breaking news
-
రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్ చేసుకోవడమా?
చెట్లను హగ్ చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా..?. అదీగాక ఇటీవల ఓ విదేశీ మహిళ చెట్టుని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. మళ్లీ ఇందేంట్రా బాబు అనుకుంటున్నారా..!. ఓ కంపెనీ దుస్సాహసం లేదా సోమ్ము చేసుకునే సరికొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు దీన్ని. ఆఖరికి సహజ సిద్ధమైన ప్రకృతిని కూడా ఇలా అమ్మకానికి పెట్టేస్తోందా అని ఆ కంపెనీపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ అంటే.. చికాగుగా, ఒత్తిడిగా ఉంటే అలా కాసేపు ఓ పార్కుకో వెళ్లి ప్రకృతిలో కాసేపు సేద తీరుతాం. లేదా ఆరుబయట కాసేపు ఆకాశానికేసి చూసి ఆహా ఈ ప్రకృతి అద్భుతాలు ఊహకే అందవు అని ఆనందపడతాం. దీనికి డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదు. ఈ భూమ్మీద జీవించే ప్రతి ఒక్కరి హక్కు ఇది. అదీగాక ఆరోగ నిపుణులు కూడా పచ్చని ప్రదేశాల్లో నిమగ్నమయ్యితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పదేపదే చెబుతుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఉండే ఉద్యానవనాలు ప్రజలకు ప్రకృతి ఒడిలో సేదతీరే చక్కటి ప్రదేశాలు. అంతేగాదు ఇలా ప్రకృతితో రమించడాన్ని జపాన్లో షిన్రిన్-యోకు అంటారు. దీన్ని 1982లో జపనీస్ వ్యవసాయ, అటవీ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ పేరుతో ప్రజలకు ఉచితంగా అటవీ ప్రాంతంలో గడపడం, కనెక్ట్ అవ్వడం వంటివి నేర్పిస్తుంది. దీని వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నది వారి నమ్మకం. అయితే ఇటీవల బెంగుళూరుకి చెందిన ఓ కంపెనీ అచ్చం అలాంటి కాన్సెప్ట్తో జస్ట్ రూ. 1500లతో గైడెడ్ ఫారెస్ట్ బాత్ అనుభవాలు నేర్పిస్తామంటూ ప్రకటన ఇవ్వడం వివాదాస్పదమయ్యింది. ఆ కంపెనీ చెట్టుని కౌగిలించుకుని వాటితో కనెక్ట్ అవ్వడం ఎలాగో నేర్పిస్తాం అంటూ ధర ప్రకటించడం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆఖరికి ప్రకృతిని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారా..? అని మండిపడుతున్నారు. ఇదేదో స్కామ్, అంటూ పోస్టులు పెట్టారు. ఇక్కడ చెట్టుని కౌగిలించుకుని వాటితో మమేకమవ్వడం వరకు బాగుంది. దీనికీ డబ్బులేం ఖర్చవ్వుతాయి. అదీ కూడా నేచర్కి ఉన్న పవర్. ఆ కంపెనీకి ఖర్చు పెట్టి చేసేదేం ఉంటుంది. వాలంటీర్గా గైడ్ చేయడమే సూచించడమే చేస్తే సరిపోయే దానికి ఇలా సొమ్ము చేసుకునే దుస్సాహాసానికి ఒడిగట్టడం అందరీకీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. సహిస్తే చక్కగా పీల్చే గాలిని కూడా సొమ్ము చేసుకుంటారు కొందరు ప్రబుద్ధులు అని తిట్టిపోస్తున్నారు ప్రజలు. (చదవండి: వారెవ్వా..నీరజ!.. మొత్తానికి సాధించింది..!) -
ఏజ్ ఈస్ జస్ట్ నెంబర్: నలభైలలో ఆ మదర్స్..!
