breaking news
Ad - Sakshi_Home_Sticky
-
మేం 10 సీట్లు గెలిస్తే పాలిటిక్స్లో మార్పులు: కేటీఆర్
అలంపూర్: కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని సంకల్పిస్తే, దురదృష్టవశాత్తు 39 సీట్లలోనే గెలిచామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 14 సీట్లలో వెయ్యి, రెండు, నాలుగు వేల తేడాతో ఓడిపోయామని, ఆ 14 సీట్లు గెలిచి ఉంటే మన దే ప్రభుత్వం ఉండేదని చెప్పారు. లేదా వాటిలో ఆరు సీట్లు గెలిచినా ప్రధాన పాత్ర పోషించేవారమన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్కు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో, అలంపూర్ చౌరస్తాలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘సీక్వెల్ సినిమాల తరహాలో పార్లమెంట్ ఎన్నికల కోసం సీఎం రేవంత్రెడ్డి సీక్వెల్ మోసంతో రెడీగా ఉన్నారు. రేవంత్రెడ్డి మోసం పార్టు–1లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మీలో ఎవరైనా రుణాలు తీసుకోని వారు ఉంటే పరుగు పరుగునపోయి లోన్లు తీసుకోండి.. అని చెప్పిన ఆయన మే 9 వస్తున్నా రుణమాఫీ చేయలేదు. మోసం పార్ట్–2లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు’ అని కేటీఆర్ అన్నారు. అంతకుముందు కేటీఆర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అవన్నీ ఇచ్చి మాట్లాడు.. ‘మొగోడివైతే ఒక్క సీటు గెలవమని మన పార్టీ గురించి మాట్లాడుతున్న రేవంత్రెడ్డి భాషలోనే అడుగుతున్నా... నీవు మొగోనివైతే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు. మొగోడివైతే కోటీ 67 లక్షల ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వు. కేసీఆర్ ఒకరికే ఇస్తున్నాడు నేను ముసలవ్వకి ముసలాయనికి ఇద్దరికీ రూ.4వేలు ఇస్తానని చెప్పావు కదా.. మొగోడివైతే 46 లక్షల మందికి ఆసరా పింఛన్ ఇచ్చి మాట్లాడు’ అని కేటీఆర్ అన్నారు. మొన్న మహబూబ్నగర్కు వచ్చి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని ఒక సీఎం మాట్లాడని మాటలు రేవంత్ మాట్లాడారని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘సూర్యాపేటలో రష్ ఉన్న బస్సులో ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా.. ప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు జేబులు వెతికితే కత్తెర దొరికిందని అడిగితే.. సీఎం రేవంత్రెడ్డి కూడా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయను పట్టుకోండి సార్ అని చెప్పారు’ అని చమత్కరించారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికేమీ లేదు.. బీజేపీ వాళ్లు అక్కడక్కడ ఎగురుతున్నారని, పదేళ్లలో రాష్ట్రానికి మోదీ చేసిందేమి లేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ వాళ్లు చెప్పుకోవడానికి ఏవీలేదని, అందుకే జైశ్రీరాం అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. శ్రీరాముడు బీజేపీకి ఒక్కడే దేవుడు కాదని.. ఆయన అందరి వాడన్నారు. దేవుళ్ల పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్లను నమ్మి మోసపోవద్దు: కేటీఆర్ రాజేంద్రనగర్ (హైదరాబాద్): బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజేంద్రనగర్లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని ముందుకొస్తోందని... కాంగ్రెస్ దొంగ హమీలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి వచ్చిందన్నారు. రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అందుకే చేవెళ్ల పార్లమెంటులో మొదటిసారిగా బడుగు, బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాందీ, మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు. రేవంత్ నిజం చెప్పారు సాక్షి, వరంగల్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కిండు రేవంత్... అయితే తప్పు రేవంత్రెడ్డిది కాదు... ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా, నిజాయితీగా చెప్పిండు ఎన్నికలకు ముందు టీవీ చర్చా వేదికల్లో. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారు... ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు... అందుకే మేం మోసం చేస్తాం అని చెప్పారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్, హనుమకొండలో మంగళవారం జరిగిన వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. తప్పు ఎవరిదన్నా ఉందంటే మనదే తప్ప ఇంకెవరిదీ కాదన్నారు. -
