breaking news
-
యూఎస్లో బర్డ్ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్ ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నాశనమవుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..! ఈ బర్డ్ ఫ్లూ వైరస్ని ఏవియన్ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ ఉక రకాల ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్9ఎన్2) వల్ల వస్తుంది. ఈ హెచ్5ఎన్1 వైరస్ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రకారం..బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. గుడ్లు.. గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. పాలు.. ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్ ఈ వైరస్ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది. అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే చివరిగా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది. దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది. కండరాల నొప్పులు: శరీర నొప్పులు తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు.. న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు. ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది. నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. (చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!) -
కారులో చికెన్ ఫ్రై రెసిపీ..ఎలాగంటే..?
వెళ్తున్న కారులోనే వంటకాలు చేసి ఔరా! అనిపిస్తున్నారు. యూట్యూబ్ రీల్ కోసం అనో చాలామంది ఇలా కారులోనే వంటకాలు చేసిన వీడియోలు చూశాం. కానీ వాటిలో అదంతా ఫేక్ అయ్యి ఉండొచ్చు కుదరదు అనుకునే వాళ్లం కదా!. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఈజీగా కారులో కూడా వంట చేసేయొచ్చేని అంటారు. ఇంతకీ ఎలా కారులో వండేస్తున్నారంటే.. ఆ వీడియోలో ఒక మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్ని కబాబ్ ముక్కలుగా కట్ చేస్తుంది. ఆ తర్వాత ఓ చిన్న కవర్ తీసుకుని అందులో మసాల దినుసులు, పెరుగు అని కలిపి ఉంచుతుంది. దానిలో చికెన్ కబాబ్ ముక్కలు అన్ని వేసి కాసేపు అలా ఉంచుతుంది. ఆ తర్వాత మరో కవర్ కార్న్ఫోర్ తీసుకుంటుంది. ఇప్పుడు మసాలాలో నాన్చిన చికెన్ముక్కలను ఈ కార్న్ఫోర్ కవర్లో దొర్లించి ఓ ప్లేట్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఓ ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని కాసేపు అలా ఉంచుతుంది. అది వేడిక్కెంది అని నిర్థారించుకున్నాక ఈ కార్న్ఫోర్ అద్దిన చికెన్ ముక్కల్ని వేసి చక్కగా డీప్ ఫ్రై చేస్తుంది. ఆ తర్వాత చక్కగా ఓ ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకుని లాంగించేస్తుంది. అబ్బా ఇంత ఈజీనా కారులో వంటలు చేయడం అనిపిస్తుంది ఆ మహిళ చేసిన విధానం చూస్తే. కానీ ఎలాగైన కిచెన్.. కిచెనే! ఎందుకంటే కారులో వంట చేయాలంటే కావాల్సిన పదార్థాల తోపాటు అన్ని క్లీన్ చేసుకుని ముందుగా రెడీ చేస్తేనే చేయడం ఈజీ. ఇంతలా ముందుగా హైరాన పడి రెడీ చేసుకోవడం కంటే వంటగదిలో హాయిగా టెన్షన్ పడకుండా చేసుకుంటే బెటర్ కదా..! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Sophie Saldana (@sophiesophss) (చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!) -
Chicken: చికెన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
ఖమ్మం: చికెన్కు డిమాండ్ పెరిగింది. నిన్న, మొన్నటి వరకు కిలో రూ.220 నుంచి రూ.250 వరకు ఉన్న చికెన్ ధర ఆదివారానికి ఒక్కసారిగా పెరిగింది. ప్రాంతం, డిమాండ్ ఆధారంగా కిలో చికెన్ రూ.300 పైగానే విక్రయిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్ కావటంతో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగానికి తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. దాణా ధరలు, కోడిపిల్లల ధరలు పెరగటం, వేసవిలో నిర్వహణ ఖర్చులు పెరగటం కూడా చికెన్ ధరలు పెరగటానికి కారణాలుగా కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్పత్తి పడిపోయింది.. ప్రస్తుతం చికెన్కు ఉన్న డిమాండ్కు తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి జరగటం లేదు. మార్కెట్లో వ్యాపారుల నుంచి