలేని పాలన. తాను చేయాలి అనుకున్నది చేసుకుంటూ పోవడం. ప్రజలకు మంచి చేస్తున్నానే సంతృప్తి. పారదర్శక పాలన. ఇవన్నీ ఆయనలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. - YV రెడ్డి
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019