breaking news
Ad - Sakshi_Home_Sticky
-
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్లోని చెన్నాస్ కన్వెన్షన్లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు. -
నేటి నుంచి కేసీఆర్ ప్రగతి రథం యాత్ర
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మే 10 వరకు 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో భాగంగా 40కి పైగా పట్టణాల్లో జరిగే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొని లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. ఈ ప్రగతి రథానికి బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కాగా బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఈ సందర్భంగా కేసీఆర్కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత... భోజనానంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఆయన వెంట ఉంటారు. సుమారు వందకు పైగా వాహనాలు ప్రగతి రథాన్ని అనుసరించే అవకాశముంది. సుమారు రెండు వందల మందితో కూడిన వలంటీర్ల బృందం కూడా యాత్రలో పాల్గొంటుంది. పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలతో పాటు సుదీర్ఘకాలంగా పారీ్టలో పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలు వలంటీర్లుగా వ్యవహరించనున్నారు. పంతంగి టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం తొలిరోజు బస్సు యాత్ర బేగంపేట, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా విజయవాడ రహదారిపైకి చేరుతుంది. వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్ దాటిన తర్వాత చౌటుప్పల్ పంతంగి టోల్ప్లాజా వద్ద అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దారి పొడవునా కేసీఆర్కు ప్రజలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికేలా మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. నకిరేకల్ క్రాస్ రోడ్, నల్లగొండ, మాడుగులపల్లి మీదుగా సాయంత్రం 5 గంటలకు మిర్యాలగూడ ఫ్లైఓవర్ వద్దకు యాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 5:30కి రాజీవ్ చౌక్వద్ద రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం వేములపల్లి, మాడుగులపల్లి తిప్పర్తి మీదుగా రాత్రి 7 గంటలకు సూర్యాపేటకు చేరుకుని రోడ్ షోలో ప్రసంగిస్తారు. సూర్యాపేటలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ రాత్రి బస చేస్తారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రచారం తీరుతెన్నులను సమీక్షించి దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి చిట్యాల, రామన్నపేట మీదుగా భువనగిరి చేరుకుని అక్కడ జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస కోసం ఎర్రవల్లి ఫామ్హౌస్కు చేరుకుంటారు. శుక్రవారం నుంచి మరో 15 రోజులు పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. కిలోమీటర్ మేర రోడ్ షో ప్రతిచోటా కిలోమీటర్ మేర రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తారు. రోజూ రోడ్ షో ముగిసిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం కేసీఆర్ విలేకరులతో మాట్లాడతారు. దీంతో పాటు ఉదయం వేళల్లో వివిధ సామాజికవర్గాలతో భేటీలు, క్షేత్ర స్థాయి సందర్శనలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా కేసీఆర్ బస్సు యాత్ర వెంట వెళ్లే వలంటీర్లకు ఎక్కడికక్కడ బస ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నారు. -
చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం
-
నా తండ్రి లాంటి వారు ఎమోషనల్ అయిన బొత్స
-
అక్క చెల్లమ్మలకు జగనన్న విజ్ఞప్తి..!
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019