breaking news
-
పెండింగ్ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం.. పెండింగ్ స్థానాలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. నాలుగు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లతో శుక్రవారం మధ్యాహ్నాం జాబితా విడుదల చేసింది టీడీపీ. లోక్సభ స్థానాల్లో భాగంగా.. విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఖరారు చేసింది. అలాగే.. అనంతపురం అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయనణ, కడప నుంచి భూపేష్రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇక తొమ్మిది అసెంబ్లీ స్థానాలకుగానూ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తానికి పంతం నెగ్గించుకుని గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి సీటు దక్కించుకున్నారు. విజయనగరం చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీకి మరో సీనియర్ కళా వెంకట్రావ్ను చంద్రబాబు ముందుంచారు. దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి అవకాశం కల్పించారు. కదిరిలో యశోదా దేవిస్థానంలో కందికుంట వెంకట ప్రసాద్కు ఛాన్స్ ఇచ్చారు. బీసీలకు వెన్నుపోటు మొత్తం మీద లోక్ సభ సీట్లకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే బీసీలకు వెన్నుపోటు అన్నది పూర్తిగా స్పష్టమవుతోంది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను కూటమి కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 ఆన్ రిజర్వ్డ్ సీట్లలో ఏకంగా 11 సీట్లను బీసీలకు కేటాయించింది. టీడీపీ కూటమి మాత్రం 20 ఆన్ రిజర్వ్ సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలోనూ చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి సీట్లు కేటాయించుకున్నారు. కూటమి తరపున 25 సీట్లకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. కాపులకు 17 లోక్ సభ సీట్లలో ఒక్క సీటు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. భీమిలిలో బేరాలు భీమిలిలో గంటా టికెట్ విషయంలో చివరివరకు డ్రామా నడిచింది. ఈ సీటు విషయంలో గంటాకు ఇవ్వడానికి ససేమిరా అన్న చంద్రబాబు.. చీపురుపల్లిలో పోటీ చేయాలని గంటాకు సూచించారు. అయితే గంటా మాత్రం ఓడిపోయే సీటు నాకెందుకంటూ పేచీ పెట్టారు. భీమిలి సీటు ఇస్తే.. ఎంత ఖర్చయినా పెడతానంటూ గంటా ముందుకురావడంతో చంద్రబాబు ఓకే అన్నట్టు తెలిసింది. భీమిలితో పాటు జిల్లాలోని కనీసం నాలుగు చోట్ల ఖర్చంతా పెట్టుకోవాలని గంటాకు షరతు పెట్టినట్టు తెలిసింది. ఓడిపోయే సీటు నాకు వద్దు బాబోయ్.. అని కళా వెంకట్రావు అరిచి గీ పెట్టినా.. ఆయనకు మళ్లీ చీపురుపల్లిని అంటగట్టాడు చంద్రబాబు. పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కళాకు సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర విమర్శలు రావడంతో.. కళా వెంకట్రావుకు చీపురుపల్లిని ఇచ్చినట్టు తెలిసింది. వారసులకు మొండి చేయి అనంతపురంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరికి నిరాశ మిగిలింది. జేసీ వారసుడు పవన్ కుమార్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. ఇటీవల పరిటాల శ్రీరామ్కు కూడా చంద్రబాబు మొండిచేయే చూపించాడు. ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ను పరిటాల శ్రీరామ్ ఆశించగా.. ఆ టికెట్ను బీజేపీకి పొత్తులో భాగంగా కేటాయించాడు. దీంతో ఇక్కడ పరిటాల శ్రీరామ్ బద్ధ శత్రువు వరదాపురం సూరికి టికెట్ దక్కింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సూరికి.. టీడీపీ ఇంఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ ఏ మాత్రం మద్ధతివ్వబోడని బహిరంగంగానే అంటున్నారు. చంద్రబాబు పెనుకొండ మీటింగ్ సందర్భంగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. గుమ్మనూరు విషయంలో ఏం జరిగింది? గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను ప్రకటించాడు చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో టిడిపిని సుదీర్ఘకాలం నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కు బాబు వెన్నుపోటు పొడిచినట్టయింది. జయరాంకు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జితేంద్రగౌడ్కు చివరకు నిరాశే మిగిల్చాడు చంద్రబాబు. చివరిక్షణంలో YSRCP నుంచి వచ్చిన గుమ్మనూరుకు టికెట్ ఎలా ఇస్తారంటూ స్థానిక టిడిపి నేతలు ఊసురుమంటున్నారు. ఇన్నాళ్లు గుమ్మనూరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన తాము.. ఇప్పుడు ఆయన్ను గెలిపించాలని ఓటర్లను ఎలా అడుగుతామని అంటున్నారు. చివరికి గుమ్మనూరు ఓడిపోతాడని IVRS సర్వేల్లో తేలినా.. వెన్నుపోటు అన్న ప్రచారానికి భయపడి సీటు కేటాయించినట్టు తెలిసింది. మొత్తమ్మీద ఈ వ్యవహారం వెనక భారీగా డబ్బు లావాదేవీలు జరిగినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. గుమ్మనూరు డబ్బు సమర్పించుకోవడం వల్లే జితేంద్రకు అన్యాయం జరిగిందంటున్నారు. -
ఎనిమిది చోట్ల ఖరారుపై తకరారు!
