breaking news
-
Ayyanna Patrudu: అధికారం కోసం ఆబగా...!
సాక్షి, అనకాపల్లి: ఎంపీ సీటు ఆశించిన ఒక కుమారుడు... ఎమ్మెల్యే సీటు ఆశించిన మరో కుమారుడు... మున్సిపాలిటీలో ఇప్పటికే కౌన్సిలర్గా ఉన్న సతీమణి... ఎమ్మెల్యే బరిలో ఉన్న అయ్యన్న ఇలా నలుగురూ అధికారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నలుగురూ చెరోవైపు ప్రచారం నిర్వహిస్తుండగా... ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెత్తనాన్ని కూడా నలుగురూ పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి ఒక సీటే అని చంద్రబాబు తమకు ఇప్పటికే దెబ్బ వేశారనే కసితో ఉన్న సదరు కుటుంబం... నర్సీపట్నం నియోజకవర్గాన్ని నాలుగువైపులా పంచుకుని అధికారం చెలాయించేందుకు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అయ్యన్న వ్యవహారం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న, ఆయన కుమారుడు చక్రం తిప్పి నర్సీపట్నంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు లేటరైట్ను అక్రమంగా తవ్వి అక్రమ సంపాదన ఆర్జించారు. అంతేకాకుండా మూడు ఆక్రమణలు... నాలుగు రంగురాళ్లు అన్న చందంగా రంగురాళ్ల వెలికితీత కూడా చేశారన్న ఆరోపణలున్నాయి. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో కొడుకు విజయ్, భార్య పద్మావతి జోక్యం విపరీతంగా ఉండేదన్న విమర్శలున్నాయి. వీరికితోడు ఇప్పు డు సకుటుంబ సపరివార సమేతం అనే రీతిలో అధికారం చెలాయించేందుకు ఆబగా ఎదురుచూస్తు న్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయ్యన్నకు ఓటు వేస్తే నలుగురు ఎమ్మె ల్యేలు.... తనకు ఓటు వేస్తే ఒక్కరే ఎమ్మెల్యే అని... తన కుటుంబంలో ఎవ్వరికీ రాజకీయ ఆకాంక్షలు లేవని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా ప్రకటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీట్లను ఆశించి....! వాస్తవానికి ఎంపీగా తన కొడుకుకు అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు సాక్షిగా అయ్యన్న కోరారు. తనకు ఎమ్మెల్యేగా, కొడుకుకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని... స్థానిక అభ్యర్థులను కాదని బయటివారికి ఎలా ఇస్తారంటూ పార్టీ సమావేశాల్లో ప్రశ్నించారు. తీరా బీజేపీ కోటాలో బాబు శిష్యుడు సీఎం రమేష్ అనకాపల్లి సీటును కొట్టేశారు. నాన్ లోకల్ అయినప్పటికీ సీఎం రమేష్ను మాత్రం అయ్యన్న ఒక్క మాట కూడా అనలేదు. మరోవైపు అన్న కోసం ఎంపీ సీటు కోరిన నేపథ్యంలో ఎమ్మెల్యే సీటు తనకు ఇవ్వాలని కోరాలంటూ చిన్న కుమారుడు పోరు పెట్టారు. రాజకీయ వారసత్వం కోసం కొడుక్కి సీటు ఇప్పించాల్సిందేనని ఇంటిపోరు కూడా అయ్యన్నకు ఎక్కువయ్యింది. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక్క ఎమ్మెల్యే సీటును నలుగురూ పంచుకుని అధికారం చెలాయిద్దామనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏ ఒక్క పదవినీ వదలరు మొదట్లో అయ్యన్నపాత్రుడు, సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు సమన్వయంతో రాజకీయాలు నడిపేవారు. ఈ సమయంలో పెద్ద కొడుకు విజయ్ జోక్యం పెరిగింది. సన్యాసిపాత్రుడు కదిలికలను తెలుసుకునేందుకు కారులో వాయిస్ రికార్డర్ అమర్చారు. ఈ వ్యవహారం కుటుంబ కలహాలకు దారి తీసింది. ఈ సంఘటనతో అయ్యన్నపాత్రుడి వద్ద ఇమడలేక సన్యాసిపాత్రుడు, మిగిలిన సోదరుల కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారు. ఏ ఒక్క పదవీని అయ్యన్నపాత్రుడు కుటుంబం వదలేదు. పురపాలిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి కౌన్సిలర్గా ఎన్నికై 26వ వార్డుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చిన్న కుమారుడు రాజేష్ 25వ వార్డుకు కౌన్సిలర్గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆఖరి మొత్తం పదవులన్నీ వారి కుటుంబంలో ఉంచుకున్నారు. ఎమ్మెల్యేగా గణేష్ గెలిస్తే ప్రజలు నేరుగా వెళ్లి పనులు చేయించుకునేందుకు వెసులుబాటు ఉంటుందనీ, టీడీపీ గెలిస్తే ముగ్గురిని దాటుకుని అయ్యన్నపాత్రుడి వద్దకు వెళ్లాల్సి ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే గణేష్ ఐదేళ్ల కాలంలో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని, ప్రశాంతంగా ఉందని, కొరివితో తల గోక్కున్నట్టు అయ్యన్నను మళ్లీ తెచ్చుకుంటామా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