రుణమాఫీ చేస్తా.. బీఆర్ఎస్ రద్దు చేస్తావా?: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, నాగర్కర్నూల్/కోస్గి/మద్దూరు: ‘జోగుళాంబదేవి సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15లోపు ఆరునూరైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. అదే రోజు నువ్వు, నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? నా రాజీనామా కాదు. నీ పార్టీ రద్దుకు సిద్ధంగా ఉండండి’అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే మాజీమంత్రి హరీశ్రావు తన సవాలును స్వీకరించాలని చెప్పారు. మంగళవారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారా యణపేట జిల్లా మద్దూరులో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, అనంతరం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలకేంద్రంలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర భారీ బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ‘ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతానని, రేవంత్రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటూందో నీ మామ కేసీఆర్ను అడుగు..ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్రంలో రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, పదవి తీసుకున్న నాలుగు నెలల్లో నీ మామ చేసిన లక్షల కోట్ల అప్పులకు రూ. 26వేల కోట్ల కిస్తీలు చెల్లిస్తూ.. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నాం. కావాలంటే లెక్కలతో సహా నీకు, నీ మామకు చూపడానికి మేము సిద్ధంగా ఉన్నాం’అంటూ తనదైన శైలిలో మాజీ మంత్రి హరీశ్రావుపై మండిపడ్డారు. రుణమాఫీతోపాటు వచ్చే పంటకే వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. దొంగలకు సద్ది మోస్తున్నరు.. పాలమూరు నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చి పదేళ్లలో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కుర్చీ వేసుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి ఫామ్హౌస్లో పడుకున్నాడని చెప్పారు. పగోడి చేతులో చురకత్తులుగా మారి, ఇక్కడి నాయకులు దొంగలకు సద్ది మోస్తున్నారని మండిపడ్డారు. తమను రేవంత్రెడ్డి తిడుతున్నారని అరుణమ్మ, ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అంటున్నారని.. వారితో తనకేం తగాదా, పంచాయితీ లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సుముఖంగా ఉన్నప్పుటికీ మంత్రిగా ఉన్న డీకే.అరుణ నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు రాకుండా ప్రాజెక్టులను అడ్డుకున్నది వాస్తవం కాదా.. మరోమారు నరేంద్రమోదీ చేతిలో చురకత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పోడుస్తున్నావంటూ ప్రశ్నించారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ఈ ఐదేళ్లు రాజకీయాలకతీతంగా జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో దేశంతో పోటీపడేందుకు తనకు సహకరించాలని కోరారు. అభివృద్ధి ఆలోచన చేయకుండా కాళ్లలో కట్టెలు పెట్టడం ధర్మమా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు ఓటేస్తే.. మోదీకి అమ్ముకుంటడు.. ‘ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కేసీఆర్ ఇబ్బందులు పెడితే మేం అండగా ఉన్నాం. ప్రజాజీవితంలోకి వచ్చి దొరలకు వ్యతిరేకంగా ప్రవీణ్కుమార్ పోరాటం చేశాడు. ఆరు నెలల్లో ఏం మారింది.. ఎందుకు కేసీఆర్ను నమ్ముతుండో సమాధానం చెప్పాలి. 4 కోట్ల మంది తిరస్కరించి కేసీఆర్కు గొయ్యి తవ్వితే, ఆ సమాధికి పూలదండలు వేసి భుజాలపై మోస్తున్నవు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశాడు. ఆయనతో చేరిన నువ్వు వర్గీకరణకు వ్యతిరేకమా? ఏనుగు తిరిగి దోమ దగ్గరకు ఎందుకు పోయిందో చెప్పాలి. దోమకు ఎంతపెద్ద తొండం ఉన్నా ఏనుగు అవుతుందా’అని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నామని, కానీ ఎందుకు తిరస్కరించారో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవీణ్కుమార్ డీజీపీ అయ్యేవారని, ముఖ్యమంత్రి స్థాయి పదవితో గౌరవించుకునే వారమని చెప్పారు. సన్’స్ట్రోక్ దెబ్బతో ఎంపీ రాములును ఆయన కొడుకు పదవి కోసం ఇంట్లో పెట్టి తాళం వేస్తే.. బీజేపీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ఓటేస్తే తిరిగి మోదీకే అమ్ముకుంటాడని, గత పదేళ్లలో ప్రతిసారి ఈ కేడీ మద్దతు పలికింది మోదీకే కదా అని వ్యాఖ్యానించారు. పాలమూరు అభివృద్ధి నా జీవితాశయం.. పాలమూరులో తనకు ఎవరూ శత్రువులు లేరని, తనకెవరూ పోటీ కాదని చెప్పారు. పాలమూరు జిల్లా అభివృద్ధి తన జీవిత ఆశయమన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు ఖర్చయినా నాలుగున్నర ఏళ్లలోనే పూర్తిచేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులును ఎంపీలుగా గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామన్నారు. ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏ గ్రూపులోకి, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే పని కోసం తనకు సహకారం అందించాలని రేవంత్రెడ్డి చెప్పారు. – మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించి రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన పాలమూరు ప్రజలు తనను కూడా ఎంపీగా ఆశీర్వదిస్తే.. ముఖ్యమంత్రికి సోదరుడిగా రేవంత్రెడ్డి గొంతుకనై ఢిల్లీలో పాలమూరు ప్రజల కోసం పోరాడుతానన్నారు. నాగర్కర్నూల్ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఆయా సమావేశాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మనోహర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర పోలీస్ హౌసింస్బోర్డు చైర్మన్ గురున్నాథ్రెడ్డి, మాజీమంత్రి చిత్తరంజన్దాస్ పాల్గొన్నారు. -
దేవుళ్లపై ఒట్లు పెట్టుడు..కేసీఆర్ను తిట్టుడు.. ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి
సాక్షి, హైదరాబాద్: ‘దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు’ అనే రీతిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు విమర్శించారు. కేసీఆర్ను బదనాం చేయడం ద్వారా పబ్బం గడుపుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్కు సుదీర్ఘంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై కేసీఆర్ మాట్లాడారు. పదేళ్ల పాలనలో విద్యుత్, తాగునీటి రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం మేడిగడ్డ బ్యారేజీ మూడు పిల్లర్లలో ఏర్పడిన సమస్యను పరిష్కరించకుండా తనను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం తెలియని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. తన కళ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మోదీ పాప కృత్యానికి పాల్పడ్డారు ఢిల్లీ లిక్కర్ కేసు ప్రధాని మోదీ పొలిటికల్ స్కామ్లో భాగమని కేసీఆర్ పేర్కొన్నారు. తన కూతురు కవిత అరెస్టు ద్వారా మోదీ పాప కృత్యానికి పాల్పడ్డారని విమర్శించారు. లిక్కర్ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి పిడికెడు మంది నేతలు మాత్రమే బయటకు వెళ్లారని, కడియం శ్రీహరి రాజకీయంగా తనను తానే భూస్థాపితం చేసుకున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్ ఏక్నాథ్ షిండే అవుతాడని బీజేపీ నేతలు అంటున్నా ఆయన ఖండించడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారతాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్గా మార్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్పై చిల్లర ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ సీఎంకు సంబంధించిన వ్యవహారం కాదని, తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారంటూ కేసీఆర్ కొట్టి పారేశారు. కేసీఆర్ ఇమేజీని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం నెరవేరదని, ప్రజలు అన్నీ గమనించి బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్కు చెందిన కొందరు నాయకులు తమ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని, సందర్భాన్ని బట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును కొట్టి పారేయలేమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నేనే సీఎం అవుతా.. కేసీఆర్ ప్రజ్వలంగా, ఉజ్వలంగా రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వస్తాడని, మళ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 98 స్థానాల్లో గెలుస్తుందని, తానే సీఎంను అవుతానని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. సమయం సందర్భాన్ని బట్టే నాయకులు తయారవుతారని, కేటీఆర్, హరీశ్రావు సహా ఎవరినీ తాను ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించలేదని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీకి ఒక సీటుకు మించి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఆంధ్రాలో ఎవరు గెలిచినా తమకు సంబంధం లేదని, ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు బాధలేదని పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే సమాచారం తమకు ఉందని కేసీఆర్ తెలిపారు. -