ఆర్డర్లు పెరగటంతో అందుకు అనుగుణంగా ఉత్పత్తులు లేకపోవటంతో కంపెనీలు రేట్లు పెంచుతున్నాయి. పరిశ్రమల వద్ద లైవ్ బర్డ్ ధర పెరగటంతో దాని ప్రభావం చికెన్ ధరపై పడుతోంది. నెల రోజుల కిందట తెలంగాణ కుంభమేళాగా జరిగిన మేడారం జాతరతో కోళ్లు, చికెన్ ధరలు పెరిగాయి. జాతర తరువాత తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. నెల రోజులకు పైగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుండటంతో మాంసాహారాల వినియోగం బాగా పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో నిత్యం 80 నుంచి 90 టన్నుల వరకు చికెన్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా. ఒక్క ఖమ్మం నగరంలోనే దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు వినియోగం ఉన్నట్లు వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో 60 లక్షలకు పైగా కోళ్లను పెంచేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత అనుభాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం 40 నుంచి 45 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగానికి తగిన విధంగా ఉత్పత్తి లేకపోవటంతో ధర ౖపైపెకి పోతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లతో.. ప్రస్తుతం హిందూ, ముస్లింల పండుగలైన ఉగాది, రంజాన్లు ఓ వైపు, మరో వైపు పెళ్లిళ్ల సీజన్ కావటంతో చికెన్కు బాగా డిమాండ్ పెరిగింది. మంగళవారం ఉగాది పండుగ, గురు, శుక్రవారాల్లో రంజా న్ పండుగ ఉండటంతో చికెన్కు వ్యాపారుల నుంచి ఆర్డర్లు బాగా పెరిగాయి. ఇదే తరుణంలో పెళ్లిళ్లు ఉండటంతో ఆ డిమాండ్ కూడా కొనసాగుతోంది. శుభ ముహూర్తాల కాలం కావటంతో ప్రతి ఇంటా ఉప్పలమ్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో చికెన్కు ధరలు పెరుగుతున్నాయి. మొక్కజొన్న వంటి పంటల ఉత్పత్తి తగ్గిపోవటంతో దాణా ధర పెరిగింది. ఇక హేచరీస్లో కోడి పిల్లల ధర పెరిగింది. రూ.25 నుంచి రూ.30 ఉన్న కోడి పిల్ల ధర ప్రస్తుతం రూ.53గా పలుకుతోంది. ఇక నిర్వహణ ఖర్చులు పెరిగాయి. వేసవిలో కోళ్ల పరిశ్రమల నిర్వహణకు అదనంగా ఖర్చవుతుంది. ఏసీల వినియో గం పెరగటంతో నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఇక ప్రస్తుతం 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్లు తట్టుకోలేవు. ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కాలం కావటంతో కోళ్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని భావించి నిర్వాహకులు, రైతులు కోళ్ల పెంపకానికి వెనుకంజ వేస్తున్నా రు. ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోతే కోలుకోలేని దెబ్బ పడుతుంది. కోళ్లు సాధారణంగా 40 రోజుల్లో 2.3 కిలోల బరువు పెరుగుతుంది. కానీ, వేసవిలో 48 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఒక కోడి పెంపకానికి రూ.125 నుంచి రూ.135 వరకు ఖర్చవుతోంది. కంపెనీలు ప్రస్తుతం రూ.140 వరకు విక్రయిస్తున్నాయి. దీంతో రిటైల్గా స్కిన్లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిండగా, విత్స్కిన్ రూ.280 గా, లైవ్కోడి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తి లేకనే.. కోళ్ల ఉత్పత్తి లేకనే చికెన్ ధరలు పెరిగాయి. వివిధ కారణాలతో కోళ్ల పెంపకం తగ్గింది. వేసవిలో కోళ్ల పెంపకం భారంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. కోడిపిల్ల ధర బాగా పెరిగింది. వేసవిలో పెంపకం ఇబ్బందిగా ఉంటుంది. నిర్వహణ ఖర్చులు పెరిగాయి. డిమాండ్ తగిన ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెంచడం అనివార్యమైంది. – రావి బాబూరావు, పౌల్ట్రీ పరిశ్రమ యజమాని, ఖమ్మం చికెన్ ధర ప్రియం చికెన్ ధర ప్రియంగా మారింది. గతంతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు ధరకు చేరింది. కిలో చికెన్ ధర రూ.300 కావటంతో వినియోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. ప్రతి ఆదివారం చికెన్కు రూ.200 నుంచి రూ.220 వరకు వెచ్చిస్తాం. అలాంటిది రూ.300 పెట్టినా కేజీ రావటం లేదు. మటన్ ధరతోపాటు చికెన్ ధర కూడా అందుబాటులో లేకుండా పోతోంది. – శీలం కార్తీక్, నాయుడుపేట, ఖమ్మం -
చికెన్ స్కిన్ గురించి విన్నారా? వేసవికాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధి..!
