breaking news
-
ఎన్నికల బరిలో సినీ నటి.. ఎవరో తెలుసా (ఫోటోలు)
-
బీజేపీలో సాధారణ వ్యక్తి సైతం సీఎం, పీఎం కూడా అవ్వొచ్చు
న్యూఢిల్లీ : ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒడిశా అధికార పార్టీ బిజు జనతాదళ్ (బీజేడీ) మాజీ ఎంపీ ప్రభాస్ కుమార్ సింగ్ బీజేపీలో చేరారు. ఒడిశా బార్ఘర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన ప్రభాస్ కుమార్ సింగ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, ఇతర సీనియర్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. పొత్తులు విఫలం ఒడిశాలో అధికార బిజు జనతాదళ్, భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. పదేళ్లుగా అనధికార మిత్రులుగా కొనసాగిన ఇరు పార్టీలు.. పదిహేనేళ్ల తర్వాత అధికారికంగా జట్టు కట్టేందుకు జరిగిన చర్చలు ఫలించలేదు. ఒంటరి పోరు తమకే లాభమని ఇరుపార్టీలు భావించాయి. ఈ తరుణంలో బీజేడీ-బీజేపీల మధ్య పొత్తుల చర్చలు విఫలం కావడంతో పలువురు ఒడిశా అధికార పార్టీ బీజేడీ నేతలు బీజేపీలో చేరుతున్నారు. మోదీ వ్యక్తిత్వం తాజాగా ప్రభాస్ కుమార్ సింగ్ బీజేపీలో చేరారు. ‘ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం నన్ను బాగా ప్రభావితం చేసింది. సమయంలో బిజూ జనతాదళ్ (బీజేడీ)పై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేడీలో గౌరవం, ఆత్మగౌరవం లేదు. ఒడియా కళ సంస్కృతి, వారసత్వం పట్ల గౌరవం లేదని మండిపడ్డారు. సాధారణ వ్యక్తి సీఎం,పీఎం అవ్వొచ్చు దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న ప్రభాస్ కుమార్ సింగ్.. గడిచిన 10ఏళ్లలో బీజేపీ దేశ ప్రజలకు చేసిన కృషిని కొనియాడారు. బీజేపీలో గౌరవం, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం ఉన్నాయి. ఇక్కడ (బీజేపీలో) సాధారణ వ్యక్తి కూడా ప్రధాని, ముఖ్యమంత్రి కాగలడు. బీజేపీలో చేరడం నా అదృష్టమని తెలిపారు. ఒడిశాలో గెలుపు మాదే ఒడిశాలో బీజేపీ విజయ బావుటా ఎగురవేస్తుందని, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభాస్ కుమార్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. -
జయపురం టిక్కెట్టు ఎవరికో?
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఏకైక జనరల్ స్థానం జయపురం టిక్కెట్టు కోసం అధికార బీజేడీ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. కొరాపుట్ జిల్లాలోని 5 శాసనసభ స్థానాల్లో కొరాపుట్, కోట్పాడ్ స్థానాలకు బీజేడీ అభ్యర్థులను ప్రకటించినా, జయపురం, లక్ష్మీపూర్, పొట్టంగి స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ముఖ్యంగా జయపురం నియోజకవర్గంలో ఎవరికి టిక్కట్టు ఇస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందుకు కారణం గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తారాప్రసాద్ బాహిణీపతిని ఎదుర్కొనే నేత ఎవరా అని ఎదురు చూస్తున్నారు. అయితే అతడిని ఎదుర్కొనే అభ్యర్థి కోసం బీజేడీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి రబినారాయణ నందో టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ గత రెండు ఎన్నికల్లో ఆయన బాహిణీపతి చేతిలో ఓటమి చెందారు. అందువలన రబి నందోకు టిక్కెట్టు లభిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశమైంది. రబినందోపై విముఖత..? రబినందోకు