breaking news
-
వారణాసిలో మోదీ ప్రత్యర్థి.. ఎవరీ 'అథర్ జమాల్ లారీ'?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ 2024 లోక్సభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇందులో భారత ప్రధాని మోదీకి ప్రత్యర్థిగా వారణాసి నుంచి 'అథర్ జమాల్ లారీ'ని రంగంలోకి దించారు. ఇంతకీ అథర్ జమాల్ లారీ ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. వారణాసిలో జూన్ 1న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. వారణాసి నరేంద్ర మోదీకి కంచుకోట. ఇప్పటికే 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరోమారు వారణాసి నుంచే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అథర్ జమాల్ లారీ (Athar Jamal Lari) ఎవరు? అథర్ జమాల్ లారీ వారణాసికి చెందిన స్థానిక వ్యక్తి. ఈయన 1980 నుంచి రాజీకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీఎస్పీ పార్టీలో ఉన్న అథర్ జమాల్.. ఇంతకు ముందు జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, అప్నా దళ్, క్వామీ ఏక్తా దళ్తో సహా అనేక రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశారు. లారీ గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో.. రెండుసార్లు లోక్సభ ఎన్నికల్లో విఫలమయ్యారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి అథర్ జమాల్ పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 1984లో మొదటిసారి యూపీ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్యామ్లాల్ యాదవ్ విజయం సాధించగా.. లారీ 50329 ఓట్లను పొందారు. 2004 లోక్సభ ఎన్నికలలో వారణాసిలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పుడు కూడా గెలువలేకపోయారు. 93228 ఓట్లతో మూడోస్ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేష్ కుమార్ మిశ్రా ఈ స్థానంలో గెలుపొందారు. 1991, 1993లో జనతాదళ్ టిక్కెట్పై వారణాసి కాంట్ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లారీ సమాజ్వాదీ పార్టీలో చేరారు. ముస్లిం కమ్యూనిటీ నుంచి మద్దతు ఆశించి వారణాసి స్థానంలో లారీని బీఎస్పీ రంగంలోకి దింపిందని పలువురు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇదే అంచనాలతో మాయావతి 2009లో బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషిపై.. ముఖ్తార్ అన్సారీని రంగంలోకి దించారు. కానీ గెలుపొందలేకపోయారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపోటములు ఎవరివనేది తెలుస్తుంది. Uttar Pradesh: BSP announced the names of 11 more candidates for Lok Sabha elections The Mainpuri Lok Sabha ticket has been changed and given to Shiv Prasad Yadav. Athar Jamal Lari has been fielded from Varanasi against PM Modi. pic.twitter.com/qSGERi22ik — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 16, 2024 -
‘మేం గెలిస్తే ప్రత్యేక రాష్ట్రం’
లక్నో: తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చేందుకు తమ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ముజఫర్నగర్ లోక్సభ స్థానం బీఎస్పీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతికి మద్దతుగా మాయావతి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ బీజేపీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. "పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని మాయావతి చెప్పారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. ముజఫర్నగర్లో బీజేపీ నుంచి సంజీవ్ కుమార్ బల్యాన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తన ర్యాలీకి ముందు, మాయావతి సహరాన్పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్లలో మొత్తం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
‘నా భార్య కాంగ్రెస్.. ఇంటికి వెళ్లను’ ఓ అభ్యర్థి కఠిన నిర్ణయం