చాలామంది వివిధ కళలు నేర్చుకోవాలనుకుంటారు. కొన్ని కారణాల రీత్యా సాధ్యం కాకపోవచ్చు. మరికొందరూ వయసు మీదపడ్డ దాన్ని వదలక ఎలాగైనా నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి కోవకు చెందని వారే ఈ ముగ్గురు తల్లులు. నాలుగు పదుల వయసులో ఏ మాత్రం సంకోచించకుండా భరతనాట్యం నేర్చుకునేందుకు ముందుకు రావడమేగాక శభాష్ అనే రేంజ్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఎవరంటే ఆ ముగ్గురు.. నలభైల వయసులో ఉన్న ముగ్గుర మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా కోరమంగళలోని నృత్య స్కూల్ ఆఫ్ ఆర్ట్లో జాయిన్ అయ్యి భరతనాట్యం నేర్చుకున్నారు. అంత ఏజ్లో ఉన్నామన్నా.. బిడియాన్ని పక్కన పెట్టిమరీ తమకిష్టమైన కళపై దృష్టిసారించారు ఆ ముగ్గరు తల్లులు. గురువు గాయత్రి చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన మెళుకవలు నేర్చుకున్నారు. వాళ్లేవరంటే....తమిళనాడుకి చెందిన లక్ష్మీ రమణి, సుమన్ వెలగపూరి, రాజస్థాన్కి చెందిన మోనికా లధాలు.. ముగ్గుర మదర్స్లో ఒకరు కుటుంబాన్ని, మిగతా ఇద్దరూ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మరీ కళకు అంకితమై నేర్చుకున్నారు. ఆ ముగ్గరు తల్లలు బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్స్ ప్రాంతంలోని సీఎంఆర్ఐటీ ఆడిటోరియంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ వేదికపై ముగ్గురు తల్లులు సోలో, సంయుక్త ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వాళ ప్రదర్శన అనంతరం అక్కడి హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఈ ఏజ్లో ఇంత బాగా ప్రదర్శన ఇస్తున్నా ఆ ముగ్గరు ఎవ్వరూ.. అని అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రదర్శన అనంతరం ఒక్కొక్కరిగా తమ నేపథ్యం వివరిస్తూ..ముందుగా తమిళనాడుకు చెందిన లక్ష్మీ రమణి (44) మైక్ పట్టుకుని మాట్లాడుతూ..తన కలను సాకారం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అత్తగారి గురించి చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక మరో తల్లి సుమన్ వెలగపూడి(47) క్లౌడ్లో కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్గా కెరీర్ని విడిచిపెట్టి మరీ భరతనాట్యం నేర్చుకుంది. తనకు డ్యాన్స్పై ఉన్న మక్కువతో కొన్నాళ్లు పార్ట్ టైంగా నేర్చుకున్నాని, ఆ తర్వాత ఇక పూర్తిగా దీనికే టైం కేటాయించాలని ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పుకొచ్చింది సమన్. పెద్ద కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేయడం పెద్ద సాహసమే అయినప్పటికీ, అందుకు సహకరించిన తన కుటుంబ సభ్యులకు ఎంతగానో రుణపడి ఉంటానాని భావోద్వేగంగా మాట్లాడింది. ఇక చివరిగా రాజస్థాన్కి చెందని 46 ఏళ్ల మోనికా లధా ఓ పక్కన భరతనాట్యం నేర్చుకుంటూనే ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసేది. చిన్న కుమార్తె ఈ చార్టర్ అకౌంటెంట్. ఆమె కూడా దక్షిణా భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడం విశేషం. ఎందుకంటే రాజస్తాన్ వాళ్లు ఉత్తరాది శాస్తియ నృత్యమైన కథక్ని అభ్యసిస్తుంటారు. ఇక మోనిక తనకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని, భరతనాట్యం లాంటివి నేర్చుకోవాలన్నిది తన ప్రగాఢ కోరిక అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన భర్త వివేక్ లధా ఇచ్చిన ప్రోత్సాహన్ని మరవలేనదని ఉద్వేగంగా చెప్పింది. ఇక గురువు గాయత్రీ దేవి మాట్లాడుతూ, ఆ మహిళల ప్రదర్శనను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపనా ఉంటే ఏదైనా సాధ్యమే అని అన్నారు. ఈ ముగ్గురు తమ కళా నైపుణ్యంతో వయసు కేవలం నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసి చూపించారు. నిజంగా మన భారతీయ కళలు ఎంతో గొప్పవి కదూ. అవి ఎంతటి విద్యా వంతుడిని, అధికారినైనా ఆకర్షించి నేర్చుకునేలా చేస్తాయి. (చదవండి: పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!) -
ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!