టిక్కెట్టుపై సీఎం నవీన్ పట్నాయక్ విముఖత ప్రదర్శిస్తున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి అభిప్రాయాలే 2019 ఎన్నికల సమయంలో వినిపించాయని, అయినా రబి నారాయణ నందోకు అప్పట్లో అధిష్టానం టిక్కెట్టు ఇచ్చిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అందువలన ఈసారి కూడా ఆయనకు టిక్కెట్టు లభించే అవకాశం లేకపోలేదని కొంతమంది అభిప్రాయం. అయితే ఒకవేళ పార్టీ టిక్కెట్టు తనకు లభించకపోయినా తన సతీమణికి వచ్చేటట్లు రబి నందో పావులు కదుపుతున్నట్లు సమాచారం. కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలిగా గతంలో పదవి నిర్వహించిన డాక్టర్ ఇందిరా నందో గత పదేళ్లుగా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అందువలన తనకు టిక్కెట్టు రాకపోయినా తన భార్యకు రాగలదని రబి నందో ఆశాభావంతో ఉన్నారు. అలాగే ఈసారి జయపురం బీజేడీ టిక్కెట్టు కోసం కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రాహి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత మూడు ఎన్నికల నుంచి పార్టీ టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న సీనియర్ మహిళా నాయకురాలు బిందు రాణి మిశ్ర కూడా మరోసారి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె జిల్లా పరిషత్ సభ్యురాలుగా ఉండేవారు. పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటూ రాష్ట్రస్థాయి నాయికత్వంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. బీజేడీ టిక్కెట్టుపై ఆశావాహుల్లో రాధా బినోద్ సామంతరాయ్ పేరుకూడా వినిపిస్తున్నది. అయితే వీరిలో బీజేడీ పార్టీ అధి ష్టానం ఎవరికి టిక్కెట్టు ఇస్తుందో వేచి చూడాలి. -
Odisha : ఒడిషా రాజకీయం ఎటు తిరుగుతోంది?
ఒడిశాలో ఎన్నికల స్నేహానికి బీజేపీ, బీజేడీ సిద్ధమవుతున్నాయా? పొత్తు కుదరలేదని తాజా వార్త. కాదు... కుదరవచ్చని ఊహాగానం. ఇప్పటికింకా పూర్తి స్పష్టత లేదు. దోస్తీ మాట నిజమే అయితే, ఒక ప్రశ్న ఉదయిస్తుంది! ‘‘అసలు ఈ రెండు పార్టీలూ కలవాల్సిన అవసరం ఏముంది?’’ రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటుకై బీజేడీకి బీజేపీ అవసరం లేదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి బీజేడీ అవసరం లేదు. మరి ఏ ప్రయోజనాలు ఆశించి మోదీ, పట్నాయక్లు స్నేహహస్తాలు చాస్తున్నారు. 2008 నాటి క్రైస్తవుల హత్యోదంతాల అనంతరం 2009లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పట్నాయక్... పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ పార్టీతో నెయ్యానికి చర్చలు జరిపారు? అడగవలసిన ప్రశ్నలెన్నో ఉన్నాయి! గతాన్ని గుర్తు చేయటం రాజకీయ నాయ కులకు ఇష్టం ఉండదు. అది వారికి ‘‘ఒక పరదేశం’’. ఎల్.పి.హార్ట్లీ చెప్పిన విధంగా, ‘‘వారు అక్కడ పనులను భిన్నంగా చేస్తారు’’. సరిగ్గా అలానే చేసే ఉద్దేశంతో నేనివాళ ఉన్నాను. భారతీయ జనతా పార్టీతో నవీన్ పట్నాయక్ కొత్తగా పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు వినగానే పదిహేను సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలని నాకు అనిపించింది. వాటిని మీకు గుర్తు చేసి, మీ సొంతంగా ఒక అభిప్రాయానికి వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను. 