అధినేత దెబ్బ.. అయ్యన్న అబ్బా..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు అధినేత అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కొట్టిన దెబ్బకు కోలుకోలేక మధనపడుతున్న అయ్యన్నకు.. ఇంటి పోరు మరింత తలపోటుగా మారుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ వారసత్వంగా కొడుకును నర్సీపట్నం నుంచి 2024 ఎన్నికల్లో బరిలోకి దించాలంటూ ఒత్తిడి అధికం కావడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రానున్న ఎన్నికల్లో కొడుకును బరిలోకి దించకపోతే తన రాజకీయ వారసత్వం కష్టమనే భావనలో అయ్యన్న ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక అయ్యన్న నోటికి తాళం పడినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు కోసం అయ్యన్న తీవ్రంగా కష్టపడ్డారు. నోటికి వచ్చినట్టు ఇష్టారీతిన అధికార వైఎస్సార్ సీపీపై విమర్శలు గుప్పించారు. అధినేత దృష్టిలో ఉంటూ అనకాపల్లి ఎంపీ సీటును కొడుకుకు వచ్చేలా యత్నించారు. అయితే, ఎన్నికలు వచ్చేసరికి వ్యాపారవేత్తలు, పైసలు ఉన్నవారికే సీటు ఇచ్చే అలవాటున్న చంద్రబాబు ఈసారి మారారనే భావనలో అయ్యన్న ఉన్నారు. తీరా ఎన్నికల ముంగిటకు వచ్చేసరికి యథావిధిగా అనకాపల్లి ఎంపీ సీటును బాగా ఖర్చు చేయగలిగిన వ్యక్తికి ఇవ్వనున్నట్టు సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ వారసత్వం కోసం నర్సీపట్నం నుంచి కొడుకును బరిలోకి దించాలంటూ ఇంటి పోరు రోజురోజుకీ ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది. కొడుకు పోరుతో విలవిల వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వకపోతే కుమారుడిని నర్సీపట్నం నుంచి బరిలోకి దించాలంటూ ఇంటి పోరు అధికమైనట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడిన అయ్యన్న ఓటమి తర్వాతైనా గుణపాఠం నేర్చుకుంటారని అందరూ భావించారు. అయితే, అయ్యన్న బుద్ధి మాత్రం మారలేదు. సరికదా ఓటమి బాధలో మరింతగా దిగజారి మాట్లాడటం ప్రారంభించారు. ఫలితంగా నియోజకవర్గంలో అయ్యన్నకు ఏ మాత్రమూ పట్టుపెరగడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వివాదరహితుడు కావడం... తాజాగా జరిగిన సాధికార యాత్ర విజయవంతం కావడం వల్ల మరోసారి వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా 2024 ఎన్నికల్లోనే కుమారుడిని బరిలోకి నిలిపేలా ఇంటి పోరు ఎక్కువవుతోందని సమాచారం. 2029 ఎన్నికల వరకూ వేచిచూడటం కష్టమంటూ కుమారుడికి మద్దతుగా అయ్యన్న సతీమణి కూడా గొంతు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా అధినేత వైఖరితో తలబొప్పి కట్టిన అయ్యన్నకు... ఇంటి పోరు మరింత తలపోటుగా మారింది. కొడుకును బరిలోకి దింపి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకుంటారా లేదా అనేది త్వరలో తేలనుంది. రాజకీయ వారసత్వం కష్టమే.. వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడైనా తనకు ఆరోగ్యం, వయస్సు సహకరించిన సమయంలోనే తన వారసత్వాన్ని రాజకీయాల్లో దించటం సహజ పరిణామం. తీరా వయస్సు అయిపోయిన తర్వాత వారసత్వాన్ని రంగంలోకి దించితే గెలిపించడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది రాజకీయ నాయకులు తమ వారసులను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తారు. అయితే అయ్యన్న నర్సీపట్నంతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు మాత్రం ఎప్పటికప్పుడు దీనిపై దాటవేస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల ముందు భారీగా ఖర్చు చేసే అభ్యర్థి దొరకడంతో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. దీంతో పార్టీ కోసం కష్టపడితే ఇదేనా నాకిచ్చే గౌరవమంటూ ఆయన లోలోపల మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇదే పరిస్థితుల్లో నర్సీపట్నం నుంచి తాను రంగంలోకి దిగితే వచ్చే ఎన్నికల వరకు అంటే 2029 వరకూ రాజకీయ వారసత్వం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి ఎన్నికల్లో గెలిచే సూచనలు కనిపించనప్పటికీ కొడుకును బరిలో నిలపడం ద్వారా రాజకీయ వారసత్వం కొనసాగించే అవకాశం ఉంటుంది. -