ఇల్లు కట్టాలంటే ముందుగా చేతినిండా దండిగా డబ్బు ఉండాలి. అప్పుడే కలల ఇంటిని నిర్మించగలం. దీనికి సిమ్మెంట్, ఇటుక, ఇసుక తదితరాలు లేకుండా ఇంటి నిర్మాణమే మొదలవ్వదు. నిజానికి ఇప్పుడు, సిమ్మెంట్, ఇటుకలు ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో మనకు తెలిసిందే. ఇక అందులో ఇసుకను కొనడం ఒక ఎత్తు తరలించేందుకు మరింత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఓ ఇంటి నిర్మాణానికి చాలా ఇసుక కావాల్సి ఉంటుంది. అలా ఇసుకు అవసరమే లేకుండా ఇల్లునే కట్టేయొచ్చట. ఎలాగంటే.. సహజ ఇసుకకు బదులుగా నిర్మాణాలకు ఉపయోగపడేలా ఓ సరికొత్త మెటీరియల్ను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు నిర్మాణాలకు అవసరమయ్యే సహజ ఇసుక స్థానంలో కొత్త మెటీరియల్ను రూపొందించారు. నిర్మాణ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఇసుక కొరత కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ (సీఎస్టీ)లోని ఒక బృందం పారిశ్రామిక వ్యర్థ వాయువులలో సేకరించిన కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉపయోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది. తవ్విన మట్టి, నిర్మాణ వ్యర్థాలను కార్బన్ డయాక్సైడ్తో శుద్ధి చేసి ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని నిర్థారించారు. ఈ కొత్త మెటీరియల్ నిర్మాణాల కారణంగా ఏర్పడే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి, నిర్మాణ నాణ్యతను మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ప్రిఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సౌరదీప్ గుప్తా పేర్కొన్నారు. సాధారణంగా నిర్మాణ రంగాల్లో మట్టికి కార్బన్ డయాక్సైడ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇసుక బదులుగా వాడే ఈ ప్రత్యేక మెటీరియల్ సిమెంట్, సున్నం మధ్య చర్యను మెరుగుపరుస్తుంది. ఈ ఆవిష్కరణ విజయంవంతం అయితే.. ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఇసుక, కంకర, చువ్వ వీటికే లక్షలు ఖర్చు అవుతాయి.. పైగా రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించాలంటే కనీసం 30 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. ఈ ఆవిష్కరణతో ఇసుకకు ప్రత్యామ్నాయం వస్తే ఖర్చు తడిసిమోపడవ్వడం తగ్గుతుంది. ఎకో ఫ్రెండ్లీగా మంచి ఇంటిని నిర్మించుకోవచ్చు కూడా. (చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!) -
18 ఏళ్లుగా తలలో బుల్లెట్తో జీవిస్తున్న వ్యక్తి..చివరికి..
ఓ వ్యక్తికి తన ప్రమేయం లేకుండానే పదేళ్ల వయసులో తలలోకి బుల్లెట్ దిగింది. ఆ తర్వాత నుంచి ఆ బాలుడి దుస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది. అలా దాదాపు 18 ఏళ్లు గడిపాడు. సంప్రదించని ఆస్పత్రిలేదు. ప్రతి ఒక్కరు బుల్లెట్ తీయడం కష్టమనే చెప్పారు. ఆ బుల్లెట్ కారణంగా విపరీతమైన తలనొప్పి, చెవి ఇన్ఫెక్షన్లతో దుర్భర జీవితాన్ని గడిపాడు. చివరికి బెంగళురు ఆస్పత్రి వైద్యులు అతడు ఎదుర్కొన్న నరకం నుంచి విముక్తి కలిగించారు. ఇంతకీ అతడికి తలలో ఎలా బుల్లెట దిగింది? ఎవరా వ్యక్తి అంటే..! యోమెన్కి చెందిన సలేహ్ అనే 29 