breaking news
-
బీజేపీ మరో జాబితా: డైమండ్ హార్బర్ నుంచి అభిజిత్ దాస్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ అభ్యర్థుల మరో జాబితా విడుదల చేసింది. మంగళవారం బీజేపీ 12వ అభ్యర్థల జాబితాను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి అభిజిత్ దాస్ (బాబీ)ని బరిలో నిలిపింది. ఇక్కడ టీఎంసీ తరఫున సీఎం మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న విసయం తెలిసిందే. 12 జాబితాలోని అభ్యర్థులు వీరే.. సతారా(మహారాష్ట్ర)-ఉదయన్రాజే భోంస్లే, ఖదూర్ సాహిబ్ (పంజాబ్)-మంజీత్ సింగ్ మన్నా మియావింద్, హోషియార్పూర్ (పంజాబ్)- అనితా సోమ్ ప్రకాష్, బటిండా( పంజాబ్)- పరంపాల్ కౌర్ సిద్ధూ, ఐఏఎస్, ఫిరోజాబాద్, (ఉత్తరప్రదేశ్) ఠాకూర్ విశ్వదీప్ సింగ్, డియోరియా (ఉత్తరప్రదేశ్)-శశాంక్ మణి త్రిపాఠిని పోటీలో నిలిపింది. भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने आगामी लोकसभा चुनाव-2024 के लिए 12वीं सूची में निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/VdGHChERQa — BJP (@BJP4India) April 16, 2024 అదే విధంగా తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల అభ్యర్థిగా డా. టీఎన్ వంశీ తిలక్ను బరిలోకి దించింది. भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने तेलंगाना एवं उत्तर प्रदेश में होने वाले आगामी विधानसभा उप-चुनाव 2024 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/LMFNNFueC0 — BJP (@BJP4India) April 16, 2024 21 మంది అభ్యర్థులతో ఒడిషా అసెంబ్లీ ఎన్నికల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. The BJP Central Election Committee has decided on the following names for the ensuing elections to the Legislative Assembly of Odisha. Here is the second list. pic.twitter.com/nmuVozPOE2 — BJP (@BJP4India) April 16, 2024 -
కాంగ్రెస్ మరో జాబితా.. కన్హయ్య కుమార్ అక్కడి నుంచే..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు పలు రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనటంలో బీజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రటించింది. పదిమంది అభ్యర్థులతో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ, పంజాబ్, అలహాబాద్ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈశాన్య ఢిల్లీ సీటు నుంచి కన్హయ్య కుమార్ బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా 75 మందితో ఒడిస్సా అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की लिस्ट। pic.twitter.com/jHaWDAlXKB — Congress (@INCIndia) April 14, 2024 The candidates selected by the Central Election Committee of Congress for the ensuing elections to the Legislative Assembly of Odisha 👇🏼 pic.twitter.com/V6RkjWAKdF — Congress (@INCIndia) April 14, 2024 -
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు లోక్సభ, 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ మంగళవారం(ఏప్రిల్ 2) విడుదల చేసింది. కడప పార్లమెంట్ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, రాజమండ్రి-గిడుగు రుద్రరాజు, బాపట్ల- జేడీశీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ లోక్సభ బరిలో ఉండనున్నారు. ఇక అసెంబ్లీ టికెట్లు పొందినవారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలిజాలకు నందికొట్కూరు, చింతలపూడి నుంచి టికెట్లు దక్కాయి. కుప్పం అసెంబ్లీ నుంచి ఆవుల గోవిందరాజులు బరిలో దిగనున్నారు. ఇదీ చదవండి.. చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా -
బీజేపీ 8వ జాబితా రిలీజ్.. ప్రముఖ బాలీవుడ్ హీరోకు నో టికెట్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ శనివారం(మార్చ్ 30) సాయంత్రం విడుదల చేసింది. ఒడిషా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 11 సీట్లకు ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, బ్లాక్ బస్టర్ గదర్ హీరో సన్నీ డియోల్కు పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్పూర్ నుంచి దినేష్సింగ్ బాబును బరిలోకి దింపింది. పార్లమెంటుకు సరిగా హాజరు కాకపోవడం వల్లే సన్నీ డియోల్కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదని సమాచారం. మాజీ సీఎం అమరేందర్సింగ్ భార్య ప్రణీత్ కౌర్కు పార్టీలో చేరిన కొద్ది రోజులకే పటియాల నుంచి టికెట్ ఇచ్చారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్జిత్సింగ్ సంధుకు అమృత్సర్ నుంచి అవకాశం కల్పించారు. ఆమ్ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సుశీల్కుమార్ రింకూను జలంధర్ నుంచి బరిలోకి దింపారు. ఒడిషాలో ఇటీవలే రాష్ట్రంలో అధికార బీజేడీ నుంచి బీజేపీలో చేరిన మోస్ట్ సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్కు కటక్ నుంచి టికెట్ ఇచ్చారు. ఇదీ చదవండి.. బీజేపీ వాషింగ్మెషిన్ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు -
సీపీఎం మొదటి లిస్ట్ విడుదల
రానున్న లోక్సభ ఎన్నికలకు సీపీఎం తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో ఒకటీ రెండు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం.. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లకు తమ అభ్యర్థులను వెల్లడించింది. ఈ జాబితాలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 17 స్థానాలు ఉన్నాయి. కేరళకు చెందిన 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో అలప్పుజా నుంచి సిట్టింగ్ ఎంపీ ఆరిఫ్, వడకర నుంచి మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ టీచర్, కాజీకోడ్ నుంచి రాజ్యసభ ఎంపీ ఎలమరం కరీం ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని 17 పేర్లలో ముర్షిదాబాద్కు చెందిన మహ్మద్ సలీం పేరు కూడా ఉంది. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మధురై నుంచి సిట్టింగ్ ఎంపీలు ఎస్ వెంకటేశన్, దిండిగల్ ఆర్ సచ్చిదానందంలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని భువనగిరి స్థానానికి ఎండీ జహంగీర్ పేరును, ఆంధ్ర ప్రదేశ్లోని అరకు స్థానానికి పాచిపెంట అప్పలనరస పేరును మొదటి జాబితాలో వెల్లడించింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019