అనకాపల్లి బరిలో బైరా దిలీప్ .. డిపాజిట్లు కూడా రావు: అయ్యన్న పాత్రుడు
స్కిల్ స్కాం కుంభకోణాల్లో చంద్రబాబు నాయుడు దొరికిపోవడంతో టిడిపి శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్టీయార్ హయాంలో టిడిపికి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెరుగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా నియోజక వర్గాల్లో టిడిపికి అభ్యర్ధులు కూడ లేని పరిస్థితి నెలకొంది. అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్ధుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి. అక అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా లోకల్ లో ఎవరూ లేకపోవడంతో దిలీప్ చక్రవర్తి అనే క్యాండిడేట్ ను దిగుమతి చేసుకుంది టిడిపి. దీనిపై పార్టీలోని మాజీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు పార్లమెంటు నియోజక వర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలు సాధించి టిడిపిని తుడిచి పెట్టేసింది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతయ్యింది. నాలుగున్నరేళ్లుగా పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టేవారే కరవయ్యారు. చోడవరం, మాడుగుల, ఎలమంచిలి వంటి నియోజక వర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్ధులు కూడా లేరు. ఈ నేపథ్యంలో అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం నుంచి బరిలో దింపడానికి పార్టీ నాయకత్వం కోట్లకు పడగలెత్తిన దిలీప్ చక్రవర్తి అనే సంపన్నుణ్ని దిగుమతి చేసుకుంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారంతో పార్టీ సీనియర్లు నిప్పులు చెరుగుతున్నారు. మాజీ మంత్రులు చింత కాయల అయ్యన్నపాత్రుడు , బండారు సత్యనారాయణలు అనకాపల్లి ఎంపీ సీటు నుండి పోటీ చేయాలని తహ తహ లాడుతున్నారు. తాము లేదా తమ తనయులను బరిలో దింపాలని వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే ఆకాశంలోంచి ఊడిపడ్డట్లు దిలీప్ చక్రవర్తి పేరు బయటకు రావడంతో పార్టీ నేతలు మండి పడుతున్నారు. తమలో ఎవరికి సీటు ఇచ్చినా గెలవకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు వస్తాయని ..అదే దిలీప్ వంటి బయటి వ్యక్తులను దింపితే డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టికే తీసుకెళ్తున్నారు. ఒక పక్క స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడి కారణంగా పార్టీ ప్రతిష్ఠ మంటగలిసిపోయిందని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. స్కిల్ స్కాంతో పాటు మరో డజనుకు పైగా అవినీతి కేసుల్లో చంద్రబాబు ఉన్నట్లు సాక్ష్యాధారాలు కూడా సేకరించినట్లు తెలుస్తుండడంతో టిడిపి నేతల్లో ఒక విధమైన నిరాశ నిస్సృహ ఆవరించేసిందని అంటున్నారు. -
బరితెగించి అయ్యన్న బూతు పురాణం
పాలకొల్లు సెంట్రల్: పత్రికల్లో రాయలేనంత పచ్చి బూతులతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు. సంస్కారం లేకుండా ఆయన పబ్లిక్గా బూతులు మాట్లాడుతుంటే అక్కడ సభలో పాల్గొన్న తెలుగు మహిళలు సిగ్గుతో తలదించుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం జరిగింది. భవిష్యత్కు గ్యారంటీ చైతన్య రథయాత్ర సమావేశంలో అయ్యన్న.. సీఎం జగన్పై రెచ్చిపోయి మాట్లాడారు. పనికిరాని సన్నాసి, నత్తి నాకొ.. లాంటి దారుణ పదజాలంతో సీఎంను విమర్శించారు. వీడు.. వాడు.. అంటూ సీఎం అనే మర్యాద లేకుండా ఏకవచనంతో సంబోధించారు. సీఎం సతీమణిపైనా అవాకులు చెవాకులు పేలారు. ఇప్పటికే తనపైన 14 కేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరంటూ అసభ్యంగా సంజ్ఞలు చేస్తూ చూపించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ‘గత ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చాం. అంతా మనకే గుద్దేస్తారని చంకలు కొట్టేసుకున్నాం. అయినా మనకి పెద్ద పువ్వు చూపించారు. గెలుపు అంత ఈజీ కాదు. చివరి వరకూ పోరాటం చేయాల్సిందే’ అని చెప్పారు. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యన్న ఇలాకాలో అసమ్మతి ‘గంట’