ఏళ్ల వ్యక్తి తలలో సమారు 3 సెంటీమీటర్ల బుల్లెట్ ఉంది. అతనికి పదేళ్ల ప్రాయంలో ఉండగా.. రెండు ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో ఓ బుల్లెట్ అతడి చెవిలోకి దూసుకుని తలలోని ఎడమవైపు ఎముకలోకి దిగిపోయింది. దీంతో అతనికి విపరీతమైన రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు గానీ ఆ బుల్లెట్ని మాత్రం తీయలేకపోయారు వైద్యులు. ఎందుకంటే? అది చెవిలోపలకి వెళ్లడం, పైగా దాని ముందర భాగం తలలోపలకి ఉండటం కారణంగా తీయడం వైద్యులకు కష్టంగా మారింది. దీంతో గాయం తగ్గేందుకు మాత్రమే మందులు ఇచ్చి పంపించేశారు సలేహ్ని. అప్పటి నుంచి సుమారు 18 ఏళ్లుదాక ఆ బుల్లెట్తోనే జీవించాడు. ఆ తర్వాత అతడు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ బుల్లెట్ కారణంగా చెవి వినికిడిని కోల్పోయాడు. పైగా చెవి ఇన్ఫెక్షన్లు, తలనొప్పితో నరకయాతన అనుభవించాడు. అతడికి ఇద్దరు సోదరులు, చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం సలేహ్కి 29 ఏళ్లు. అతడకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ బుల్లెట్ అతడి తల నుంచి ఎప్పుడు పోతుందా అనుకునేవాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయిన సలేహ్ స్నేహితుల ద్వారా బెంగళూరులోని ఆస్టర్ ఆస్పత్రి గురించి తెలుసుకుని మరీ ఎంతో ఆశతో వెళ్లాడు. అయితే వైద్యుల పలు టెస్ట్లు చేసి అసాధ్యం అని తేల్చేశారు. ఎందుకంటే? బుల్లెట్ సరిగ్గా చెవి లోపల ఎడమవైపు ముఖ్యమైన టెంపోరల్ ఎముక లోపల వాస్కులర్ నిర్మాణాలకు దగ్గరగా ఉంది. ఇది శస్ర చికిత్సకు అది పెద్ద సవాలు. అందువల్లే వైద్యులు రిస్క్ చేసే సాహసం చేయలేకపోయారు. అయితే వైద్యులు ఆ బుల్లెట్ కరెక్ట్గా ఏ ప్రదేశంలో ఉందో తెలిస్తే తీయడం ఈజీ అని గుర్తించారు. అందుకోసం కాంట్రాస్ట్ సీటీ యాంజియోగ్రఫీని ఎంచుకుంది. టూ డైమెన్షియల్ ఎక్స్రే సాయంతో బుల్లెట్ స్థానాన్నిగుర్తించి విపరీతమైన రక్తస్రావం కాకుండా సులభంగా తొలగించారు వైద్యులు. సర్జరీ చేస్తున్నంత సేపు అనుమానంగానే ఉందని అన్నారు వైద్యులు. ఎట్టకేలకు ఈ శస్త్రచికిత్సతో అతడికి తలనొప్పి తగ్గింది. అలాగే స్పష్టంగా వినిపిస్తోంది కూడా. అంతేగాదు పూర్తి స్థాయిలో కోలుకున్న వెంటనే సలేహ్ యెమెన్కి తిరిగి వెళ్లిపోయాడు కూడా. (చదవండి: ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా అలా అవుతుంటే అలర్జీ అనుకుంది! కానీ చివరికి..) -
బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..
కొంతమంది ఆకలితో అలమటిస్తుంటే, మరోపక్క టన్నులకొద్దీ ఆహారం వివిధ రకాలుగా వ్యర్థాల రూపంలో మట్టిపాలవుతోంది. ఈ మధ్య కాస్త అవగాహన రావడంతో ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని ఆశ్రమాలకు దానంగా ఇస్తున్నారు. అయితే వండిన ఆహారమే కాకుండా, కొన్నిరకాల పదార్థాలు, పానీయాలు తయారయ్యాక ఎన్నో పోషకాలున్న పదార్థాలు చెత్తలోకి వెళ్లి పోతున్నాయి. వీటిని మనం చక్కగా వినియోగించుకుంటే...