ఆదిలాబాద్ ఈ లోక్సభ సీటులో స్థానిక నేతలు కాకుండా బయటి నుంచి తెచ్చిన వారిని పోటీలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రమేశ్ రాథోడ్ ఇప్పుడు పార్టీలో లేరు. అంతకంటే ముందు పోటీచేసిన డాక్టర్ నరేశ్ జాదవ్ పార్టీలోనే ఉన్నా వేరే అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో రిమ్స్లో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ సుమలత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణలలో ఒకరిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వీరిలో సుమలత పేరు ఖరారైందని తొలుత ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఆత్రం సుగుణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వరంగల్ ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో కచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి కాంగ్రెస్కు ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటించిన రెండు ఎస్సీ రిజర్వుడ్ సీట్లను మాల సామాజిక వర్గానికే ఇచ్చారు. దీంతో ఇక్కడ మాదిగ సామాజికవర్గ నేతకే చాన్స్ ఇవ్వనున్నారు. తొలుత దొమ్మాట సాంబయ్య పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ పార్టీలోకి రావడంతో ఆయన వైపు మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు. ఈ ఇద్దరితోపాటు గతంలో లోక్సభకు పోటీచేసిన డాక్టర్ రాగమళ్ల పరమేశ్వర్ కూడా టికెట్ అడుగుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థిని తేల్చడంలో గందరగోళం కనిపిస్తోంది. కరీంనగర్ : ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. వెలిచాల రాజేందర్రావు పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ ప్రవీణ్రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని అంటున్నా అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. నిజామాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పోటీ చేస్తారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బాల్కొండ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన ముత్యాల సునీల్రెడ్డి కూడా ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఇక్కడ జీవన్రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందని చెప్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. ఖమ్మం: ఈ ఎంపీ సీటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్టాపిక్గా మారింది. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులలో ఎవరికి అవకాశం అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మల్లు నందిని, పొంగులేటి ప్రసాదరెడ్డి, తుమ్మల యుగంధర్లతోపాటు పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ అడుగుతున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారా? కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తారా? బీసీ వర్గాలకు టికెట్ ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. భువనగిరి: ఇక్కడ కూడా ఖమ్మం లోక్సభ స్థాయిలో పోటీ నెలకొంది. ఈ సీటుకు సంబంధించి తొలినుంచీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అనుచరుడు చామల కిరణ్కుమార్రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మి పేరును సీరియస్గా పరిశీలించారు. అయితే రాజగోపాల్రెడ్డి మాత్రం తాము టికెట్ అడగడం లేదని, లోక్సభ ఎన్నికల తర్వాత తాను మంత్రిని అవుతానని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పార్టీలోకి వస్తారని, ఆయనకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన మరో నాయకుడు పవన్రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. తాజాగా బీసీ నేతకు భువనగిరి టికెట్ వస్తుందనే చర్చ జరుగుతోంది. దీనితో గందరగోళంగా మారింది. మెదక్: ఈ లోక్సభ సీటును బీసీలకు ఇస్తారని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి, పటాన్చెరు టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీచేసి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చిన నీలం మధు ముదిరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష కూడా పోటీలో ఉన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల తనకు మెదక్ ఎంపీ టికెట్ కావాలని అడిగినా.. ఆమెను టీజీఐఐసీ చైర్మన్గా నియమించడంతో రేసు నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. మెదక్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ హైదరాబాద్ టికెట్ విషయంలోనూ ఏమీ తేలలేదు. ఇక్కడ ఎంఐఎంకు ప్రతిగా ఎంబీటీని ప్రోత్సహించాలని తొలుత భావించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దింపాలని తర్వాత నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అజారుద్దీన్, ఫిరోజ్ఖాన్తోపాటు అలీ మస్కతిల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా న్యాయవాది షహనాజ్ తబసుమ్ అభ్యర్థిత్వాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నారు. ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఎలాంటి స్పష్టతా లేదు. -
TDP : మూడో జాబితా చూస్తే వెన్నుపోటు అంటే ఏంటో తెలుస్తుంది
