breaking news
Ad - Sakshi_Home_Sticky
-
‘ICEతో బీజేపీకి సంబంధం లేదు’
న్యూఢిల్లీ: ఇన్కమ్ట్యాక్స్ డిపార్టుమెంట్, ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ),సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్న్(సీబీఐ) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడని దేశంలో ఒక్కరు కూడా ఆరోపణలు చేయాలేరన్నారు. ‘2013లో ఢిల్లీ సీఎం అసలు రాజకీయాల్లోకి అడుగుపెట్టనన్నారు. కాంగ్రెస్తో ఎట్టిపరిస్థితుల్లో జత కట్టనని అన్నారు. ఆప్, కాంగ్రెస్ పార్టీ వారి సొంతంగా ఏం సాధించలేదు. రోజూ కాంగ్రెస్, ఆప్ ప్రధాని మోదీని దూషిస్తారు వాళ్లు మోదీని ఎంత దూషిస్తే.. బీజేపీ అభ్యర్థులను ప్రజలు అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటారు’ అని అన్నారు. ‘ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు దర్యాప్తు సంస్థ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీచేసింది. ఎందుకు హాజరు కాలేదు. మళ్లీ విలువల గురించి మాట్లాడతారు. ఆయన ఈడీ ఆఫీసుకు హాజరకాకపోతే.. ఈడీనే ఆయన ఇంటికి వెళ్లింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ఒక్కసీటు కూడా గెలవలేదు. మళ్లీ 2024 ఎన్నికలో సైతం ఆప్ ఒక్కసీటు గెలవదు. ఈ రోజుకీ జైలులో ఉండి కూడా కేజ్రీవాల్ విలువల గురించి మాట్లాడుతున్నారు’ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు చేశారు. ఇక.. ‘ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సీబీఐ’(ఐసీఈ) స్వతంత్ర సంస్థలని వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై కూడా కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాల కూటమి నిజాయితీగా ఉంటే కూటమి పేరు ఎందుకు మార్చారు? అని ప్రశ్నించారు. వాళ్లు(కాంగ్రెస్) 2జీ, సబ్మెరైన్, బోగ్గు కుంభకోణాలు చేశారు. వారు ప్రజలకు ముఖం చూపించలేరు. ఆ తర్వాత దాణా కుంభకోణం చేసిన లాలు ప్రసాద్ యాదవ్ను కూటమిలోకి చేర్చుకున్నారు. జైలుకెల్లిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూటమిలో ఉన్నారు’ అని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. -
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
అశ్లీలతతో నిండిన ఆ వెబ్సైట్స్, ఓటీటీ యాప్స్ బ్యాన్
అశ్లీలమైన, అసభ్యకరమైన చిత్రాలను ప్రచురించే 18 OTT ప్లాట్ఫారమ్లను నిరోధించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) వివిధ మధ్యవర్తుల సమన్వయంతో చర్య తీసుకుంది. 19 వెబ్సైట్లు, 18 యాప్లను తొలగించేసింది. ఈ ఓటీటీ ప్లాట్ఫారమ్లతో అనుబంధించబడిన 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా నిలిపేసింది. 'సృజనాత్మక వ్యక్తీకరణ' ముసుగులో అశ్లీలత, అసభ్యతతో కూడిన కంటెంట్ను ప్రచారం చేయవద్దని కేంద్ర సమాచార & ప్రసార మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో అసభ్యకరమైన కంటెంట్ను ప్రచురించే 18 OTT ప్లాట్ఫారమ్లను తాజాగా తొలగించినట్లు ఠాకూర్ ప్రకటించారు. బ్యాన్ అయిన ఓటీటీల జాబితా Dreams Films, Neon X VIP, MoodX, Voovi, Besharams, Mojflix, Yessma, Hunters, Hot Shots VIP, Uncut Adda, Rabbit, Fugi, Tri Flicks, Xtramood, Chikooflix, X Prime, Nuefliks, Prime Play. ఈ ప్లాట్ఫారమ్లలో ప్రసారం అవుతున్న కంటెంట్లో ఎక్కువ భాగం అశ్లీలతతో కూడి ఉంది. అంతే కాకుండా మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరించిన పలు సినిమాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటి వల్ల సమాజంలో సంబంధాలు దెబ్బతింటాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ ఓటీటీ యాప్లను కొన్ని కోట్ల మంది డౌన్లోడ్ చేసకుని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ యాప్స్తో పాటు వెబ్సైట్స్ భారత్లో బ్యాన్ అవుతాయి. IT చట్టంలోని సెక్షన్ 67, 67A, IPCలోని సెక్షన్ 292 మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం, 1986లోని సెక్షన్ 4ను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా కంటెంట్ నిర్ధారించబడింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
సాకులు చెప్పలేదు.. ఉదయం 5.30 గంటలకే రోహిత్ ఇలా!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్య క్రీడా భారత్ రూపుదిద్దుకునే కార్యక్రమంలో చిత్తశుద్ధితో పాల్గొనడం రోహిత్ హుందాతనానికి నిదర్శనమని ప్రశంసించారు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్తో రోహిత్ శర్మ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగింట మూడు విజయాలతో ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా.. ధర్మశాల వేదికగా గురువారం నుంచి నామమాత్రపు ఐదో టెస్టు ఆడనుంది. అయితే, నాలుగు- ఐదో టెస్టుకు మధ్య విరామం ఎక్కువగా ఉండటంతో రోహిత్ శర్మ సతీసమేతంగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నాడు. గుజరాత్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ అనంతరం తిరిగి విధుల్లో చేరేందుకు ధర్మశాల(హిమాచల్ ప్రదేశ్)కు పయనం కావాల్సింది. అయితే, అంతకంటే ముందు భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హమీర్పూర్ నియోజకవర్గంలోని బిలాస్పూర్కు చేరుకున్నాడు. అక్కడ జరిగిన ఖేల్ మహాకుంభ్ 3.0 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రోహిత్ శర్మతో పాటు టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఖేల్ మహాకుంభ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఉదయం ఐదున్నర గంటలకే రోహిత్ శర్మ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఒకవేళ రోహిత్ అనుకుంటే.. మార్చి 7న ఆరంభం కానున్న ఐదో టెస్టును సాకుగా చూపి ఇక్కడికి రాకుండా మా ఆహ్వానాన్ని తిరస్కరించి ఉండవచ్చు. కానీ అతడికి భవిష్య క్రీడా భారత్ ఇలాంటి కార్యక్రమాల నుంచే రూపుదిద్దుకుంటోందని తెలుసు. అందుకే ఇక్కడకు వచ్చాడు. అతడికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఈవెంట్ ఆరంభించిన అనంతరం రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో బిలాస్పూర్కు దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మశాలకు చేరుకున్నారు. చదవండి: 100th Test: అశ్విన్పై మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు Swung for the fences and had a blast with Hitman @ImRo45 and The Wall Rahul Dravid at the grand opening of #SansadKhelMahakumbh 3.0 at Luhnu Cricket Stadium, Bilaspur. Truly a game to remember! pic.twitter.com/ENRaSOr6Y8 — Anurag Thakur (मोदी का परिवार) (@ianuragthakur) March 5, 2024
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019