2008లో కొంధమాల్లో జరిగిన క్రైస్తవుల దారుణ హత్యోదంతాల అనంతరం నేను నవీన్ పట్నాయక్ను ఇంటర్వ్యూ చేశాను. ఆ హత్యలు దేశాన్ని కుదిపి వేయటమే కాకుండా, పట్నాయక్ ప్రతిష్ఠను పదేపదే దెబ్బతీశాయి. తేరుకోవటానికి ఆయన తలకిందులుగా తపస్సు చేయవలసి వచ్చింది. ‘‘నా దేహంలోని ప్రతి అస్థికా మతంతో సంబంధం లేనిది. ఆ అస్థికల్లో ఏవైనా దెబ్బతిని ఉంటాయని నేను అనుకోను’’ – అని, లౌకికవాదిగా తనకై తను ఆయన ఒక ఉనికిని ఇచ్చుకున్నారు. ఆరు నెలల తర్వాత, 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు, బీజేపీతో తనకున్న తొమ్మిదేళ్ల పొత్తును విచ్ఛిన్నం చేసుకున్నారు. అప్పుడు మళ్లీ నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. పట్నాయక్: ‘‘బీజేపీతో తెగతెంపులు చేసుకోవటం తప్పనిసరి అయింది. ఎందుకంటే, నా రాష్ట్రానికి వారినిక ఏమాత్రంగానైనా ఆరోగ్యకరమని నేను పరిగణించటం లేదు. కొంధమాల్ తర్వాత అది ప్రతి ఒక్కరికీ స్పష్టమై ఉంటుందని అనుకుంటున్నాను.’’ థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీతో కొనసాగలేమని మీరు చెబుతున్నారా?’’ పట్నాయక్ : ‘‘కొనసాగటం చాలా చాలా కష్టంగా మారింది.’’ థాపర్: ‘‘అంటే కొంధమాల్ ఒక విధంగా మీ పొత్తు విచ్ఛిత్తికి కారణం అయిందనేనా?’’ పట్నాయక్ : ‘‘నిజానికి, అంతే.’’ (ఈ సంభాషణ మరింతగా ముందుకు సాగింది. చెప్పాలంటే, అలా జరగాలన్న ఆసక్తి ఆయనలో కనిపించింది.) థాపర్: కొంధమాల్ ఘటనలతో పట్టణ ప్రాంత మధ్య తరగతి ప్రజలు మిమ్మల్ని నరేంద్ర మోదీతో పోల్చడం ప్రారంభించారు. కొంతమంది మిమ్మల్ని రెండవ నరేంద్ర మోదీ అని కూడా అన్నారు. అది మిమ్మల్ని కలవరపరిచిందా? నొప్పించింది కూడానా?’’ పట్నాయక్: ‘‘నన్ను నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా అలా చూసుకోలేదు. నేను ఎల్లవేళలా లౌకికవాద ధోరణిలోనే ఆలోచిస్తాను. నాది పూర్తిగా లౌకికవాద నేపథ్యం. కనుక నేను దానిని నాపై వచ్చిన సరైన ఆరోపణగా ఏనాడూ పరిగణించలేదు.’’ థాపర్: ‘‘దానర్థం... నరేంద్ర మోదీతో పోల్చడం మిమ్మల్ని బాగా గాయపరచేదిగా ఉండి ఉండాలి.’’ పట్నాయక్: ‘‘నా మీద అలాంటి ఆరోపణ వస్తుందని నేను అస్సలు నమ్మలేకపోయాను.’’ (కొంధమాల్ తర్వాత పట్నాయక్ బీజేపీని ఎలా చూశారన్నది స్పష్టం అయింది. అయితే ఆయన చెప్పాలనుకున్నది ఇంకా ఉండింది. అక్కడితో ముగించలేదు.) థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ శరీరంలోని ప్రతి అస్థికా మత రహితమైనదేనని మీరు చెప్పారు. అది నిజమేనని... మీరిప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోవటమన్నది రుజువు చేస్తోందని మీరు చెప్పగలరా?’’ పట్నాయక్: ‘‘మీరేమనుకుంటున్నారు కరణ్? నేనేమిటో మీకు ఎప్పటి నుండో తెలుసు.’’ థాపర్: ‘‘అది నిజమేనని రుజువు చేస్తోందని నేను చెప్పగలను.’’ పట్నాయక్: ‘‘థ్యాంక్యూ.’’ (మరొక ప్రశ్న అడగవలసిన అవసరం ఉందని నా ప్రవృత్తి చెప్పింది. అది ఆయనపై ముష్టిఘాతాన్ని విసిరింది.) థాపర్: ‘‘ఆ పని (బీజేపీతో తెగతెంపులు) మీరు మనస్ఫూర్తిగా చేసినదే కదా?’’ పట్నాయక్: ‘‘చివరికొచ్చేటప్పటికి ఎవరి నమ్మకాలపై వారు నిలబడతారు. కాదా చెప్పండి? ఎవరి నమ్మకాలపై వారు నిలబడి తీరాలి కూడా.’’ (అయిపోయింది – స్పష్టంగా, క్లుప్తంగా, నిశ్చయంగా పట్నా యక్ తనేమిటో చెప్పేశారు. ఆయన నమ్మకాలు తమను తాము పునరుద్ఘాటించుకున్నాయి. పాత పట్నాయక్ ప్రత్యక్షమయ్యారు. బీజేపీతో జతపడి ఉండటం అన్నదిక చరిత్రే.) థాపర్: ‘‘తను నమ్మిన సిద్ధాంతాలపై నిలబడేందుకు నవీన్ పట్నాయక్కు తొమ్మిదేళ్లు పట్టిందని చాలామంది అంటారు. మిమ్మల్ని బాగా ఎరిగిన వారికి మీరు లౌకికవాదులు, ఉదారవాదులు, నవీ నులు. నిజంగా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే, ఆ పొత్తు దీర్ఘకాలం సాగిందంటే వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. మీ నమ్మికలు ఏమిటో మీరు కనుగొనడానికి ఎందుకు మీకంత ఎక్కువ సమయం పట్టింది?’’ పట్నాయక్: ‘‘గత పన్నెండేళ్లలో బీజేపీకి అనేక లౌకికవాద పక్షాల పొత్తు ఉండటం మీరు చూసే ఉంటారు. మమతా బెనర్జీ లేదా హెగ్డే లేదా ఫరూఖ్ అబ్దుల్లా, చివరికి జార్జిఫెర్నాండెజ్, నితిశ్కుమార్. అనేక మిత్ర పక్షాలూ ఉండేవి. అంతేకాదు, ఒడిశాలో మన అదృష్టవశాత్తూ మొదటి ఎనిమిదేళ్లలో ఎలాంటి మతపరమైన సంఘటనలూ జరగ లేదు. కొంధమాల్ జరగనంత వరకు మొత్తంగా పరిస్థితే మారలేదు.’’ ప్రస్తుతం ఒకే ఒక ప్రశ్న మిగిలింది. పరిస్థితి ఏం మారింది? బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆ తర్వాత బాగా పని చేసిన పట్నాయక్ తిరిగి ఇప్పుడు వారి ఆలింగనం కోసం ఎందుకు వెనక్కు నడవాలని తపిస్తున్నారు? వారి అవసరం లేకుండానే ఆయన మళ్లీ గెలుస్తారు కదా!అయితే విషయం అది కాదు. ఆయన తెగతెంపులు చేసుకున్న బీజేపీ ఎల్.కె. అద్వానీ నేతృత్వం లోనిది. ఆయనిప్పుడు తిరిగి వెళ్ళాలని చూస్తున్నది నరేంద్ర మోదీ సారథ్యం లోనిది. నేను మరింతగా చెప్పాల్సిన అవసరం ఉందంటారా? పట్నాయక్ మళ్లీ బీజేపీతో ఎందుకు పొత్తు కుదుర్చుకోవాలని అనుకున్నారో నాకెప్పటికైనా తెలుస్తుందా అని నా సందేహం. కానీ తను యూ–టర్న్ తీసుకోవటాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు ఉంది. ఈలోగా మీదైన అభిప్రాయా లకు మీరు వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను. బహుశా మీలోకొందరు... మీరూ నాలాగే ఊహించారని భావించే అవకాశం ఉంది. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - కరణ్ థాపర్ -
Odisha: ఎన్నికల వేళ ‘బీజేడీ’కి గట్టి దెబ్బ
భువనేశ్వర్: అసెంబ్లీ,లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఒడిషాలో అధికార బీజేడీకి గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఆరుసార్లు ఎంపీ భర్తృహరి మెహతాబ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్కు రాజీనామా లేఖ పంపినట్లు తెలిపారు. అవినీతిపై పోరాటంలో పార్టీకి కమిట్మెంట్ లేనందునే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని మెహతాబ్ వెల్లడించారు. అవినీతిపై పోరకు తాను ఇచ్చిన సలహాలు సూచనలకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికి ఓపిక ఉంటుందని, ఇప్పుడది నశించిందని అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. పార్టీని వీడినప్పటికీ అవినీతిపై తన పోరాటం కొనసాగిస్తానన్నారు. ప్రస్తుతం కటక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న భర్తృహరి మెహతాబ్ ఒడిషా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మెహతాబ్ కుమారుడు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేడీ, బీజేపీ పొత్తు ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేడీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇదీ చదవండి.. లోక్సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019