breaking news
-
రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వేలు బంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. -
చరిత్ర ఏం చెబుతుందంటే.. విపక్షాలవి పగటి కలలే.!
సాక్షి, ఆంధ్రప్రదేశ్: 1956–2014 మధ్య ఉనికిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్లో 1982లో తెలుగుదేశం ఏర్పాటయ్యాకే రెండు ప్రధాన రాజకీయపక్షాల మధ్య అధికారం కోసం గట్టి పోటీ జరిగే పరిస్థితులు వచ్చాయి. అంటే, 1983 ఏపీ శాసనసభ ఎన్నికల నుంచి మాత్రమే ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షానికి 30 శాతానికి పైగా ఓట్లు రావడం మొదలైంది. 1953–56 మధ్య మూడేళ్లు ఉనికిలో ఉన్న ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఒకే ఒక ఎన్నికల్లో ప్రతిపక్షానికి పడిన ఓట్లు 30 శాతం దాటాయి. 1955లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)కి 31.13% ఓట్లు దక్కాయి. అయితే, దాదాపు మూడో వంతు శాతం ఓట్లు దక్కించుకున్నాగాని కమ్యూనిస్టులకు ఈ ఎన్నికల్లో మొత్తం 190 సీట్లకుగాను కేవలం 15 స్థానాలే లభించాయి. కాంగ్రెస్ కూటమికి, సీపీఐకి మధ్య దాదాపు అన్ని చోట్లా పోటీ తీవ్రంగా ఉండడమే ఈ అసాధారణ ఫలితాలకు కారణం. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో 1983 ఎన్నికల ముందు వరకూ ఇలా దాదాపు మూడో వంతు ఓట్లు (30%) దక్కించుకున్న ప్రధాన ప్రతిపక్షం ఏదీ లేదు. 1957, 62, 67, 72 ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్కు దాదాపు ఎదురులేని పరిస్థితి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ చివరి మూడు ఎన్నికలే రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. 1957లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 105 స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన సీపీఐ 25.73% ఓట్లతో 22 సీట్లు సంపాదించగలిగింది. విశాల తెలుగురాష్ట్రంలో మొదటిసారి అంతటా జరిగిన 1962 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ అత్యధికంగా 19.13% ఓట్లు సంపాదించి, 51 సీట్లు సాధించింది. అయితే, అప్పటికీ బలహీనపడిన సీపీఐ నాటి ఏపీ అసెంబ్లీలోని మొత్తం 300 సీట్లకు గాను 136 సీట్లలో మాత్రమే పోటీచేయగలిగింది. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (1967, 1972) ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి కనీసం 10% ఓట్లు దక్కలేదు. 1978 ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి, ఇందిరాగాంధీ నాయకత్వంలో రెండు పార్టీలుగా దేశవ్యాప్తంగా చీలిపోయింది. ఈ చీలిక తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన 1978 ఫిబ్రవరి ఎన్నికల్లో మాత్రమే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా పార్టీకి రాష్ట్రంలో 28.85 శాతం ఓట్లు, 60 సీట్లు దక్కాయి. (ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (ఆర్) తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు నాయకత్వంలోని పార్టీకి 17% ఓట్లు, 30 సీట్లు దక్కాయి.) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1983 ఎన్నికలకు ముందు ఒక ప్రతిపక్ష పార్టీకి పాతిక శాతం వరకూ ఓట్లు వచ్చిన ఏకైక సందర్బం ఇదే. మూడో పక్షానికి 15% ఓట్లు దాటిన ఏకైక సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే! 1980ల ఆరంభంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షానికి (కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్) ప్రతిసారీ 30 శాతానికి పైగానే ఓట్లు లభించాయి. 1994 ఏపీ పదో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 26 సీట్లు (మొత్తం 294కు) మాత్రమే దక్కించుకున్నప్పుడు కూడా ఈ పార్టీకి పోలైన ఓట్లలో 33.85% వచ్చాయి. ఈ పదో శాసనసభ ఎన్నికల తర్వాత మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలోకి దిగిన ప్రాంతీయపక్షానికి 15 శాతానికి మించిన ఓట్లు లభించిన సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికలకు 8 మాసాల ముందు ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)కి 16.2 శాతం ఓట్లు, 18 సీట్లూ ఈ ఎన్నికల్లో లభించాయి. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలోగాని, రెండు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ)గాని మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల పోరుకు దిగిన ఏ పార్టీకి కనీసం 15 శాతం ఓట్లు దక్కలేదు. 