సాక్షి, అనకాపల్లి: ‘భవిష్యత్తు గ్యారెంటీ’ అనే పేరుతో జిల్లాలో టీడీపీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర చప్పగా సాగుతోంది. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం నియోజవర్గాల్లో ఆశించిన స్థాయిలో స్పందన లేక అడుగడుగునా యాత్ర డీలా పడింది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డిని దూషించాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ యాత్రకు జనాదరణ లేకపోవడంతో టీడీపీ అధిష్టానం ఆశలన్నీ నీరుగారాయి. ఇక యాత్రలో సెల్ఫీచాలెంజ్ కార్యక్రమమైతే మొదటిరోజే తుస్సుమంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితల వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వర్గీయులు ఈ యాత్రను పట్టించుకోలేదు. జిల్లాలో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులైతే యాత్రకు ఆది నుంచి దూరంగా ఉంటున్నారు. యాత్ర ప్రారంభంలోనే పాయకరావుపేటలో వంగలపూడి అనిత వ్యతిరేక వర్గం ఈ యాత్రలో పాల్గొనడం లేదు. ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపు సీనియర్ టీడీపీ నాయకులంతా పాల్గొంటారని తెలుగు తమ్ముళ్లు ఆశించినా...పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్తిగా డుమ్మాకొట్టారు. జిల్లాలో యాత్రను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నాయకత్వంలో సాగడం ఇష్టంలేకనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు డుమ్మాకొట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులందరిని ఆహ్వానించి తమ సత్తా నిరూపించుకోవాలని చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే విఫలమయ్యాయి. అయ్యన్న ఇలాకాలో అసమ్మతి ‘గంట’ బస్సు యాత్ర పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ప్రారంభమైనప్పటి నుంచి నర్సీపట్నం వరకూ అడుగడుగునా ఇబ్బందులే ఎదురయ్యాయి. గత ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ పాతాళంలోకి కూరుకుపోయింది. ఇప్పుడు కూడా ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. తనకు తిరుగులేదని చెప్పుకునే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో సాగిన మూడోరోజు యాత్రలో సొంత నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప, యర్రాపాత్రుడు పాల్గొనలేదు. ఏడాదిగా అయ్యన్నపై గుర్రుగా ఉంటున్న వీరిపై గంటా వర్గంగా కూడా ముద్ర ఉంది. గతంలో మాజీ మంత్రి గంటాపై అయ్యన్న నోరు జారినప్పటి నుంచి వీరు పూర్తిగా అయ్యన్నకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు కాస్త ఈ యాత్రతో మరింత బట్టబయలయ్యాయి. టీడీపీ సీనియర్ నేత రుత్తల యర్రాపాత్రుడు తన గ్రామంలో ఒక ఉత్సవానికి నియోజకవర్గంలో టీడీపీ నాయకులందరినీ పిలిచారు గానీ..అయ్యన్నను, ఆయన వర్గీయులను పిలవలేదు.తాజా పరిణామమంతో విభేదాలు తేటతెల్లమయ్యాయి. అసహనంగా తెలుగు తమ్ముళ్లు.. ఈ యాత్రతో జిల్లాలో పార్టీ భవిష్యత్తు కనుమరుగవుతుందేమోనని తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న సీనియర్లంతా వస్తారేమో అన్న వారి ఆశ నిరాశైంది. నేతల్లో విభేదాలు ఈ యాత్రలో స్పష్టంగా కనిపించాయి. షెడ్యూల్ ప్రకారం యాత్ర జరగకపోవడంతో కార్యకర్తల్లో అసహనం మొదలైంది. ఏ సమయంలో యాత్ర వస్తుందో...రూట్ మ్యాప్ ఎలాగో కూడా తెలియక సతమతమైపోతున్నారు. తమ ప్రాంతానికి ఎప్పుడోస్తారో..యాత్రలో ఏ నాయకుడు మాట్లాడతాడో కూడా వచ్చే వరకూ కూడా కార్యకర్తలు తెలియడంలేదు. ఒక్క మొదటి రోజు మినహాయిస్తే ఏ రోజూ కూడా యాత్ర సక్రమంగా సాగలేదని టీడీపీ కార్యకర్తలు చిరాకుకు లోనవుతున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Multiple cat checj
Check international block
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019