ఒట్టేసి చెబుతున్నా..! రేవంత్ ‘ఒట్లపై’ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: ‘బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి చెపుతున్నా.. మా ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంది. అది మా మంత్రివర్గం బాధ్యత. రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం..’. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఒక్క నిజామాబాద్లోనే కాదు..ఆదిలాబాద్ అయినా మహబూబాబాద్ అయినా, మహబూబ్నగర్ అయినా, మెదక్ అయినా, భువనగిరి అయినా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లినా రేవంత్ ఒట్లు మీద ఒట్లు పెడుతున్నారు. ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, భద్రాద్రి రామయ్యతో పాటు గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ సాక్షిగా అంటూ.. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని నిత్యం విరుచుకుపడే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి.. ఏ దేవుడి దగ్గరకు వెళితే ఆ దేవుడు సాక్షి అంటూ ఒట్టేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒట్టు మాటలు గట్టివేనా? లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్రెడ్డి మాట్లాడుతున్న ఈ ‘ఒట్టు’మాటలు ఎంత గట్టివనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తరహాలోనే లోక్సభ ఎన్నికల్లోనూ రాజకీయ ప్రత్యర్థులపై దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ దేవుళ్ల సాక్షిగా ఎందుకు మాట ఇస్తున్నారనేది హాట్టాపిక్గా మారింది. రైతు రుణమాఫీ కేంద్రంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు అధికార పక్షంలోనూ చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో విఫలమైనందున రేవంత్రెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఈ తరహాలో హామీ ఇవ్వడం ద్వారా వారిని నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే రేవంత్ ‘ఒట్టు’మాటలు మాట్లాడాల్సి వస్తోందని అంటోంది. రైతు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని, కరువు వచ్చి పడిందని, కరువును కూడా ప్రభుత్వం ఎదుర్కోలేకపోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇదే మార్గమని చెబుతోంది. తాము అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాగానే..ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఈలోపే తామేమీ చేయడం లేదన్నట్టు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే రేవంత్ ఘాటుగా స్పందిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు ప్రజలు ఆయన మాటలు విశ్వసించేలా చేసేందుకే ఆయన ఈ ఎత్తుగడ అమలు పరుస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు, మహిళలు, రైతులు, మైనార్టీల ఓట్లు రాబట్టుకునే వ్యూహంతోనే రేవంత్ ఈ తరహాలో ఎన్నికల ప్రచార ప్రసంగాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. కోమటిరెడ్డికి కితాబుపైనా చర్చ భువనగిరి ప్రచార సభలో మాట్లాడుతూ సీఎం అయ్యేందుకు మంత్రి కోమటిరెడ్డికి అన్ని అర్హతలున్నాయని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. భువనగిరి అభ్యర్థి, తన సన్నిహితుడు చామల కిరణ్రెడ్డిని గెలిపించుకోవడంలో భాగంగా అక్కడ మంచి పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ను మచ్చిక చేసుకునేందుకే రేవంత్ అలా మాట్లాడారని కొందరంటుంటే... మరికొందరు మాత్రం రేవంత్ స్టైల్ ఆట నల్లగొండలో ఆడారని, ఆ జిల్లాకు చెందిన నేతలను డిఫెన్స్లో పడేసేలా ఆయన మాట్లాడారని కొందరంటున్నారు. మరోవైపు బీజేపీ చేస్తున్న హిందూత్వ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా దేవుడు, మతాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలి.. పోలింగ్ బూత్లలో కాదు.. నేను హిందువునని గర్వపడతా.. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులను ఆదరిస్తా.. గౌరవిస్తా..’అంటూ చెప్పడం, హామీల అమలుకు దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం.. ఎలాంటి ఫలితాలనిస్తుందోనన్న చర్చ జరుగుతోంది. వేడి రాజేసేలా రాజకీయ వ్యాఖ్యలు ఒట్ల మాటలు అలా ఉంటే... ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్ పదేపదే మరో విషయాన్ని నొక్కి చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇవి కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన, సమయం వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇక తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ అంశంపై దాడిని ఆయన మరింత తీవ్రతరం చేశారు. టచ్ చేసి చూడండి... మసై పోతారంటూ సినిమా డైలాగులు విసురుతున్నారు. ‘ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాపలా ఉంది రేవంత్రెడ్డి. నేను జైపాల్రెడ్డి, జానారెడ్డి కాదు. రేవంత్రెడ్డిని..’లాంటి పదునైన వ్యాఖ్యలతో సవాళ్లు విసురుతున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యల ద్వారా కేడర్లో ధైర్యాన్ని నింపడమే కాకుండా రాజకీయ వేడి పుట్టించడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ సానుకూలతను పెంచేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. -
నేటి నుంచి కేసీఆర్ ప్రగతి రథం యాత్ర
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మే 10 వరకు 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో భాగంగా 40కి పైగా పట్టణాల్లో జరిగే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొని లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. ఈ ప్రగతి రథానికి బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కాగా బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఈ సందర్భంగా కేసీఆర్కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత... భోజనానంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఆయన వెంట ఉంటారు. సుమారు వందకు పైగా వాహనాలు ప్రగతి రథాన్ని అనుసరించే అవకాశముంది. సుమారు రెండు వందల మందితో కూడిన వలంటీర్ల బృందం కూడా యాత్రలో పాల్గొంటుంది. పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలతో పాటు సుదీర్ఘకాలంగా పారీ్టలో పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలు వలంటీర్లుగా వ్యవహరించనున్నారు. పంతంగి టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం తొలిరోజు బస్సు యాత్ర బేగంపేట, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా విజయవాడ రహదారిపైకి చేరుతుంది. వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్ దాటిన తర్వాత చౌటుప్పల్ పంతంగి టోల్ప్లాజా వద్ద అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దారి పొడవునా కేసీఆర్కు ప్రజలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికేలా మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. నకిరేకల్ క్రాస్ రోడ్, నల్లగొండ, మాడుగులపల్లి మీదుగా సాయంత్రం 5 గంటలకు మిర్యాలగూడ ఫ్లైఓవర్ వద్దకు యాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 5:30కి రాజీవ్ చౌక్వద్ద రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం వేములపల్లి, మాడుగులపల్లి తిప్పర్తి మీదుగా రాత్రి 7 గంటలకు సూర్యాపేటకు చేరుకుని రోడ్ షోలో ప్రసంగిస్తారు. సూర్యాపేటలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ రాత్రి బస చేస్తారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రచారం తీరుతెన్నులను సమీక్షించి దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి చిట్యాల, రామన్నపేట మీదుగా భువనగిరి చేరుకుని అక్కడ జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస కోసం ఎర్రవల్లి ఫామ్హౌస్కు చేరుకుంటారు. శుక్రవారం నుంచి మరో 15 రోజులు పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. కిలోమీటర్ మేర రోడ్ షో ప్రతిచోటా కిలోమీటర్ మేర రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తారు. రోజూ రోడ్ షో ముగిసిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం కేసీఆర్ విలేకరులతో మాట్లాడతారు. దీంతో పాటు ఉదయం వేళల్లో వివిధ సామాజికవర్గాలతో భేటీలు, క్షేత్ర స్థాయి సందర్శనలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా కేసీఆర్ బస్సు యాత్ర వెంట వెళ్లే వలంటీర్లకు ఎక్కడికక్కడ బస ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019