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీకి సంబంధించి 11 మంది, అలాగే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఉదయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఆశావహుల్లో కొందరికి అధిష్టానం మొండి చేయి చూపించింది. సీనియర్లలో కొందరికి సీట్లు దక్కగా.. మరికొందరికి మాత్రం చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేసుకున్న చంద్రబాబు.. బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు అంటే రుచి చూపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ మరీ.! భీమిలి నుంచి గంటాకు నో, మూడో జాబితాలో మొండి చేయి, చీపురుపల్లి నుంచి చేస్తే చేయ్.. లేదంటే తప్పుకో అంటూ గంటాకు సూచన చేసినట్టు తెలిసింది. తెలుగుదేశం రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు శ్రీకాకుళంలో సీటు ఆశించి భంగపడ్డ గుండా లక్ష్మీదేవి, డబ్బు సంచులకే ప్రాధాన్యం తనను పక్కనబెట్టారని అంటున్నారు విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్కు చోటు దక్కకుండా చక్రం తిప్పాడు, బాలకృష్ణ తోడల్లుడి కొడుకు భరత్కు విశాఖ ఎంపీ సీటు ప్రకటించాడు, కేవలం కుటుంబ సభ్యుల కోసమే విశాఖ సీటును టిడిపికి అప్పగించారని పురందేశ్వరీ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిజమైన బీజేపీ కార్యకర్తలకు కాకుండా.. కుటుంబ సభ్యుల కోసం పార్టీని తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు. మైలవరంలో దేవినేని ఉమా మొదటి నుంచి ఆరోపిస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగానే వంద కోట్లు ఇచ్చిన కృష్ణప్రసాద్కు టిడిపి టికెట్ ఇచ్చినట్టు తాజా జాబితా బట్టి తేలిపోయింది. డబ్బుల పోటీలో దేవినేని ఉమా వెనకబడిపోయారు. పార్టీలో చేరగానే వసంతకు టికెట్ ఇచ్చాడు బాబు. డబ్బు సంచులకే టికెట్లు అన్నది శ్రీకాకుళంలో పక్కాగా నిరూపణ అయింది. శంకర్, గోవింద్రావు ఇద్దరిది అదే అర్హత అన్న విమర్శలున్నాయి పెనమలూరు టికెట్ పార్ధసారధి యాదవ్కు ఇస్తానని టీడీపీ లోకి తీసుకొని నూజివీడుకు పంపించారు చంద్రబాబు. అక్కడ బోడె ప్రసాద్ చౌదరికి ఇచ్చాడు. అలాగే గత ఎన్నికల్లో వైఎస్సార్సిపి నుంచి ఎన్నికైన ఉండవల్లి శ్రీదేవిని ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశ పెట్టి ఓటు వేయించుకున్నాడు. తీరా అవసరం తీరిన తర్వాత మొండిచేయి చూపించాడు బాబు. కాపు ,యాదవ, చేనేత ,బిసీ సామాజిక వర్గాలకు పోటీగా కమ్మలను రంగంలోకి దించినట్టు తేలిపోయింది. విశాఖ ఎంపీగా భరత్ (కమ్మ) vs బొత్స ఝాన్సీ (కాపు) గుంటూరు ఎంపీ గ పెమ్మసాని (కమ్మ) vs కిలారు రోశయ్య(కాపు) నరసారావు పేట ఎంపీగా లావు vs అనిల్ యాదవ్ (యాదవ బీసీ) మంగళగిరి లో లోకేష్ vs కాండ్రు లావణ్య (చేనేత బీసీ ) కుప్పం లో బాబు vs భరత్ (వన్నెకుల క్షత్రియా బిసీ ) -
YSRCP సిద్ధం : వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులు వీరే
Updates సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు 50 శాతం స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్థానాలకు కేటాయించాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఎప్పుడూ జరగలేదు. దాదాపు 99 స్థానాల్లో మార్పులు చేశాం. ప్రజల మీద నమ్మకంతో మార్పులు చేశాం. టికెట్ రాని వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఇదే నా భరోసా. విప్లవాత్మక మార్పులతో ఈ ఐదేళ్ల పాలన జరిగింది. ఎక్కడా లంచం లేకుండా సంక్షేప పథకాలు ప్రజలకు అందాయి. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో ఇది లిఖించదగిన అంశం. గ్రామాలు మారాయి. స్కూల్స్ బాగుపడ్డాయి. ఆసుపత్రులు మారాయి. మహిళా సాధికారత, సామాజిక న్యాయం చేసి చూపించాం. మార్పులను ప్రజలు గమనించాలి. రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం మరింత ఎక్కువగా అందిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థులు వీరే.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన నందిగామ సురేష్.. అనకాపల్లి స్థానం పెండింగ్లో ఉంది. మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు 200 సీట్లకు గాను 100 స్థానాలు కేటాయించారు. సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు కేటాయింపు. ఎంపీల విద్యార్థత.. 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే. ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు. 25 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు. ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టిషనర్. ఎమ్మెల్యేల విద్యార్హత.. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు. 77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లు కేటాయింపు. 2024 ఎన్నికల బరిలో 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు. 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు. 25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. ►ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే అదనంగా 11 సీట్లు కేటాయించిన సీఎం వైఎస్ జగన్. ►2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయింపు. ►2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. 