breaking news
-
అండగా ఉంటా.. ఆదుకుంటా
మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్ గురువారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్లో కొద్దిసేపు ఆగి ప్రజలతో మమేకమయ్యారు. తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితులకు ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. అర్జీలు స్వీకరించారు. అండగా ఉంటానంటూ కన్నీళ్లు తుడిచారు. వారంతా సంతోషంతో సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియచేశారు. –కొత్తపేట/రావులపాలెం జగనన్న న్యాయం చేస్తానన్నారు.. గతేడాది దీపావళి సమయంలో బాణసంచా పేలి నా కుమారుడు వినోద్ కుమార్ కుడిచేతికి తీవ్ర గాయమైంది. మణికట్టు వరకు తొలగించారు. కృత్రిమ చేయి పెట్టించేందుకు అవసరమైన సాయం కోసం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వారా జగనన్నను కలిశాను. నా బాధ విన్న జగనన్న తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఈ ఐదేళ్లలో ఆయన అమలు చేసిన పథకాల ద్వారా రూ.4.75 లక్షలు లబ్ధి పొందాం. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – పువ్వల చినబాబు, జార్జిపేట, తాళ్లరేవు మండలం అడగకుండానే.. నా కాలికి ఆపరేషన్ చేయిస్తానన్నారు మా కుటుంబానికి సీఎం జగన్ మరో దేవుడు. ఆయన వస్తున్నారని తెలిసి చూద్దామని వచ్చాను. కానీ ఆయన్ని కలిసి మాట్లాడే అదృష్టం దక్కింది. నా పోలియో కాలును చూసిన జగనన్న.. ‘ఏమ్మా ఆపరేషన్ చేయించుకోలేదా’ అని అడిగారు. ఇరవై ఏళ్ల క్రితం చేయించుకున్నాను సార్.. అయినా ప్రయోజనం లేదని చెప్పాను. దీంతో జగనన్న ఆపరేషన్ చేయిస్తానని మాట ఇచ్చారు. అడగకుండానే అన్నీ ఇస్తున్న జగనన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. – మెరుగు పువ్వు శాంతి, గోపాలపురం, రావులపాలెం మండలం భరోసా దొరికింది.. నాకు గుండె సమస్య ఉంది. ఏడాది కిందట ఒకసారి, ఇటీవల మరోసారి గుండెపోటు రాగా.. కాకినాడ జీజీహెచ్లో చికిత్స చేయించుకొని నిన్ననే డిశ్చార్జ్ అయ్యాను. అయినా ఖరీదైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో సీఎం జగన్ను కలిసి నా బాధ చెప్పుకున్నాను. ఆయన ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. – మెర్ల చంద్రరావు, ర్యాలీ, ఆత్రేయపురం మండలం బస్సు ఆపి.. బాధలు తెలుసుకున్న సీఎం రాజమహేంద్రవరం రూరల్/రాజమహేంద్రవరం సిటీ: మేమంతా సిద్ధం బస్సుయాత్ర గురువారం రాత్రి రాజమహేంద్రవరం పరిధిలోని కాతేరులో కొనసాగుతుండగా రోడ్డు పక్కన కొందరు వైద్య సహాయం కోసం వేచి ఉన్నారు. వారిని చూసిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపించారు. ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఆరోగ్యశ్రీ ఇన్చార్జి హరికృష్ణను వారి వద్దకు పంపి వివరాలు సేకరించారు. కొంతమూరు అఫీషియల్ కాలనీకి చెందిన బడుగు నర్సశ్రీ తన కుమారుడు సోహిత్ శివకుమార్కు కంటి ఆపరేషన్ చేయించినప్పటికీ రెటీనా దెబ్బతినడంతో కంటి చూపుపోయిందన్నారు. కంటిచూపు వచ్చేలా చూడాలని విన్నవించింది. దేవీపట్నం మండలం చిన్నదేవరపేటకు చెందిన బుడ్డిగ శ్రీనివాస్ కీళ్లవాతంతో బాధపడుతున్నాడని అతడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు వైద్య సహాయం చేయాలని వేడుకుంది. రాజమహేంద్రవరంలోని తాడితోట జంక్షన్ వద్ద ఓ కుటుంబం తమ కుమారుడికి వైద్య సహాయం కోసం వేడుకుంది. బస్సులోంచి వారిని గమనించిన సీఎం జగన్ వెంటనే వారిని దగ్గరకు పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేటలో గల ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన గుర్తుర్తి శ్రీకాంత్ చిరు వ్యాపారి. రెండో కుమారుడు తారకరామ్ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అతడికి వైద్యం చేయించేందుకు సాయం చేయాలని వారు కోరారు. -
16వ రోజు కొనసాగుతున్న "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర
-
Memantha Siddham Bus Yatra Day 7: మేమంతా సిద్ధం.. పోటెత్తిన జనం (ఫొటోలు)
-
చిత్తూరు బస్సుయాత్రలో జగనన్న ఆత్మీయ పలకరింపు..(ఫొటోలు)
-
మేమంతా సిద్ధం @ఏడో రోజు: ప్రజలతో సీఎం జగన్ మమేకం