2023 నవంబర్–డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ మూడో ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా భావించిన బీజేపీకి గరిష్ఠంగా 13.9 శాతం ఓట్లు, 8 సీట్లూ దక్కాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లోనూ (2014, 2019) మూడో ప్రధాన పార్టీగా బరిలోకి దిగిన ఏ రాజకీయపక్షం కూడా కనీసం ఆరు శాతం ఓట్లు సంపాదించుకోలేదు. ఇలా తెలుగునాట రెండు ప్రధాన రాజకీయపక్షాలే ఒకదాని తర్వాత మరొకటి (ఒక్కోసారి వరుసగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాగాని) సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయేగాని మూడో ప్రత్యామ్నాయ పార్టీకి లేదా కూటమికి అవకాశం ఇవ్వలేదు. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP ఇవి చదవండి: ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
అత్తిలి(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో మంగళవారం చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, వైస్ ఎంపీపీలు సుంకర నాగేశ్వరరావు, దారం శిరీష, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పోలినాటి చంద్రరావు, ఉపసర్పంచ్ మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జన బలమే గీటురాయి.. -
‘కోడ్’ ముగిసినా ఎక్కడి అధికారులు అక్కడే
సాక్షి, అమరావతి : ఎన్నికల నిబంధనావళి అమల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన అధికారులు ‘కోడ్’తో నిమిత్తం లేకుండా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసినందున వారిని పాత జిల్లాలకు పంపించాలా? లేక ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనేది కీలకమైన అంశమైనందున ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే కొనసాగించాలా? లేక ఎన్నికల ముందు వరకూ పనిచేసిన జిల్లాలకు తిరిగి బదిలీ చేయాలా? అనే అంశంపై స్పష్టమైన విధివిధానాల్లేవు. అందువల్ల కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అమలుచేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే, ఎన్నికలు ముగిసినందున ఎన్నికల ముందు పనిచేసిన స్థానాలకే అధికారులను తిరిగి బదిలీ చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ఇలాంటి నిబంధనేమీ లేదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. కొత్త ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఎలా చెబితే అలా చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఫైలును సీఎం పరిశీలన కోసం పంపింది. ఎందుకిలా? రాష్ట్రంలో విధానసభ, దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్.. మోడల్ కోడ్ (నిబంధనావళి) ప్రకారం రెవెన్యూ శాఖలో 530 మందికి పైగా తహసీల్దార్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఇదే నిబంధనావళి ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇతర శాఖల్లో ఇదే కేడర్లో పనిచేస్తున్న మరికొందరిని కూడా వేరే జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల కమిషన్ విధుల్లో భాగస్వాములను చేసే వారిని సొంత జిల్లాల నుంచి వేరే జిల్లాలకు బదిలీ చేయాలని నిబంధన ఉంది. అలాగే, మూడేళ్లుపైగా ఒకేచోట ఉన్న వారిని కూడా బదిలీ చేయాలని ఉంది. దీంతో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న ఆయా శాఖల అధికారులను బదిలీ చేశారు. కొందరు రెవెన్యూ డివిజనల్ అధికారులు సైతం ఇలాగే బదిలీ అయ్యారు. ఈ బదిలీలన్నీ మార్చి 10న వచ్చిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే జరిగాయి. ఈ నేపథ్యంలో.. ‘ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించిన అనంతరమే బదిలీ అయిన వారిని పూర్వ స్థానాలకు పంపించాలా? ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. అందుకోసం ఫైలు ఇప్పటికే పంపించాం’.. అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇతర విభాగాల వారి విషయంలోనూ ఇదే విధానం అమలవుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. సాధారణ పరిపాలన వేగవంతం ఇదిలా ఉంటే.. ఎన్నికల కోడ్ ముగిసినందున అధికార యంత్రాంగం ఇక పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత మూడు నెలలుగా ఎన్నికల పనులు, తర్వాత ‘కోడ్’ అంటూ క్షేత్రస్థాయి అధికారులు ప్రజల వినతులు, సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో రెవెన్యూ కార్యాలయాల్లో రోజువారీ సాగాల్సిన పనులన్నీ స్తంభించాయి. ‘వాస్తవంగా పట్టాదారు పాసుపుస్తకాల