2024లో నాలుగు స్థానాలు పెంపు. ►2019లో మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు కాగా.. 2024లో మరో రెండు స్థానాలు పెంచి ఏడు స్థానాలు కేటాయింపు. ►2019లో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇస్తే.. ఈసారి ఒకసీటు అదనంగా మూడు సీట్లకు పెంపు. ►2019లో ఎంపీ ఎన్నికల్లో ఎస్సీలకు నాలుగు, బీసీలకు 12 సీట్లు కాగా.. 2024లో బీసీలకు అదనంగా నాలుగు సీట్లు కేటాయింపు. ►2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయింపు. ►2024 ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపు. ►2019లో మహిళలు, మైనార్టీలకు 18 సీట్లు ఇస్తే.. ►2024లో ఆరు సీట్లు పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 24 సీట్లు ఇచ్చి తన మార్క్ చాటుకున్న సీఎం జగన్. ►2019 ఎన్నికల్లో మహిళలకు 15 చోట్ల ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు.. ఈసారి ఆరు సీట్లు పెంచి 24 చోట్ల అవకాశం. ►2024 ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 14 ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు. వైఎస్సార్ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ వైఎస్సార్ సమాధి వద్ద పూలమాలలతో నివాళులర్పిస్తున్న సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలు కాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్ కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ కాసేపట్లో ప్రత్యేక హెలికాఫ్టర్లో ఇడుపులపాయకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ ►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ►గన్నవరం నుండి కడప ఎయిర్ పోర్ట్ కి బయల్దేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జాబితాలో పెద్దగా మార్పులు ఉండవు: సజ్జల అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చాం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యం మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నాం వైఎస్సార్సీపీ తుది జాబితాలో ఇది కనిపిస్తుంది ఇడుపులపాయకు బయల్దేరిన సీఎం జగన్ వైఎస్సార్ఘాట్ వద్ద కాసేపట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన మధ్యాహ్నం 12.30కు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళి ఆ తర్వాత.. మధ్యాహ్నాం 12.50 నుంచి 1.20 వరకు జాబితా ప్రకటన సీఎం జగన్ సమక్షంలో.. అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేయనున్న వైఎస్సార్సీపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల కోసం 175, లోక్సభ ఎన్నికల 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించనున్న పార్టీ సామాజిక న్యాయం ప్రతిబింబించేలా జాబితా.. ►మధ్యాహ్నాం 12.58 నిమిషాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన ►సీఎం జగన్ సమక్షంలో అభ్యర్థుల్ని ప్రకటించనున్న ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ ►బీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ►అన్ని వర్గాలకు అవకాశాలు ఉండేలా తుది జాబితా ►ఇప్పటికే 68 అసెంబ్లీ స్థానాలకు మార్పులు ప్రకటించిన వైఎస్సార్సీపీ ►32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలకు పక్కన పెట్టిన అధిష్టానం ►సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములే ప్రామాణికంగా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించనున్నారు. ►ఇడుపులపాయ వద్ద 200 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు, నందిగామ సురేష్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ►వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటే అవకాశం. అన్ని వర్గాలకు అవకాశం ఉండే విధంగా వైఎస్సార్సీపీ జాబితా రూపొందించినట్టు సమాచారం. సీఎం జగన్ ఇడుపులపాయ షెడ్యూల్ ఇలా.. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. ►అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. ►మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతను చాటుకున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టోను ప్రకటించాక.. ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరి మోగించనున్నారు. ►ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికను రూపొందించారని తెలుస్తోంది. ఓవైపు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. మరోవైపు వైఎస్సార్సీపీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులేస్తోంది. -
మరో నలుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య, జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్కుమార్, నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్థన్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా నలుగురు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా తొమ్మిదికి చేరింది. ఇంకా 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్ఎస్. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, )మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది. ఇదీ చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019