చికెన్ఫాక్స్ లాంటి ఆటలమ్మ, పొంగు, తట్టు తరహా చర్మ వ్యాధులను చూశాం. గ్రామాల్లో మాత్రం ఈ వ్యాధిని అమ్మవారు చూపింది అంటారు. ఓ వారం రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇప్పటికీ చాలా చోట్ల దీనికి మందులు వాడరు ప్రజలు. వేపాకు, పసుపుతో తగ్గించుకుంటారు. అయితే దీనికి కూడా టీకాలు వంటివి వచ్చేశాయి ఇప్పుడు. కానీ కొత్తగా ఇదేంటీ..? చికెన్ స్కిన్ .. అంటే.. ఇది కూడా ఒక విధమైన చర్మ వ్యాధే. గానీ తీవ్రత ఎక్కువ. వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు. శోభి తర్వాత భయానకమైన చర్మవ్యాధి ఇదే. ముఖ్యంగా వేసవికాలంలో పలువురిని వేధించే సమస్య ఇది. అయితే కొందరికి నయం అయినా, మరికొందరికి మాత్రం జీవితాంతం వేధిస్తుంది. అసలేంటి వ్యాధి? ఎలా వస్తుంది ? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..! వైద్య పరిభాషలో చికెన్ స్కిన్ను కెరటోసిస్ పిలారిస్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి వచ్చిన రోగి చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. రాను రాను గులాబీ లేదా ఎరుపు రంగు మచ్చలుగా మారతాయి. ఇవి ఎక్కువగా చేతులు, ముఖం, తొడలు, చెంపలు, వీపు పైభాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఆ మచ్చలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటి వల్ల దురద కూడా ఏర్పడుతుంది. నలుగురిలో అదే పనిగా శరీరాన్ని గోకుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పైగా నలుగురిలో తిరగలేక నానాఅవస్థలు పడతారు. దీనికి ప్రధాన కారణం చర్మంపై కెరాటిన్ ఏర్పడటం. ఎందుకంటే..? ఈ కెరాటిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. చర్మంపై వెంట్రుకల కుదుళ్ళు పెరగకుండా చేస్తుంది. ఫలితంగా చర్మంపై చిన్న పరిమాణంలో ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి. ఈ కెరాటోసిస్ అనేది జన్యు మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. తామర, మధుమేహం కెరాటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఉబ్బసం, అలర్జీ, అధిక బరువు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ చికెన్ స్కిన్ వల్ల ఏర్పడే గడ్డలు కొందరిలో వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. చికెన్ స్కిన్ నుంచి బయటపడాలంటే .. ముందుగా పొడి చర్మాన్ని నివారించాలి. కెరాటో లిటిక్ ఏ వంటి మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే చికెన్ స్కిన్ బారిన పడ్డవారు చర్మంపై వచ్చిన ఆ గడ్డలను గిచ్చడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అంతేకాదు కొంతమంది రాపిడితో కూడిన ఎక్స్ ఫోలీయేటర్తో గడ్డల మీద స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత ప్రమాదంలో పడుతుంది. అంతేగాదు బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఈ వ్యాధి బారనే పడ్డట్టు ఇన్స్టాగ్రాం వేదికగా తెలిపింది. ఈ వ్యాధి ఏంటో ఎలా బయటపడాలి అనే దాని గురించి కుణ్ణంగా తెలుసుకునే పనిలో ఉన్నాని కన్నీటిపర్యంతమయ్యింది. అందువల్ల సమస్య ఆదిలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి సత్వరమే సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దీని గురించి మరింత క్షుణ్ణంగా వ్యక్తిగత వైద్యులను, నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్వెజ్గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్ని బట్టి చికెన్ లేదా మటన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019