జారీ, రెవెన్యూ రికార్డుల మార్పులు చేర్పులు, సవరణలు (మ్యుటేషన్), భూముల కొలతలు, వ్యవసాయ ఆధార ధ్రువీకరణ పత్రాల జారీ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సాధారణ కార్యకలాపాలు నిత్యం చేయాల్సిందే. ఇవి ఎన్నికల కోడ్ పరిధిలోకి రావు. అయితే, అధికారులు పని భారాన్ని సాకుగా చూపుతూ ఈ పనులను నిలిపేశారు. ఇప్పుడు ఎన్నికల క్రతువు ముగిసినందున అధికారులు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం’.. అని ఒక ఉన్నతాధికారి వివరించారు. ముగిసిన ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్రంలో శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘కోడ్’.. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో దాని కాల పరిమితి ముగిసిందని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కార్యదర్శి అజయ్కుమార్ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడి కావడంతో మోడల్ కోడ్ను ఎత్తివేస్తున్నాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం మొత్తానికి తెలియజేయండి’.. అని అజయ్ కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్ సర్క్యులర్ జారీచేసింది. -
ప్రతిపక్ష నేత ఎవరు?
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుంగిపోయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్న విషయం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. తీవ్ర అవమానభారంతో ప్రజలకు మొహం చూపించేందుకు సైతం వెనుకాడుతున్న ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడడంలేదని పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఫలితాల తర్వాత రెండు రోజుల నుంచి తనను కలుస్తున్న నాయకులతో ఆయన మాట్లాడుతున్న తీరు ఈ ప్రచారానికి దారితీసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 151 ఉండడం, తన వయసు రీత్యా అసెంబ్లీలో వారిని ఎదుర్కోవడం వంటి కారణాలను చూపి ప్రతిపక్ష నేత బాధ్యతలకు దూరంగా ఉంటే ఎలా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండి, గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరికి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయని నాయకులు చర్చించుకుంటున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కింజరాపు అచ్చెన్నాయుడు, కరణం బలరామకృష్ణమూర్తి తదితరుల్లో ఒకరిని ప్రతిపక్ష నేతగా పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన తమ అధినేత మదిలో ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతగా తానుండాలా, ఎవరికైనా బాధ్యత అప్పగించాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలోనే ఇంతవరకూ పార్టీ శాసనసభాపక్ష సమావేశంపై నోరు మెదపడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దారుణ ఓటమితోనే వైరాగ్యం చంద్రబాబు వ్యవహార శైలి, ఆలోచనా తీరు తెలిసిన నేతలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోరని, ఆయనే ప్రతిపక్ష నేతగా ఉంటారని చెబుతున్నారు. ఓటమి భారంతో ప్రస్తుతం వైరాగ్యంగా మాట్లాడుతున్నా కొద్దిరోజుల్లో తేరుకుని మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలమవుతారని చర్చించుకుంటున్నారు. ఓటమిని ఆయన ముందే ఊహించినా అది ఇంతటి దారుణంగా ఉంటుందని అనుకోలేదని, రాష్ట్ర రాజకీయ చరిత్రనే తిరగరాసే రీతిలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గెలుపు ఓటములు సహజమే అయినా వైఎస్సార్ పార్టీకి 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు రావడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని, జగన్మోహన్రెడ్డికి ఈ స్థాయి ప్రజాదరణ ఎలా వచ్చింది, దాన్ని ఎందుకు గుర్తించలేకపోయానని బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బయటకు వచ్చేందుకు సైతం ఇష్టపడని ఆయన కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే ప్రతిపక్ష నేత ఎన్నికపై నిర్ణయం ఉంటుందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. పార్టీ భవిష్యత్తుపైనా, అంతకు మించి తన కుమారుడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న చంద్రబాబు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా లోకేష్ని పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మండలిలో యనమల రామకృష్ణుడు టీడీపీ పక్ష నేతగా ఉండగా ఆయన స్థానంలో లోకేష్ను పెడితే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019