breaking news
-
డీజే రాజయ్య
-
ఖబర్దార్ కడియం
-
రాష్ట్రంలో రెండు కాంగ్రెస్లు
జహీరాబాద్: రాష్ట్రంలో రెండు కాంగ్రెస్ పార్టీలు నడుస్తున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఒకటి రాహూల్ గాంధీ కాంగ్రెస్ అయితే, మరొకటి రేవంత్రెడ్డి కాంగ్రెస్గా వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, రేవంత్ ఎజెండా వేరు, రాహుల్ ఎజెండా వేరుగా ఉందన్నారు. గుజరాత్ మోడల్ను పీఎం మోదీ ఎదుట రేవంత్ పొగిడారని, రాహుల్ మాత్రం గుజరాత్ మోడల్ డొల్ల అని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, ఆయన రాజకీయ పునాదులు ఆర్ఎస్ఎస్తో ఉన్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఏ కాంగ్రెస్కైనా మూడో స్థానమే దిక్కు అని హరీశ్ జోస్యం చెప్పారు. కేరళ సీఎం, సీపీఎం నేత పినరయి విజయన్ను రేవంత్ బీజేపీ తొత్తు అని విమర్శించారని, సీపీఎం ఏనాడైనా బీజేపీతో కలుస్తుందా? అని హరీశ్ ప్రశ్నించారు. అబద్ధాల్లో రేవంత్, భట్టి పోటీ అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పోటీ పడుతున్నారని హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన ఈద్మిలాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతిపై ప్రియాంక గాంధీ మాట ఇచ్చారని,, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిందని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క మాత్రం తాము నిరుద్యోగభృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదని నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడారని ఆరోపించారు. తాజాగా రైతుల రుణమాఫీపై భట్టి విక్రమార్క నాలుక మడత పెట్టారని విమర్శించారు. ఇది రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులను ఘోరంగా అవమానించడమేనని విమర్శించారు. ఏపీలో బాబు మాదిరే.. ఇక్కడ కూడా ఆంధ్రలో టీడీపీ, బీజేపీ కలిశాయని, అదే విధానం మేరకు చంద్రబాబు మిత్రుడు ఇక్కడ బీజేపీతో మిలాఖత్ అయ్యారని హరీశ్రావు సీఎం రేవంత్నుద్దేశించి విమర్శించారు. బీజేపీని వ్యతిరేకిస్తూ వచి్చంది బీఆర్ఎస్సేనని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ వచ్చాకే బీజేపీ బలపడుతోందన్నారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తోందని హరీశ్ ఆరోపించారు. -
ఆఖరి నిమిషం దాకా అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై లోక్సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసిన అభ్యర్థులు కొందరు చివరి నిమిషంలో ఇతర పార్టీల్లో చేరడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కడా అభ్యర్థులు చేజారిపోకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థులను బరిలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు నందినగర్ నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు, బస్సు యాత్ర షెడ్యూల్తో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై లోతుగా చర్చించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ నాటికి ఒకరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు పార్టీ మారిన చోట లోక్సభ ఎన్నికల ప్రచారం, సమన్వయ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేశారు. గురువారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు, వాటిపై విపక్ష శిబిరం నుంచి వచి్చన స్పందనపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ ఇరువురు నేతలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిధుల వ్యయం అభ్యర్థుల చేతుల మీదుగా కాకుండా పార్టీ పర్యవేక్షణలోనే జరిగేలా చూడాలని ఆదేశించారు. రైతాంగ సమస్యలు ఎత్తిచూపేలా యాత్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చేసే బస్సుయాత్ర తీరుతెన్నులపై సుదీర్ఘంగా చర్చించారు. బస్సు యాత్ర చేయాల్సిన మార్గం, ఏయే తేదీల్లో ఏయే ప్రదేశాల్లో సభలు, వీధి మలుపు (స్ట్రీట్ కార్నర్) సమావేశాలు ఏర్పాటు చేయాలనే అంశంపై కసరత్తు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటల లోపు ఇటీవల కేసీఆర్ చేసిన ‘పొలంబాట’తరహా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు ఇతర సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యేలా చేపట్టాల్సిన కార్యక్రమాల జాబితాను సిద్ధం చేశారు. రైతాంగ సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపేలా బస్సు యాత్ర ఉదయం పూట షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. సాయంత్రం సమయంలో రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్షోలు, మినీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తనతో పాటు బస్సు యాత్రలో పాల్గొనే బృందం బస, భోజన వసతి తదితరాల బాధ్యతలు స్థానికంగా ఎవరికి అప్పగించాలనే అంశంపైనా చర్చ జరిగింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సభలు, రోడ్షోలకు వచ్చే వారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలని నిర్ణయించారు. కాగా బస్సు యాత్ర రూట్మ్యాప్పై లోక్సభ నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లాల నేతలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనలను క్రోడీకరించి శనివారం సాయంత్రంలోగా కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ను ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్, బీజేపీల కంటేఓ అడుగు ముందే..! లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు జరిగిన సన్నాహక భేటీలను, కేడర్ను సన్నద్ధం చేసిన తీరుపై కేసీఆర్ సమీక్షించారు. సన్నాహక భేటీలు, సభల నిర్వహణ, ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్తో పోలిస్తే ఓ అడుగు ముందు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలు, ఉపయోగిస్తున్న భాష తదితరాలు భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. రెండు జాతీయ పార్టీలను ఇరకాట స్థితిలోకి నెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర కోసం ప్రజలకు చేరువయ్యే రీతిలో కొత్త పాటలను రికార్డు చేసే పనులు సాగుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఇలావుండగా శుక్రవారం పలువురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ను కలిశారు. -
Telangana: కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనున్న బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర అనుమతి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ను బీఆర్ఎస్ నాయకులు కే వాసుదేవా రెడ్డి శుక్రవారం కలిశారు. బస్సు యాత్ర వివరాలను వికాస్ రాజ్కు వాసుదేవా రెడ్డి అందజేశారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు పోలీసుల సహకారం అందించేలా చూడాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని వాసుదేవా రెడ్డి కోరారు. కాగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. బీర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కేసీఆర్ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్స హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఈనెల చివరి వారం నుంచి బస్సు యాత్ర చేయనున్నారు, సాయంత్రం సమయాల్లో ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండు, మూడు చోట్ల రోడ్షోలు ఉండనున్నాయి. రెండు, మూడు వారాల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతోపాటు వివిధ వర్గాలతో భేటీ అవుతారు. బస్సుయాత్రలో తన వెంట వచ్చే బృందానికి బస ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్లలో లక్ష మందితో మినీ సభలు కూడా ఏర్పాటు చేద్దామన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019