భోపాల్: ఈ సార్వత్రిక ఎన్నికలు భార్యాభర్తల మధ్య ఎడబాటును కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లోక్సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంకర్ ముంజరే తాత్కాలికంగా ఇంటిని వీడి బయటకు వచ్చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇంట్లో అడుగు పెట్టను అని కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని బీఎస్పీ అభ్యర్థి కంకర్ ముంజరే శనివారం తెలిపారు. తన తన భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుభా ముంజరే అక్కడ ఉంటున్నారని, ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సిద్ధాంతాలను అనుసరిస్తున్నప్పుడు ఒకే పైకప్పు కింద ఉండకూడదని అన్నారాయన. ఏప్రిల్ 19న పోలింగ్ రోజు తర్వాతే ఇంటికి తిరిగి వెళ్తానని మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కంకర్ ముంజరే చెప్పారు. "నేను శుక్రవారం నా ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆనకట్ట సమీపంలో ఒక గుడిసెలో నివసిస్తున్నాను. వేర్వేరు భావజాలాన్ని అనుసరించే ఇద్దరు వ్యక్తులు ఒకే పైకప్పు కింద నివసిస్తుంటే, అది మ్యాచ్ ఫిక్సింగ్ అని ప్రజలు భావిస్తారు ” అని ఆయన పీటీఐతో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన భార్య అనుభా ముంజరే బీజేపీ అభ్యర్థి గౌరీశంకర్ బిసెన్ను ఓడించారు. అయితే తన భర్త నిర్ణయంతో బాధపడ్డానని, పెళ్లి అయి మెట్టినింటికి వెళ్లిన మహిళ చనిపోయే వరకు అక్కడే ఉంటుందని అనుభా ముంజరే చెబుతున్నారు. గతంలో ఆయన ఇక్కడి పరస్వాడ నుండి గోండ్వానా గంతంత్ర పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు, తాను కాంగ్రెస్ టిక్కెట్పై బాలాఘాట్ నుండి పోటీ చేసినప్పుడు తాము కలిసే ఉన్నామని తెలిపారు. తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తనని, బాలాఘాట్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సామ్రాట్ సరస్వత్ విజయానికి కృషి చేస్తానని అనుభా ముంజరే పేర్కొన్నారు. -
Lok sabha elections 2024: మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని..
బాలాఘాట్: అనుభా ముంజారే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈమె భర్త కంకర్ ముంజారే గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా బాలాఘాట్ లోక్సభ స్థానానికి బీఎస్పీ అభ్యరి్థ. తామిద్దరి మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నందున ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నానంటూ కంకర్ ముంజారే ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ‘భిన్న సిద్ధాంతాలు కలిగిన పారీ్టల్లో కొనసాగుతూ ఇద్దరం ఒకే చోట ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరూ మమ్మల్ని అనుమానిస్తారు. అందుకే శుక్రవారం నుంచి వేరే చోట ఓ గుడిసెలో ఉంటున్నాను. ఎన్నికల పోలింగ్ రోజున ఏప్రిల్ 19వ తేదీన తిరిగి మా ఇంటికి వెళ్తా’అని ఆయన తెలిపారు. భర్త నిర్ణయం తనను బాధిస్తోందని అనుభ చెప్పారు. ‘గతంలో ఆయన గోండ్వానా గణతంత్ర పార్టీ తరఫున పారస్వాడ స్థానానికి, నేను బాలాఘాట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఒకే ఇంట్లో ఉన్నాం. పెళ్లైనప్పటి నుంచి 33 ఏళ్లుగా కుమారుడితోపాటు కలిసే సంతోషంగా ఉంటున్నాం’అని ఆమె అన్నారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో భర్త కంకర్పై విమర్శలు చేయబోనన్నారు. కాగా, 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలాఘాట్లో బీజేపీ సీనియర్ నేత గౌరీశంకర్ బిసెన్పై అనుభా ముంజారే ఘన విజయం సాధించారు. -
బీఎస్పీ అభ్యర్థికి గుండెపోటు
బహుజన్ సమాజ్ పార్టీ అలీగఢ్ అభ్యర్థి గుఫ్రాన్ నూర్ గుండెపోటుకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్ పేషెంట్ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గుఫ్రాన్ నూర్ కుమారుడు ఆదిల్ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్ నూర్ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్ అలీ.. గుఫ్రాన్ నూర్ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. కాగా బీఎస్పీ అలీగఢ్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్ నూర్ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్ టిక్కెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019