Memantha Sidham Day 7 Highlights CM Jagan Bus Yatra Details పూతలపట్టు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఒకటే తేదీన సూర్యుడు ఉదయించే ముందు వాలంటీర్లువ చ్చి పెన్షన్లు ఇచ్చేవారు. పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుంది జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది. 3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రైతు భరోసా పేరుతో రైతులకు నేరు 34,370 కోట్లు ఇచ్చాం . ఉచిత పంటల భీమా కోసం రూ. 7,800 కోట్లు చెల్లించాం. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రైతుకు రూ. 3,262 కోట్లు అందించాం. 53 లక్షల మంది తల్లుల అకంట్లలో అమ్మఒడిడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద 18 వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయుత కింద 39 ళక్షల మంది అక్క చెల్లెళ్లకు రూ. 19,182 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం కింద 1,876 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం కింద రూ. 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసారా కింద 25, 571 కోట్లు. ఆరోగ్య శ్రీ కింద 33 12463 కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ కింద అక్క చెల్లెళ్లకు రూ. 4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ. 1,390 కోట్లు ఇచ్చాం. 10 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులకు రూ. 906 కోట్లు చెల్లించాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం ఆరోగశ్రీని 25 లక్షలకు పెంచింది మీ జగన్ ప్రభుత్వం ఏకంగా 2 లక్షల 70 వేల కోట్లను నేరుగా అకౌంట్లో వేసింది మధ్యలో ఎక్కడా జన్మభూమి లాంటి దళారులు లేరు. మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్ వారి చేతుల్లో పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తు వస్తుందా 14 ఏళ్ల కాలంలో చంద్రబాబు మీ ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు? ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియాం తెచ్చిందెవరు? విలేజ్ క్లీనిక్, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ను ఏర్పాటు చేసింది ఎవరు? ఇంటింటికీ పౌరసేవల్నీ డోర్డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మీ జగన్ ఒకటో తేదీ ఆదివారమైనా సరే అవ్వాతాతలకు పెన్షన్లు అందించిన వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది మీ జగన్. పూతలపట్టులో జన మహాసముద్రం కనిపిస్తోంది: సీఎం జగన్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు జగన్కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..? ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా? ఈ ఎన్నికల్లో మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మంచి ఓ వైపు, చెడు మరోవైపు.. ధర్మం ఓవైపు అధర్మం మరోవైపున్నాయి. ఓవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం.. ఓవైపు నిజం, మరోవైపు అబద్దం అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్స్గిఫ్ట్గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పూతలపట్టు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ కాసేపట్లో పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్కు అడుగడుగునా జన నీరాజనాలు కాసేపట్లో పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్ దామలచెరువులో సీఎం జగన్కు అపూర్వ స్వాగతం వేలాదిగా తరలి వచ్చిన జన ప్రభంజనం సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం దామలచెరువు చేరుకున్న సీఎం జగన్ చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర దామలచెరువు వద్ద పదుల సంఖ్యలో గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎంకు స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు ఎర్రటి ఎండల్లోనూ మేమంతా సిద్ధమంటూ సీఎం బస్సు యాత్రలో జన జాతర షెడ్యూల్లో లేకున్నా.. ప్రజల కోసం.. కల్లూరులో స్థానిక ప్రజల కోరిక మేరకు షెడ్యూల్లో లేకున్నా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లిన సీఎం జగన్ కల్లూరులో సీఎం జగన్కు ఘనస్వాగతం పలికిన జనం మండుటెండలోను కదం తొక్కిన మహిళా లోకం కల్లూరు ప్రధాన రహదారి పొడవునా సీఎం జగన్ను చూసేందుకు వెల్లువలా తరలివచ్చిన ప్రజలు కల్లూరు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సీఎం జగన్కు భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు సీఎం జగన్కు హారతులు ఇచ్చిన అక్కా చెళ్లెమ్మలు బస్సు మీది నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ నేను విన్నాను... నేను ఉన్నాను పెరాలసిస్ బాధితుడికి సీఎం వైఎస్ జగన్ భరోసా చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్కు గురయ్యాడు ఇప్పటికే స్తోమతకు మించి, అప్పుల చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు సీఎం వైఎస్ జగన్ను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని నమ్ముతున్నామని ముఖేష్ తల్లి ఆశాభావం వ్యక్తం చేసారు. మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసారు సీఎం వైఎస్ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం నమ్మకంగా ఉంది మతుకువారిపల్లె చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర దారిపొడవునా సీఎం జగన్కు స్వాగతం పలికిన ప్రజానికం చిత్తూరు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది దారిపొడవునా సీఎం జగన్కు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు సీఎం సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేత మేమంతా సిద్ధం బస్సుయాత్రలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ముఖ్యనేత అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, 2019లో టీడీపీ తరపున గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ. హరికృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి సీఎం జగన్ సమక్షంలో పార్టీలో కీలక నేతల చేరికలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన కీలక నేతలు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎం సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పార్టీ నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం అమ్మగారిపల్లె నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను కలిసిన అన్నమయ్య, చిత్తూరు జిల్లా చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ సదుం సర్కిల్లో స్వాగత ఏర్పాట్లు... సదుం సర్కిల్ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు తీన్మార్ డాన్స్లతో సందడిగా సదుం సర్కిల్ సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అమ్మగారిపల్లె నుంచి బయల్దేరిన సీఎం జగన్ సీఎం జగన్కు అమ్మగారిపల్లిలో భారీగా స్వాగతం పలికిన ప్రజానికం సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకోనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు బైపాస్కు చేరుకోనున్న బస్సు యాత్ర సాయంత్రం పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లిక్రాస్, చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగ గువరరాజుపల్లెకు చేరుకోనున్న బస్సు యాత్ర రాత్రికి గురవరాజుపల్లెలో సీఎం జగన్ బస చిత్తూరు జిల్లాలో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అమ్మగారిపల్లె నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరానున్న సీఎం జగన్ సదుం సర్కిల్ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు తీన్మార్ డాన్స్లతో సందడిగా సదుం సర్కిల్ చిత్తూరు జిల్లా సిద్ధమా..? ఏడో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చిత్తురులో కొనసాగనుంది ‘చిత్తూరు జిల్లా సిద్ధమా...?’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు Day-7 చిత్తూరు జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 ఏడో రోజు ‘మేమంతా బస్సు’ యాత్ర షెడ్యూల్: నేడు చిత్తూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు సదుం, కల్లూరు మీదుగా, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో దామలచెరువు వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది అనంతరం పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని లంచ్ బ్రేక్ తీసుకుంటారు అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు సభ అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజవర్గం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గాధంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి, చంద్రగిరి క్రాస్ వరకు కొనసాగుతుంది అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట, గురవరాజుపల్లెకు చేరుకుని సీఎం జగన్ రాత్రి బస చేస్తారు Memantha Siddham Yatra, Day -7. ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డులో బహిరంగ సభ సభ అనంతరం రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె వరకు కొనసాగుతుంది. గురువరాజుపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/qw7x7QFOCM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 ఆరో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సూపర్ సక్సెస్ అన్నమయ్య జిల్లాల్లో సీఎం జగన్కు భారీగా స్వాగతం పలికిన ప్రజానికం దారి పొడవునా ప్రజలతో మమేకమైన సీఎం జగన్ పలువురి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం పార్టీలో చేరిన పలువురు నేతలు మదనపల్లిలో మేమంతా సిద్ధం బహిరంగ సభకు పోటెత్తిన జనం ఎన్నికలకు మేమంతా సిద్ధం అంటూ నినాదించిన శ్రేణులు సీఎం ప్రసంగిస్తూ బాబు పేరెత్తగానే శ్రేణుల్లో ఉత్సాహం ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసిన సీఎం జగన్ మధ్యాహ్నం నుంచి సభ ముగిసే వరకు కార్యకర్తల్లో తగ్గని జోష్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019