బిస్కెట్లు, బ్రెడ్, రోటీలు చేసుకోవచ్చని చెబుతోంది ఎలిజబెత్ యార్క్. బీర్ తయారవగా మిగిలి పోయిన వ్యర్థాలతో చిక్కి, లడ్డు, నూడుల్స్ తయారు చేసి మరీ రుచి చూపెడుతోంది ఎలిజబెత్. బెంగళూరుకు చెందిన ఎలిజబెత్ యార్క్ ఒక చెఫ్. మణిపాల్లో డిగ్రీ చేసిన ఎలిజబెత్ తరువాత మైసూర్లోని సెంట్రల్ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేసింది. అందులో భాగంగా దేశంలో ఎన్నో రకాలుగా భారీ ఎత్తున ఆహార వృథా జరుగుతోందని గ్రహించింది. ఆహారం వ్యర్థం కాకుండా ఎలా ఆపాలా... అని ఆలోచించింది. ఈ క్రమంలోనే 2016లో కాలిఫోర్నియాలోని బ్రెడ్ స్పెషలిస్ట్, ఫుడ్ హిస్టోరియన్ విలియం రెబెల్ దగ్గర ఇంటర్న్గా చేరింది. రుబెల్ ద్వారా... ‘‘వందల ఏళ్ల నాడే పానీయాల తయారీ దారు, (బ్రీవర్స్), రొట్టె, బ్రెడ్స్ తయారీదార్లు (బేకర్స్) కలిసి పనిచేసే వారని తెలిసింది. కొన్నిసార్లు ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మిగిలిపోయిన బ్రెడ్ను బ్రీవర్స్, గింజలు, ఈస్ట్ను బ్రీవర్స్ బేకర్స్ ఇచ్చి పుచ్చుకునేవాళ్లు. అలా వాళ్లు పదార్థాలు వృథా కాకుండా, తక్కువ ఖర్చులో ఆహారాన్ని తయారు చేసేవారు’’ అని ఎలిజబెత్ తెలుసుకుంది. భారత్లో కూడా ఇలా చేసి ఫుడ్ వేస్ట్ కాకుండా చూడవచ్చు అనుకుంది. సేవింగ్ గ్రెయిన్స్ లాక్డౌన్ సమయంలో కాస్త ఎక్కువ సమయం దొరకడంతో ఎలిజబెత్ వ్యర్థాల నుంచి ఫుడ్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. బీర్ తయారైన తరువాత పడేసే వ్యర్థాలను రుచికరమైన ఆహారంగా మార్చాలనుకుని 2021లో ‘సేవింగ్∙గ్రెయిన్స్’ ప్రారంభించింది. బీర్ తయారవగా మిగిలిన పిప్పిని పిండిగా మార్చి, తరువాత ఆ పిండితో బ్రెడ్, రోటీలు, గ్రనోలా, కుకీస్, టీ బిస్కెట్స్, లడ్డులు, చిక్కీలు తయారు చేసి విక్రయిస్తోంది. పిప్పినుంచి తయారు చేసినవే అయినా ఇవి ఎంతో రుచిగా ఉండడం విశేషం. సేవింగ్ గ్రెయిన్స్ ఉత్పత్తులు ఆఫ్లైన్లోనేగాక, ఆన్లైన్లోకూడా లభ్యమవుతున్నాయి. స్థానిక బేకరీ భాగస్వామ్యంతో సేవింగ్ గ్రెయిన్స్ను విస్తరిస్తోంది ఎలిజబెత్. రోజుకి పన్నెండు వేల కేజీలు.. ‘‘రకరకాలుగా ఫుడ్ వేస్ట్ అవడం చాలా బాధగా అనిపించేది. రుబెల్ను కలిసాక ఈ సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది. దాంతోనే ‘సేవింగ్ గ్రెయిన్స్’ను ప్రారంభించాను. బీర్, ఆల్కహాల్ను తయారు చేసేందుకు గోధుమలు, ఓట్స్, బార్లీలను నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత, చక్కెరతో ఉడికి స్తారు. తరువాత మెత్తగా రుబ్బి రసాన్ని వేరు చేసి బీర్, ఆల్కహాల్స్ను తయారు చేస్తారు. పానీయం వేరు చెయ్యగా మిగిలిన పిప్పిని పశువులకు దాణాగా వేస్తుంటారు. పశువులు తిన్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో వ్యర్థంగా పోతుంది. ఒక్క బెంగళూరులోనే రోజుకి పన్నెండు వేలకేజీల ధాన్యాలను పానీయాల తయారీలో వాడుతున్నారు. రోజుకి ఇంత అంటే ఇక ఏడాదికి చాలా ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రీవరీలు లక్షల కేజీల ధాన్యాలను ఉపయోగిస్తున్నాయి. ఇలా ఉత్పన్నమయ్యే పిప్పిని ఫుడ్గా మార్చడం వల్ల ధాన్యాలు వ్యర్థంగా పోవు. సేవింగ్ గ్రెయిన్స్ ద్వారా ఎంతోమంది ఆకలి కూడా తీర్చవచ్చు’’ అని ఎలిజబెత్ చెబుతోంది. (చదవండి: బీర్ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్, విటమిన్ బి)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019